సుధీర్‌కు ఫ‌స్ట్ చాన్స్ ఇచ్చింది.. వేణు!

'పార్టీ చేద్దాం పుష్ప' షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హిలేరియస్ గా సాగిపోయింది. డ్యాన్సెస్‌తో, స్కిట్స్‌తో కడుపుబ్బా నవ్వించారు కంటెస్టెంట్స్. స్టేజి మీద కరివేపాకు బాబా స్కిట్ కూడా మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఈ స్కిట్ గురించి అందరూ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు జడ్జెస్. ఈ స్కిట్ లో సుధీర్ కరివేపాకు బాబా దగ్గరకు వచ్చి తన డెస్టినీ ఎలా ఉండబోతోంది అంటూ అడిగాడు. "డిస్నీకి ఇక నీ డెస్టినీ బాగుంటుంది, హాట్ స్టార్ లో బాగా చేసుకో సూపర్ స్టార్‌వి ఐపోతావ్" అంటూ  జోస్యం చెప్పాడు ధనరాజ్. స్కిట్ ఎండింగ్ లో సుధీర్ తన ఫస్ట్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. "నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది వేణు అన్న, అవకాశం ఇప్పించింది శీను" అంటూ గుర్తు చేసుకున్నాడు. "ఈరోజు ఈ స్టేజి మీద ఇలా ఇంతలా ఎదిగాను అంటే దానికి కారణం వేణు, శీను.. నా జీవితాంతం వీళ్లిద్దరికీ రుణపడి ఉంటాను" అంటూ స్టేజి మీద వీళ్ళ ఇద్దరితో మొదలైన జర్నీ గురించి ఆనాటి జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చాడు సుధీర్.  "2013 ఫిబ్రవరి 2న ఫస్ట్ టైం నేను స్టేజి మీదకు రావడం.. నాగబాబు గారిని షూటింగ్‌లో చూడడం తప్ప రియల్ గా చూసింది ఆ రోజే" అని వెల్ల‌డించాడు. ఫస్ట్ స్కిట్ ప్రెజంట్ చేసినప్పుడు జడ్జెస్ చేసిన కామెంట్స్, ఆ స్కిట్ పెర్ఫార్మన్స్ ని రికార్డు చేసుకుని భద్రంగా ఉంచుకున్నానన్నాడు. "ఇక్కడ ఎవరికీ ఏ ప్రాబ్లెమ్ వచ్చినా మేమున్నాం అంటూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయేంత అనుబంధం ఏర్పడింది అంటే అది వేణు అన్న వ‌ల్ల‌నే" అన్నాడు సుధీర్.. "ఈరోజు నేను, నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉంటూ, ఆడియన్స్ తో నాకు ఇంత అటాచ్మెంట్ పెరిగింది అంటే అది వేణు అన్న నాకు ఇచ్చిన మొదటి అవకాశం" అంటూ వేణుకి, ధనరాజ్ కి థ్యాంక్స్ చెప్పాడు సుధీర్. "ఆనాటి మిత్రులంతా కూడా ఇలా ఈ స్టేజి మీద ఇలా కలవడం సంతోషంగా ఉంది" అంటూ వేణు కూడా ఎమోషన్ అయ్యాడు.

ఆది ప్రేమను రిజెక్ట్ చేసిన ఇషా!

బుల్లి తెర మీద పంచ్ డైలాగ్స్ కి ప్రాణం పోసి ఎదిగిన కమెడియన్స్ లో హైపర్ ఆది పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ బుల్లితెర మీద ఒక్కొక్కరి ప్రేమ వ్యవహారాలూ, పెళ్లి విషయాలపై ఎప్పుడూ పెద్ద ఎత్తున చర్చలు  జరుగుతూ ఉంటాయి. ఇక ఆది కూడా ఇప్పుడు ఆ కోవలోకి వెళ్ళిపోయాడు. ఆది ఇప్పటికే ఎంతోమందితో ప్రేమలో ఉన్నట్లు  చెప్పుకుంటూ వచ్చాడు. వర్షిణితో ప్రేమాయణం అని, పెళ్లి అని ఒకసారి.. తరువాత చుట్టాలమ్మాయిని వివాహం చేసుకుంటున్నట్లు మరోసారి, రీసెంట్ గా ఒక షోలో ఈమె నా భార్య అంటూ ఒక అమ్మాయిని ముగ్గురు పిల్లల్ని పరిచయం చేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇషా చావ్లా వెంట పడడం స్టార్ట్ చేసాడు ఆది. 11 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానని చెప్పి 11 గిఫ్టులు కూడా ఇచ్చేసాడు.  వీటితో పాటు అదనంగా కొన్ని క‌వితల్ని కూడా తన రైటర్ స్టైల్ లో రాసి మరీ ఆమె కోసం చెప్పాడు. "ఏరా ఈషా నువ్ నటించిన మూవీ 'ప్రేమ కావాలి' వచ్చి పదకొండేళ్ళ అయ్యింది. అప్పటినుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను" అంటూ స్టేజి మీదే తన లవ్ ని ప్రొపోజ్ చేసేసాడు. అలాగే "జీవితాంతం నా పక్కనే ఉండాలి నువ్వు" అంటూ  బాండ్ పేపర్స్ ఇచ్చి సంతకం చేయించేలా ప్లాన్ చేసాడు ఆది. చివరికి ఇషా స్టేజి మీదకు వచ్చి "గిఫ్ట్స్ అన్నీ నచ్చాయి కానీ ఒక్క గిఫ్ట్ మాత్రం ఇవ్వడం మర్చిపోయాడు. గిఫ్ట్స్ ఎంపికలో పడి తనని తానే నాకు ప్రొపోజ్ చేయడం మర్చిపోయాడు" అంటుంది. "అది నా తప్పు కాదు.. సర్లే అయిందేదో అయ్యింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం" అంటూ 'ఇష్టమైన సఖుడా' అనే పాటకు జోడి డాన్స్ వేసి వెళ్ళిపోయింది ఇషా. ఇక ఈ షోలో ఇలా  ఇషా కూడా హ్యాండ్ ఇచ్చేసరికి "పోయే పోయే లవ్వే పోయే" అంటూ బాధపడ్డాడు ఆది.

పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన పూర్ణ

పూర్ణ ఇప్పుడు బుల్లి తెర మీద మంచి ఫేమస్ నేమ్. 'శ్రీ మహాలక్ష్మి' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తర్వాత అల్లరి నరేష్ తో 'సీమ టపాకాయ్' మూవీలో నటించి క్రేజ్ సంపాందించుకుంది. అవును, లడ్డుబాబు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా వంటి మూవీస్ లో యాక్ట్ చేసింది. తర్వాత బుల్లి తెర మీద బాగా పాపులర్ అయ్యింది పూర్ణ. వీటితో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఆడియన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఇక ఈమె కొన్ని డాన్స్ అండ్ రియాలిటీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తోంది పూర్ణ. ఐతే ఇటీవల పూర్ణ బిజినెస్ మ్యాన్ ఐన షానిద్ అసిఫ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.  తాజాగా తన పెళ్లి డేట్ ఫిక్స్ ఐనట్లు తెలుస్తోంది. నవంబర్ 6న తాను షానిద్ ని వివాహం చేసుకుంటున్నట్లు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో స్టేజి మీద అనౌన్స్ చేసింది. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ తాను దుబాయ్ కూడా వెళ్ళిపోతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పూర్ణ నటించిన దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక పూర్ణ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో 'పేరెట్టి నేనెట్టా' సాంగ్ కి అలాగే 'శ్రీవల్లి' సాంగ్ కి లంగా వోణిలో డాన్స్ చేసి స్టేజిని ఒక ఊపు ఊపేసింది. ఇక నాటీ నరేష్ వచ్చి పూర్ణ డాన్స్ బాగుందని దిష్టి తగలకుండా ఉండాలి అంటూ స్టేజి మీదకు వచ్చి పూర్ణ బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఇక పూర్ణ కూడా నరేష్ ని నచ్చో అని పిలుస్తూ నరేష్ అంటే ఇలా ఉంటేనే  ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్తాను అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చేసింది పూర్ణ.

 ఆ రోజు నుంచే జోర్దార్ సుజాత మాయ‌లో ప‌డ్డాడ‌ట!

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలని టీమ్ లీడ‌ర్లు ఒక్కొక్క‌రుగా వీడుతున్నా మిగ‌తా వాళ్లు షోని హిట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆటో రాంప్ర‌సాద్‌, రాకింగ్ రాకేష్‌, ఇమ్మానుయేల్, బుల్లెట్ భాస్క‌ర్ వంటి వారు త‌మ టీమ్ ల‌తో షోని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్ర‌తి శుక్ర‌వారం ప్ర‌సారం అవుతున్న ఈ షో కోసం టీమ్ లీడ‌ర్లు కొత్త కాన్సెప్ట్ ల‌తో వ‌స్తూ అద‌ర‌గొడుతున్నారు. ఈ షో నుంచి సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను వంటి వాళ్లు వెళ్లిపోవ‌డంతో ఉన్న వాళ్లే ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్ ల త‌రువాత ఈ షోలో కంటిన్యూ అవుతున్న రాకింగ్ రాకేష్ కూడా సీనియ‌రే. దీంతో త‌న వంతు బాధ్య‌త‌గా షోని మ‌రింత బాధ్య‌త‌గా ర‌క్తిక‌ట్టించేందుకు త‌న వంత ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. జోర్దార్ సుజాత‌తో క‌లిసి న‌వ్విస్తున్నాడు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య సాగుతున్న ల‌వ్ స్టోరీ కూడా ఈ షోకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తూ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు.  జాక్‌గా రాకింగ్ రాకేష్‌, రోస్‌గా సుజాత క‌నిపించి న‌వ్వులు పూయిస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిసి టైటానిక్ స్ఫూఫ్ తో అల‌రించారు. షిప్ కెప్టెన్ తో వీరిద్ద‌రూ చేసే  సంభాష‌ణ న‌వ్వులు పూయిస్తోంది. టైటానిక్ షిప్ హైద‌రాబాద్ లో అమీర్ పేట్‌, పంజాగుట్ట అన్ని ప్రాంతాలు తిరుగుతుంద‌ని చెప్ప‌డం న‌వ్వులు పూయించే విధంగా వుంది. రియ‌ల్ లైఫ్ ల‌వ్ జోడీ ఐన రాకేష్‌, సుజా మ‌ధ్య‌లో ప్రేమ గురించి చెప్పే మాట‌లు ఆస‌క్తికంగా ఉన్నాయి. ఓవ‌రాల్ గా ఈ స్కిట్ బాగా ఆక‌ట్టుకుంది. ఈ స్కిట్ పై ఇంద్ర‌జ ప్ర‌శంస‌లు కురిపించింది.  స్కిట్ పూర్త‌య్యాక సుజాత‌తో త‌న రియ‌ల్ లైఫ్ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో వివ‌రించాడు రాకింగ్ రాకేష్‌. ఓ రోజు సుజాత ప‌ని చేసే ఛాన‌ల్ కి ఇంట‌ర్వ్యూ కోసం వెళితే అక్క‌డే ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం మొద‌లైంద‌ట‌. ఆ రోజు నుంచే జోర్దార్ సుజాత మాయ‌లో ప‌డ్డాడ‌ట. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. 

సుమ ప్రశ్నకు కోపంతో స్టేజి మీద నుంచి వెళ్లిపోయిన ఆకాష్!

'క్యాష్' ప్రోగ్రాం బుల్లితెర మీద దూసుకుపోతోంది. మార్కెట్ లో ఏ కొత్త మూవీ రిలీజ్ ఐనా ఆ టీమ్‌ ఈ క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి ఈ స్టేజి మీద ఎంటర్టైన్ చేసి వెళ్లాల్సిందే. ఈ షోకు ఇటీవలే  'పక్కా కమర్షియల్' టీం వచ్చి ఓ రేంజ్ లో సందడి చేసి వెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ రిలీజ్ ఐన 'చోర్ బాజార్' టీం లేటెస్ట్ గా క్యాష్ షోకి వచ్చింది. ఈ మూవీలో నటించిన హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ గెహ‌నా సిప్పీ, ఆర్టిస్ట్స్ రచ్చ రవి, ఇమ్మానుయేల్ వచ్చారు. అప్పటివరకూ ప్రశాంతంగా సాగిన షో ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. దానికి కారణం సుమ అడిగిన టిపికల్ ప్రశ్న.  'డైరెక్ట‌ర్‌ జీవన్ రెడ్డి, హీరో ఆకాష్ పూరి ఇద్దరిలో ఎవరితో కలిసి సినిమా చేయడం మీకు టాప్ గా అనిపించింది?' అంటూ సుమ ఈ షోలో హీరోయిన్ గెహ‌నా సిప్పీకి ఒక ఫిట్టింగ్ క్వశ్చన్ వేసింది. 'జీవన్ రెడ్డితో చేయడం టాప్ అనిపించింది' అనే ఆన్సర్ ఇచ్చింది గెహ‌నా.. "ఈ  అమ్మాయికి జీవన్ రెడ్డితో చేయడం నచ్చిందట" అని సుమ గట్టిగా అరిచి మరీ చెప్పేసరికి ఆకాష్ జేబులో చేయి పెట్టుకుని కోపంతో స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే గెహ‌నా "ఐ యాం వెరీ సారీ ఆకాష్" అంటూ అత‌ని వెనకాలే వెళ్లింది.  ఇక ఈ షోలో 'క్యాష్ బజార్' పేరుతో సినిమాలో నటీనటులు వాడిన వస్తువులని వేలం వేసి అమ్మేసింది సుమ. "రండి బాబు రండి.. 'మగధీర'లో కాజల్ వాడిన కత్తి, 'ఆర్.ఆర్.ఆర్' లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ వాడిన బల్లెం.. రండి బాబు రండి" అంటూ వేలం పాట పెట్టింది. ఇంతలో ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి వచ్చి బల్లెం కొందామనుకుంటుంది. ఆమె దగ్గరకు రచ్చ రవి వచ్చి "ఎవరిని కొడతావ్?" అని అడిగేసరికి "నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే కొట్టడానికి" అని చెప్పింది. 'ఏయ్'.. అంటే నీకే ముందుగా నీకే పడతాయ్ అన్న అర్థంలో సుమ ఇమ్మానుయేల్ వైపు వేలు చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్స్ తో ఈ వారం ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇంతకు ఆకాష్ కి నిజంగానే కోపం వచ్చిందా? సినిమాల్లో వాడిన వస్తువులను ఎంతకు వేలం వేసి అమ్మింది సుమ? అనే విషయాలు తెలియాలంటే ఈ షో కోసం శనివారం వరకు  వెయిట్ చేయాల్సిందే..

సుడిగాలి సుధీర్ ట్రావెల్ ఏజెన్సీ 'ఊ కానీ'!

'పార్టీ చేద్దాం పుష్ప' ప్రోమో నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫుల్ షో ఇంకా పడకముందే ప్రోమోనే హండ్రెడ్ డేస్ ఆడించేలా డిజైన్ చేశారు నిర్వాహకులు. ఇక ఇందులో అంతా కమెడియన్స్, డ్యాన్సర్లు వచ్చి చేసిన హంగామా చూస్తుంటే ఈ షో వ‌చ్చేది ఎప్పుడా అంటూ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షో స్టార్టింగ్ లో "పార్టీ అంటే ఏ గోవాకో బ్యాంకాక్ కో వెళ్ళాలి" అంటూ అప్పారావు మంచి జోష్ మీద చెప్తూ ఉంటాడు. "గోవా వెళ్లాలన్నా, బ్యాంకాక్ వెళ్లాలన్నా మనకు ఒక గైడ్ కావాలి" అంటాడు ధనరాజ్ . అలా అనేసరికి  "మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్" అంటూ ఒక బ్యాగ్రౌండ్‌ వాయిస్ వినిపిస్తుంది. ఇక వెంటనే "తుఫాన్ తుఫాన్" అనే సాంగ్ ప్లే అవుతుంటే బ్లాక్ కలర్ డ్రెస్ లో బుల్లి తెర హీరో సుధీర్ ఎంట్రీ ఇస్తాడు.  తర్వాత సుధీర్ దగ్గరకు ధనరాజ్ వచ్చి 'మీకో ట్రావెల్ ఏజెన్సీ ఉందని చెప్పారు' అంటాడు. 'ఆ ఉందండి 'అంటాడు సుధీర్. 'ఆ  ఏజెన్సీ పేరేమిటి?' అని అడుగుతాడు ధనరాజ్. "ఊ కానీ" అనేది త‌మ‌ ట్రావెల్ ఏజెన్సీ పేరు అని చెప్తాడు. అర్థం కానట్టు చూస్తాడు ధనరాజ్. "అసలా పేరు ఎందుకు పెట్టావయ్యా?" అని సుధీర్ ని  ప్రశ్నిస్తాడు ధనరాజ్. "అంటే మన ట్రావెల్ ఏజెన్సీకి ఎండింగ్ అనేది ఉండదు సర్.. డే టైం కానీ, నైట్ టైం కానీ, ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ ప్లేస్ ఊ కానీ, ఊ కానీ" అని సుధీర్ చెప్పేసరికి  "నువ్ కానిచ్చుకోవయ్యా బాబు" అంటూ ధనరాజ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.  ఇప్పుడు ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుధీర్ అన్న ఉంటె షో నెక్స్ట్ లెవెల్ , సుధీర్ అన్న నువ్వు ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు, సుధీర్ అన్న స్టైల్ సూపర్బ్, సుధీర్ లేనిదే షో నడవదు అంటూ సుధీర్ ఫాన్స్ అంతా ఈ ప్రోమోకి మెసేజీల వరద కురిపిస్తున్నారు.

షాకింగ్‌.. క‌త్తిపై న‌య‌ని వేలి ముద్ర‌లు.. ఏం జ‌రుగుతోంది?

ఆషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టిస్తోన్న‌ సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. బుల్లితెర‌పై గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. జ‌ర‌గ‌బోయేది ముందే పసిగ‌ట్టే వ‌రం వున్న ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని మ‌లిచిన తీరు మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో, ట్విస్ట్ ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్‌లోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణుప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నారెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో విశాల్, న‌య‌ని త‌వ్వి తీసిన పెట్టెలో ఓ క‌త్తి ల‌భిస్తుంది. ఆ క‌త్తిపై వున్న వేలి ముద్ర‌లు ఎవ‌రివో తేల్చాల‌ని ఎస్సై త‌న టీమ్‌తో తిలోత్త‌మ ఇంటికి వ‌స్తాడు. వీరితో పాటు విశాల్, న‌య‌ని కూడా వ‌స్తారు. అక్క‌డ ఒక్కొక్క‌రి వేలి ముద్ర‌లు తీసుకుంటుంటారు. ఎవ‌రి వేలి ముద్ర‌లు మ్యాచ్ కావు.. చివ‌రికి విశాల్‌, తిలోత్త‌మ, న‌య‌ని మిగులుతారు. బాబు గారు మ‌గ వాళ్ల‌లో మీరు, ఆడ‌వాళ్లలో నేను, అత్త‌మ్మ మాత్ర‌మే మిగిలామ‌ని చెబుతుంది న‌య‌ని. స‌రే ముందు నేనే ఇస్తాన‌ని వెళ్లి వేలి ముద్ర‌లు ఇస్తాడు విశాల్‌.. అత‌నివి మ్యాచ్ కావు.. ఆ త‌రువాత తిలోత్త‌మ వంతు వ‌స్తుంది. దీంతో తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ ఇక త‌ప్పించుకునే మార్గం లేద‌ని, ఏదైతే అదైంది అన్నింటికి సిద్ధంగా వుండు అని వ‌ల్ల‌భ‌తో సైగ చేస్తుంది తిలోత్త‌మ‌.. ఈ లోగా విశాల్‌నే స్వ‌యంగా తిలోత్త‌మ వేలి ముద్ర‌లు వేయించ‌మంటుంది న‌య‌ని.. అలాగే చేస్తాడు.. షాకింగ్‌.. న‌య‌ని అనుకున్న‌ట్టుగా తిలోత్త‌మ వేలి ముద్ర‌లు మ్యాచ్ కావు.. కానీ అనూహ్యంగా న‌య‌ని వేలి ముద్ర‌లు మ్యాచ్ కావ‌డంతో అంతా షాక్ అవుతారు. న‌య‌ని కూడా ఏంటీ ఇలా జ‌రిగింద‌ని షాక్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

సూసైడ్ చేసుకోబోయిన బులెట్ భాస్కర్!

'జబర్దస్త్' షోలో బులెట్ భాస్కర్ స్కిట్స్ అంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఈ స్టేజి మీదకి ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది కమెడియన్స్ వచ్చి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుని చక్కని అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఐతే ఈవారం జబర్దస్త్ షోలో బులెట్ భాస్కర్ తన పర్సనల్ లైఫ్ గురించి  చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు. తాను ప్రేమలో ఓడిపోయాను కానీ  జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ ప్రేమను సంపాదించుకున్నానని చెప్పాడు. "నేను  ఒక అమ్మాయిని సిన్సియర్ గా, సీరియస్ గా  రెండేళ్ల పాటు ప్రేమించాను, తనతో కలిసున్నాను కూడా. ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది." అంటూ స్టేజి మీద తన లవ్ స్టోరీ చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బులెట్ భాస్కర్.  "పిచ్చెక్కి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రీ, వైజాగ్ అన్నీ ఊర్లు తిరిగేసేవాడిని. సూసైడ్ చేసుకుందామనుకున్నా.. తలకు కూడా ఎన్నో దెబ్బలు తగిలించుకుని తలంతా కుట్లు వేయించుకుని కొన్నాళ్ళు పిచ్చోడినై పోయాను. తర్వాత నన్ను నేను మార్చుకున్నా. నిజంగా ఒక అమ్మాయి మనల్ని మోసం చేస్తే వెళ్లి కొట్టాలి, తిట్టాలి, చంపేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా" అని అత‌న‌న్నాడు. కానీ అత‌ను మాత్రం అలాంటివి అసలు ఆలోచించలేదు. "ఎందుకంటే నేను నా ఎదుగుదలతోనే వాళ్ళను కొట్టాలనుకున్నాను. నేను ఎదిగితేనే మనల్ని మోసం చేసిన వాళ్ళను చెప్పుతో కొట్టినట్టు అని అప్పుడు డిసైడ్ అయ్యాను. అలా నన్ను నేను ప్రూవ్ చేసుకోడానికి హైదరాబాద్ వచ్చాను. అన్ని ఊర్లు తిరిగి చివరికి హైదరాబాద్ వచ్చాక జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ప్రతీ అపజయం వెనుక ఒక విజయం ఉంటుంది అనేది నిజమే" అంటూ తన బాధాకరమైన ఫెయిల్డ్ లవ్ స్టోరీని రివీల్ చేసాడు భాస్కర్.

య‌ష్ ఎంట్రీ.. స్టేష‌న్ లో వేద.. ఏంజ‌రిగింది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్న‌ రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ గా దీన్ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. స్టార్ ప్ల‌స్ లో ప్ర‌సార‌మై సూప‌ర్ హిట్ గా నిలిచిన `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు నటిస్తున్నారు. కైలాష్ గురించి అత్త మాలినికి చెప్పినా ఫ‌లితం లేక‌పోగా తిరిగి త‌న‌నే అనుమానిస్తూ అవ‌మానిస్తుండ‌టంతో ఈ విష‌యాన్ని త‌న అక్క‌కు చెప్పాల‌నుకుంటుంది వేద. వేంట‌నే త‌న‌ని క్లినిక్ కి రమ్మ‌ని ఫోన్ చేస్తుంది. అయితే నేరుగా త‌న గురించి అని కాకుండా త‌న ఫ్రెండ్ కు ఇలా జ‌రుగుతోంద‌ని చెబుతుంది. ఇలాంటి విష‌యాల్ని నాన్చ‌డం వ‌ల్ల మ‌న ఆడ‌వాళ్లు జీవితాల్ని కోల్పోతున్నార‌ని, అదే నేనైతే అడ్డంగా న‌రేకేస్తాన‌ని వేద అక్క చెబుతుంది. "నీ ఫ్రెండ్‌కి ధైర్యం లేక‌పోతే నేను వ‌స్తా వాడి అంతు చూడ‌టానికి" అని చెబుతుంది. దీంతో అక్క‌ర్లేద‌ని, తానే ఈ విష‌యాన్ని చెబుతానంటుంది వేద‌. ఇదంతా బ‌య‌ట చాటుగా వింటున్న వేద అసిస్టెంట్... వేద సోద‌రి వెళ్లిపోగానే లోపలికి వ‌చ్చేస్తుంది.. మీరు చెప్పింది మీ ఫ్రెండ్ గురించి కాద‌ని, మీ గురించేన‌ని, మిమ్మ‌ల్ని వేధిస్తుంది మీ ఇంట్లో వున్న కైలాష్ అని చెప్ప‌డంతో వేద ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. కైలాష్ నీచుడ‌ని, త‌న‌ని కూడా మోసం చేశాడ‌ని, వాడికి ఎలాగైనా మీరే బుద్ధి చెప్పాలంటుంది. అయితే త‌న‌కు స‌పోర్ట్ గా వుండాలంటుంది వేద‌. క‌ట్ చేస్తే .. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో వేద‌పై దాడికి కైలాష్ సిద్ధ‌ప‌డ‌తాడు.. అదే టైమ్ లో ముంబై ట్రిప్ ముగించుకుని య‌ష్ ఇంటికి వ‌స్తాడు.. మిర్ర‌ర్ పై వేద `ఐ మిస్ యూ` అని రాసి పెట్టడాన్ని చూసి ఫీల‌వుతాడు.. అయితే ఇంట్లో వేద క‌నిపించ‌దు.. కంగారు ప‌డిన య‌ష్.. స్టేష‌న్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు.. ఇంత‌కీ మిస్స‌యింది ఎవ‌ర‌ని ఎస్సై అడిగితే య‌ష్ ఫోన్ లో వేద ఫొటో చూపిస్తాడు. క‌ట్ చేస్తే పోలీస్ స్టేష‌న్‌ సెల్ లో వేద‌ని చూసి య‌ష్ షాక్ అవుతాడు.. ఇంత‌కీ ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

‘నువ్వు పెద్ద షో చేయొద్దు’ అంటూ వేణుపై ధనరాజ్ ఫైర్

జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ స్టేజి ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఎదిగారు. వేణు వండర్స్ కూడా మూవీస్ లో చేస్తూ బుల్లి తెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుని మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. 'పార్టీ చేద్దాం పుష్ప'లో చేసిన స్కిట్ చేసాడు వేణు. ఈ ప్రోమో ఆడియన్స్ లో ఒక హైప్ ని క్రియేట్ చేసింది. టాప్ మోస్ట్ కమెడియన్స్ అంతా వచ్చి ఈ షోలో స్కిట్స్ పెర్ఫార్మ్ చేసి అలరించబోతున్నారు. ఈ షోలో ధనరాజ్ బాబా వేషంలో ఒక ఆశ్రమం నడుపుతూ ఉంటాడు. అతని దగ్గరకు వేణు వండర్స్ తన కో - ఆర్టిస్ట్ తో వచ్చి "మన్మథ‌ రాజా మన్మథ‌ రాజా " అనే పాటకు ఇరగదీసే స్టెప్స్ వేస్తారు. అంతలో ధనరాజ్.. వేణు మీద సడెన్ గా ఫైర్ ఐపోతాడు. "ఆల్రెడీ ఇది షో మీరు పెద్ద షో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నా ఆశ్రమంలో డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు.. గెటౌట్, గెటౌట్ ఫ్రమ్ మై ఆశ్రమం" అంటూ మండిపడతాడు. "మీ ఆశ్రమం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నీ స్కిట్ లాంటిదే నీ ఆశ్రమం" అంటే, "నాకు" అని వేణు కూడా ధనరాజ్ కి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత పండు, ఆరియానా వచ్చి గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ లో "యాయాయాయా జై బాలయ్య" అనే సాంగ్ కి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తారు. ఇక సుధీర్, యాదవ రాజు స్కిట్ వేస్తారు. యాదవరాజు టీ పెట్టి సుధీర్ కి ఇచ్చినప్పుడు పవర్ కట్ అవడం, అంతలోనే ఏదో జరిగిపోయిందని రాజు ఏడవడం, ఇంతలో అక్కడికి ఎక్స్‌ప్రెస్‌ హరి వచ్చి అరవడం చేస్తారు. ఇక నాగబాబు కల్పించుకుని "ఇందుకేనట్రా నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వచ్చావ్" అంటూ సుధీర్ కి చురకలు వేస్తారు . "అయ్యో లేదు" అంటూ చెయ్యూపుతాడు సుధీర్. స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు. యాదవ రాజు తల మీద పూలను చూసి తల మీద సుధీర్ చేయ్యిపెట్టేసరికి విగ్గు ఊడిపోతుంది. వెంటనే రాజు అక్కడినుంచి పారిపోతాడు. "ఒరే అమ్మాయి కాదు అబ్బాయా.. ఆ ఏడూ కోట్లేదో ఇస్తాను. విగ్గు పెట్టి ఆ అమ్మాయిని ఒకసారి పంపించరా మాట్లాడతాను" అంటూ హరితో కామెడీ చేస్తాడు సుధీర్. ఇలా స్కిట్స్ అన్నీ కూడా సరదా సరదాగా సాగాయి ఈ షోలో.

నిరుపమ్ కి హ్యాపీ డాక్టర్ బాబు డే అని చెప్తున్న అభిమానులు

ఈరోజు  డాక్టర్స్ డే సందర్భంగా ఎంతో మంది డాక్టర్స్ ఈ రోజు విషెస్ అందుకున్నారు. ఇక ఆన్ స్క్రీన్ డాక్టర్ ఐన నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు కూడా శుభాకాంక్షలు అందుకుంటున్నాడు. రియల్ లైఫ్ లోను, రీల్ లైఫ్ లోనూ ఒక్క సర్జరీ కూడా చేయని నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబుకి ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీ మాత్రం డాక్టర్స్ డే విషెస్ చెపింది. నిరుపమ్ మంజుల ఇన్స్టా పేజీలో దీన్ని షేర్ కూడా చేసాడు. అభిమానులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాడు డాక్టర్ బాబు. కార్తీకదీపంలో నిరుపమ్ డాక్టర్ బాబుగా ఆడియన్స్ మనసులను కొల్లగొట్టాడు. అసలు పేరు పక్కకు పోయి డాక్టర్ బాబుగా మారిపోయాడు. ఈ సీరియల్ లో ఫేమస్ కార్డియాలజిస్ట్ పాత్రలో నటించాడు. బుల్లి తెర చరిత్రలో ఆన్ స్క్రీన్ మీద కేవలం డాక్టర్ గా నటించి ఎంతోమందికి ఆరాధ్య డాక్టర్ గా మారాడు నిరుపమ్. ఇక ఈ సీరియల్ లో కార్తీక, సహృద, ప్రేమి విశ్వనాధ్, నిరుపమ్ ఒక ఫామిలీగా నటించారు. ఎంతో మందికి ఫ్రీగా వైద్యం చేస్తూ గొప్ప డాక్టర్ గా పేరు సంపాదించుకుంటాడు. నిరుపమ్ నటించిన ఏ సీరియల్ లోని క్యారెక్టర్ కి  రాని పేరు ప్రఖ్యాతలు మాత్రం ఈ సీరియల్ లోని క్యారెక్టర్ కి వచ్చాయి. ఇక బ్రహ్మి స్టేటస్ లో హ్యాపీ డాక్టర్ డాక్టర్ బాబు డే అంటూ పెట్టిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రిషి ప్రేమాయణాన్ని అందరి ముందు బయటపెట్టిన సాక్షి

జగతి, వసు మాట్లాడుకుంటూ ఉంటారు. వసు మాత్రం రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వసు మనసు తెలుసుకున్న జగతి "నీ మనసేమిటో నీకే తెలియాలి" అంటుంది. "ఈ మధ్యనే ఒక క్లారిటీ వచ్చింది మేడం" అనేసి వెళ్ళిపోతుంది వసు. రిషి కారులో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అభినందన సభ దగ్గర జగతి వాళ్లంతా హడావిడి చేస్తూ ఉంటారు. వసు రిషి గురించి చూస్తూ ఉంటుంది. ఇంతలో బస్తీ వాళ్లంతా ప్రోగ్రాంకి వచ్చేసరికి వాళ్ళను రిసీవ్ చేసుకుంటుంది వసు. తర్వాత వసు పెట్టిన మెసేజ్ కి రిషికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇంతలో గౌతమ్ ఫోన్ చేసేసరికి అతని మీద సీరియస్ ఐపోతాడు. దేవయాని, ధరణి సభకి వస్తారు. జగతిని, మహేంద్రని ఉద్దేశించి వెటకారమాడుతుంది దేవయాని. జగతి కూడా రివర్స్ సమాధానం ఇచ్చేస్తుంది. ఇకపోతే సభని కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్స్ తో సాక్షి మాట్లాడుతుండగా జగతి చూస్తుంది. ఆ తర్వాత దేవయానితో సాక్షి మాట్లాడుతుండగా జగతికి అనుమానం వస్తుంది. ఇంతలో అక్కడికి మినిస్టర్ రానే వస్తారు. కాసేపట్లో వసుకు స్టేజి మీద జరగబోయే అవమానాన్ని తలచుకుని హ్యాపీగా ఉంటుంది సాక్షి. వసుకి కంగ్రాట్స్ చెప్తుంది.  సభ మొదలైనా రిషి రాకపోయేసరికి ఫామిలీ మొత్తం బాధపడుతూ ఉంటుంది. సాక్షి మినిస్టర్ కి చెప్పి వీడియో ప్లే చేయిస్తుంది. అప్పుడే రిషి అక్కడికి వస్తాడు. ఆ వీడియోలో ఉన్నదంతా చూసి అక్కడి వారంతా షాక్ అవుతారు. రిషికి వసు మీద పీకల వరకు కోపం తన్నుకొస్తుంది. ఇది ఈరోజు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అప్ డేట్స్.

మల్లెమాల చెక్కుల కోసం అబద్దాలు చెప్పొద్దు

శ్రీదేవి డ్రామా కంపెనీ 75 వ ఎపిసోడ్ ప్రోమో పంచ్ డైలాగ్స్ తో జోరు మీద ఉంది. ఈ షోలో ఆది పుష్ప క్యారెక్టర్ చేస్తే అన్నపూర్ణ శ్రీవల్లి క్యారెక్టర్ లో అలరించారు. "పుష్ప నేను శ్రీవల్లిని... తగ్గేదెలా అంటూ అన్నపుర్ణమ్మ లంగా వోణిలో"లో  డైలాగ్ చెప్తే "ఏంటి ఆయాసమా" అంటాడు ఆది. శ్రీవల్లి ఒక ముద్దెమన్నా  ఇత్తావ అని ఆది అనేసరికి "ఇదిగో అన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు " అంటూ వర్ష మధ్యలో ఎంట్రీ ఇస్తుంది. అన్న అంటది, ముద్దితానంటది ఇది పుష్ప ఇల్లా , అమ్మమ్మ గారిల్లా అంటాడు ఆది. మధ్యలో అన్నపూర్ణ వచ్చి "అప్పటినుంచి ఇప్పటివరకు నా అందం చెక్కుచెదరలేదు తెల్సా" అంటుంది. "మల్లెమాల చెక్కుల కోసం ఇలాంటి మాటలు చెప్పడానికి నీకేమైనా మనసు ఉందా" అంటూ నవ్విస్తాడు ఆది. తర్వాత గీతాసింగ్, శ్రీవాణి, హరిత స్టేజి మీదకు వచ్చి "ఆగేదెట్టాగా, అందాక యేగేదెట్టాగా" అనే పాటకు మస్త్ డాన్స్ చేస్తారు. ఇక పూర్ణ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ అంటూ కామెంట్ చేస్తుంది. ఇలా ఈ షో త్వరలో ప్రసారం కానుంది. ఇక ఈ షోకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి ఆదరణ అనేది లభిస్తోంది. వ్యూయర్ షిప్ లో కూడా ఈ షో టాప్ ప్లేస్ దూసుకుపోతోంది.

తన లోపల తనకే తెలియని కొరియోగ్రాఫర్ ఉన్నాడట

విష్ణుప్రియా సోషల్ మీడియాలో ఏది చేసిన ఇట్టే వైరల్ ఐపొతూ ఉంటుంది. ఇక తాజాగా ఒక అద్భుతమైన డాన్స్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో  పోస్ట్ చేసింది. "వర్షాకాలంలో నా ఉదయాలన్నీ చాలా హాయిగా ఉండాలన్నా, నేను కొత్తగా ఉండాలన్నా నాకు ఇలాంటి పాటలే కావాలి. ఇంకా చెప్పాలంటే నా లోపల నాకే తెలియని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నాడు. ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా బయటికి వచ్చి ఇలా డాన్స్ చేస్తూ ఉంటాడు" అని పోస్ట్ చేసింది. పైజామా వేసుకుని  డాన్స్ చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయంటూ కొంటె ఎమోజిస్ ని తగిలించి మరీ పోస్ట్ చేసింది. సెక్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణు పొట్ట కనిపించేలా డాన్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. బుల్లి తెర మీద విష్ణుప్రియ ఎంత సందడి చేసిందో అందరికీ తెలుసు. పోవే పోరా షోతో ఈ అమ్మడు మంచి క్రేజ్ ని, పాపులారిటీని సంపాదించుకుంది. ఇక లేటెస్ట్ గా సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన వాంటెడ్ పండుగాడ్  మూవీలో ఇద్దరు హీరోయిన్స్ లో విష్ణు ఒక హీరోయిన్ గా నటించింది. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ శ్రీధర్ సీపాన. నేను హీరోయిన్ కాకుండా చనిపోతానేమోనని భయపడ్డాను. కానీ అదృష్టం , అవకాశం ఈ మూవీ రూపంలో వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ విష్ణు చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ఇక  తాను పోస్ట్ చేసే హాట్ వీడియోస్ ని  నెటిజన్స్ తిడుతున్నారనో ఏమో తాజాగా అప్లోడ్ చేసిన వీడియోకి మాత్రం కామెంట్స్ ని లిమిట్ చేసే ఆప్షన్ పెట్టేసుకుని కాస్త జాగ్రత్త పడింది ఈ అమ్మడు.

లాస్యను, భాగ్యను పరిగెత్తించిన తులసి

నందు తన కంపెనీ పార్టనర్ తో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి తులసి లాస్యకి ఫోన్ చేస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఇక ఆ టైములో నందు తులసిని తిట్టడం లాస్యాని పొగడడం చేస్తాడు. నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం లాస్య అడగగానే 20  లక్షలు తెచ్చి ఇచ్చింది అని తాగి వాగేసరికి ఫోన్ లైన్ లో ఉన్న తులసి షాక్ అవుతుంది. తర్వాత లాస్య పక్కకు వెళ్లి తులసితో  ఏమీ తెలియనట్టు ఫోన్ మాట్లాడుతుంది. అవసరంలో ఉంటె లక్షా రెండు లక్షలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ 20 లక్షలు ఇచ్చేంత ఫ్రెండ్స్ ఉన్నారా నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉంటె బాగుండు అంటుంది కావాలనే. ఇక తులసికి అసలు సీన్ అర్థమైపోతుంది. కానీ లాస్య మాత్రం తులసికి నిజం గాని తెలిసిపోయిందా అంటూ భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జరిగిన విషయం అంకిత వాళ్లకు చెప్పేస్తుంది తులసి. ఆ తర్వాత వాళ్ళకో ప్లాన్ చెప్తుంది. దాంతో అంకిత వాళ్ళు భాగ్యను తులసి ఇంటికి రప్పిస్తారు. లాస్యకి ఇది ప్లాన్ అని తెలీక మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే నువ్వు తులసి ఇంట్లోనే ఉండి తులసి ఏం చేస్తుందో గమనించు అని చెప్తుంది. భాగ్య తులసి ఇంటికి వస్తుంది. అక్కడికి వచ్చిన పరంధామయ్య జోడి భాగ్యతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక తులసి లాస్యను, భాగ్యను రోడ్డు మీద పరుగులు పెట్టిస్తుంది. ఫైనల్ గా లాస్యకు తులసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇవి ఈరోజు గృహలక్ష్మి సీరియల్ అప్ డేట్స్.

పార్టీలో రక్కమ్మ పాటతో రచ్చ రచ్చ చేసిన అనసూయ

ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసినా అనసూయ హవానే నడుస్తోంది. అనసూయ గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాంకర్ గా, యాక్టర్ గా ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది అనసూయ.  ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న షోస్ తో మస్త్ ఎంటర్టైన్ చేస్తోంది ఆడియెన్సుని. అందం తో అందరినీ కట్టిపడేస్తుంది. ఇక ఇప్పుడు పార్టీ చేద్దాం పుష్ప షోలో మంచి హాట్ హాట్ గా డాన్స్ చేసి రచ్చ రచ్చ చేసింది అనసూయ. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాస్ట్యూమ్ లో రారా రక్కమ్మ సాంగ్ కి అద్దిరిపోయేలా డాన్స్ చేసేసరికి  స్టేజి మొత్తం దద్దరిల్లిపోయింది.. ఈమెకు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందచందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ లైక్స్ ని కామెంట్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. స్కిన్ టైట్ కాస్ట్యూమ్స్ లో అందాల్ని చూపిస్తూ అనసూయ చేసే వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రేండింగ్ లో ఉంటాయి. ఇక ఈమె చేసే డాన్స్ కి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వకుండా ఉండదు. అన్ని రకాల ట్రెండీ డ్రెస్సెస్ లో కనిపిస్తూ మంచి జోక్స్ పేలుస్తూ తన గ్లామర్ కి కాస్త గ్రామర్ ని జత చేసి బుల్లితెర మీద రాకెట్ లా దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం కాబోయే పార్టీ చేద్దాం పుష్ప షోలో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ చేసింది. చేతినిండా షోస్ తో, మూవీ రోల్స్ తో ఎక్కడ తగ్గట్లేదు అనసూయ. కొంచెం టైం దొరికిన భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లి అక్కడి ఫొటోస్, వీడియోస్ కూడా షేర్ చేసి ఆడియన్స్ తో మంచి రాపో మెయింటైన్ చేస్తోంది అనసూయ. ఇక నెటిజన్స్ కూడా డాన్స్ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.

కొణిదెల నువ్వే మా భీమ్లా అంటున్న ధనరాజ్

సుడిగాలి సుధీర్ మొత్తానికి కాలుపెట్టిన ప్రతీ షోలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీ చేద్దాం పుష్ప న్యూ ప్రోమో రిలీజై సందడి చేస్తోంది. ఇక ఈ షోకి నాగబాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. సుధీర్ నాగబాబు చూసి వెల్కమ్ సర్ అంటాడు . ఎవరు ఎవరికీ వెల్కమ్ చెప్తున్నార్రా  అంటూ నాగబాబు కామెడీ చేస్తాడు. అందరం చాలా మిస్సయ్యామ్ సుధీర్ అనేసరికి ఒక్క హగ్ డాడీ అంటూ నాగబాబుని కౌగిలించుకుంటాడు సుధీర్. తర్వాత ధనరాజ్ ఒక పాట పాడతాడు. కొణిదెల నాగబాబు కొణిదెల , నువ్వేలే మా అందరి భీమ్లా అనేసరికి నాగబాబు పగలబడి నవ్వుతాడు. విడుదల, బిడ్డకు విడుదల, ఇక నుంచి నీ లైఫు కళకళ అంటూ సుధీర్ ని చూస్తూ సాంగ్ ఎండ్ చేస్తాడు. సుధీర్ ఎక్కడున్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి.  జబర్దస్త్ ని ఎట్టి పరిస్థితిలో విడిచిపోను అన్న సుధీర్ ఆ షోని వదిలేసాడు, ఢీ వదిలేసాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ వదిలేసి స్టార్ మాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఏదైమైనా సుధీర్ ఏ ఛానల్ లో షో చేస్తే ఆ షోకి రేటింగ్ బాగా పెరుగుతుండడంతో సుధీర్ ఇప్పుడు నిర్వాహకుల పాలిట బంగారు గుడ్లు పెట్టె బాతులా మారాడు. ఇప్పుడొస్తున్న కొత్త కొత్త షోస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఒక వెలుగు వెలిగిన షోస్ మాత్రం సరైన హోస్ట్స్ లేక, జడ్జెస్ లేక వెలవెలబోతున్నాయి. ఐతే ఈ షోలో రష్మీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఒక చోటైనా కనిపిస్తుందేమో సుధీర్ ని రష్మిని చూసే అవకాశం కలుగుతుంది అని ఆశపడిన నెటిజన్స్ కి మాత్రం కొంచెం నిరాశ కలిగిందని చెప్పొచ్చు.  

'సరిగమప' బోనాలు స్పెషల్

హైదరాబాద్, 1st జూలై, 2022: ఆసక్తికరమైన సీరియల్స్, అద్భుతమైన రియాలిటీ షోస్ తో పాటు, వరుస వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో 'జీ తెలుగు' ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గతవారం రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు క్రైమ్ థ్రిల్లర్ 'కిన్నెరసాని' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మరియు రాత్రి 9 గంటల నుండి సరిగమప బోనాలు స్పెషల్ ఎపిసోడ్ తో సందడి చేయనుంది. రమణ తేజ దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ మరియు అన్ శీతల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులనుండి మంచి ప్రశంసలు అందుకుంది. వెంకట్ పాత్రలో లాయర్ గా మరియు అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ కలిగిన ఒక 'క్రిమినల్ లా' నిష్ణాతుడిగా కళ్యాణ్ దేవ్ మెప్పించగా, వేద పాత్రలో శీతల్ చక్కని ప్రదర్శన కనబరిచింది. ఐతే, వేద తన తండ్రి తనను చంపి కసి తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఒక పుస్తకం ద్వారా తెలుసుకుంటుంది. దీంతో, భయాందోళనకు గురైన వేద వెంకట్ ని సహాయం కోరుతుంది. ఇక విలన్ విషయానికొస్తే, జయదేవ్ పాత్రలో రవీంద్ర విజయ్ వేద అనే పేరు కలిగిన అమ్మాయిలను చంపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆధ్యాంతం పలు ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగల్చడంతో పాటు, ఇందులోని పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మరియు స్క్రీన్ ప్లే అందరిని ఆకట్టుకుంటాయి.  ఈ సినిమా అనంతరం 'సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్' బోనాలు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుండడంతో, 'జీ తెలుగు' తమ ప్రేక్షకులకు ఈ వారాంతానికి అద్భుతంగా ముగింపు పలికే అవకాశాన్ని కల్పించబోతుంది. పైగా, సెమీ-ఫైనల్స్ దగ్గరపడుతుండటంతో, పోటీదారులు ఒళ్ళు పులకరించే ప్రదర్శనలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికితోడు, 'క్రేజీ ఫెలోస్' చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆది షో కి రావడంతో మరియు ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండడంతో ఈ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగనుంది.  ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'కిన్నెరసాని' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ని మరియు రాత్రి 9 గంటలకు 'సరిగమప' బోనాలు స్పెషల్ ఎపిసోడ్ ని తప్పక వీక్షించండి, మీ 'జీ తెలుగు' లో

శ్రీ‌వ‌ల్లిగా అన్న‌పూర్ణ‌..ఇంత‌కీ పుష్ప ఎవ‌రు?

బుల్లితెర‌పై హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షోల్లో శ్రీ‌దేవి డ్రామా కంపనీ` ఒక‌టి. గ‌త కొంత కాలంగా ఈటీవిలో ప్రసారం అవుతున్న ఈ షోని మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు స్పాన్స‌ర్ చేస్తున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ లు అంతా ఈ షోలోనూ క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నారు. త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ న‌వ్విస్తున్నారు. ఈ షోకు `ఢీ` నుంచి బ‌య‌టికి వ‌చ్చిన పూర్ణ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా .. యాంక‌ర్ గా ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తోంది. సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ‌మ్మ ఈ షోలో సంద‌డి చేస్తూ న‌వ్విస్తున్నారు. ఈ ఆదివారం జూలై 3న 75వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. అయితే దీన్ని మ‌రింత స్పెష‌ల్ గా మార్చి న‌వ్వించ‌డానికి అంతా సిద్ధ‌మ‌య్యారు. ఈ షోకు హీరోయిన్ ఇషా చావ్లా గెస్ట్ గా హాజ‌రై సంద‌డి చేసింది. అయితే ఇదే షోలో సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ శ్రీ‌వ‌ల్లిగా మారి ఆదితో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో నెట్టింట సంద‌డి ఏస్తోంది. ఈ షోలో `పుష్ప‌` స్ఫూఫ్ ని హైప‌ర్ ఆది, అన్న‌పూర్ణ‌మ్మ ఓ రేంజ్ లో ర‌క్తిక‌ట్టించి క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించారు. `పుష్పా నేను శ్రీ‌వ‌ల్లిని త‌గ్గేదే లే.. అని అన్న‌పూర్ణ‌మ్మ అంటే .. ఏంటీ ఆయాస‌మా.. అంటూ హైప‌ర్ ఆది పంచ్ వేశాడు. ఆ త‌రువాత `శ్రీ‌వ‌ల్లీ ముద్దేమైనా ఇత్తావా.. అని హైప‌ర్ ఆది అంటే..ఇదుగో అన్నో నోనొచ్చి ఇచ్చేదా ముద్దు.. అని వ‌ర్ష్ అన‌డంతో .. హైప‌ర్ ఆది మ‌ళ్లీ పంచ్ వేశాడు. ఇక ఇప్ప‌టి దాకా నా అందం చెక్కు చెద‌ర‌లేదు తెలుసా? అని అన్న‌పూర్ణ‌మ్మ అంటుంటే.. మ‌ల్లెమాల చెక్కుల కోసం ఇలాంటి మాట‌లు చెప్ప‌డానికి నీకేమైనా మ‌న‌సుందా? అంటూ హైప‌ర్ ఆది పంచ్ వేయ‌డంతో అక్క‌డున్న వారంతా ప‌డి ప‌డి న‌వ్వేశారు. ఈ సంద‌ర్భంగా ఈ షోలో పాల్గొన్న ఇషా చావ్లాని 2011 నుంచి ల‌వ్ చేస్తున్నాన‌ని చెప్పి షాకిచ్చాడు.. ఆ మాట‌ల‌కు ఇషా చావ్లా ఎలా రియాక్ట్ అయింది?.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే జూలై 3న ప్ర‌సారం అయ్యే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.