వ‌సు మీద రిషికి కోపం వ‌చ్చింది.. రీజ‌న్ ఏంటంటే..

మంచి నీళ్ల బిందెను తీసుకుని వసు ఇంటికి రావడం చూసి ధరణి "ఏంటిది వసు?" అని అడుగుతుంది. తాగటానికి నీళ్లు లేకపోయేసరికి తెచుకున్నానని చెప్తుంది వ‌సు. ఆ తర్వాత గౌతమ్, రిషి, ధరణి ముగ్గురూ కలిసి "స్కాలర్‌షిప్ టెస్ట్ లో గెలిచావ్" అంటూ స్వీట్ తినిపిస్తారు. "మీ ఇంటికి ఎండీ గారు వ‌చ్చారు. కాఫీలు, టీలు వంటి మర్యాదలు ఏమీ చేయవా" అంటూ గౌతమ్ కామెడీ చేస్తాడు. "వదినా వసుని నీళ్లు మోయొద్దని చెప్పండి" అంటాడు. ఆ మాటలకు సంతోషంగా ఫీల్ అవుతుంది వసు.  ఇంకో వైపు ఫణీంద్ర.. దేవయానితో కామెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రిషి వాళ్ళు రావ‌డంతో ధరణి మీద కోప్పడుతుంది దేవ‌యాని. ఆ టైంలో రిషి అడ్డుపడి "నేను వదినను తీసుకెళ్లా పెద్దమ్మా" అని చెప్తాడు. అప్పుడు వసు గురించి మాట్లాడతాడు రిషి. దేవయానికి అది నచ్చక గౌతమ్ ని ఇన్‌డైరెక్ట్ గా తిట్టేసరికి దేవయాని మీద సీరియస్ అవుతాడు రిషి. అంతే.. దేవయాని సైలెంట్ ఐపోతుంది.  మరోవైపు వసు పేరు నోటీసు బోర్డులో వేసేసరికి అందరూ చదివి హ్యాపీగా ఫీల్ అవుతారు. "సన్మాన సభ ఏర్పాట్లను రిషి సర్ దగ్గరుండి చూసుకుంటున్నారు" అని వసుతో చెప్తుంది పుష్ప‌. వ‌సు చాలా సంతోషిస్తుంది. ఆమె సడెన్ గా కనిపించకుండా పోయేసరికి రిషి వెయిట్ చేస్తుంటాడు. అత‌డికి సంతోషం క‌లిగిస్తూ ఫైనల్ గా వసు కనిపిస్తుంది. అదే టైంలో క‌మిష‌న‌ర్ గురించి జగతి, మహేంద్ర మాట్లాడేసరికి వసు వైపు చూస్తూనే సమాధానం చెప్తాడు. ఆ తర్వాత కమీషనర్ ని తప్పకుండా పిలవాలి అంటాడు. జగతి అక్కడి నుంచి వసు దగ్గరకి వెళ్లి మాట్లాడుతుతూ ఉంటుంది. రిషి కూడా వెళ్లిపోతుండేసరికి వసు "ఆగండి సర్" అంటూ అరుస్తుంది. ఐనా వినిపించుకోనట్టే వెళ్ళిపోతాడు. ఇంతలో రిషికి అడ్డు వచ్చి "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడుగుతాడు మ‌హేంద్ర‌. "పని ఉంది" అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇక సాక్షి అక్కడికి వచ్చి రిషికి వ‌సుధార ప్ర‌పోజ్ చేసిన వీడియో బయట పెడుతుంది. దాంతో రిషికి వసు మీద బాగా కోపం వస్తుంది. ఇదంతా వసు ప్లాన్ అనుకుంటూ ఉంటాడు. ఎపిసోడ్ లోని మిగతా హైలైట్స్ కోసం ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు'లో చూడొచ్చు.

1980ల‌లోకి తీసుకెళ్లిన 'ఢీ 14'

'ఢీ 14' రాబోయే  ఎపిసోడ్ మొత్తం కూడా 1980లోకి తీసుకెళ్లబోతోంది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జెస్ గా గణేష్ మాస్టర్, శ్రద్ధా దాస్, నందిత శ్వేతా హాజరయ్యారు. అలనాటి సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు కంటెస్టెంట్స్ అంతా అప్పటి హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ తో డాన్సులు చేసి మైమరిపించారు. "సామజ వరగమనా "సాంగ్ కి జ్ఞాన్‌ సాహు, రిషిక డాన్స్ ఇరగదీశారు. "కుర్రాడు బాబోయ్" పాటకు కూడా మంచి ఊపుతో డాన్స్ చేశారు. ఇక ప్రదీప్ కూడా మంచి జోష్ స్టెప్పులేసి అందరినీ మరింత హుషారెత్తించాడు. సుశాంత్ స్పెషల్ గెస్ట్ గా ఈ షోకి వచ్చాడు. ఇక జతిన్ టీం "నా కళ్ళు చెబుతున్నాయి"కి డాన్స్ చేసేసరికి శ్రద్ధా దాస్ "కన్నార్పకుండా చూసాను" అని కామెంట్ చేసింది. ఆది సోఫా చూసి "చిన్న సైజు ఫ్యామిలీలా ఉంది" అంటాడు ప్రదీప్. "హలో ఫామిలీ ఫోటో ఏంటి ఫ్యామిలీయే" అంటూ డాన్సర్ తేజస్విని తన భార్య అని, చైల్డ్ కంటెస్టెంట్స్ ముగ్గురు తమ పిల్లలని చెప్తాడు ఆది. "ఏమే వాన సాంగ్ చూసావ్ కదా మనం కూడా అలా వానలోకి వెళ్లి డాన్సులు చేయాలి" అంటాడు తేజుతో ఆది. "ఎండిపోయిన మొక్కకు ఎండైతే ఏమిటి, వానైతే ఏమిటి" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది తేజు. "వద్దు ఒక్క పిల్లాడితో ఆగుదాం అంటే ముగ్గుర్ని కన్నది" అంటాడు మళ్ళీ ఆది. ఇలా ఈ వారం ఎపిసోడ్ ప్రోమో సందడి చేస్తోంది.

అనసూయ ఆగుతుందా.. సాగుతుందా?!

అనసూయ 'జబర్దస్త్' షోకి బై బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ షోకి నిజంగానే బై బై చెప్పిందా లేదా, కంటిన్యూ చేస్తుందా అనే విషయంలో సందేహాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ 'జబర్దస్త్' షూటింగ్ కోసం ఒక అద్భుతమైన బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసిన అనసూయ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే హైట్ కి తగ్గ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి కాస్ట్యూమ్ వాడినా బాగుంటుంది. ఈ రోజు సోషల్ మీడియాకి రిలీజ్ చేసిన పిక్ చూస్తే.. ట్రెడిషనల్ గా, పద్ధ‌తిగా కనిపిస్తోంది. 2013లో 'జబర్దస్త్' షో మొద‌లైన‌ దగ్గరనుంచి అనసూయ చేస్తోంది. ఇక మూవీస్ లో కీ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఆమె న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ జూలై 1న రిలీజ‌వుతోంది. 'దర్జా' మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. 'పుష్ప 2', 'రంగ మార్తాండ' మూవీస్ లో నటిస్తోంది. లేటెస్ట్ గా 'సింబల్' అనే టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పింది అనసూయ. "ఇలా నిటారుగా నిలబడడం అంటే నాకు చాలా ఇష్టం" అనే కాప్షన్ తో ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఫాషన్ ఐకాన్ , క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా అనసూయ జబర్దస్త్ స్టేజి మీద ఆగిపోతుందా, కంటిన్యూ అవుతుందా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆర్య మాస్ట‌ర్ ప్లాన్‌కు అడ్డంగా బుక్కైన రాగ‌సుధ‌!

'బొమ్మ‌రిల్లు' ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించిన సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. బుల్లితెర‌పై జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మర్డర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. తాజాగా ఈ సీరియ‌ల్ చివరి అంకానికి వ‌చ్చేసింది. క్లైమాక్స్ చేరుకుంది. ఇందులో శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా వ‌ర్ష హెచ్.కె. న‌టించ‌గా ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, జ్యోతి రెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, రాధాకృష్ణ‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు. రాగ‌సుధ ఎలాగైతే త‌మ‌ని మోసం చేసిందో అలాగే ఆమె నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని ఆర్యవ‌ర్ధ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ని అను చేత అమ‌లు చేయిస్తాడు. ఆర్య చెప్పిన ప్లాన్ ప్ర‌కారం రాగ‌సుధ గెట‌ప్ ని మాన్సీ త‌ల్లికి వేయించి అను ఓ వీడియో షూట్ చేయిస్తుంది. రాజ‌నందిని గ‌దిలో త‌న‌తో పాటే వున్న రాగ‌సుధ ఆమెను న‌మ్మించి ఆస్తి ప‌త్రాల‌ని ఎలా కొట్టేసిందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా షూట్ చేయిస్తుంది. దాన్నే ఆధారంగా చేసుకుని కోర్టులో స‌బ్మిట్ చేస్తుంది. ఇక అక్క‌డి నుంచి ఆర్య త‌రుపు వాదిస్తున్న లాయ‌ర్ ఆట మొద‌లు పెడ‌తాడు. అను షూట్ చేయించి తెచ్చిన వీడియో వున్న‌ పెన్ డ్రైవ్ ని జ‌డ్జికి స‌మ‌ర్పిస్తాడు. అదే వీడియోను కోర్టులో ప్ర‌ద‌ర్శిస్తారు. వీడియో చూసిన జ‌డ్జి, రాగ‌సుధ త‌రుపున వాదిస్తున్న లాయ‌ర్‌, రాగ‌సుధ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌వుతారు. ఇదే అద‌నుగా ఆర్య‌వ‌ర్ధ‌న్ లాయర్ రాగ‌సుధ‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ ఊపిరి ఆడ‌కుండా చేస్తాడు.  "కేవ‌లం డ‌బ్బు వ్యామోహంతోనే ఇప్పుడు అనురాధ‌ గారిని ఎలా క‌త్తితో పొడిచి చంపాల‌నుకున్నారో.. అప్పుడు రాజ‌నందిని గారిని కూడా క‌త్తితో కిరాత‌కంగా క‌ర్క‌శంగా పొడిచి చంపారు" అని నిల‌దీస్తాడు.. అయితే రాగ‌సుధ లేదు అని బుకాయిస్తుంది... అయినా స‌రే క‌త్తితో పొడిచి పొడిచి చంపార‌ని లాయ‌ర్ రెట్టిస్తాడు.. దీంతో టంగ్ స్లిప్ప‌యిన రాగ‌సుధ పొడ‌వ‌లేద‌ని, నెట్టేశాన‌ని నిజం చెప్పేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? రాగ‌సుధ జైలుకి వెళ్లిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

పెట్టెలో దొరికిన క‌త్తిపై తిలోత్త‌మ వేలిముద్ర‌లున్నాయా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'త్రిన‌య‌ని'. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా కొడుకు కోసం ఆరాట‌ప‌డే త‌ల్లి ఆత్మ క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. చిత్ర విచిత్ర‌మైన మలుపులు, ట్విస్ట్ ల‌తో ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ థ్రిల్ల‌ర్ సీరియ‌ల్స్ ని అమితంగా ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఇందులో అషికా గోపాల్, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌ర‌లు న‌టించారు. న‌య‌ని, విశాల్ వెలికి తీసిన పెట్టెలో ఏముందో చెప్ప‌డం లేద‌ని ఆగ్ర‌హించిన తిలోత్త‌మ.. క‌సి, వల్ల‌భ‌, దురంధ‌ర‌, హాసినిల‌తో క‌లిసి న‌య‌ని ఉంటున్న ఏరియాకు వ‌స్తుంది. అప్ప‌టికే సుమ‌న ద్వారా విష‌యం తెలుసుకున్న విక్రాంత్.. త‌ల్లి తిలోత్త‌మ‌పై సీరియ‌స్ అవుతాడు. త‌ల్లి కూడా న‌టిస్తుందా? అని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తాడు. క‌ట్ చేస్తే.. విశాల్ - న‌య‌నిల‌ని ఈ ప్రాంగ‌ణంలో తవ్వితీసిన పెట్టెని బ‌య‌టికి తీసుకుర‌మ్మ‌ని తిలోత్త‌మ అరుస్తుంది. అంతా ఒక‌చోట చేర‌డంతో బ‌స్తీ జ‌నం కూడా పోగ‌వుతారు. ఇంత‌లో వ‌ల్ల‌భ‌ని పెట్టెని బ్రేక్ చేయ‌మంటుంది తిలోత్త‌మ‌. ఇదే స‌మ‌యంలో న‌య‌ని త‌న‌కు ప‌రిచ‌యం వున్న ఎస్.ఐ కి ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన ఎస్.ఐ పెట్టెని బ‌ద్ద‌లు కొట్టాల్సిందే అంటాడు.. వ‌ల్ల‌భ‌ని ఆ ప‌ని చేయ‌మ‌ని తిలోత్త‌మ చెబుతుంది. పెట్టెని బ్రేక్ చేయ‌డంతో డోర్ ఓపెన్ చేసి చూసి అంతా షాక్ అవుతారు. తిలోత్త‌మ‌, క‌సి అనుకుంటున్న‌ట్టుగా అందులో ఎలాంటి నిధి వుండ‌దు. గాయ‌త్రిదేవి హ‌త్య‌కు తిలోత్త‌మ ఉప‌యోగించిన క‌త్తి ల‌భిస్తుంది. దీంతో ఒక్క‌సారిగా తిలోత్త‌మ షాక్ అవుతుంది.  క‌ట్ చేస్తే.. ఇదే విష‌యాన్ని న‌య‌ని.. తిలోత్త‌మ‌తో చెబుతుంది. ఆ క‌త్తిపై వున్న వేలి ముద్ర‌లు మీవో కాదో తేల్చ‌డానికి పోలీస‌న్న వ‌చ్చాడ‌ని.. ఇక గాయ‌త్రి దేవి అమ్మ‌గారిని చంప‌డానికి నువ్వు రాసిన లెట‌ర్ లోని అక్ష‌రాల‌ని విశాల్ బాబు గుర్తు ప‌ట్టాడ‌ని చెబుతుంది న‌య‌ని.. దీంతో తిలోత్త‌మ‌లో టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది.. ఆ త‌రువాత ఏం జ‌ర‌గ‌నుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సూరత్‌లో స్ట్రీట్ ఫుడ్ అదుర్స్.. కావాలంటే న‌వీన‌ని అడ‌గండి!

బుల్లితెరపై ఎంతో మంది తమని తాము నిరూపించుకుని దూసుకుపోతున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది నటి యాటా నవీన. తెలుగు సీరియల్స్ ద్వారా ఈమె ఆడియన్స్ కి సుపరిచితమే. 'కలవారి కోడలు', 'చంద్రముఖి' వంటి సీరియల్స్ లో యాక్ట్ చేసిన నవీన తన నటనతో, అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఈమె భర్త పేరు యాట సత్యనారాయణ. ఈయన 'కలవారి కోడలు', 'పెళ్లి నాటి ప్రమాణాలు' సీరియల్స్ కి నిర్మాతగా పని చేశారు. ఇక నవీన సీరియల్స్ తో న‌టించ‌డంతో పాటు యూట్యూబ్ లో కూడా వరుసగా వీడియోస్ చేస్తుంటుంది.  ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఫుడీస్ అందరికోసం ఒక ఫుడ్ వీడియో చేసింది. గుజరాత్ కి వెళ్లిన నవీన సూరత్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అని చెప్తూ అక్కడి ఫుడ్ గురించి వివ‌రించింది. ఉధ్నా బజార్ అని సూరత్ లో మంచి ఫేమస్ ప్లేస్. అక్కడ కోల్డ్ కోకో ఫేమస్ డ్రింక్. గ్లాస్ లో ఐస్ వేసి చాక్లెట్ సిరప్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇస్తారు. కోల్డ్ కాఫీలంటే ఇష్టపడని నవీన ఫస్ట్ టైం కోల్డ్ కోకో తాగి టెంప్ట్ ఐపోయింది.  తర్వాత స్పెషల్ ఫ్రాంకీ, సూరత్ స్పెషల్ రింజిమ్ స్టఫ్డ్ పిజ్జా మస్త్ ఎంజాయ్ చేసింది. గుజరాత్ కి వచ్చిన వారెవరైనా పానీపూరి తినకుండా వెళ్ళరు. అంత ఫేమస్ ఫుడ్ అది. ఇక దాన్ని అక్కడ బాస్కెట్ చాట్ అంటారట. అలా సూరత్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ ని ఫుడ్ లవర్స్ కోసం వీడియో చేసి పెట్టింది నవీన. వీటిని ఫాలో అయ్యి ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఆ ఫొటోస్ ని కూడా తనతో షేర్ చేసుకోమని చెప్పుకొచ్చింది నవీన. ఈ వీడియోకి సూపర్ వ్లాగ్ అని, సూపర్ వీడియో అని, యమ్మీ ఫుడ్ అని.. ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బెడ్‌రూమ్‌లో వేద‌ని వేధిస్తున్న‌ కైలాష్.. య‌ష్ ఏం చేశాడు?

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో సాగుతోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. య‌ష్ బిజినెస్ ప‌నిమీద‌ ముంబై వెళ్లిపోవ‌డంతో ఇదే మంచి అద‌నుగా భావించిన కైలాష్ వావి వ‌రుస‌లు మ‌రిచిపోయి.. ఒంట‌రిగా బెడ్రూమ్ లో వున్న వేద‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు.. త‌న ప్ర‌పోజ‌ల్ కు ఒప్పుకోమ‌ని ఇబ్బందికి గురిచేస్తాడు. ఇందు కోసం ల‌వ్ సింబ‌ల్ తో వున్న గిఫ్ట్ ని కూడా ఇస్తాడు. అత‌ని నీచ‌పు మ‌న‌స్త‌త్వానికి షాకైన వేద ఏడుస్తూ హాల్లోకి వ‌స్తుంది. జ‌రిగిన విష‌యాన్ని అత్త మాలినితో చెబుతుంది. కానీ త‌ను న‌మ్మ‌దు. పైగా వేద‌నే అనుమానిస్తుంది. కైలాష్ ఎలాంటి వాడో త‌న‌కు తెలుస‌ని, త‌ను ఇంటి అల్లుడు అని, అత‌ని అధికారం ముందు త‌ల వంచాల్సిందేన‌ని, ఈ విష‌యాన్ని య‌ష్ కు ఎట్టిప‌రిస్థితిలో చెప్ప‌కూడ‌ద‌ని వేద‌ని హెచ్చ‌రిస్తుంది. ఉన్న‌ట్టుండి అంతా తారుమార‌య్యే స‌రికి వేద అచేత‌నురాల‌వుతుంది. అయినా స‌రే.. "సాటి ఆడ‌దాని బాధ‌ని అర్థం చేసుకోండి" అని నిల‌దీస్తుంది. అయినా మాలిని.. వేద మాట‌ల‌ని విన‌దు.. నీది అపోహ అని కొట్టి పారేస్తుంది. ఏం చేయాలో తెలియ‌క బెడ్రూమ్ లో య‌ష్ ఫొటోని అద్దంలో చూస్తూ "మిస్ యు" అని రాస్తుంది వేద‌.. ఆ త‌రువాత య‌ష్ కు జ‌రిగిన విష‌యం చెప్పాల‌ని ఫోన్ చేస్తుంది. కానీ య‌ష్‌.. మాలిని ప‌డిపోవ‌డంతో త‌న వ‌ద్దే వుంటాడు.. ఫోన్ సైలెంట్ లో వున్న విష‌యం ప‌ట్టించుకోడు.. త‌రువాత ఫోన్ చెక్ చేస్తే వేద చాలా సార్లు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది.  వెంట‌నే వేద‌కు ఫోన్ చేస్తాడు య‌ష్‌.. త‌ను విష‌యం చెప్పే లోపు "కైలాష్ గురించేనా?" అంటే షాకిస్తాడు. "త‌న‌కు డ‌బ్బులు ఇప్పించావు, ఉద్యోగం ఇవ్వ‌మ‌న్నావు.. ఇదంతా తెలిసి మా అమ్మ నిన్ను ఆకాశానికి ఎత్తేసి వుంటుంది క‌దా?" అంటాడు. త‌న‌కు జ‌రిగిన విష‌యం చెప్ప‌లేక, మ‌న‌సులో దాచుకోలేక వేద న‌ర‌కం అనుభ‌విస్తూ అది య‌ష్ కు తెలియ‌కుండా మాట్లాడుతుంది. అయినా య‌ష్ గ‌మ‌నించి "ఏం జ‌రిగింది?" అని ఆరాతీస్తే "ఐ మిస్ యూ" అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది.. దీంతో స‌మ్ థింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని య‌ష్ కు అర్థ‌మ‌వుతుంది.  క‌ట్ చేస్తే.. వేద ఒంట‌రిగా బెడ్రూమ్ లో వుండ‌టం గ‌మ‌నించిన కైలాష్ త‌న కోరిక తీర్చ‌మ‌ని వేద‌ని వేధించ‌డం మొద‌లు పెడ‌తాడు.. ఇదే స‌మ‌యంలో య‌ష్ ముంబై నుంచి దిరిగి ఇంటికి చేర‌తాడు.. హాలులో య‌ష్‌.. బెడ్రూమ్ లో వేద‌, కైలాష్‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది?.. య‌ష్ ఎలా రియాక్ట్ కాబోతున్నాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'ఇంటి గుట్టు', 'మిఠాయికొట్టు చిట్టెమ్మ' మహాసంగమం

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు' లో ప్రసారమవుతున్న 'ఇంటి గుట్టు', 'మిఠాయికొట్టు చిట్టెమ్మ' సీరియల్స్ వినూత్న కథాంశాలతో, రిలేటబుల్ కంటెంట్ తో తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ప్రేక్షకులను ఆ ఛానల్ 'మహాసంగమం' ఎపిసోడ్స్ తో కనువిందు చేయడానికి సిద్దమవుతుండడంతో, ఇరు సీరియల్స్ లోని నటీనటులను ఒకే ఫ్రేములో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. అంతేకాకుండా, సీరియల్స్ నిర్వాహకులు ఈ ఎపిసోడ్స్ ద్వారా జూన్ 30న, జూలై 1న మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు గంటపాటు రెట్టింపు వినోదాన్ని 'జీ తెలుగు' వీక్షకులకు అందించనున్నారు.    వివరాల్లోకి వెళితే, ఈ మెగా ఎపిసోడ్ అనేక ట్విస్టులతో, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రసవత్తరంగా సాగనుంది. సంపద, సిద్ధు (ఇంటి గుట్టు), కాంతమ్మ (మిఠాయికొట్టు చిట్టెమ్మ) మధ్య జరిగే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. డబ్బు కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధంగా ఉండే ఈ ముగ్గురి మధ్య వచ్చే ఒక సిట్యుయేషన్ ని ఇరు సీరియల్స్ లోని ఫీమేల్ లీడ్స్ ఐన కళ్యాణి, చిట్టెమ్మ ఎలా ఎదుర్కుంటారనేది ఈ 'మహాసంగమం' ఎపిసోడ్స్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఈ గురువారం, శుక్రవారం 'ఇంటి గుట్టు' మరియు 'మిఠాయికొట్టు చిట్టెమ్మ' మహాసంగామం ఎపిసోడ్స్ ను మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు 'జీ తెలుగు'లో వీక్షించ‌వ‌చ్చు.

మొక్కలతో మీ రోహిణి...

ప్రపంచం మొత్తం కూడా ప్లాస్టిక్ మాయమైపోతుంది. పచ్చని చెట్లు ఎక్కడా  కనిపించకుండా పోతున్నాయి. ఐతే కొంతమంది మాత్రం ఇంట్లో మొక్కల్ని పెట్టుకోవడమా, గార్డెన్ లో, లాన్లో మొక్కల్ని పెంచుకోవడమే వంటివి చేస్తారు. అలాంటి కోవలోకి వస్తుంది రౌడీ రోహిణి. తన ఇంటినంతటిని మొక్కలతో అలంకరించేసింది. వాటిని ఆడియన్స్ తో షేర్ చేసుకోవడానికి ఒక వీడియో కూడా చేసింది. గోల్డెన్ టబ్ లో కొన్ని మొక్కల్ని డెకరేట్ చేసి గోడకు తగిలించింది. తన ఇంట్లో పెట్టిన మొక్కలన్నీ కూడా లోలైట్, ఎయిర్ ప్యూరిఫయ్యర్ ప్లాంట్స్ అన్నమాట. వీటికి ప్రతీ రోజు నీళ్లు పోయాల్సిన పని లేదు, టెన్ డేస్ కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది అని చెప్పింది .  అలాగే ఎండ కూడా అంత అవసరం ఉండదు, ఇవన్నీ నీడ పట్టున పేరైన ఇన్డోర్ ప్లాంట్స్ అని చెప్పింది. అందానికి అందాన్ని ఇవ్వడమే కాదు ఫ్రెష్ ఎయిర్ కూడా అందిస్తాయట ఈ మొక్కలు. రెడ్ ఎగ్లోనిమా, గోల్డెన్ పోతోస్ అని మనీ ప్లాంట్ లో ఒక వెరైటీని, అలాగే పేపరోమియా ప్లాంట్ కూడా డెకరేట్ చేయించుకుంది. ఇక తన బెడ్ పక్కన స్నేక్ ప్లాంట్ అనే ఒక మొక్కను పెట్టించుకుంది. ఈ మొక్క ఆక్సిజన్ ఎక్కువగా సరఫరా చేస్తుందట . అలాగే చైనీస్ ఎవర్ గ్రీన్ అనే మొక్కను వాళ్ళ అక్క రూమ్ లో పెట్టించింది.  రోహిణి వాళ్ళ అమ్మ కోసం తులసి మొక్కను , తన కోసం ఎల్లో రోజ్ ప్లాంట్ ని కూడా తెప్పించుకుంది. ఇక అలాగే తన ఇంట్లో స్పేస్ కి తగ్గట్టు ప్లాంట్ పాట్స్ ని డిజైన్ చేశారు ప్లాన్ ఏ ప్లాంట్ వాళ్ళు అని చెప్పుకొచ్చింది రోహిణి. ఇక మొక్కల్లో ఉన్న మట్టి ఎండిపోతే తప్ప లేకపోతే నీళ్లు పోయాల్సిన అవసరం పడదని చెప్పింది. ఎందుకంటే 20 రకాల మట్టి నమూనాలతో తయారు చేసిన మట్టి కాబట్టి అంత తొందరగా ఎండిపోయే పరిస్థితి రాదని వివరించింది. ఇక ప్లాంట్ డెకొరేషన్ చాలా బాగుంది. మొక్కల్ని ఇంట్లో షోగా పెట్టుకుంటారని తెలుసు కానీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..  

పైనాపిల్ హల్వా తిన్నారా ఎప్పుడైనా ?

కరాటే కళ్యాణి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఒకరకమైన హస్కి వాయిస్ తో మత్తుగా మాట్లాడ్డం ఆమెకే సొంతం. కళ్యాణి అనే అబ్బా ..బాబీ.. అనే డైలాగ్ మస్త్ ఫేమస్..ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కాంటెస్ట్ చేసింది. ఈమె ఎప్పుడూ  ఏదో ఒక ఇష్యూలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. యాక్టర్ కాకముందు కల్యాణి ..హరికథా కళాకారిణిగా ఎన్నో స్టేజి షోస్ చేసింది. అలాంటి టైములో వినాయక్ కంటబడిన కళ్యాణి ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.  ఆ తర్వాత "కృష్ణ, మిరపకాయ్, లక్ష్మి నరసింహ, శంకర్ దాదా ఎంబిబిస్" లో నటించారు. అలాగే కొన్ని సీరియల్స్ కూడా యాక్ట్ చేసారు కళ్యాణి. గోరంత దీపం, ముత్యాల ముగ్గు, మధుమాసం సీరియల్స్ మంచి గుర్తింపు తెచ్చాయి. కృష్ణ మూవీ కళ్యాణికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కళ్యాణి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల గోవా వెళ్లిన కల్యాణి అక్కడ పైనాపిల్ హల్వా తిన్నదట. దాని మీద ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. గోవా వస్తే మాత్రం ఈ పైనాపిల్ హల్వా తినడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, మిస్సవ్వొద్దు . ఇట్స్ సో యమ్మీ అంది కల్యాణి. గోవాలో స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది  అని చెప్పింది. రవితేజ హీరోగా నటించిన కృష్ణ మూవీలో బ్రహ్మానందాన్ని బాబీ అంటూ ఒక రకమైన పిలుపుతో పిలుస్తుంది .. ఆ డైలాగ్ ఆమె చెప్పే విధానంతో ఆమె మంచి పాపులర్ అయింది. ఈ డైలాగ్ ఈమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది.  

ఆర్పీ గుండె మీద 'నాగబాబు'!

బుల్లితెర విషయాలు మాట్లాడుకోవాలంటే 'జబర్దస్త్' షోతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది బుల్లితెర చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ షో. ఇక ఈ షోలో ఎవరికి వారే డిఫరెంట్, సంథింగ్ స్పెషల్ పర్సన్స్. అందులోనూ నాగబాబు ఇంకొంచెం స్పెషల్. ఆయనకు తెలియకుండా షోలో ఏదీ జరిగేది కాదు. నాగబాబు ఈ షోకి కానీ, కమెడియన్స్ కి కానీ ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. రోజా కూడా నాగబాబు వల్లనే ఫేమస్ అయ్యింది.  ఒకవిధంగా చెప్పాలంటే నాగబాబు ఈ షోలో వాళ్లందరికి ఒక ఆరాధ్య దైవం అన్ని చెప్పొచ్చు. ఆయన కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతారు, పచ్చబొట్లు కూడా పొడిపించుకుంటారు. చివరికి నాగబాబు 'జబర్దస్త్'కి బై బై చెప్పి 'అదిరింది' షోకి వెళ్లిపోయారు. ఇక ఆయన్ని నిత్యం ఆరాధించే చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వాళ్ళు కూడా ఆ షో నుంచి వచ్చేసారు.  ఒక్క మాట‌లో చెప్పాలంటే కిర్రాక్ ఆర్పీకి నాగబాబు అంటే పిచ్చి. ఆయనకు చెప్పకుండా ఒక్క పని చేయడు. చివరిగా ఆర్పీకి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు బయటపడింది. సుధీర్ ఆయన ప్రేమను ప్రపంచానికి చూపించాడు. ఇక ఈ విషయం నాగబాబుకు చెప్పకుండా చేసాడు. నాగబాబు అంటే పచ్చబొట్టు పొడిపించుకునేంత ప్రేమ అని ఆయన గుండెల మీద ఉన్న పచ్చబొట్టుని నాగబాబుకి చూపించాడు సుధీర్.  "అదేంట్రా ఎప్పుడూ చెప్పలేదు?" అంటూ నాగబాబు షాక్ అయ్యాడు. ఒక్క నిమిషం ఆర్పీ చేసిన పనికి ఎమోషన్ అయ్యాడు. "వీడి పిచ్చి ఏంటో వీడికే తెలీదు. అందుకే కిర్రాక్ ఆర్పీ అని పేరు పెట్టుకున్నాడు" అని సుధీర్ అన్నాడు. 'పార్టీ చేద్దాం పుష్ప' అనే షోలో ఇది చూడొచ్చు. ఇప్పుడు ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది.

లౌక్యం తెలీక 'మగధీర' మూవీ ఛాన్స్ వదులుకున్న అర్చన!

అర్చనా శాస్త్రి అలియాస్ వేదా శాస్త్రి అనే పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చే మూవీ "నేను". ఇదొక ఇంటరెస్టింగ్ మూవీ. మొద‌ట్లో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో అల‌రించిన ఆమె, ఆ త‌ర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ కి వెల్ నోటెడ్ పర్సన్. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్ లో యాక్ట్ చేసింది. తర్వాత ఈమె బిగ్ బాస్ సీజన్ వన్ లో కాంటెస్ట్ చేసి  మంచి సందడి చేసింది. ఇప్పుడు అర్చన, జగదీష్ జోడి 'అలీతో సరదాగా' షోకి వచ్చి తన మనసులోని మాటల్ని, బాధల్ని పంచుకుంది. అప్పటివరకు నవ్వినా చివర్లో బాగా ఎమోషన్ అయ్యింది అర్చ‌న‌. ఇప్పుడు ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. 'శ్రీరామదాసు' మూవీ టైములో తనకు పెద్ద ఏజ్ ఏమి లేదని చాలా చిన్న వయసు అని చెప్పింది. "అలా యాక్ట్ చేయగలిగాను అంటే ఆ క్రెడిట్ మొత్తం నా క్లాసికల్ డాన్స్ వల్లనే" అంది అర్చన.  "రాఘవేంద్రరావు గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. సర్.. రాఘవేంద్రరావు గారు మళ్ళీ ఎప్పుడు?" అంటూ ఈ షో ద్వారా అడిగింది. "పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ తో పార్టీ కి వెళ్లి, అక్కడినుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లావట ఏమైంది?" అని అలీ అడిగేసరికి "నేనున్నా కదా నీకు.. నువ్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయి అని చెప్పాను. కానీ నాకు తెలీదు కదా తన కెపాసిటీ ఎంతో.. ఫుల్ ఐపోయింది. దాంతో ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాల్సి వచ్చింది"  అని చెప్పాడు జగదీష్ .  "బాలయ్య బాబుకి కోరియోగ్రఫీ నేర్పించావట" అనీ అలీ అడిగితే, "బృందావనంలో గోపికలతో డ్యాన్స్ చేసే చిన్న బిట్ ఉంటుంది. అది నేను చెప్తే బాలయ్య గారు చేశారు. దాంతో ఆయన గడ్డం పట్టుకుని సూపర్, బాగా చేసావ్ అని మెచ్చుకున్నార"ని చెప్పింది అర్చన. "యమదొంగలో ఒక  సాంగ్ చేసావ్ కదా.. మరి అదే రాజమౌళి గారి డైరెక్షన్లో 'మగధీర'లో ఒక క్యారెక్టర్ చేయమంటే చేయను అన్నావట" అని అలీ అడిగేసరికి, "అప్పుడు బ్రెయిన్ చిన్నది.. లౌక్యం తక్కువ.. ఇప్పుడు పెరిగింది మెచ్యూరిటీ.. ఒకవేళ 'మగధీర'లో చేసి ఉంటే ఆయన నెక్స్ట్ ఫిలింలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారేమో" అంది.  త‌మ ఇద్దరిలో త‌నే రొమాంటిక్ అని అర్చన చెప్తే, "ఇద్ద‌రిలో అబద్దాలు నేను ఎక్కువగా చెప్తాను" అన్నాడు జగదీశ్. పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చి లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయినవి ఉన్నాయా అని అడిగేసరికి అర్చన ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అర్చనకు 'నేను', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'శ్రీరామదాసు' చిత్రాలు మంచి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టాయి.

తండ్రి కాబోతున్న సామ్రాట్

సామ్రాట్ అంటే గ‌తంలో ఎక్కువ‌మందికి తెలీదు కానీ, 'పంచాక్షరి' మూవీలో అనుష్క జోడీగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేయ‌డంతో మ‌రింత మందికి ద‌గ్గ‌ర‌య్యాడు. సామ్రాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ యాక్ట‌ర్‌ తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పేశాడు. తొందరలోనే తాను నాన్నను కాబోతున్నానని చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. "మా చిన్నారి రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం" అనే కాప్షన్ పెట్టి, బేబీ బంప్ ఉన్న‌ వైఫ్ శ్రీలిఖితతో క‌లిసున్న‌ ఫోటో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్  అవుతున్నాయి. ఈ జంటకు నెటిజన్స్ విషెస్ కూడా చెప్పేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సామ్రాట్ మ్యారేజ్ లైఫ్ విషయం పై కొన్ని కాంట్ర‌వర్సీస్ నడిచాయి. అప్పట్లో మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం అనే విషయం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. రెండేళ్ల క్రితం శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు సామ్రాట్. టాలీవుడ్ లో 'పంచాక్షరి', 'అహ నా పెళ్ళంట', 'బావ' వంటి మూవీస్ లో యాక్ట్ చేశాడు. సామ్రాట్ తండ్రి కాబోతున్నాడని తెలిసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా కంగ్రాట్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక సామ్రాట్ కూడా తనకు విషెస్ చెప్పిన అందరికి థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చాడు.

'జబర్దస్త్' నుంచి తప్పుకున్న అనసూయ.. షో ప‌రిస్థితేంటి?

అనసూయ బుల్లి తెర మీద ఒక ఆటం బాంబు. నవరసాలు పండించే యాంకర్. ఇటు స్మాల్  స్క్రీన్ మీద, అటు బిగ్ స్క్రీన్ మీద తన సత్తా చాటి దూసుకుపోతున్న స్టైలిష్ యాంకర్. పుష్ప మూవీలో సునీల్ భార్య పాత్రలో మాస్ రోల్ లో నటించింది అనసూయ. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందోన‌నే ఆసక్తి కలిగిస్తోంది. కాగా జబర్దస్త్ షో ద్వారా ఇంత‌దాకా అనసూయ మంచి కామెడీని, హ్యూమర్ ని పంచుతూ వ‌చ్చింది. చాలా కాలంగా ఈ షోకి హోస్ట్ చేస్తోంది అనసూయ. జబర్దస్త్ షో నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. ఇప్పుడు అనసూయ వంతు వచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే కానీ ఇప్పుడు సడెన్‌గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. తన కెరీర్లో ఇదే చాలా పెద్ద నిర్ణయం అని అంటోంది. "ఈ షోతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని నాతో తీసుకెళ్తున్నా అంది. ఇక ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను" అంటూ అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. మూవీస్ లో ఛాన్సెస్ వస్తుండడం, అలాగే మరో కొన్ని షోస్ తో ఎంగేజ్ కావడం వలన ఈ షో నుంచి తప్పుకోవాల్సిన‌ పరిస్థితి వచ్చిందేమో అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా జబర్దస్త్ షో ఇప్పటికే రేటింగ్ ప‌డిపోయి, నడవలేక నడుస్తోంది. ఇక ఇప్పుడు అందాల అనసూయ కూడా షో నుంచి తప్పుకుంది. ఇక ఎవరు ఈ షోని  హ్యాండిల్ చేస్తారో, జబర్దస్త్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

జానకి చదువు ఆగదు.. అమరదీప్ కి శోభనం జరగదు!

'మొగుడ్స్ పెళ్లామ్స్' షో ఎవ్రీ వీక్ నవ్వులతో సాగిపోతోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా అంతే జోష్ ని అందించింది. ఫైనల్‌గా ఈ షోలో పెర్ఫార్మ్ చేసిన కపుల్స్ అందరికీ  డిఫరెంట్ నేమ్స్ తో అవార్డ్స్ కూడా అందించారు స్టమక్ స్టార్ ముక్కు అవినాష్. ముందుగా "బయట మ్యూజిక్ ఇంట్లో మ్యాజిక్" అవార్డును సాకేత్ కొమాండూరి, పూజిత కపుల్ కి అందించారు. "స్టమక్ స్టార్ అని నాకు అవార్డు ఇచ్చారు కానీ సాకేత్ కి ఇవ్వాలి" అన్నాడు అవినాష్.  తర్వాత సాకేత్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. "నాకు తెలిసి ఫస్ట్ టైం అవార్డు ఫంక్షన్ లో యాంకర్స్ దిక్కులేకుండా పక్కన నిలబడి అనౌన్స్ చేస్తుంటే గెలిచిన వాళ్ళు పోడియం మీద నిలబడి మాట్లాడుతున్నారు" అన్నాడు. స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. "ఈ అవార్డుని బయట నాతో కలిసి పని చేసే కో-మ్యుజీషియన్స్ అందరికి డేడికేట్ చేస్తున్నాన‌"ని చెప్పాడు సాకేత్‌. తర్వాత "ఆగదు.. జరగదు" అనే అవార్డుని అమరదీప్, ప్రియాంకకి ఇచ్చారు. 'జానకి కలగనలేదు' సీరియల్ లో కపుల్ గా నటిస్తున్నారు వీళ్ళు. 'జానకి చదువు ఆగదు.. అమరదీప్ కి శోభనం జరగదు' అనే కాన్సెప్ట్ లో ఈ అవార్డుని అందించారు. ఏ షో ఐనా ఇద్దరి మధ్యా రొమాన్స్ తగ్గట్లేదు అంటూ "నీ యవ్వా తగ్గేదేలే" అనే అవార్డుని కీర్తికి, మహేష్ కి ఇచ్చారు. "ఒకటా, రెండా, మూడా" అనే అవార్డుని అర్జున్ అంబటి, సుహాసినికి ప్రెజంట్ చేశారు. "ముసలోళ్లే కానీ మహానుభావులు"  అనే అవార్డుని అప్పారావు, లక్ష్మికి అందించారు. "ఊ అంటారా.. ఊఊ అంటారా" అవార్డుని నిఖిల్, కావ్యకి ఇవ్వగా క్రేజీ టైటిల్  "ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం" అవార్డుని రవికృష్ణ, నవ్యస్వామికి అందించారు. ఫైనల్ గా "నా మాటే శాసనం" పేరుతో ఉన్న అవార్డుని జ్యోతి, గంగూలీ కపుల్ కి ఇచ్చి విన్నర్స్ అందరితో విన్నింగ్ స్పీచెస్ తీసుకున్నారు. భార్యాభర్తలు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటున్నానిని చెప్తూ ఈ షోని ఎండ్ చేసింది అందాల శ్రీముఖి.

అందమైన ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ఆటో!

జబర్దస్త్ రాంప్రసాద్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ గా ఆడియన్స్ కి బాగా తెలుసు. గెటప్ శీను, సుధీర్, రాంప్రసాద్ మంచి ఫ్రెండ్స్ గా బాగా పరిచయం. జబర్దస్త్ అంటే వీళ్ళ ముగ్గురేనా అన్నట్టు సాగిపోయింది. తర్వాత ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు వెళ్లిపోయారు. రాంప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో ఉండిపోయాడు. ఫ్రెండ్స్ అంతా విడిపోయేసరికి ఈ షోకి ఉన్న కళ కూడా బాగా తగ్గిపోయింది. రేటింగ్స్ కూడా పడిపోయాయి. ఐతే ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో ఆడియన్స్ తో  సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. రాంప్రసాద్ కూడా అదే పనిలో ఉన్నాడు. మంచి మంచి ఔట్ ఫిట్స్ తో షూట్స్ చేయించి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు.  ఇక లేటెస్ట్ గా ఒక ఫోటో రిలీజ్ చేసాడు. "ఈ ఆటోకి అందంగా డిజైన్ చేసింది" అనే కాప్షన్ పెట్టి సైడ్ లుక్ ఫోటో ఒకటి వదిలాడు. దానికి, "అర్హ.. థాంక్స్ ఫర్ అవుట్ ఫిట్" అని పోస్ట్ చేసాడు. 'సూపర్ బ్రో' అని ఒకరంటే, 'షూస్ కి సాక్స్ వేసుకోవడం మర్చిపోయావా' అంటూ ఒక నెటిజన్ క్రేజి కామెంట్ ని పోస్ట్ చేశారు. ఇలా ఈ అవుట్ ఫిట్స్ లో ట్రెండీగా కనిపిస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ లో ఎన్నో టీమ్స్ వచ్చాయి, వెళ్లాయి.. కానీ సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ టీమ్ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో స్పెషల్ . ఎంతో టాలెంట్ ఉన్న‌ వీళ్ళు కొత్త కొత్తగా స్కిట్స్ రాసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ముందుండేవాళ్లు. అందుకే ఈ టీమ్ ఈ షోలో ది బెస్ట్ టీమ్ గా పేరు సంపాదించుకుంది.

న‌య‌ని - విశాల్ తీసిన‌ పెట్టెను వ‌ల్ల‌భ బ‌ద్ద‌లు కొట్టాడా?  

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందినీ సీరియ‌ల్ గ‌త వారం రోజులుగా చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. బుధ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో చూద్దాం. న‌య‌ని - విశాల్ ల‌కు ల‌భించిన పురాత‌న పెట్టెలో ఏముందో తెలుసుకోవాల‌న్న కుట్ర‌కు తిలోత్త‌మ, క‌సి, వ‌ల్ల‌భ‌ తెర‌లేపుతారు. ఇందుకు న‌య‌ని చెల్లి సుమ‌న‌ని పావుగా వాడుకోవాల‌ని ప‌థ‌కం వేస్తారు. విక్రాంత్ లేని స‌మ‌యం చూసి త‌న‌ని న‌య‌ని ఇంటికి పంపిస్తారు. అయితే విక్రాంత్ కూడా అక్క‌డికే వెళ్లిపోతాడు. భోజ‌నం చేసి అంతా ప‌డుతున్నాక తిలోత్త‌మ చెప్పిన‌ట్టు ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాల‌ని దొంగ‌లా సుమ‌న ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన విక్రాంత్ "దొంగ దొంగ" అంటూ అర‌వ‌డంతో న‌య‌ని - విశాల్ మేలుకుంటారు. లైట్ వేసి చూస్తే సుమ‌న వుండ‌దు.. ఎక్క‌డి వెళ్లిందా అని వెతుకుతుంటే ఎక్క‌డ దొరికి పోతానో అని వెంట‌నే న‌య‌ని వున్న గ‌దిలోకి వ‌చ్చేస్తుంది సుమ‌న‌. వాష్ రూమ్ కి వెళ్లాన‌ని.. ఇంత‌లోనే గోల చేస్తున్నారంటుంది. ఇక తెల్లారాక తిలోత్త‌మ.. సుమ‌న‌కు ఫోన్ చేసి "ఏం చేశావ్‌.. పెట్టెలో ఏముంది?" అంటూ అడ‌గ‌డం మొద‌లు పెడుతుంది. ఇంత‌లో ఆ ఫోన్ విక్రాంత్ తీసుకుని తల్లి తిలోత్త‌మ మాట‌లు వింటాడు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది.  క‌ట్ చేస్తే... తిలోత్త‌మ, క‌సి, వ‌ల్ల‌భ‌, ధురంద‌ర‌, హాసిని అంతా క‌ల‌సి న‌య‌ని ఇంటికి వ‌స్తారు. దాచిన పెట్టెలో మాకూ భాగం ఇవ్వాల్సిందే అంటూ గొడ‌వ‌కు దిగుతారు.. దీంతో న‌య‌ని తెలివిగా త‌న‌కు ప‌రిచ‌యం వున్న ఎస్.ఐ. కి ఫోన్ చేసి విష‌యం చెబుతుంది.. వెంట‌నే స్పాట్ కు వ‌చ్చిన ఎస్.ఐ. ఏం చేశాడు?.. వ‌ల్ల‌భ పెట్టెను బ‌ద్ద‌లు కొట్టాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

అడ్డంగా దొరికిన కైలాష్.. వేద మాట‌లు ప‌ట్టించుకోని మాలిని

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సాం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజాగా కీల‌క మ‌లుపు తీసుకున్న ఈ సీరియ‌ల్ లోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. వేద‌పై క‌న్నేసిన కైలాష్ ఏం చేశాడు.. వేద‌ని ఎలా ఇబ్బందుల‌కు గురిచేశాడ‌న్న‌ది ఈ ఎపిసోడ్ లో చూద్దాం. య‌ష్ బిజినెస్ కాంట్రాక్ట్ ప‌ని మీద ప్ర‌త్యే మీటింగ్ కోసం ముంబై వెళ‌తాడు. రెండు రోజుల వ‌ర‌కు రాడ‌ని తెలియ‌డంతో కైలాష్ త‌న ప్లాన్ ప్ర‌కారం వేద‌ని త‌న బుట్ట‌లో వేసుకోవాల‌ని ప్లాన్ చేస్తాడు. త‌న కోసం ల‌వ్ సింబ‌ల్ వున్న గిఫ్ట్ ని కూడా సిద్ధం చేసి త‌న‌కు ఇచ్చి ప్ర‌పోజ్ చేయాల‌ని సిద్ధ‌మ‌వుతాడు. ఇదే స‌మ‌యంలో బెడ్రూమ్ లో వున్న వేద స్నానం చేసి చీర క‌ట్టుకుని త‌ల తుడుచుకుంటూ చీర స‌ర్దు కుంటూ వుంటుంది. ఇదే మంచి అద‌నుగా భావించిన కైలాష్ వెంట‌నే వేద బెడ్రూమ్ లోకి దూరిపోతాడు.. త‌న‌కు తెలియ‌కుండానే వెన‌కాలే వెళ్లి వేద‌ని త‌న రెండు చేతుల‌తో బంధిస్తాడు.. ఏం జ‌రుగుతోందో తెలుసుకునే క్ర‌మంలో వేద షాక్ కు గుర‌వుతుంది. నేనే వేద అని కైలాష్ అన‌డంతో ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. బ‌ల‌వంతంగా కైలాష్ చేతుల్లో నుంచి విడిపించుకుంటుంది. అయినా స‌రే కైలాష్ త‌న‌ని తాకుతూ త‌డుముతూ వుంటాడు. వేద చీద‌రించుకుంటూ బ‌య‌టికి వెళ్ల‌మ‌ని.. నా బెడ్రూమ్ లోకి రావ‌డానికి నీకు ఎంత ధైర్య‌మ‌ని వాదిస్తుంది. అయినా స‌రే ప‌ట్టించుకోని కైలాష్ త‌న కోసం తెచ్చిన గిఫ్ట్నిస్తాడు. చీద‌రించుకున్న వేద వెంట‌నే వెళ్లి ఈ విష‌యాన్ని మాలినికి చెబుతుంది. కానీ మాలిని, ఆమె కూతురు కైలాష్ మంచి వాడ‌ని కితాబిస్తారు.. ఈ విష‌యాన్ని య‌ష్ కు చెప్పాల‌ని వేద ఫొన్ చేస్తే అదే స‌మ‌యంలో య‌ష్ బెడ్రూమ్ లో మాళ‌విక వుంటుంది.. ఇంత‌కీ వేద జీవితంలో ఏం జ‌ర‌గ‌బోతోంది? ఏ మ‌లుపు తిర‌గ‌బోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

నా లైఫ్ లో ది బెస్ట్ మా నాన్న అంటున్న దివిజ

ప్రభాకర్ బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఒకప్పటి ఋతురాగాలు సీరియల్ నుంచి చిన్న చిన్నగా మొదలైన ప్రయాణం ఇప్పుడు మూవీస్ లో కూడా యాక్ట్ చేసేవరకు ఎదిగారు. ప్రభాకర్ వైఫ్ మలయజ, కూతురు దివిజ..ఇక దివిజ ఫాదర్స్ డేని రీసెంట్ గా సెలెబ్రేట్ చేసింది. ఎందుకంటే తన హయ్యర్ స్టడీస్ కోసం హాస్టల్ కి వెళ్ళిపోతున్న సందర్భంగా ఫాదర్స్ డే రోజున కాకుండా ఆ తర్వాత సెలెబ్రేట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపిస్తాను అంటూ నెటిజన్స్ కి  బై కూడా చెప్పేసింది. ఇక సర్ప్రైజ్ చేయడానికి ప్రభాకర్ కి ఇష్టమైన పెర్ఫ్యూమ్ బాటిల్, ఒక షర్ట్, ఒక కేక్ తీసుకుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది దివిజ. ఒక రైటర్ తో డిస్కషన్స్ లో ఉన్నాను నైట్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి అని చెప్తాడు.  ఇక వెంటనే గిఫ్ట్స్ అన్నీ వాళ్ళ ఆఫీస్ కే తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తుంది దివిజ. ప్రభాకర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఫాదర్స్ డే ఏమిటి అనేసరికి హాస్టల్ కి విల్లిపోతున్నా  కాబట్టి ఇలా ప్లాన్ చేశా అని చెప్తుంది దివిజ. ప్రభాకర్ ఫామిలీలో  ఇప్పటివరకు ఎవరూ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి దివిజాని చదివించాలనే  పట్టుదలతో చదివిస్తున్నాను  అని చెప్తాడు. ఐతే దివిజ తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పేసరికి యాక్టింగ్ ఎప్పుడైనా చేయొచ్చు ముందు చదువు ఇంపార్టెంట్ అని చెప్తాడు ప్రభాకర్. తనకు చాలా హై గోల్ ఉందని అది రీచ్ అయ్యాక వస్తానని చెప్తుంది దివిజ. డాడీ తన లైఫ్ లో ది బెస్ట్ అంటుంది. నాన్న నాకు నువ్వు ఏమైతే చేసావో అన్నిటికి థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక  మలయజ కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఫాదర్స్ డే విషెస్ చెప్తుంది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఒక వేళ ఏదైనా తప్పు చేస్తే క్షమించు.. మనిషిగా ఎదిగేలా ఛాన్స్ ఇవ్వు. నువ్వు ఎప్పుడూ నా వల్ల తల దించుకునే పరిస్థితి రానివ్వను. గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను ఇది నా ప్రామిస్ అని వాళ్ల నాన్న మీద ప్రేమను తన మాటల్లో చెప్తుంది దివిజ. ఇది సూపర్ వీడియో, నాన్నకు మంచి కూతురు ఉంది, అక్కా  నిన్ను మిస్ అవుతున్నాం అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.