ఏపీలో 14 జిల్లాలకు నూతన ఎస్పీలు
posted on Sep 13, 2025 4:33PM

ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు నూతన అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ రాహుల్ మీనా
బాపట్ల- ఉమామహేశ్వర్
కృష్ణా- విద్యాసాగర్ నాయుడు
నెల్లూరు- అజితా వేజెండ్ల
తిరుపతి- సుబ్బరాయుడు
అన్నమయ్య- ధీరజ్ కునుగిలి
కడప- నచికేత్
గుంటూరు- వకుల్ జిందాల్
నంద్యాల- సునీల్ షెరాన్
విజయనగరం- ఏఆర్ దామోదర్
పల్నాడు- డి.కృష్ణారావు
ప్రకాశం- హర్షవర్ధన్ రాజు
ప్రకాశం– హర్షవర్థన్ రాజు
చిత్తూరు – తుషార్ డూడి
శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్