‘ఈ సీరియల్ చూసి రాజీవ్ కనకాల సెకండ్ సెటప్ పెడితే ఎవరిది బాధ్యత’

"స్టార్ మా పరివార్ అవార్డ్స్" ఈవెంట్ ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి మహామహులంతా ఎంట్రీ ఇచ్చేసారు. సూపర్ డాన్సులతో ఎంటర్టైన్ చేసారు. బుల్లితెర మీద "మల్లి.. నిండు జాబిల్లి" అనే  సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం ఒక రేంజ్ లో దూసుకెళుతున్న సీరియల్. ఇందులో హీరోకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఈ పరివార్ అవార్డ్స్ లో ఇద్దరి భార్యలను మేనేజ్ చేస్తున్నందుకు ఆ సీరియల్ హీరోకి ఉత్తమ భర్త  అవార్డు ప్రదానం చేసారు. "ఇలా ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఉత్తమ భర్త అవార్డు ఇచ్చారా ? దీన్నే ఆదర్శంగా తీసుకుని రాజీవ్ కనకాల ఏదైనా చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబిల్ " అంటూ సంచలన కామెంట్ చేసి ఫన్ క్రియేట్ చేసింది సుమ. ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి నటనకు గాను  అవార్డు అందుకుంటూ "యాంకరింగ్ క్వీన్ అంటే సుమ..ఎంటర్టైన్మెంట్ కింగ్  అంటే స్టార్ మా" అంటూ సూపర్ కామెంట్ చేసింది. ఇందులో పాయల్ రాజపుట్, నాగార్జున, ఓంకార్, శ్రీరామచంద్ర, మురళీమోహన్, సన్నీ ఇలా ఎంతో మంది ఈ షోలో కనిపించారు.

హార్ట్ టచింగ్ సీన్ గా ఆదిరెడ్డి మాట్లాడిన వీడియో కాల్!

మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఫ్యామిలిని ఇన్వాల్స్ చేస్తు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. 'బ్యాటరీస్ ఛార్జ్' పేరిట ఇచ్చిన ఈ టాస్క్ లో ఆదిరెడ్డిని కన్ఫేషన్ రూం కి పిలిచాడు బిగ్ బాస్. కన్పేషన్ రూం కి వెళ్ళాక ఆదిరెడ్డికి మూడు ఆప్షన్ లు ఇచ్చాడు. మొదటి ఆప్షన్ ఆడియో కాల్, రెండవది వీడియో కాల్, మూడవది  మెసెజ్. ఇలా మూడు ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఎంచుకోమన్నాడు. అందులో ఏది ఎంచుకున్నా హౌస్ బ్యాటరీ నుండి ఛార్జ్ పోతుంది అని చెప్పగా వీడియో కాల్ ఆప్షన్ ఎన్నుకున్నాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత కాసేపటికి వీడియో కాల్ కనెక్ట్ చేసాడు బిగ్ బాస్. "హాయ్ కవిత.ఎలా ఉన్నావ్. పాప ఎలా ఉంది. అద్విత ఇటు చూడు" అన్న ఆదిరెడ్డి. అటువైపు నుండి కవిత మాట్లాడుతూ "మేం బాగున్నాం. అద్విత అమ్మ అంటోంది.నిన్ను చాలా మిస్ అవుతుంది." అని కవిత చెప్పింది. "నేను గేమ్ ఎలా ఆడుతున్నాను.ఇంకా ఏమైనా మార్చుకోవాలా" అని ఆదిరెడ్డి అడుగగా, కవిత మాట్లాడుతూ "బాగా ఆడుతున్నావ్. నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నావ్. అవతల ఎవరున్నా ఫైట్ చేయు. ఇంకా పాప, నేను చాలా మిస్ అవుతున్నాం. అయినా మిమ్మల్ని ఎందుకు మిస్ అవ్వాలి? దానికి సమాధానం నువ్వు విజేతగా నిలిచి కప్పు తీసుకురావడమే!" అని కవిత చెప్పింది. దీంతో ఆదిరెడ్డి  "మంచి ఎనర్జీ ఇచ్చావ్ కవిత. లవ్ యూ కవిత. ఇక చూడు నా ఆట చూపిస్తా చూడు" అన్నాడు ఆదిరెడ్డి. తన భార్య చెప్పిన ఇన్స్పిరేషనల్ మాటలు ప్రేక్షకులను కదిలించాయి. ఆ తర్వాత ఆదిరెడ్డి ఒక్కడే మాట్లాడుకున్నాడు. మంచి ఎనర్జీ ఇచ్చావ్ కవిత. థాంక్స్ బిగ్ బాస్  అంటూ మంచి ఎనర్జీగా కనిపించాడు. ఒక రివ్యూయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యడు. కెప్టెన్ విజేతగా నిలుస్తాడో?లేదో? చూడాలి మరి.

రొమాంటిక్ కపుల్ అవార్డు అందుకున్నాం..కానీ రొమాన్స్ చేయలేదని బాధగా ఉంది

స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఫంక్షన్ ధూమ్ ధామ్ గా ఎంటర్టైన్ చేయబోతోందని ప్రోమో చూస్తే అర్ధమైపోతుంది. ఇక ఈ షోలో కార్తీక దీపంలో నటించిన  పిల్లలు వచ్చి డాన్స్  చేశారు. అలాగే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ కూడా వచ్చి స్టేజి మీద స్టెప్పులేసింది. "కార్తీక దీపంలో పిల్లలు పెద్దవాళ్ళవుతూ ఉన్నారు కానీ వాళ్ళ అమ్మా నాన్నే పెద్దవాళ్ళు కావట్లేదు. ఇంతకు దీప వయసెంత " అని సుమ  అడిగేసరికి "నా వయసు అడిగితే మీ వయసు కూడా చెప్పాలి" అంది వంటలక్క. ఈ ప్రశ్నకు క్రిష్ జాగర్లమూడి స్టేజి మీదకు వచ్చి "సుమ గారి వయసు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత వయసు" అని ఆన్సర్ చేశారు. దాంతో సుమకి నోటమాట రాలేదు. ఇక తర్వాత సుధీర్ ఈ స్టేజి మీద  అవార్డు అందుకున్నాడు. ఆది, సుధీర్ ఇద్దరూ వచ్చి స్టేజి మీద ఎంటర్టైన్ చేశారు. సుధీర్ "అడిగా అడిగా" అని పాట పాడేసరికి "తొమ్మిదేళ్లు  అడిగి అడిగి ఇక్కడికి వచ్చేసాడు" అని కౌంటర్ వేసాడు. దానికి సుమ నవ్వేసింది. ఇక "గుప్పెడంత మనసు" సీరియల్ నుంచి రిషి అలియాస్ ముఖేష్ గౌడ అవార్డు అందుకున్నాడు. అలాగే తన తండ్రిని స్టేజి మీదకు తీసుకొచ్చాడు. "మా నాన్నను నాకు పుట్టిన కొడుకులా చూసుకుంటున్నాను" అనేసరికి "ముఖేష్ నాకు తెలిసి ఎన్ని సీరియల్స్ చేసినా, ఎన్ని అవార్డ్స్ అందుకున్నా మీ నాన్న గారిని ఇలాంటి పరిస్థితుల్లో చూసుకోవడమే గ్రేట్ ఎచీవ్మెంట్ " అని సుమ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. అలాగే "గుప్పెడంత మనసు" సీరియల్ లో నటిస్తున్న రిషి, వసుధార రొమాంటిక్ కపుల్ అవార్డు అందుకున్నారు. "రొమాంటిక్ అవార్డు అందుకున్నాము కానీ రొమాన్స్ చేయలేదని కొంచెం బాధగా ఉంది" అని ముఖేష్ ఫన్నీ గా చెప్పేసరికి సుమ "రొమాన్స్ అంటే ఏంటి అసలు" అని అడిగింది. ఇంతకు రొమాన్స్ గురించి రిషి ఏం చెప్పాడో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాలి.

'అల్లు' పేరు మాత్రమే కాదు ఇట్స్ ఏ బ్రాండ్!

ఆలీతో సరదాగా షోలో కామెడీతో పాటు కాంట్రావర్సీ కూడా ఉంటుంది. ఇక ఈ వారం ఈ షోకి  అల్లు అరవింద్ వచ్చారు. ఈ షోలో ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అల్లు అనే ఇంటి పేరుని సార్ధకం చేసాడు అల్లు అర్జున్. ఇక ఆలీ అల్లు  అరవింద్ ని ఒక  ప్రశ్న అడిగారు.  “సపోజ్ మీ నాన్నగారు  అల్లు రామలింగయ్య గారు  సడన్ గా కనిపిస్తే మీరేం చెపుదామనుకుంటున్నారు” అని అడిగేసరికి  “ఆయనకి అల్లు అంటే చాలా ఇష్టం. నేను ప్రయత్నించి చాలా దూరం తీసుకెళ్ళాను. ఇప్పుడు నీ మనవళ్లకిచ్చాను. వాళ్ళు ఇంకా ఎత్తుకి తీసుకెళ్తున్నారు" అని చెప్తా అంటూ నవ్వేశారు. ఆ ఆన్సర్ కి ఆలీ "వాహ్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. నిర్మాతగా అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పెట్టి దాని ద్వారా  అల్లు అనే బ్రాండ్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లారని విషయం అందరికీ తెలుసు.  హీరో, విజేత, పసివాడి ప్రాణం, మాస్టర్, గంగోత్రి, జల్సా, మగధీర, ధృవ, గీతా గోవిందం వంటి ఎన్నో హిట్ మూవీస్  నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇక ఆయన పిల్లలైన అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇంటి పేరుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఈ ఆలీతో సరదాగా షో ప్రోమో 2  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కండక్టర్ ఝాన్సీ కి పోటీగా నెల్లూరు కవిత!

ప్రతీ ఆదివారం మధ్యాహ్నం బుల్లితెర మీద ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న షో  ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈ  స్టేజిపై  కామెడీ స్కిట్స్ మాత్రమే కాదు  కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తుండడంతో ప్రతీ వారం కొత్త కొత్తగా కనిపిస్తోంది  ఈ షో.  ఈ వారం ఎపిసోడ్ ని ‘హైపర్ ఆది’ బర్త్ డే స్పెషల్ గా ప్లాన్ చేశారు. ఇక  ఈ వారం హైపర్ ఆది తన బర్త్ డే అంటూ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో ఫన్ చేశారు. రష్మీ కూడా ఆదిని తిట్టేసింది. "ఒక ఎదవ బర్త్ డే కి వచ్చాం" అనేసరికి "ఎదవ కాదు ఎదవన్నర" అన్నారెవరో అంటూ ఇంద్రజ కూడా కౌంటర్ వేసింది. ఇక తర్వాత " శ్రీరామదాసు" మూవీలోని "తాగరా శ్రీరామ నామామృతం" అనే భక్తి గీతాన్ని  హైపర్ ఆది, నూకరాజు పాడి అందరినీ ఫిదా చేసేసారు. ఈ పాటకి స్టేజి మొత్తం లేచి చప్పట్లు కొట్టారు.  ఇక ఫైనల్ గా నెల్లూరు నుంచి కవిత అనే కొత్త డాన్సర్ ని తీసుకొచ్చారు.  గాజువాక కండక్టర్ ఝాన్సీ ఈ స్టేజి ద్వారానే మంచి  డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక  తాను  ఝాన్సీకి  మించిన టాలెంట్ తో వచ్చానని చెప్పింది కవిత. తర్వాత ఇద్దరి మధ్యా డాన్స్ పోటీ జరిగింది.  హోరాహోరీగా డాన్స్ చేసేసారు ఇద్దరూ. మరి నెల్లూరు కవిత, ఝాన్సీ మధ్య ఎలాంటి పోటీ జరిగింది..ఎవరు బాగా చేశారు. ఝాన్సీ ప్లేస్ లో ఇక నుంచి నెల్లూరు కవిత కనిపిస్తుందా ? తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

బిగ్ బాస్ లో సింగర్ రేవంత్ రెమ్యూనరేషన్ ఎంత ?

ప్రస్తుతం బిగ్ బాస్ లో సింగర్ రేవంత్ చాలా స్ట్రాంగ్ కంటెండర్ గా రాణిస్తోన్నాడు. ఇతని పూర్తి పేరు  లొల్లవెంకట రేవంత్ కుమార శర్మ . ఇతను 1990 ఫిబ్రవరి 10 న శ్రీకాకుళంలో జన్మించాడు. తన చదువు మొత్తం విశాఖపట్నంలో చదివాడు. రేవంత్ కి చిన్నప్పటినుండి సింగర్ కావాలని ఉండేదట. అందుకే డిగ్రీ చివరి సంవత్సరంలోనే హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ఎదురుచూసాడట. ఆడిషన్స్ కి వెళ్ళాలంటే కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కావట,దాంతో కేటరింగ్ కి వెళ్లి వచ్చిన డబ్బులు దాచుకొని, ఆడిషన్స్ కి వెళ్ళేవాడట. రేవంత్ సింగర్ కావడానికి చాలా కష్టపడ్డాడట. బుల్లితెరలో  2010 లో వచ్చిన సూపర్ సింగర్ -5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఈటీవీలో వచ్చిన సప్తస్వరాలు ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. సూపర్ సింగర్-7 మరియు సూపర్ సింగర్-8 లో మెంటర్ గా ఉన్నాడు. అప్పటికే చిన్న సినిమాలలో అవకాశం వచ్చింది. కాగా 2017 లో తను పాడిన పాటలకు గాను  'Indian idol' విజేతగా నిలిచాడు. దానితో సింగర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తరువాత పలు సింగింగ్ కాంపిటిషన్స్ కి మెంటర్  గా వ్యవహరించాడు. ఇప్పటివరకు తన కెరియర్ లో చాలా గౌరవ అవార్డులు అందుకున్నాడు. ఇప్పటివరకు రేవంత్ దాదాపు వందకు పైగా పాటలు పాడాడు. రేవంత్ చిన్నప్పటి నుండి తన జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదురుకున్నాడాట, కానీ తను అనుకున్నట్టుగానే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరిని ఎంటర్టైన్ చేస్తొన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కి  చివరి కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. రేవంత్ మొదటి వారం నుండి హౌస్ లో చురుకుగా ఉంటూ, అందరితో సన్నిహితంగా ఉంటున్నాడు. హౌస్ లో కొందరితో గొడవలు లేకపోలేదు. హౌస్ లో  రేవంత్ ఎప్పుడు నామినేషన్ లో ఉన్నా కూడా ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటున్నాడు. షో చూసే ప్రేక్షకులను తన ఆట తీరుతో ఆకర్షిస్తోన్నాడు. ఎప్పటికి అప్పుడు తన ఆట తీరులో మార్పులు చేసుకుంటు హౌస్ లో అన్నింటిలో పాల్గొంటున్నాడు. అయితే హౌస్ లో మాత్రం తనకి చాలా కోపం అనే వాళ్ళు లేకపోలేదు. దీంతో నాగార్జున గత రెండు వారాలు గట్టిగానే కౌంటర్  వేసాడు. కోపం తగ్గించుకుంటేనే హౌస్ లో ముందుకెళతావ్ అంటు నాగార్జున చెప్పాడు. కోపం తగ్గించుకొని, ఆ తర్వాత కెప్టెన్ అయ్యి తనధైనా స్టైల్ లో కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోన్నాడు. ఈ సీజన్ లో చివర వరకు ఉండేవాళ్ళలో రేవంత్ టాప్ -5 లో ఉంటాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కాగా తను  అటలో ఇంకా ఏమైనా మార్పులు చేసి, సరికొత్త గేమ్ ప్లాన్ తో ఆడతాడో చూడాలి. అయితే రేవంత్ రెమ్యూనరేషన్ రోజుకి అరవై వేల నుండి డెభ్బై వేల వరకు తీసుకొంటున్నాడని బయట తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరిలో కంటే రేవంత్ కే ఎక్కువ రెమ్యూనరేషన్ అని బయట వినిపిస్తోంది.

బాలయ్యా.. నేను నీకంటే రొమాంటిక్ అయ్యా!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మిగతా టాక్ షోలకు భిన్నంగా ఫుల్ జోష్ తో బాలయ్య షో నడిపించిన తీరుతో సీజన్-1 పెద్ద హిట్ అయింది. అందుకే సీజన్-2 పై ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పైగా మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. "మీకు బాబు గారు.. నాకు బావ గారు" అంటూ  చంద్రబాబుకి బాలయ్య ఆహ్వానం పలికారు. "నేను స్టూడెంట్ గా ఉన్న టైంలో.. మీరు సినిమాల్లో చేసిన దానికంటే రొమాంటిక్ గా ఉండేవాడిని" అంటూ చంద్రబాబు బాలయ్యతో కలిసి నవ్వులు పూయించారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డితో స్నేహం' దగ్గర నుంచి 'టీడీపీ 1995 సంక్షోభం' వరకు పలు ఆసక్తికర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అలాగే ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ కూడా పాల్గొనడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లోకేష్ ఫోటోని చూపించి బాలయ్య ప్రశ్న అడగటం ఆకట్టుకుంది. ఇలా కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త ఎమోషన్ తో ప్రోమో ఆద్యంతరం ఆసక్తికరంగా సాగింది. 'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోతో రెండో సీజన్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

'ఏ డాన్సర్‌నీ అడగలేదు.. ఒక్కసారి నిన్ను టచ్ చేయొచ్చా!'

'డాన్స్ ఐకాన్' దుమ్ము రేపే డాన్సస్ తో ప్రతీ వారం అలరిస్తోంది. ఇక ఈ వారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం థీమ్ వచ్చేసి "డాన్స్ విత్ సెలబ్రిటీస్" అని ఓంకార్ అనౌన్స్ చేశారు. ఇక ఇందులో  ఒక్కొక్కళ్ళ డాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎవరిదీ ఎక్కువ ఎవరిదీ తక్కువ అని  చెప్పడానికే చాలా కష్టంగా అనిపించింది జడ్జెస్ కి. వర్తిక, సౌమ్య స్టన్నింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి  జడ్జెస్ ఫుల్ ఫిదా ఇపోయారు. "నేను ఇప్పటివరకు ఏ డాన్సర్ ని అడగలేదు. ఒకసారి నేను వచ్చి నిన్ను టచ్ చేయొచ్చా అని శేఖర్ మాస్టర్ స్టేజి మీదకు వచ్చి ఆమె చేతుల్ని పట్టుకుని దణ్ణం పెట్టుకొనేసరికి" అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. "ఏం కామెంట్ చేయాలో కూడా అర్ధం కావట్లేదు" అంది రమ్యకృష్ణ. జబర్దస్త్ వర్ష ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేసింది. తర్వాత యష్ మాస్టర్ అతని వైఫ్ తో కలిసి " రా రా రక్కమ్మ" సాంగ్ డాన్స్ చేసాడు. "యష్ చేసిన డాన్స్ స్టెప్ బాగుంది ఇదే స్టెప్ శ్రీముఖితో ఎలా చేస్తాడో చూద్దాం" అని ఓంకార్ అనేసరికి  యష్, శ్రీముఖి అదే డాన్స్ కి స్టెప్స్ వేశారు కానీ డాన్స్ స్టైల్ మార్చేసరికి యష్ కి అతని వైఫ్ కి  మధ్య గొడవలు పెట్టడానికి శేఖర్ మాస్టర్, ఓంకార్ ట్రై చేసి ఫన్ క్రియేట్ చేశారు. తర్వాత అమరదీప్-అనుదితతో కలిసి "ఉప్పెన" మూవీలో రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసాడు. "ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు ఇలా అనుదితతో  రొమాన్స్ చేస్తున్నాడు అమరదీప్ "అని ఓంకార్ అనేసరికి  "చూస్తుంటే అనుదిత-అమరదీప్ నిజమైన లవర్స్ లా అనిపిస్తున్నారు" అంది రమ్యకృష్ణ. ఇక భానుశ్రీ-అసిఫ్ డాన్స్ మెస్మోరైజ్ చేసేసింది. ఇలా రాబోయే వారం షో ఇరగదీసే పెర్ఫార్మెన్సెస్ ఎంటర్టైన్ చేయబోతోంది.

దీపావళికి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్న ‘ఇది కదా పండగంటే’

  బుల్లితెర మీద నిన్న మొన్నటి వరకు దసరా ఈవెంట్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు దీపావళి పండగ రాబోతోంది. దీన్ని పురస్కరించుకుని ఇప్పుడిప్పుడే కొత్త షోస్ బుల్లితెర మీద ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటి ప్రోమోస్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ పండగ సందర్భంగా మల్లెమాల వాళ్ళు ఆల్రెడీ ఒక ఈవెంట్ ప్రోమోని సోషల్ మీడియాలో వదిలేశారు. "ఇది కదా పండగంటే" పేరుతో ఈ షోని  డిజైన్ చేశారు. యాంకర్ రష్మీ, రవి హోస్ట్స్ గా ఈ షోకి నిర్వహించబోతున్నారు. ఇక ఎంట్రీనే ఇరగదీసింది. "ఒక బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండ్ర" అంటూ రష్మీ, రవి మాస్ డాన్స్ తో స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. "లక్ష దీపాల వెలుగుల మధ్య దీపావళి సెలెబ్రేట్  చేసుకోబోతున్నాం" అని చెప్పింది రష్మీ. ఇక ఈ షోకి సంగీత, పోసాని కృష్ణమురళి గెస్టులుగా వచ్చారు. అలాగే బుల్లితెర స్టార్స్ అంతా వచ్చి డాన్స్ చేసేసరికి  "ఇది కదా పండగంటే" అంటూ ఫుల్ జోష్ తో చెప్పేసింది రష్మీ. ఫైనల్ గా అందరూ స్టేజి మీద దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారు. "మోస్ట్ ఎంటర్టైనింగ్ ఈవెంట్ ఆఫ్ ది డికేడ్" అంది అంటూ సోఫాలో పడుకుని మస్త్ కాంప్లిమెంట్ ఇచ్చేసాడు "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరో నవీన్ పోలిశెట్టి".

మితిమీరిపోతున్న శ్రీహాన్, ఇనయా మధ్య గొడవ!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. నామినేషన్లో అయినా, టాస్క్ లో అయినా ఎవరి ప్రతిభను వారు కనబరుస్తూ వస్తోన్నారు కంటెస్టెంట్స్. దీనికి కారణం ఒక టీం గా ఆడమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా ఆడేవాళ్ళు కొందరు అయితే, మనకెందుకులే అని వదిలేసేవాళ్ళు మరికొందరు. ఇదే తరహాలో ఇనయా, శ్రీహాన్ ల గొడవ కొనసాగుతోంది. "ఎప్పటి గొడవలు అప్పుడే పరిష్కారించుకోవాలి. వాటిని ప్రొలాంగ్ చేయకూడదు." అని లాస్ట్ వీక్ నాగార్జున అందరికి తెలియజేసాడు. అయితే ఇనయా, శ్రీహాన్ మ‌ధ్య గొడ‌వ కంటిన్యూ అవుతోంది. నిన్న జరిగిన నామినేషన్ ప్ర‌క్రియ‌లో శ్రీహాన్ ని నామినేట్ చేసింది ఇన‌యా. ఆ తర్వాత "నువ్వు టాస్క్ లో నాకు ఓర్పు లేదు అన్నావ్. ఓర్పు అనే వర్డ్ ఎలా అంటావ్, నాకు ఓర్పు లేదు అని నువ్వు ఎలా అంటావ్?" అని అడిగింది. "ఓర్పు లేదు అని అనలేదు. పేషెన్సీ తక్కువగా ఉంది. అది కాస్త ఉంటే బాగుండేది అన్నాను" అని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు.  ఇలా నామినేషన్లో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీహాన్, ఇనయా మ‌ధ్య‌ గొడవ రోజు రోజుకి పెరుగుతుండటం. అటు హౌస్ మేట్స్ కి ఇబ్బంది గాను, ఇటు ప్రేక్షకులకు ఇబ్బందిగాను తోస్తోంది. అయితే ఈ సారి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకు వస్తారని అనుకొంటున్నారు ప్రేక్షకులు. అయితే నాగార్జున వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న గొడవను క్లియర్ చేస్తాడో, లేదో.. చూడాలి మరి.

'ఎవరికి ఏం జరిగినా నా కంటెంట్ నాదే!'

క్యాష్ షోకి ప్రతీ వారం బిగ్ స్క్రీన్ సెలబ్రిటీస్ తో పాటు అప్పుడప్పుడు స్మాల్ స్క్రీన్ సెలెబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. క్యాష్ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఢీ డాన్స్ షో నుంచి కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వచ్చారు. క్యాట్ మాస్టర్ - సూరజ్, శోభిత-మహాలక్ష్మి, సోమేష్-నిక్కీ, చెర్రీ-ఆర్నాల్డ్ ఈ షోకి వచ్చారు.  "ఏంట్రా నీ ఏజ్ చూస్తే చిన్నగా ఉంది..వేసే వేషాలు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి.. ఏంట్రా విషయం" అని ఆర్నాల్డ్ ని సుమ అడిగేసరికి "ఏం లేదు ఆంటీ .. చెప్పాలి మీరే" అని సమాధానం ఇచ్చాడు ఆర్నాల్డ్‌. అత‌డిని సుమ లాగి పెట్టి కొట్టబోతుంది. తర్వాత జడ్జెస్ కంటెస్టెంట్స్ గా, కంటెస్టెంట్స్ జడ్జెస్ మారి ఒక డాన్స్ స్కిట్ పెర్ఫార్మ్ చేస్తారు.  ఇక చివరిలో సోమేష్ మాస్టర్ డాన్స్ చేసినట్టు చేసి ఒక్కసారిగా కింద పడిపోయినట్టు యాక్ట్ చేసేసరికి స్టేజి మీద అందరూ ఒక్కసారిగా షాకైపోతారు. సుమకి ఏం అర్థం కాదు కానీ అందరినీ కంట్రోల్ చేస్తుంది. "బాబు సోమేష్ నీకు ఒకటి అర్థ‌మయ్యిందా.. ఎవరికి ఎం జరిగినా నాకు సంబంధం లేదు.. నా కంటెంట్ నేను తీసుకుని చెప్పేస్తాను" అని కౌంటర్ వేసేసరికి సోమేష్ స్టన్ ఐపోతాడు. ఇలా ఈ వారం క్యాష్ షో అలరించబోతోంది.

‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు'.. క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

'ఆలీతో సరదాగా' షోకి ఈ వారం సెలెబ్రిటీగా అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అలీ కూడా ఒక కాంట్రవర్సీ ప్రశ్న వేశారు. "అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కాస్త డిస్టర్బెన్స్ వచ్చిందని ప్రజలు చెవులు కొరుక్కుంటారు" అని అలీ అడిగేసరికి అల్లు అరవింద్ కూడా ఆ విషయం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.  "అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము బావబామ్మర్దులం కాక ముందు నుంచి అంటే 80వ దశకం నుంచి మంచి ఫ్రెండ్స్. ఇది పోటీ ప్రపంచం. ఇక్కడ పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలి. లేదంటే మనం వెనకబడిపోతూ ఉంటాం. ఇదొక చిన్న ఫిలిం సొసైటీ. కాబట్టి ఈ పోటీని తట్టుకుంటూ ఎవరికీ వారుగా పైకి వెళ్తున్నాం. ఐతే ఇలా ఎవరికి వారుగా ఎదుగుతూ ఉండేసరికి సహజంగా గొడవలు అంటూ రూమర్స్ రావడం సహజం. అని ఆయ‌న చెప్పారు. "కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మాకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఏం జరిగినా మేమంతా ఒక్కటే.. ఒక్క మాట మీదే నిలబడతాం అని అర్ధం చేసుకోవాలి. ప్రతీ పండగకి మా ఇంట్లో పూజ అవీ చేసేసుకున్నాక అందరం చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం. మేం కలిసే వున్నాం అని చెప్పడానికి ప్రతీ ఇన్సిడెంట్ ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయలేము కదా.. మాలో ఎవ్వరి మీద ఒక్క మాట పడినా కూడా మేమంతా ఒక్కటైపోతాం. ఇందులో నో డౌట్" అంటూ క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్.

కీర్తి భట్ వర్సెస్ ఇనయా!

బిగ్ బాస్ లో రోజు రోజుకి వినోదంతో పాటు, సస్పెన్స్  ఉత్కంఠభరితంగా  సాగుతూ వస్తోంది. అయితే నామినేషన్లో ఒక్కొక్కరుగా వచ్చి తమ‌  నామినేషన్ ని తెలిపారు. ఇనయ, కీర్తి భట్ ని నామినేట్ చేసింది. అలా చేసాక ఒక మినీ యుద్ధం జరిగినట్టుగా అనిపించింది. నామినేషన్లో మొదటగా రేవంత్, సుదీపని నామినేట్ చేసాడు. ఆ తర్వాత కారణం చెప్పగా, అది సుదీపకి కరెక్ట్  అనిపించలేదు. "ఏమీ లేని దానికి నామినేట్ చేసావ్" అని సుదీప చెప్పగా, "మీకు తెలిసి చేసారు కానీ ఆలోచించి చేయలేదు" అని రేవంత్ చెప్పుకొచ్చాడు. "నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు అనవసరంగా నన్ను నామినేట్ చేసావ్" అని సుదీప సమాధానమిచ్చింది. ఆ తర్వాత కీర్తి భట్ ని  ఇనయా నామినేట్ చేసింది. "చంటి గారు సెల్ఫ్ నామినేట్ అయ్యారు. నీ వల్ల రెండు రోజులుగా ఫుడ్ కూడా తినలేదు. చంటి గారు నామినేట్ అయ్యి బయటకు పోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నువ్వు" అని ఇనయా చెప్పగా, "సెల్ఫ్ నామినేట్ చేసుకోమని నేను చెప్పలేదు" అని కీర్తి భట్ సమాధానమిచ్చింది. తర్వాత కీర్తి  భట్ మట్లాడుతూ "నేను కెప్టెన్ గా సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించకపోతే నాకు నాగార్జున గారు ఎనభై మార్కులు ఇవ్వడు" అని అనగా ఇరవై తగ్గింది కదా అని ఇనయ చెప్పింది. దీంతో కీర్తి భట్ చాలా గర్వంగా నడుస్తూ "అరె పో ఎనభై కన్నా ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకో చాలు నువ్వు గొప్ప" అని చెప్పింది. ఇనయాని కించపరుస్తూ మాట్లాడినట్టుగా అనిపించింది. ఏదైనా ఆటలో 'సేమ్ టూ సేమ్ ఆటిట్యూడ్' ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ తలపడితే ఎలా ఉంటుందో అలా ఉంది కీర్తి భట్, ఇనయా ఇద్దరు గొడవ. ఈ గొడవ గురించి వీరిద్దరిపై, నాగార్జున చాలా గట్టిగానే సీరియస్ అవుతాడేమోనని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హౌస్ లో వీళ్ళిద్దరు కలిసి టాస్క్ లు ఆడతారో? లేదో? చూడాల్సి ఉంది.

నామినేషన్లో ఆదిరెడ్డి మాస్ డైలాగ్స్!

సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇందులో ఆదిరెడ్డి మాటలకు ఏ కంటెస్టెంట్ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. మాస్ రివ్యూస్ తో , బిగ్ బాస్ రూల్స్ చెబుతూ ఎవరిని కించపరచకుండా, అందరికి అర్థం అయ్యేలా చెప్తూ, తనదైన మాస్ డైలాగ్ లతో, ఒక స్పీచ్ లా ఒక్కొక్కరిని చాలా బాగా డిఫెండ్ చేసాడు. సరైన లాజిక్ లతో మిగిలిన హౌస్ మేట్స్ ని ఇరికించేసాడు. నామినేషన్లో మొదటగా రోహిత్, ఆదిరెడ్డిని నామినేట్ చేసాడు. తర్వాత రీజన్ చెప్పాడు. "లాస్ట్ వీక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో మీది కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకే నామినేట్ చేసాను" అని అనగానే, "మీరేం ఎంటర్టైన్మెంట్ చేసారు బ్రో" అని ఆదిరెడ్డి అన్నాడు. ఒక్క నిమిషం పాటు ఏం మాట్లాడాలో తనకి అర్థం కాలేదు. తర్వాత "నేను ఎంటర్టైన్మెంట్ చేసాను" అంటు కవర్ చేసుకున్నాడు. తర్వాత మెరీనా నామినేట్ చేసింది ఆదిరెడ్డిని. "ఆ రోజు నేను సుదీప అంత కష్టపడుతున్నాం కిచెన్ లో, మీకేం అనిపించలేదా" అని మెరీనా చెప్పగా,  "మీ ఇద్దరు ఆర్గుమెంట్ లో ఉన్నప్పుడు , మీదే తప్పు నాది తప్పు కాదు, అయినా మీరు తప్పు జరిగినప్పుడు చెప్పాలి. అప్పుడే ఆ రోజే చెప్పాల్సింది కదా" అని ఆదిరెడ్డి సమాధానమిచ్చాడు. అయితే మధ్యలో మెరీనా భర్త రోహిత్ సపోర్ట్ గా వచ్చి "మీరు ఆ పాయింట్ చెప్పారు. కాబట్టి మేం ఇది అడుగుతున్నాం" అని అనగానే, "మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారా? లేదు కదా? మరి మీకెందుకు? " అని ఆదిరెడ్డి చెప్పాడు. ఇది చూసిన హౌస్ మేట్స్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది.‌ఎవరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. "నా గేమ్ తక్కువ అని చెప్పడం నేను ఒప్పుకొను, మీరు అలా ఎలా అంటారు." అని మెరీనా అనగా, "ఇది నా ఒపీనియన్, నామినేషన్లో నేను కారణం చెబుతాను. దాన్ని మీరు తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు. అది మీ పర్సనల్. కానీ నేను చెప్పాలనుకున్నది నేను చెబుతాను" అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత వసంతి నామినేట్ చేసి, "మీ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గినట్టనిపించింది" అని ఆదిరెడ్డితో అనగా, ఎక్కడ తగ్గిందో చెప్పు అనేసాడు. దానికి వసంతి "డ్యాన్స్‌ తక్కువ అనిపించింది" అని అనగానే "పదా మనిమిద్దరం డ్యాన్స్ చేద్దాం" అని ఆదిరెడ్డి అన్నాడు. దీంతో స్ట్రాంగ్ ఢిఫెండర్ అని మరోసారి నిరూపించుకొన్నాడు ఆదిరెడ్డి. చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ నామినేషన్లో ఆదిరెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆదిరెడ్డి ఈసారి నామినేషన్లో ఉన్నాడు. అయితే తన మార్క్ రివ్యూస్ తో, గేమ్ స్ట్రాటజీస్ తో ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది.

కామన్ మ్యాన్ ఆదిరెడ్డి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబ్ సెన్సేషన్  ఆదిరెడ్డి. ఇతని పూర్తి పేరు వెంకట ఆది నారాయణరెడ్డి. ఇతను నెల్లూరు జిల్లా వరికొండపాడులో జన్మించాడు. వీళ్లది మధ్యతరగతి కుటుంబం. ఇతను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ చదివాడు. ఇతనికి భార్య, కూతురు ఉన్నారు. ఇత‌ని సోదరి నాగలక్ష్మి. ఆమెకు పుట్టుకతోనే కంటి చూపు లేదు. లాక్డౌన్ లో ఆమె తనకొచ్చే పెన్షన్ డబ్బులు సోనూసూద్ ఫౌండేషన్ కి పంపించి, వార్తల్లో నిలిచింది. ఆమె అలా పంపించాక నేషనల్ న్యూస్ ఛానెల్ సైతం ఇంటర్వ్యూకి రావడంతో ఒక్కసారిగా వారి కుటుంబం మొత్తం ఫేమస్ అయ్యింది.  తర్వాత ఆదిరెడ్డి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసాడు. మొదటగా మూవీస్ కి రివ్యూ చేప్పేవాడు. ఆ తర్వాత సమాజంలో జరిగే ప్రస్తుత సంఘటనలు, క్రికెట్ రివ్యూస్ చేస్తు తనకంటూ ఒక మార్క్ ని సంపాందించుకున్నాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, ఒక యూట్యూబ్ సెన్సేషన్ గా మారాడు. రివ్యూ ఎక్స్‌పర్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. కష్టాలను తన ఇంటిపేరుగా చెప్పుకునే అతను, తన జీవిత ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కున్నాడంట. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. తను హౌస్ లోకి పదిహేడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. హౌస్ లో మొదటి వారం నుండి తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అంతేకాకుండా కెప్టెన్ కూడా అయి తన ఆట తీరు ఏంటో అభిమానులకు చూపించాడు. "ఒక కామన్ మ్యాన్, బిగ్ బాస్ రివ్యూయర్ అయ్యాడు. ఒక బిగ్ బాస్ రివ్యూయర్, కెప్టెన్ అయ్యాడు" అని నాగార్జున చెప్పాడు.  దీంతో ఆదిరెడ్డి హౌస్ లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్  చేసుకొని అలరిస్తున్నాడు. అయితే హౌస్ లో ఎలాంటి గొడవలకి పోకుండా, ఎక్కువ ఆట మీద ఆసక్తితో ఆడుతున్నాడు. హౌస్ లో గీతుతో మాత్రం సన్నిహితంగా ఉంటూ రివ్యూస్ చేస్తున్నాడు. కాగా ఆదిరెడ్డి ఆట తీరును ప్రతీసారీ నాగ్‌ ప్రశంసిస్తూ వస్తున్నాడు. ఆదిరెడ్డి తన రివ్యూస్ లో ఎక్కువ ఉపయోగించే పదం 'ఉడాల్'. ఈ పదం ఎక్కువగా పాపులర్ అయింది. కాగా నాగార్జున కూడా ఆదిరెడ్డిని 'ఉడాల్ మామ' అని పిలవడం విశేషం. ఆదిరెడ్డి ఇప్పటి వరకు బాగానే ఎంటర్టైన్మెంట్ చేసినా, ఇక మునుముందు ఏమైనా స్ట్రాటజీస్ ప్లాన్ చేసి, ఆడతాడో చూడాలి. ఆదిరెడ్డి రెమ్యూన‌రేషన్ రోజుకి ముప్పై వేల నుండి ముప్ఫై అయిదు వేల వరకు ఉంటుంద‌ని బయట వినిపిస్తోంది. అయితే ఇక ముందు ఈ కామన్ మ్యాన్ షో ఎంతవరకు బిగ్ బాస్ లో కొనసాగుతుందో చూడాల్సి ఉంది.

అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడను!

బుల్లితెర మీద గ్లామరస్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వైపు షోస్, ఈవెంట్స్ తో.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అను. లేటెస్ట్‌గా 'నిఖిల్‌తో నాటకాలు' షోకి వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు భార్యా భర్తలు. "ఇంటికి బాస్ ఎవరూ లేరు. ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటాం" అని చెప్పారు. సినిమా స్క్రిప్ట్స్, డేట్స్ వంటి వాటి విషయంలో ముందుగా భరద్వాజ్ విన్నాక అనసూయ వింటుందట‌. తాను ఓకే అంటేనే ముందుకు వెళ్తారట ఇద్దరూ.  అలాగే "సోషల్ మీడియాలో అను పై వస్తున్న ట్రోలింగ్స్, మీమ్స్ ని అస్సలు పట్టించుకోను. ఒకవేళ తను అప్సెట్ గా కనిపిస్తే 'అవన్నీ చూడొద్దు' అని చెప్తాను" అన్నారు  భరద్వాజ్. "అలాగే కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి అనసూయ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఉన్నది ఒక్క లైఫ్. ఎలా కావాలంటే అలా ఉండడం ఇంపార్టెంట్. అందుకే అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడేది ఏమీ లేదు" అన్నారు అనసూయ భర్త. ఇంకా ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే "అనుకి పెళ్ళై పిల్లలు ఉన్నాక కూడా తనకు లవ్ ప్రపోజల్స్ చాలా వచ్చాయి" అంటూ నవ్వుతూ చెప్పారు భరద్వాజ్.  ఇక ఈ షోలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అనసూయ భరద్వాజ్. "ఇప్పుడు ఎవరైతే మీమ్స్ చేసే వాళ్ళు, ట్రోల్ల్స్ చేసే వాళ్ళు వున్నారో.. వాళ్లకు కూసాలు కదిలేలా ఒక దెబ్బ తగలబోతోంది. దాని మీద నేను వర్క్ చేస్తున్నా. ఆ కాంపెయిన్ అందరికీ వర్తిస్తుంది" అంటూ ఒక బాంబు పేల్చారు. "నాకు విజయ్ సేతుపతి మీద క్రష్ ఉంది. అలాగే నేను ఫెమినిస్ట్ ని కాదు, యాక్టివిస్ట్‌ని. ఎక్కడ తప్పు జరిగినా ఖండిస్తాను" అని చెప్పింది.

బిగ్ బాస్ హౌస్‌లో ఆట ఆడాలి అంటే ఫేక్‌గా ఉంటే చాలు!

చలాకి చంటి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు. ఇక వచ్చాక బీబీ కేఫ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "చలాకి చంటి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమైపోయాడు" అని ఆడియన్స్ అనుకుంటున్నారని యాంకర్ అనేసరికి "ఇది నువ్వు ఇస్తున్న కామెంటా, జనాలు ఇచ్చారని చెప్తున్నావా?.. ఎవరు అన్నారో నా ముందుకు తీసుకురా, నేను సమాధానం చెప్తా" అంటూ ఫైర్ అయ్యాడు.  "హౌస్ లో ఉన్నవాళ్లు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరిని ఇరికించడానికైనా రెడీగా ఉన్నారు.. మీరు గేమ్ ఆడలేదు అని చెప్పకుండా మీ గేమ్ ఆపడం బిగ్ బాస్ తప్పు అంటారా?" అని అడిగేసరికి "ఎలాగైనా అనుకో" అంటూ ఘాటుగా చెప్పాడు చంటి. "బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడాలి అంటే ఫేక్ గా ఉంటే చాలు. అలా ఉన్న వాళ్ళే గేమ్ ఆడగలరు అని నాకు అనిపించింది. నువ్ కూడా ఫేక్ గానే ఆడావుగా" అని యాంకర్ వైపు బాణం సంధించాడు చంటి. "మీకు ఇగో ఎక్కువ కాబట్టి ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు" అని యాంకర్ అనేసరికి "ఇగో ఎప్పుడొస్తుంది.. కెలికినప్పుడు వస్తుంది. నా ఇగోని కెలికిందెవరు" అంటూ గలాటా గీతూ ఇమేజ్ చూపించాడు. "నేను ఇలాగే ఉంటా, ఇలాగే గేమ్ ఆడతా, ఎవరినానైనా మోసం చేస్తా అనే బుద్ది ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు" అన్నాడు చంటి.

'చంటి ఎలిమినేషన్ అస్సలు ఊహించనిది'..అమరదీప్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 6  ఈ వారం మంచి రసవత్తరంగా సాగింది. ఐతే చలాకి చంటి ఎలిమినేషన్ విషయం ఎవరూ ఊహించనిది. ఈ విషయం మీద  చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. ఇలాంటి టైములో అమరదీప్ కూడా కొన్ని కామెంట్స్ చేసాడు. కొంతమంది అడిగిన ప్రశ్నలకు "బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్తున్నట్టు ట్రోల్స్ అవి బాగా వచ్చాయి. కానీ అవకాశం రాలేదు. అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను. ఇక  చంటి అన్న ఎలిమినేట్ అవడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.  ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అన్న ఎలిమినేట్ అయ్యాడు అని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. చాలామంది ఆడని వాళ్ళు కూడా హౌస్ లో ఉన్నారు కదా. ఆయన్ని ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. టాప్ 5 లో చంటి అన్న ఉంటాడని అనుకున్నా. బాగా ఆడతాడు, బాగా కామెడీ చేస్తాడు కదా కానీ  మా అన్న కొంచెం స్ట్రయిట్ ఫార్వర్డ్ మరి అలానే ఉంటుంది. " అన్నాడు అమరదీప్.  ఇక నెటిజన్స్ మాత్రం "చంటి అన్న ఎలిమినేషన్ కి గలాటా గీతూ కారణం.. ఆయన చేసే కామెడీ గురించి హోస్ట్ ముందే కామెంట్ చేసింది. అలాంటి వాళ్ళు హౌస్ లో ఎందుకు ఉంచుతున్నారో ..బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ దేవుడు హైట్ కట్ చేశాడు.. నువ్ శాలరీ కట్ చేస్తున్నావ్.. పెద్ద తేడా లేదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఫామిలీ సర్కస్ పేరుతో ఫామిలీస్ ని పిలిపించి పిక్నిక్ ఏర్పాట్లు చేసి ఫుల్ గా ఆడి పాడారు. ఇక నాటీ నరేష్ , ఆటో రాంప్రసాద్ మధ్య డిస్కషన్ సూపర్ ఫ్లోలో సాగింది. " పొద్దున్న పూట వచ్చే కలలు నెరవేరవుతాయా" అని రాంప్రసాద్ ని నాటి నరేష్ అడిగేసరికి "వీడికేదో కల వచ్చి ఉంటుంది " అనుకుని " ఏం కల వచ్చింది" అని అడిగాడు రాంప్రసాద్ " మీరు బాగుపడినట్టు కలొచ్చింది" అని నరేష్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చేసరికి రాంప్రసాద్ షాకయ్యి "నా మీదే పంచ్ వేస్తావా నీకు శాలరీ కట్ చేస్తా" అనేసరికి " ఆ దేవుడు హైట్ కట్ చేసాడు నువ్ శాలరీ కట్ చేస్తున్నావ్" పెద్ద తేడా లేదు అనేసరికి "ఇదిగో నీ శాలరీలో కొంత కట్ చేస్తి ఇస్తున్నా అంటూ ఒక నోట్ తీసి కత్తెరతో కట్ చేసి ఇచ్చాడు"  రాంప్రసాద్.  ఇక స్కిట్స్, గేమ్స్, డాన్స్ పెర్ఫార్మెన్సులు అయ్యాక పిక్నిక్  లో అందరూ కలిసి భోజనాలు చేశారు. ఇంతలో బులెట్ భాస్కర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా  వచ్చి ఫుడ్ ఐటమ్స్ పరిశీలిస్తుంటే ఆటో రాంప్రసాద్ మాత్రం పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసాడు. ఇక నూకరాజు ఇంద్రజని తెగ పొడిగేసాడు.." ఇంద్రజ గారి నవ్వు  లాంటి తియ్యటి స్వీట్ వేయరా" అని అడిగేసరికి ఇంద్రజ నవ్వేసింది. "పప్పు ఎలా ఉంది" అని రాంప్రసాద్ నూకరాజుని అడిగాడు " ఇంద్రజ మేడం జడ్జిమెంట్ లా ఉంది" అని ఆన్సర్ ఇచ్చేసరికి ఇంద్రజాకి కోపం వచ్చేసింది. "నన్ను ముద్దపప్పు అని ఇండైరెక్ట్ గా పొగుడుతున్నావా..అరేయ్ నీ మనసులో ఏం ఉందో నాకు తెలుసు మళ్ళీ కవర్ చేసుకుంటున్నావా" అంది ఇంద్రజ.