కీర్తి భట్ కి కత్తి‌పోట్లు.. కొత్త కెప్టెన్ గా శ్రీహాన్!

బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కొత్తగా మారుతోంది. రోజు రోజుకి కొత్త టాస్క్ లతో కనువిందు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో కెప్టెన్ కోసం జరిగే టాస్క్ లు కాస్త ఉత్కంఠను రేకెత్తిస్తుంటాయి. కాగా ఈ వారం హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. "శ్రీహాన్ యూ ఆర్ మై ఫేవరేట్ కంటెస్టెంట్, నిన్ను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాను. సూర్య నువ్వు టాస్క్ లో వెనుకబడ్డావ్. అలా ఉండకూడదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్. గేమ్ లో నువ్వు బ్యాక్ అయ్యావ్" అని సూర్య గురించి చెప్పుకొచ్చింది వసంతి. ఆ తర్వాత "కొంచెం కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటోంది అని అనుకున్నా" అని వసంతి చెప్పి కీర్తి భట్ కి కత్తి గుచ్చింది. ఆ తర్వాత కీర్తి భట్ మాట్లాడుతూ, " కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఒకే, కానీ నాకు గుచ్చడం కరెక్ట్ కాదు. నాలో రిజెక్ట్ చేయడానికి ఏమీ లేవు అని కత్తితో పొడవడం ఏంటి" అని సమాధానమిచ్చింది. ఎట్టకేలకు రెండు రోజుల నుండి కొనసాగుతోన్న ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఇక హౌస్ మేట్స్ అందరూ కత్తి గుచ్చే పనిలో ఉన్నారు. అయితే హౌస్ మేట్స్ లో ఎక్కువగా కీర్తి భట్ కి కత్తి‌పోట్లు పొడిచారు. అంటే తను కెప్టెన్ కి సరిపోదు అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే వీరి ముగ్గురిలో శ్రీహాన్ ఎక్కువ మెజారిటీతో ఉండడంతో శ్రీహాన్ గెలిచాడు. కాగా సంచాలకులురాలిగా ఉన్న ఫైమా ముగ్గురిలో శ్రీహాన్ గెలిచాడు. కాబట్టి ఈ వారం కెప్టెన్ శ్రీహాన్ అని చెప్పింది. బిగ్ బాస్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించమని శ్రీహాన్ కి తెలియజేసాడు. అయితే శ్రీహాన్ సింహసనం మీద కూర్చున్నప్పుడు హౌస్ మేట్స్ అంతా 'ఓ' అంటు అరుస్తూ తమ శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొత్తగా ఎన్నికైన శ్రీహాన్ హౌస్ మేట్స్ ని ఎలా మేనేజ్ చేస్తాడో చూడాల్సి ఉంది.

మేం కలిసున్నప్పుడు టెన్షన్ కన్నా పెన్షన్ ఎక్కువ వచ్చింది

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారంలానే ఈ వారం కూడా అందంగా ముస్తాబైంది. "బంగారం ఒకటి చెప్పనా" అనే కాన్సెప్ట్ తో ఈ వారం రాబోతోంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం అర్జున్, సుహాసిని ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి. ఐతే అర్జున్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య విడిపోయారు. అందుకే వాళ్ళను మళ్ళీ కలిపాక ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పాడు. అర్జున్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యగా కృష్ణభగవాన్, అన్నపూర్ణ నటించారు. వాళ్ళ ఇద్దరినీ కలపడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకొచ్చింది.  ఇక స్టేజి మీదకు "వయ్యారి భామ నీ హంస నడక" అనే పాటతో కృష్ణ భగవాన్ , అన్నపూర్ణ వచ్చారు. "తాతయ్య గారు ఎప్పుడూ ఈ గొడవలేంటి.. అసలు మీరెప్పుడు చూసారు అమ్మమ్మని" అని అడిగాడు ఆది. "ఒకసారి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక కుక్కకు భోజనం పెడుతోంది..కుక్కకే ఇలా పెడుతోంది అంటే నాకు ఇంకెంత బాగా పెడుతుందో" అని అనుకుని పెళ్లి చేసుకున్నా అని చెప్పారు కృష్ణభగవాన్.."మీరు ఇద్దరూ కలిసున్నపుడు టెన్షన్ వచ్చేదా" అని ఆది అడిగేసరికి "టెన్షన్ ఏమో కానీ ఇద్దరికీ కలిపి పెన్షన్ బాగా వచ్చేది" అని కౌంటర్ వేసాడు కృష్ణ భగవాన్. ఇక చివరిలో అర్జున్ అంబటి, సుహాసిని ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు.

కెప్టెన్సీ కోసం నా క్యారెక్టర్ మార్చుకోను!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ జోరుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్స్ స్టేజ్ కి వెళ్ళగా, హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు వచ్చింది. చివరగా కెప్టెన్ పోటీదారులుగా శ్రీహాన్, కీర్తి భట్, సూర్య.. ముగ్గురు బరిలో ఉన్నారు. "ఈ వారం కెప్టెన్ గా ఎవరిని ఎన్నుకుంటారో హౌస్ మేట్స్ నిర్ణయించుకోవలసి ఉంటుంది. కెప్టెన్ గా ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నారో వారి మెడలో ఉన్న థర్మకోల్ తో చేసిన 'సి' లెటర్ మీద కత్తితో పొడవాలి. అలా ఒక్కొక్కరు తమ ఓట్ ఎవరికో చెప్పాలి" అని బిగ్ బాస్ చెప్పాడు.    కాగా  నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు అందరి కంటే ఎక్కువ కత్తి పోట్లు సూర్యకి పడగా, కీర్తి భట్ కి, శ్రీహాన్ కి చెరొక కత్తిపోటు దిగింది. అయితే హౌస్ మేట్స్ లో చాలా వరకు సూర్య ఇది వరకు కెప్టెన్ అయ్యాడు కదా అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్, "సూర్య కెప్టెన్సీలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ లు చాలా సార్లు వచ్చాయి. కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు" అని తన అభిప్రాయం చెప్పాడు. కీర్తి, సూర్య ఇదివరకు కెప్టెన్ గా ఉన్నారు. శ్రీహాన్ మాత్రం ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. కాబట్టి అందరి దృష్టి అతని వైపే మొగ్గు చూపుతోంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో సూర్యకి, రాజ్ కి మధ్య జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్ గా మారింది.   రాజ్, "నువ్వు కెప్టెన్ గా  ఉన్నప్పుడు హౌస్ మేట్స్ తో ఇంకా పనులు చేయించి ఉంటే బాగుండేది. అందరికి కమాండింగ్ గా చెప్పి పనులు చేపించుకుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది" అని సూర్యతో అన్నాడు. దానికి సూర్య, "నేను బెదిరించి పనులు చేయించను. నాకు నచ్చిన విధంగా మాట్లాడి  చేపించుకుంటా. కెప్టెన్సీ కోసం నా క్యారెక్టర్ మార్చుకోను. నా నేచర్ మార్చుకోను. కెప్టెన్సీ కంటే కూడా క్యారెక్టర్, నేచరే ముఖ్యం" అని జవాబిచ్చాడు.  కాగా హౌస్ మేట్స్ లో అందరు సూర్య ఇలా మట్లాడటాన్ని నెగెటివ్ గా తీసుకుంటారో? లేక పాజిటివ్ గా తీసుకొని అతడిని కెప్టెన్ గా ఎన్నుకుంటారో చూడాలి. కాగా శ్రీహాన్, సూర్య, కీర్థి.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

హౌస్ లో కొత్త కెప్టెన్ ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో యాభై మూడవ రోజు 'కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి' పాటతో మొదలైంది. కాగా ఇప్పుడు హౌస్‌ లో ఆరవ కెప్టెన్ కోసం పోటీ జరుగుతోంది. గేమ్ ఆడినవాళ్ళు, తమ పర్ఫామెన్స్ తో సత్తా చాటినవాళ్ళకే, ఈ కెప్టెన్ పోటీలో విజయం దక్కుతుంది అనే విషయం అందరికి తెలిసిందే. కాగా హౌస్ లో గత మూడు రోజులుగా సాగుతోన్న చేపల చెరువు టాస్క్ ఎట్టకేలకు ముగిసింది. ఈ చేపల టాస్క్ లో ఎక్కువ చేపలు సేవ్ చేసుకున్నందువల్ల శ్రీహాన్, శ్రీసత్య  నేరుగా కెప్టెన్ పోటీకోసం నామినేట్ అయ్యారు. ఆ తర్వాత టాస్క్ కి గాను హౌస్ లో జంటగా ఉన్న సభ్యుల నుండి ఒక్కొక్కరిని ఎంచుకోమన్నాడు బిగ్ బాస్. అలా ఒక్కో జంట నుండి ఒక్కరు మాత్రమే కెప్టెన్ పోటీకి ముందుకొచ్చారు. "మీలో ఎవరు కెప్టెన్ పోటీదారులుగా ఉంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని అడుగగా, "శ్రీహాన్, శ్రీసత్య ,సూర్య, ఫైమా, కీర్తిభట్, రేవంత్ కెప్టెన్ పోటీదారులుగా ఉంటారు" అని హౌస్ మేట్స్ చెప్పారు. తర్వాత గేమ్ "చిక్కుల్లో కెప్టెన్సీ" టాస్క్‌. కెప్టెన్ పోటీదారులుగా ఈ టాస్క్ లో శ్రీహాన్, శ్రీసత్య, సూర్య, ఫైమా, కీర్తి భట్, రేవంత్ పోటీపడగా మొదటి స్థానంలో కీర్తి భట్, రెండవ స్థానంలో సూర్య, మూడవ స్థానంలో శ్రీహాన్ నిలిచి, తర్వాత రౌండ్ కి క్వాలిఫై అయ్యారు.  అయితే తర్వాత రౌండ్ లో గెలిచేదెవరో? హౌస్ లో కొత్త కెప్టెన్ అయ్యేదెవరో? అని అందరిలో ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో శ్రీహాన్ కి, హౌస్ మేట్స్ లో చాలా మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం శ్రీహాన్ కెప్టెన్ అవ్వొచ్చని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో గెలిచేదెవరో? కొత్త కెప్టెన్ అయ్యేదెవరో? అని తెలియాల్సి ఉంది.

రంగులు మార్చే ఊసరవెల్లి ఇనయా!

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతోన్న సన్నివేశాలు, వారాలు గడిచేకొద్ది ఉత్కంఠభరితంగా సాగుతూ వస్తున్నాయి. అయితే మొదటి వారం నుండి వీక్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారిపోతున్నారు. వాళ్ళలో ఒకరు ఇనయా. అయితే హౌస్ లో మొదటి వారం నుండి 'టామ్ అండ్ జెర్రీ'  లాగా ఉన్న ఇనయా, శ్రీహాన్. గత కొన్ని రోజుల నుండి మిత్రులుగా ఉంటు కలిసిపోయినట్టుగా అనిపించారు. కాగా గత వారం ఇనయా, సూర్య మీద కోపంతో శ్రీహాన్ ని పొగడటం స్టార్ట్ చేసింది. అలాగే రేవంత్ తో కూడా సూర్య గురించి మాట్లాడుతూ, "తనతో ఉంటే ఏం తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది" అని అంది. రేవంత్ దగ్గర సూర్య గురించి నెగెటివ్ గా పోట్రేట్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత "సూర్యని టాప్ ఫైవ్ లో ఉండనివ్వొద్దు" అంటు, మరో వైపు శ్రీహాన్ ని పొగడటం స్టార్ట్ చేసింది. లాస్ట్ వీక్ లో రాత్రికి రాత్రే మాట మార్చేసింది. గత వారం నామినేషన్ రోజు శ్రీహాన్ దగ్గరగా వెళ్ళి ఇనయా మాట్లాడుతూ, "నిన్ను నామినేట్ చేయడం ఇష్టం లేదు. నువ్వు నన్ను నామినేట్ చేసావ్. కాబట్టే నేను చేశాను. అంతే కాని యూ ఆర్ ఫార్ బెటర్ దెన్ ఎనీవన్ ఇన్ దిస్ హౌస్" అని పాజిటివ్ గా పొగిడేసింది. గతవారం నాగార్జున, శ్రీహాన్ తో మట్లాడుతూ, "ఇనయా, సూర్య ఇద్దరు నటిస్తోన్నారు" అని  చెప్పిన విషయం తెలిసిందే. అయితే చివరి టాస్క్ లో "ఎవరు అయితే కెప్టెన్ గా అనర్హులు అని భావిస్తారో, వాళ్ళ మెడలో ఉన్న 'సి' లెటర్ తో ఉన్న థర్మకోల్ షీట్ మీద కత్తితో గుచ్చి మీ అభిప్రాయం తెలియజేయండి" అని బిగ్ బాస్ చెప్పాడు. కాగా సూర్య, కీర్తి భట్, శ్రీహాన్ కెప్టెన్సీ పోటీదారులుగా ఉండగా, శ్రీహాన్ కి కత్తి గుచ్చేసి, కెప్టెన్ గా  అనర్హుడివి అన్నట్టుగా చెప్పేసింది. అయితే ఇది చూసిన హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. దీనికి కారణం గత వారం నుంచి ఇనయా, శ్రీహాన్ తో బాగా ఉంటోంది. అలాగే సూర్యతో మాట్లాడట్లేదు. కాగా శ్రీహాన్ బాధపడ్డాడు. అలా బాధ పడుతూ శ్రీసత్యతో  చెప్పుకున్నాడు. "ఊసరవెల్లి నాకు వేసింది. వారానికో రంగు మారుస్తూ, నాకు నమ్మక ద్రోహం చేసింది. పక్కా చెబుతున్నా తను వేసిన ఈ స్టెప్ కి  రీగ్రేట్ అవుతుంది చూడు" అని శ్రీహాన్, శ్రీసత్య తో చెప్పుకొని బాధపడ్డాడు. ఇనయా ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటిస్తోంది. అయితే తన ప్రవర్తన నిజంగానే 'రంగులు మార్చే ఊసరవెల్లి' ని తలపిస్తోంది. అని  ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాబోయే రోజుల్లో ఇనయా ఎవరితో సన్నిహితంగా ఉంటుందో? ఎవరితో శత్రువుగా ఉంటుందో? అనే విషయం ఇప్పుడు హౌస్ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.

అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్.. కారణం శ్రీసత్యనే!

బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయిన అర్జున్ కళ్యాణ్ తెలుసుకదా!.. ఎప్పుడూ శ్రీసత్య చుట్టూ తిరుగుతూ, శ్రీసత్య కోసమే బిగ్ బాస్ లోకి వచ్చినట్టుగా కనిపించిన అర్జున్. గతవారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కి రాకముందు, ఎవరికి తెలియని వ్యక్తి. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఇతను కూడా ఒక హీరో అన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది. అర్జున్ వైజాగ్ లో జన్మించాడు. గీతం కాలేజీలో చదివాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి, అక్కడ M.S చేసాడు. ఆ తర్వాత  ఫిల్మ్ కోర్స్ చేసాడు. చిన్నప్పటి నుండి సినిమాలు అంటే మక్కువతో మొదటగా షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. 'మిస్సమ్మ', 'ఆత్మరామ', 'గీత గోవిందం', 'నారి నారి నడుమ మురారి'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.  2013 లో 'చిన్న సినిమా' అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కాగా 'ప్రేమమ్', 'వరుడు కావలెను' వంటి సినిమాలలో నటించాడు. అయితే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒక ఆడియో ఫంక్షన్ లో అర్జున్ కి యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ గురించి మాట్లాడం టాక్ అఫ్ ది టౌన్ గా మారి, పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొదట్లో ప్రేక్షకులు ఆశించినంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. టాస్క్ లో, గేమ్ లో ఎలాంటి వాటిలోను తను ఒక్కసారి కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో, వేస్ట్ కంటెస్టెంట్ గా, అన్‌డిజర్వింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే హౌస్ లో శ్రీసత్యతో క్రష్ ఉండేది. ఎక్కువగా హౌస్ లో తన కోసమే ఆడినట్లుగా అనిపించేది. ఇక శ్రీసత్యని వదిలి, గేమ్ పై ఫోకస్ పెడుతున్నాడు అనేసరికి హౌస్ లో నుండి బయటకొచ్చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఒకడిగా ఉంటాడనుకున్న అర్జున్ ఎలిమినేట్ అవ్వడంతో, ఈ షో చూసే ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. అర్జున్ ఓటింగ్ పోల్ లో మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ ఎలా ఎలిమినేట్ చేస్తారని నెటిజన్లు కామెంట్లు చేసారు. "అర్జున్ కి అన్యాయం జరిగింది" అంటు తెగ ట్రోల్స్ చేసారు. ఇది చాలా అన్‌ఫెయిర్ అంటు నెటిజన్లు పోస్ట్ లతో, ట్వీట్లతో వైరల్ చేసారు.  కాగా ఏడవ వారం హౌస్ నుండి బయటకొచ్చేసిన అర్జున్, తను బయటికి రావడానికి కారణం ఒక రకంగా శ్రీసత్యనే అని అంటున్నాడు. టాస్క్ లో పర్ఫామెన్స్ లేకపోగా, గేమ్ లో పోరాడే ఆసక్తి లేనట్లు, ఎప్పుడు చూసినా శ్రీసత్య కోసమే అన్నట్టుగా ఉండటం వల్ల బిగ్ బాస్ నుండి కావాలని‌  పంపించేసారని బయట ప్రచారం జరుగుతోంది. అర్జున్ కి రెమ్యూనరేషన్ కూడా తక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకి  రోజుకి ఇరవై వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారంలో ఉంది.

నల్ల చేప వచ్చె.. ముప్పు తెచ్చె!

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతోన్న టాస్క్ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్ ఎవరో తేల్చే ఈ టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ ఇచ్చినవాళ్ళు కెప్టెన్ అవుతారు. కాగా పర్ఫామెన్స్ ఇచ్చేవాళ్ళని ఎదో ఒక లింక్ పెట్టి కెప్టెన్సీ పోటీ తప్పిస్తోన్నారు కొందరు కంటెస్టెంట్స్. గత రెండు రోజుల నుండి  హౌస్ లో చేపల వర్షం కురుస్తుంది అనే విషయం తెలిసిందే. కాగా మొన్నటి రోజు అంతా చేపలను కాపాడుకోవడం, వాటిని సంపాదించుకోవడం మధ్యలో గోల్డ్ కాయిన్ వీటితో గడిచింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ వేక్ అప్ సాంగ్ వేయగా అందరూ బయటకొచ్చి డ్యాన్స్ చేసారు. అయితే అప్పటికే పూల్ లో ఉన్న నల్ల చేపని గీతు చూసి తీసేసుకొంది. డ్యాన్స్ చేసే వారిలో ఫైమా, మెరీనా ఉండగా వారు దానిని పట్టించుకోలేదు. కాగా గీతు మాత్రం దానిని తీసుకొని దాచిపెట్టుకుంది. హౌస్ లో జరిగే ట్విస్ట్ లు బాగానే ఉంటాయి. ఆ తర్వాత "బజర్ మోగే సమయానికి ఏ జంట దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయో" లెక్కించమంటాడు బిగ్ బాస్. "అలాగే నల్ల చేప ఎవరి దగ్గర ఉంటుందో, వారికీ ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది" అని బిగ్ బాస్ చెప్పడంతో, గీతూ తన దగ్గర ఉన్న నల్లచేపను తీసుకొచ్చింది. ఒక జంట ని ఇంకో జంటతో స్వాప్ చెయ్యమని గీతూకి చెప్పగా అందరికంటే ఎక్కువగా ఉన్న జంట రేవంత్, ఇనయాను అందరికంటే తక్కువ ఉన్న శ్రీహాన్, శ్రీసత్యతో స్వాప్ చేస్తున్న" అని గీతు చెప్పింది. గీతు, ఆదిరెడ్డితో, "ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో ఇలా చేస్తే, వాళ్ళు విడిపోతారు. ఆట మజా ఉంటుంది" అని చెప్పుకొచ్చింది. కానీ రేవంత్, ఇనయా రెండు రోజులుగా చాలా కష్టపడి ఆడారు. కాగా వాళ్ళకి బాధతో కూడా కోపం వచ్చి కొంచెం గట్టిగానే ఆర్గుమెంట్ జరిగింది అని చెప్పాలి. హౌస్ లో వచ్చిన నల్ల చేప వల్ల రేవంత్, ఇనయ ఇద్దరు స్వాప్ చేయబడ్డారు. కాగా ఈ టాస్క్ లో ఏమైనా మార్పులు చేసి ఈ జంటకి అవకాశం ఇస్తారో? లేదో? చూడాలి మరి.

మాట మార్చిన గీతు.. ఫేట్ ఏమవుతుందో..!

టాస్క్ లతో జనాలని ఇంట్రెస్ట్ గా చూసేలా చేస్తున్న బిగ్ బాస్. చేపల టాస్క్ లో  కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు. ఒక టాస్క్ ఇచ్చి అందులో మేజర్ ట్విస్ట్ లతో హౌస్ లోని కంటెస్టెంట్స్ కి, చూసే ప్రేక్షకులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరు ఇద్దరుగా జోడి చేసి వారికి చేపలు కాపాడుకునే బాధ్యతలు ఇచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ వారి చేపలని కాపాడుకోవడానికి తెగ కష్టపడ్డారు. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపారు రేవంత్, గీతు, సూర్య, ఇనయ. గీతు అందరి దగ్గరికి వెళ్ళి చేపలు కొట్టేసే పనిలో ఉంది. అయితే గీతు బాధ భరించలేక రేవంత్ వాష్ రూంకి వెళ్ళి పడుకున్నాడు. సూర్య, గీతు కలిసి రేవంత్ ని డోర్ కొట్టి లేపారు. "ఏంటి వాష్ రూంలో పడుకున్నావ్. ఎవరైనా వాష్ రూం కి వస్తే ఎలా ?" అని గీతు అంది. ఓ వైపు గీతు ఆటతీరుతో ఆకట్టుకుంటోంది అనుకుంటున్న ప్రేక్షకులతో పాటు, మరో వైపు ఏంది సామి ఈ అమ్మాయి ఇలా చేస్తోంది అని అనుకునేవాళ్ళు లేకపోలేదు. అయితే రెండు జంటలను‌ స్వాప్ చేసే అవకాశం గీతుకి లభించింది. దీంతో శ్రీహాన్, రేవంత్ ల ఫ్రెండ్‌షిప్ దెబ్బతీయాలని వాళ్ళిద్దరిని స్వాప్ చేసింది. అలా‌ చేయగానే "ఆడటం చేతకానప్పుడు ఇలానే ఉంటుంది" అని రేవంత్ అన్నాడు. బిగ్ బాస్ చెప్పే రూల్స్ కాకుండా సంచాలకురాలిగా గీతు చెప్పినట్లు చేయాలని భావించి అందరికి తన నియమాలు చెప్పగా, "నువ్వు ఏంది నాకు చెప్పేది బోడి?" అని రేవంత్ అన్నాడు. "పక్కనోళ్ళతోని గేమ్ ఆడించేది నా గేమ్" అని గీతు అంది. "పక్కనోళ్ళతో నువ్వు ఆడించేది ఏంది బోడి. వాళ్ళకి ఆడరాదా" అని రేవంత్ అన్నాడు. అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌లో గీతు పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా సరే తననే తప్పుగా చూస్తారు. ఎందుకంటే "వేరేవాళ్ళని ఆడించడానికి, గెలిపించడానికి కాదు  మనం బిగ్ బాస్ కి వచ్చింది‌. మన గేమ్ మనం ఆడాలి" అని చెప్పిన గీతు.. ఇప్పుడు తన గేమ్ వేరేవాళ్ళని ఆడిపించాలని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రేక్షకులు.

'సూర్యని టాప్‌లో ఉండనివ్వొద్దు'.. ఇనయా పంతం!

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకు మారుతున్న అంచనాలు, సన్నివేశాలు. అలాగే హౌస్ మేట్స్ ప్రవర్తన కూడా మారుతోంది. అయితే హౌస్ లో మొదట్లో సూర్య ఎక్కువగా ఆరోహితో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆరోహి వెళ్ళిపోయాక ఇనయాతో సన్నిహితంగా ఉన్నాడు. లాస్ట్ వీక్ లో జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో ఇనయాకి సూర్య హెల్ప్ చెయ్యకపోవడంతో అతనితో ఇనయా మాట్లాడట్లేదు. దానికి గాను ఈ వారం‌ సూర్యని నామినేట్ చేసింది. ఇన్ని రోజులుగా హౌస్ లో, ప్రేక్షకులలో ఒకటే ఫీల్ ఉండేది..  వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అని. అలా  అనిపించేలా వాళ్ళ ప్రవర్తన కుడా ఉండేది. కాగా ఇనయా అందరికి క్లారిటీ ఇస్తూ, "సూర్య నా క్రష్" అని కూడా చెప్పింది. గత వారం నాగార్జున కూడా ఇనయాని అన్నాడు. "ఇనయా‌ పొద్దుతిరుగుడు పువ్వు. సూర్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటావు" అని అన్నాడు. అంత సన్నిహితంగా ఇద్దరూ ఉండేవారు. ఒక్కసారిగా ఇద్దరూ శత్రువులుగా మారారు. ఎంతలా అంటే "సూర్యని టాప్-5 లో ఉండనివ్వను" అనేంతలా, సూర్య పై కోపం పెంచుకుంది ఇనయా. అయితే రేవంత్‌తో, "సూర్య ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. తనతో ఉంటే తన గురించి అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది" అని ఇనయా చెప్పుకొచ్చింది. కాగా సూర్య, వసంతితో మాట్లాడుతూ, "ఇనయా ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇలా చేంజ్ అవ్వడం ఏంటీ? ఎందుకు వట్టిగనే ట్రిగ్గర్ అవుతోంది. అంత క్లోజ్ గా ఉండి, ఒక్కసారిగా ఇలా ప్రవర్తిస్తోంటే సరికి బాధేస్తోంది" అని అన్నాడు. ఈ వారం ఒక్కొక్కరుగా ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరు నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయితే హౌస్ లో ఎప్పుడు కలిసి ఉండే వీరిద్దరు మళ్ళీ కలుస్తారో? లేదో? చూడాలి. 

రూల్స్ బ్రేక్ చేసిన గీతు.. బిగ్ బాస్ ఏం చేస్తాడో..!

బిగ్ బాస్ ప్రతీ రోజు కొత్త టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న జరిగిన టాస్క్ లో రేవంత్ దగ్గర ఉన్నవి తీసుకుందామని గీతు మాస్టర్ ప్లాన్ వేయగా, తన బొమ్మలే ఎత్తుకెళ్ళిపోయారు. అదేవిధంగా తన గేమ్ కూడా పోయింది. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరుగుతోన్న టాస్క్ లో గీతు, ఆదిరెడ్డి సంచాలకులుగా వ్యవహరించారు. అయితే గీతు బిగ్ బాస్ రూల్స్ ఫాలో కాకుండా వాటిని తనకు నచ్చినట్టుగా మార్చేసింది. దీన్ని రేవంత్ తీవ్రంగా అపోజ్ చేసాడు. బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా టాస్క్ నియామాలను అమలుచేయాల్సిన సంచలాకులు వాటిని పాటించకుండా, వారికి నచ్చినట్టు గేమ్ రూల్స్ ను  మార్చడం అనేది ఇదే తొలిసారి. ఇచ్చిన నియమాలు కాకుండా సొంత నియమాలు పెట్టడం అనేది తప్పు. సంచాలకులు కేవలం అటలోని నియమాలు చెబుతూ, ఆడే కంటెస్టెంట్స్ కి వివరించాలి. వారికి తగిన న్యాయం చెప్పడం సంచాలకుల బాధ్యత. కాగా గీతు మిగత కంటెస్టెంట్స్ తో కలిసి గేమ్ లో పాల్గొంది. అప్పటికే రేవం‌త్ చెప్పాడు, "నువ్వు కొత్త రూల్స్ ఏం పెట్టవద్దు. బిగ్  బాస్ రూల్స్ మాత్రమే పాటించాలి" అని. గీతు మాత్రo తన ఆటిట్యూడ్ తో "నా ఇష్టం. నా గేమ్ ఇంతే. సంచాలకురాలిగా నా రూల్స్ ఇంతే" అన్నట్లు మాట్లాడింది.  హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఆ తర్వాత  సంచాలకురాలిగా ఉన్న గీతు సాధారణ కంటెస్టెంట్ గా  గేమ్ ఆడుతోంది. అది చూసిన ఆదిరెడ్డి, "గీతు! నువ్వు చేసేది తప్పు. సంచాలకులుగా  గేమ్ ని మాత్రమే చూడాలి.  ఆడకూడదు" అని చెప్పినా తన మాటను పెడచెవిన పెట్టింది. పైగా ఆది రెడ్డిని కూడా మాటలు అంది. "నువ్వు అతి చెయ్యకు ఆదిరెడ్డి. ఇది కూడా గేమే" అంటు బదులు ఇచ్చింది. కాగా గీతు ప్రవర్తన, హౌస్ మేట్స్ కి చిరాకు తెప్పిస్తోందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గీతుని, వీకెండ్ లో వచ్చే నాగార్జున ఏం అంటాడో చూడాలి మరి.

ఏం థంబ్ నైల్ రా బాబు అది!

జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ గురించి తెలిసిందే. ఇతను కొన్నాళ్లుగా కిడ్నీకి  సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ  ప్రాణాల మీదకు రావడంతో తోటి కమెడియన్స్ ఆదుకున్నారు. పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి ఆర్థిక సహాయం చేశారు. ట్రీట్ మెంట్ కారణంగా  చాలా కాలం పంచ్ ప్రసాద్ బుల్లితెరకు దూరమయ్యాడు.  డయాలసిస్ చేయించుకుంటున్న ప్రసాద్ ప్రస్తుతం కోలుకుని రీ-ఎంట్రీ ఇచ్చాడు.   జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు వంటి కామెడీ షోలలో పంచ్ ప్రసాద్ కనిపిస్తున్నాడు.  పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై కూడా కమెడియన్స్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. ఆయన కూడా తనపై తాను పంచెస్ వేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాడు.  ఇలాంటి టైంలో   "పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నాడు" అన్న  వార్త సంచలనం రేపుతోంది. కమెడియన్ ఇమ్మానియేల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసేసరికి అందరిలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి.  అయితే ఇదంతా కమెడియన్ ఇమ్మానియేల్ ఫాన్స్ ఫోకస్ ని తమ వైపు తిప్పుకోవడానికి చేసిన ఒక ట్రిక్ లా కనిపిస్తోంది.  ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రసాద్ కి ఆయన భార్యతో మళ్ళీ పెళ్లి చేశారు. ఆ ఎపిసోడ్ లో  పంచ్ ప్రసాద్ కి సంబంధించిన కొన్ని ఎమోషనల్ వీడియోస్ ప్లే చేశారు. ఇక తమ ఇంట్లో పంచ్ ప్రసాద్ కి తన భార్యకు మధ్య జరిగిన డిస్కషన్ వీడియోలు శ్రీదేవి డ్రామా కంపెనీలో  ప్రదర్శించారు. ఇక ఈ మొత్తానికి సంబంధించిన ఒక వీడియోని ప్రసాద్ కి రెండో వివాహం అని థంబ్ నైల్ పెట్టి ఫోటో విడుదల చేశారు. నిజానికి పంచ్ ప్రసాద్ ఎవరినీ మరో పెళ్లి చేసుకోలేదు. ఐతే ఈ వీడియోకి  ఏమంత రెస్పాన్స్ రావడం లేదని అనుకున్న ఇమ్ము తన ఫ్రెండ్ కోసం తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టేసరికి వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. 

మనిషిని తప్ప అన్నీ తింటాడు

బ్రహ్మి - ఆలీ ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు చాన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఎంటర్టైన్ చేసింది. చెఫ్ మంత్ర సీజన్ - 2 లో వీరిద్దరూ అక్టోబర్ 28 న  కనిపించి అలరించబోతున్నారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ‘‘ఆలీ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి?’’ అని బ్రహ్మానందాన్ని లక్ష్మి అడిగేసరికి "మనిషిని తప్పా అన్నీ తింటాడు" అని ఫన్నీ ఆన్సర్ చెప్పారు. ఇక వీళ్ళ ఇద్దరికీ దోశెలు వేసే పోటీ పెట్టింది. అది కూడా స్పీడ్ గా వేయాలి, అందంగా వేయాలని కండిషన్ పెట్టింది. ‘‘మిరపకాయ ఈజ్ ఈక్వల్ టూ గుంటూరు.. గుంటూరు ఈజ్ ఈక్వల్ టూ బ్రహ్మారందరావు’’ అని బ్రహ్మానందం కామెడీ డైలాగ్ చెప్పబోయి అచ్చు తప్పు చెప్పేసరికి  వెంటనే లక్ష్మి  ‘‘బ్రహ్మారంధ్రమా’’ అని  పంచ్‌ వేసింది. "బోటీ కూర, లివర్ కూర, తలకాయ కూర " అని లక్ష్మీ ఏదో ప్రశ్న అడగడానికి ట్రై చేస్తుండగా మధ్యలో బ్రహ్మానందం అందుకుని ‘‘తలకాయ లేనోళ్లే.. తలకాయ కూర తింటారు’’ అని పంచ్‌ వేశారు. ఇక ఫైనల్ గా షోకి వచ్చిన గెస్టుల ఎదురుగా వాళ్లకు ఏమీ పెట్టకుండా లొట్టలేసుకుని మరీ డెలీషియస్ ఫుడ్ తినేసింది మంచు లక్ష్మి. "షోకి పిలిచి మనకు పెట్టకుండా అలా తినేస్తుందేమిటి" అని బ్రహ్మానందం చాలా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే వీళ్ళ కామెడీ ఫుడ్ షో ఆడియన్స్ లో జోష్ నింపబోతోంది.

ఎవడ్రా నవ్విందక్కడ..కం టు మై రూమ్

"క్యాష్" ప్రోగ్రాం ఈ వారం ఫుల్ మస్తీ చేయడానికి రెడీ అయ్యింది. ఇక ఈ లేటెస్ట్ షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. జెనరల్ గా మాట్లాడుకునే పదాలనే సినిమా టైటిల్స్ గా పెడుతుండేసరికి కొంత కంఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతోంది. ఇప్పుడు అలాంటి ఒక టైటిల్ తో నవంబర్ 4 న రిలీజ్ కాబోతున్న like share subscribe మూవీ టీమ్ క్యాష్ షోలో సందడి చేశారు. ఈ షోకి  మూవీ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్  ఫారియా అబ్దుల్లా, డైరెక్టర్ మేర్లపాక గాంధీ, యాక్టర్స్ బ్రహ్మాజీ, సుదర్శన్  పాల్గొన్నారు. ఇలా  చాలా మంది సెలెబ్రెటీలు సెలబ్రిటీలు మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఇక  ఈ మూవీ టీమ్ కు సుమ గ్రాండ్ వెల్కం చెప్పారు. నటుడు బ్రహ్మాజీ పై సుమ కనకాల వేసిన పంచ్ లు వింటే కడుపుబ్బా నవ్వాల్సిందే. "చూసారా బ్రహ్మాజీ పక్కన  ఫరియా ఎంత సూట్ అయ్యిందో " అని ఇద్దరి ఫోటో చూపించేసరికి బ్యాక్ గ్రౌండ్ లో ఎవరో గట్టిగా నవ్వారు. దాంతో బ్రహ్మాజీకి కామెడీ కోపం వచ్చేసింది..దాంతో "ఎవడ్రా నవ్విందక్కడ, కం టు మై రూమ్" అనేసరికి స్టేజి మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఈ  మూవీ గురించి చెప్పాలంటే..  సంతోష్ శోభన్ ను హీరోగా ఎలివేట్ చేసే మరో మూవీ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు సినిమాతో మంచి  ఫేమ్ తెచ్చుకున్న ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక డైరెక్టర్  మేర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే సినిమా ట్రైలర్ ను హీరో ప్రభాస్ రిలీజ్ చేశారు.

దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు అంతకుమించి ఏం చేయలేడు!

"ఎక్స్ట్రా జబర్దస్త్" ఈ వారం మంచి పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయింది. ఇందులో గెటప్ శీను గ్యాంగ్  "గాడ్ ఫాదర్" మూవీ స్పూఫ్ చేశారు. చిరంజీవిగా శీను, సత్యదేవ్ గా ఆటో రాంప్రసాద్, నయనతారగా అన్నపూర్ణ , సల్మాన్ ఖాన్ గా బులెట్ భాస్కర్ ఈ స్కిట్ లో నటించారు. "కామెడీకి దూరంగా ఉన్న మీరు మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చారు" అని రాంప్రసాద్ శీనుని సీరియస్ గా అడిగేసరికి " నేను రానంతవరకు ఆ కామెడీని చెరిగి చెదపట్టనివ్వను" అని చిరు లెవెల్ లో డైలాగ్ చెప్పాడు.  వెంటనే అన్నపూర్ణ లైన్ లోకి వచ్చి "చెద పట్టదన్నయ్యా అప్పుడప్పుడు వీడు చెదలమందు కొడుతున్నాడు" అని చెప్పేసరికి "నా చిట్టి చెల్లి" అని కౌంటర్ డైలాగ్ వేసాడు శీను. "చూడు బ్రహ్మ నీకేం కావాలి అంటే అది ఇస్తాను నీ సపోర్ట్ నాకు కావలి" అని రాంప్రసాద్ శీనుకి చెప్పాడు "నా సపోర్ట్ లేనిదే నువ్వు ఇంతదూరం వచ్చావా" అని కౌంటర్ వేసాడు శీను.  ఇలా ఈ టీం స్కిట్ వేశారు. ఇక శీను వేసిన చిరు గెటప్ చూసి "నిజంగా చిరంజీవిని చూసినట్టే ఉంది" అని ఖుష్భూ శీనుకి కాంప్లిమెంట్ ఇచ్చింది. తర్వాత రాంప్రసాద్ మాట్లాడుతూ "చిరంజీవి గారితో శీను ప్రైవేట్ జెట్ లో వెళ్ళినప్పుడు నిజంగా మా జబర్దస్త్ ఫామిలీ మొత్తం వెళ్ళినట్లే అనిపించింది" అన్నాడు. తర్వాత శీను మాట్లాడుతూ "నేను ప్రతీసారి మెగాస్టార్ గారి గురించి చెప్తే భజన భజన అంటూ ఎగతాళి చేస్తున్నారు. దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు అంతకుమించి ఏమీ చేయడు" అని చెప్పి నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్ళ నోరు మూయించాడు.

గీతు, రోహిత్ మధ్య వాగ్వాదం!

బిగ్ బాస్ లో మంగళవారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ పోటీ టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. అందులో గీతు, రోహిత్ మధ్య జరిగిన గొడవ పీక్స్ స్టేజ్ కి వెళ్ళింది. "గేమ్ ని గేమ్ లా ఆడాలి. నిజం చెప్పడానికైన, గేమ్ ఆడటానికైనా గట్స్ ఉండాలి" అని గీతు అంది. దానికి రోహిత్ " దా గట్స్ ఉంటే వచ్చి తీసుకో" అన్నాడు. టాస్క్ మొదలవగానే చేపల వర్షం‌ కురవగా, ఒక్కో కంటెస్టెంట్ చేపలను పట్టుకొని బుట్టలో వేసుకున్నారు. అయితే వాటిని లాక్కొని దాచుకోవాలి. కానీ రోహిత్, తన భార్య మెరీనాకు సపోర్ట్ చేసాడు. ఇది చూసిన గీతుకి కోపం‌ వచ్చి, "ఏంటి రోహిత్ టాస్క్ గురించి క్లారిటీ లేదా నీకు. మెరీనాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్. కలిసి ఆడమన్నప్పుడు ఆడరు. విడిపోయి ఆడమన్నప్పుడు కలిసి ఆడుతున్నారు." అని గీతు, రోహిత్ తో చెప్పుకొచ్చింది. రోహిత్ మాట్లాడుతూ, "నా భార్య నా ఇష్టం. నేను సపోర్ట్ చేస్తా , నీకేంటి" అని అన్నాడు. "దమ్ముంటే గీతులాగా ఆడాలి. గీతులా ఆడాలంటే గట్స్ ఉండాలే. మీలా కాదు నేను" అంటూ గీతు చెప్పింది రోహిత్ తో. ఇలా ఇద్దరి మధ్య కాస్త‌ వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ చేపలు పట్టడం లో బిజీ అయిపోయారు.  టాస్క్ ముగిసే సమాయానికి ఒక్కొక్కరుగా అందరూ బాగానే పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు సరదగా నవ్వుకోవచ్చు.

చేపల వేట.. కంటెస్టెంట్స్ మధ్య గలాట!

బిగ్ బాస్ లో యాభై ఒకటో రోజు 'శ్రీమంతుడు' మూవీలోని 'రామ రామ‌ ' పాటతో మొదలైంది. ఆ తర్వాత టాస్క్ నియమాలు కంటెస్టెంట్స్ కి వివరించాడు బిగ్ బాస్. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా చేపల వర్షం కురిసింది. ఆ టాస్క్ ముగిసే సమయానికు రేవంత్-ఇనయా దగ్గర ఎక్కువ చేపలు ఉన్నాయి. "ఆ తర్వాత గేమ్ 'పూల్ లో గోల్డ్ కాయిన్'. పూల్ లో బాల్స్ తో పాటుగా అందులో గోల్డ్ కాయిన్ ఉంది. అది ఎవరికి లభిస్తే వాళ్ళు విజేత" అని బిగ్ బాస్ చెప్పాడు కంటెస్టెంట్స్ తో. ఆ తర్వాత రేవంత్ కి గోల్డ్ కాయిన్ దొరికింది. ఇది దొరకడం వల్ల రేవంత్ కి తర్వాత గేమ్ కి సభ్యులను ఎన్నుకునే అవకాశం దొరికింది. ఆ తర్వాత గేమ్ కి రేవంత్, ఇనయా కలిసి రెండు టీంలుగా విభజించుకున్నారు. ఆ టీం‌లలో గీతు, ఆదిరెడ్డి అవుట్ అయ్యారు. కాగా సూర్యని సంచాలకుడిగా నియమించారు. ఆ తర్వాత టాస్క్ పేరు 'పుల్ ద కాట్". ఈ టాస్క్ లో ఆదిత్య, రేవంత్ ఒక వైపు నుండి కాట్ ని పుష్ చేస్తుండగా, మరో వైపు నుండి శ్రీహాన్, రాజ్ పుష్ చేసారు. కాగా ఆ కాట్ మీద శ్రీసత్య, ఫైమా, ఇనయా, కీర్తి కూర్చున్నారు. ఇందులో శ్రీహాన్-రాజ్ టీం గెలిచింది. గేమ్ ముగిసాక సంచాలకుడితో‌ రేవంత్ మట్లాడుతుండగా, రాజ్ కూడా అదే సమయంలో మాట్లాడటంతో రేవంత్ కి కోపం వచ్చింది. ఆ తర్వాత "రాజ్ నేను నీతో మాట్లాడట్లేదు. నన్ను రెచ్చగొట్టకు" అని రేవంత్ అనగా, దానికి సమాధానంగా "నేను నీతో మాట్లాడట్లేదు. సంచాలకుడితో మాట్లాడుతున్నా" అని రాజ్ ‌చెప్పాడు.ఆ తర్వాత ఇనయా "సంచాలకుడిగా సూర్యని అనవసరంగా ఎన్నుకున్నాం. అసలు కరెక్ట్ గా చూడలేదు. చూడకుండా వాళ్లకు సపోర్ట్ చేసాడు" అని రేవంత్ కి చెప్పింది. చేపల కోసం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గలాటాలో గీతు పర్ఫామెన్స్ తక్కువ అనే చెప్పేయొచ్చు‌. అయితే రేవంత్ తన ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఈ వారం కంటెస్టెంట్స్ అందరు నామినేషన్లో ఉండగా ఎవరు బయటకొచ్చేస్తారు అనేది చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హౌస్ లో మొదటిసారిగా ఏడ్చిన గీతు!

బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడు లేని విధంగా వింతలు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండి, ఎలాంటి ఎమోషన్స్ కి తావు ఇవ్వకుండా, మొదటి వారం నుండి పక్కాగా గేమ్ ఆడుతు  హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న గీతు ఏడ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ అందరిని రెండు జంటలుగా చేసిన విషయం తెలిసిందే. కాగా "బిగ్ బాస్ లో చాపల వర్షం మొదలవుతుంది. బజర్ మోగిననుండి, తర్వాత బజర్ వచ్చేవరకు ఈ టాస్క్ కొనసాగుతోంది. చాపలు అన్నీ పట్టుకొని వారికి సంబంధించిన బుట్టలో వేసుకోవాలి మరియు వేరే వాళ్ళ బుట్ట నుండి తీసుకోవచ్చు అలాగే వారి బుట్ట ను కాపాడుకోవాలి" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. కాగా అందరూ చేపలను పట్టుకున్నారు. వారి వారి బుట్టలను కాపాడుకుంటు వస్తున్నోరు. గీతు మాత్రం ఇతరుల బుట్ట నుండి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మిగతా జంటలు కూడా గీతు, ఆదిరెడ్డి జంటల చాపలు తీసుకున్నారు. మొదటి బజర్ పూర్తి అయ్యేసరికి, అందరికంటే తక్కువ ఉన్న గీతు, ఆదిరెడ్డి లను పోటీ నుంచి తొలగించాడు బిగ్ బాస్. కాగా టాస్క్ లో ఓడిపోయినందుకు గీతు మొదటిసారిగా ఏడ్చింది. అప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరు వచ్చి ఓదార్చారు. "నేను చూసినంతవరకు ఎప్పుడు ఏడ్వలేదు. నువ్వు ఏడ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా గీతు" అని‌ సూర్య చెప్పాడు. ఎప్పుడు ఏడ్వని గీతు ఏడ్చేసరికి అందరు ఆశ్చర్యపోయారు. గీతు మాట్లాడుతూ, "మీరు గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చెయ్యడానికి మిమ్మల్ని అందరిని కావాలని రెచ్చగొట్టాను" అని చెప్పుకుంటు ఏడ్చేసింది. మిగతా హౌస్ మేట్స్ గేమ్ ని కంటిన్యూ చేస్తుంటే ఆదిరెడ్డి, గీతు ఇద్దరు ఒక్క పక్కన కూర్చొని బాధపడుతున్నారు. అయితే టాస్క్ లో ఓడిపోయిన వీరిద్దరికి బిగ్ బాస్ ఈ వారం లో ఇంకా ఏమైనా అవకాశం ఇచ్చి టాస్క్ లో పాల్లొనేలా చేస్తాడేమో? చూడాలి

శ్రీహాన్‌కి రెమ్యూనరేషన్ ఎక్కువేనట!

బిగ్ బాస్ లో ప్రతీవారం నామినేషన్లో ఉంటు తన పర్ఫామెన్స్ తో మెప్పిస్తున్న శ్రీహాన్. ఇప్పుడు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు అందరికి సుపరిచితమే.  ఇతను 1988 అక్టోబర్ 19న వైజాగ్ లో జన్మించాడు. ఇతనకి చిన్నతనం నుండి నటన అంటే ఇష్టం ఉండేదట, కాగా చదువు అంతా కూడా వైజాగ్ లో పూర్తి చేసాడట. చదువు పూర్తి అయ్యాక  నేవీలో జాబ్ సంపాదించుకున్నాడు. కానీ అతనికి నటన అంటే ఇష్టంతో జాబ్ వదిలేసి నటన వైపు అడుగులేసాడట. ఆ తర్వాత  హైదరాబాద్ కి వచ్చాడు. సినిమాల్లో ఛాన్స్ ల కోసం చాలా ప్రయత్నించాడు. ఆ తర్వాత  షార్ట్ ఫిలిమ్స్ లో‌ ఛాన్స్ లభించడంతో తను నటించడం మొదలుపెట్టాడు. కాగా శ్రీహాన్ మంచి డాన్సర్ గా, యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ఎన్నో  లఘుచిత్రాలలో నటించాడు. తను నటించిన షార్ట్ ఫిలిమ్స్ ని  ఎక్కువ మంది వీక్షించేవాళ్ళు. అయితే బిగ్ బాస్ సీజన్-5 లో తన ఫియాన్సీ అయిన సిరి హనుమంత్ కంటెస్టెంట్ గా  ఉన్నప్పుడు,  తనను కలవడానికి బిగ్ బాస్ స్టేజి మీదకి వచ్చాడు. అప్పుడు అతను మాట్లాడిన తీరు బాగుండడంతో తనకి ఈ సీజన్  లో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి మూడవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శ్రీహాన్. మొదటి రోజు నుండి తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్  ఇస్తూ వస్తోన్నాడు. కాగా 'ఆల్ రౌండర్ అఫ్ హౌస్' అని కూడా పిలుచుకుంటున్నారు హౌస్ మేట్స్. అయితే హౌస్ లో గొడవలకు తావు ఇవ్వకుండా, అందరితో మంచిగా ఉంటూ  మాత్రం వస్తోన్నాడు. ఒక్క ఇనయాతో చిన్న గొడవ  ఉన్నా కూడా, గత వారం నుండి ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయి ప్రస్తుతం బాగానే ఉంటోన్నారు. తన అట తీరుతో, మాటతీరుతో అటు హౌస్ మేట్స్ ని, ఇటు ప్రేక్షకులను ఆకర్షిస్తూ వస్తోన్నాడు ఈ యంగ్ డైనమిక్. ఈ సీజన్ టైటిల్ విజేత అవుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీహాన్ రెమ్యూనరేషన్ విషయానికొస్తే హౌస్ లో రేవంత్ తరువాత ఎక్కువ రెమ్యూనరేషన్  తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ యాభై వేల నుండి అరవై వేల వరకు ఉండొచ్చని ప్రచారంలో ఉంది. కాగా ఇతను ప్రతీ వారం నామినేషన్లో ఉండగా, తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, సేవ్ అవుతూ వస్తోన్నాడు. మునుముందు తన పర్ఫామెన్స్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

నోటిదూల లేకపోతే ఎవరూ మనల్ని పట్టించుకోరు

జ‌బ‌ర్థ‌స్త్ షో ఆడియన్స్ ని ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది.  లేటెస్ట్ గా  జ‌బ‌ర్ధ‌స్త్‌కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇక ఇందులో ఆది, కృష్ణ భ‌గ‌వాన్ వీల్ చెయిర్ లో  వ‌స్తారు. అప్పుడు కృష్ణ భ‌గ‌వాన్ "వీల్ చెయిర్ ని తోయ‌కుండా న‌న్ను తోస్తావేంట‌ని అడిగేసరికి దానికి ఆది.. మిమ్మల్నయినా అది తోస్తోంది, ఇదైతే నా వెన‌క ఏదేదో చేస్తోంది" అని అన్నాడు. "ఇక ఇంద్ర‌జ‌ గారితో  వ‌ర్క్ చేస్తున్నారుగా, అది ఎలా ఉందో" అని ఆది అడిగేసరికి " ఆవిడ‌కేంటి, ఎప్పుడూ ఎవ‌ర్ గ్రీన్, గ్రీన్ సారి, గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుని  రావ‌డం చాలా బాగుంటుంది" అని కృష్ణ భ‌గ‌వాన్ అంటే దానికి పంచ్‌గా ఆది "అలా ఎవ‌ర్‌గ్రీన్ అంటారా" అని అన్నాడు. దానికి అందరూ నవ్వేశారు. "మ‌న ఎదురుగా త‌మ‌న్నా, పూజా హెగ్డే వెళితే మీరు ఎవ‌రిని చూస్తారు" అని ఆది అడిగేసరికి " నేను త‌మ‌న్నాని చూస్తా" అని కృష్ణ భ‌గ‌వాన్ అన్నాడు . "ఏంటి సార్ నేనైతే ఇద్ద‌రిని చూస్తా " అని ఆది అనడంతో "నేను అంత క‌క్కుర్తి పొజిషన్ లో లేను" అని అన్నాడు. "మ‌న బాడీలో అన్ని ప‌డిపోయి నోరు ఒక్క‌టే ఎందుకు వదిలేసాడో" అని ఆది అనేసరికి అప్పుడు కృష్ణ భ‌గ‌వాన్ "నాకు  నోటిదూల ఉంది కాబ‌ట్టి" అని ప‌రువు తీసాడు. "నోటి దూల ఉంటే త‌ప్పు అంటారా" అనేసరికి " అది లేక‌పోతే త‌ప్పుకోండ‌ని మ‌న‌ని అంటారు" అంటూ కృష్ణ భ‌గ‌వాన్ పంచ్‌లు వేశాడు.