కుప్పకూలిన హాస్టల్ భవనం!

గురుకుల పాఠశాల హాస్టల్ భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఆ సమయంలో హాస్టల్ లో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలో బుధవారం (సెప్టెంబర్ 10)ఈ ఘటన జరిగింది. హాస్టల్ భవనం కుప్పకూలిన సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

భవనం కూలిన సమయంలో హాస్టల్ ముందు ఉన్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరి చాలా కాలమైంది. ఈ విషయమై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu