మా వదిన గన్ పెట్టి అడిగినా నేను చెప్పలేను

పుష్ప హీరో అల్లు అర్జున్  తమ్ముడు అల్లు  శిరీష్ అంటే ఆడియన్స్ కి ఒక మోస్తరుగా బాగానే   తెలుసు. హీరోగా చాలా మూవీస్ చేసాడు కానీ అనుకున్నంత పేరు రాలేదు.  దాదాపు మూడేళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ అనే  మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదే టైంలో  ‘ఆలీతో  సరదాగా’ టాక్ షోకి వచ్చాడు. ఎవరికీ తెలియని కొన్ని ఇంటరెస్టింగ్  విషయాల్ని బయటపెట్టాడు. "ఏమిటి ఎక్కువగా ఈమధ్య ముంబై వెళ్తున్నావ్..కోడల్ని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నావా" అని ఆలీ అనేసరికి "అలాంటిదేమీ లేదు" అని నవ్వేసాడు శిరీష్.  కొత్త మూవీలో లిఫ్ట్ లో వచ్చే ముద్దు సీన్ గురించి ఆలీ , శిరీష్ ని అడిగాడు. " యూత్ కి ఈరోజున ఇదంతా చాలా మూములు విషయం" అని అల్లు శిరీష్ చెప్పాడు. "ఈ ముద్దు సీన్  సింగిల్ టేక్ లో అయిందా లేదా ఎన్ని టేకులు అయ్యింది" అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలీక శిరీష్ తల పట్టుకున్నాడు. ఇక ‘పుష్ప’ రిలీజ్ సమయానికి తాను ముంబై లో ఉన్నానని చెప్పాడు. "నేను అల్లు అర్జున్ తమ్ముడినని తెలియదు కాబట్టి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా  గొప్పగా మాట్లాడుకుంటుంటే పక్కనే కూర్చుని విన్న నాకు చాలా హై ఇచ్చిందని" శిరీష్ చెప్పాడు. "తన  ఫస్ట్ మూవీ "గౌరవం"  98 శాతం మందికి నచ్చలేదని, ఒకవేళ ఆ మూవీ బాగుందని ఎవరైనా చెబితే మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నా" అని చెప్పాడు. "తన భార్య స్నేహకి చెప్పని సీక్రెట్స్ కూడా కూర్చోబెట్టి నీకు చెప్తాడట కదా అవి ఏంటి" అని ఆలీ అడిగేసరికి "ఎవరో ఒకరికి మైండ్ లో ఉన్నవి షేర్ చేసుకోవాలి కాబట్టి నాతో చెప్తాడు. ఐతే మా వదిన స్నేహ గన్ పెట్టి అడిగినా సరే చెప్పలేను" అని  నవ్వుతూ సమాధానమిచ్చాడు.

సీరియల్స్ అత్తా కోడళ్ల మధ్య చిచ్చు పెట్టిన సుమ

క్యాష్ ప్రోగ్రాం ప్రతీ వారం మస్త్ కామెడీ పండిస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. మూవీ ప్రొమోషన్స్ కి సంబంధించిన నటీనటులు ఎక్కువగా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెరైటీ గా ప్లాన్ చేశారు. క్యాష్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.. ఈ షోకి సీరియల్స్ అత్తాకోడళ్లు ఎంట్రీ ఇచ్చారు. హరిత - సుహాసిని, శిరీష - గౌతమీ, భావన - వర్షిణి, కస్తూరి - లహరి..ఇక సుమ కామెడీ మాములుగా లేదు.. " ఒకప్పుడు అత్తలంటే ఎలా ఉండేవారు..ఎంతో పద్ధతిగా ఉండేవారు" అని ఈ సీరియల్ అత్తల మీద కౌంటర్ వేసింది. ఇక కోడళ్ళకు ఒక టాస్క్ కూడా ఇచ్చి ఎంటర్టైన్ చేసింది సుమ. టైం లిమిట్ పెట్టి కోడళ్లంతా వచ్చి వాళ్ళ వాళ్ళ అత్తగార్లని ఎత్తుకోవాలని చెప్పింది. "అత్తాకోడళ్లకు ఎక్కువగా కిచెన్ లోనే ఎందుకు గొడవలు వస్తాయి" అని అడిగింది సుమ. సుహాసిని వాళ్ళ రియల్ అత్తగారు చూస్తూ ఉంటారు ఆవిడ అక్కడి నుంచి ఇలా చెప్తారు " మంచినీళ్ళని మైక్రోవేవ్ లో వేడి చేసి ఇది వంట అంటుంది" అని సుమ కామెడీ చేసింది. ఇక అత్తలు, కోడళ్ళకు చపాతి చేసే టాస్క్ ఇచ్చింది. ఇంకా ఒక కూరగాయ పేరు చెప్పి దాంతో పాటలు కూడా పాడించింది. అత్తాకోడళ్లలో ఒక టీం ఐన భావన - వర్షిణి కలిసి దొండకాయ, బెండకాయ మీద సాంగ్స్ పాడి సుమకి షాకిచ్చారు.  ఇక ఫైనల్ గా కార్తీక మాసం కాబట్టి అందరూ కలిసి వన భోజనాల్లాంటివి కాష్ షో భోజనాలు చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు.

సుజాతతో నా రిలేషన్ అలాంటిది...ఎంతో బాధ్యతగా ఉంటాను!

జబర్దస్త్ వేదిక ద్వారా ప్రేమించుకున్న  జంట రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత. అయితే మొదట్లో వీరిద్దరిదీ రీల్ లవ్ అనుకున్నారు అంతా.  షోకి రేటింగ్ కోసం చేస్తున్నారని  అనుకున్నారు. కానీ తర్వాత తమది రియల్ లవ్ అని చెప్తూ ఒక రియాలిటీ షోలో  సుజాతకు రింగ్ తొడిగి మరి ప్రపోజ్ చేశాడు రాకింగ్ రాకేష్. ఇక ఇప్పుడు రాకేష్ సుజాతతో, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. "జీవితం అంటే ఏమిటో తెలియాలంటే స్మశానానికి వెళ్ళాలి అంటారు నేను కూడా అలాగే స్మశానానికి  వెళ్లాను, సుజాతను కూడా తీసుకెళ్ళాను..కొంత మంది ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లా.ఐతే ఈ విషయం తెలిసి సుజాత వాళ్ళ అమ్మ నా మీద కోప్పడ్డారు కూడా. తర్వాత మా అమ్మ నన్ను కాశీ తీసుకెళ్ళేసరికి అక్కడ ఉన్న ఒక గురువుగారు నాకు మంచి ఉపదేశం ఇచ్చి వయసుకు తగ్గట్టు వ్యవహరించమని చెప్పారు. అలా నా దారి మార్చుకున్నాను. ఇక చిన్నప్పటినుంచి నన్ను, తమ్ముడిని అమ్మే సాకింది. ఎందుకంటే మా నాన్న ఉన్నా కూడా లేనట్టే. నాకంటే ముందు తమ్ముడికి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడి కూతురు ఇంట్లోకి అడుగుపెట్టింది. ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు అందరినీ అలా చూసుకోవడం అలవాటు చిన్నప్పటినుంచి అందుకే ఎవరి విషయంలోనైనా బాద్యతగానే ఉంటాను. భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది ఆకర్షణ కాదు.ఒకరి పద్ధతులు ఒకరు యాక్సెప్ట్ చేసుకునే గుణం ఉండాలి. నేను తనను ఎంత కేర్ గా చూసుకుంటానో నన్ను అలాగే చూసుకుంటుంది సుజాత .. టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. నా మనసు మారినందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. సుజాత మా అమ్మతో బాగా కలిసిపోతుంది. సుజాత వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్. అందుకే తాను మా ఇంటికి వస్తుంది నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను " అంటూ సుజాతతో తనకున్న రిలేషన్ గురించి చెప్పాడు రాకింగ్ రాకేష్.

'నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు'

జబర్దస్త్ ద్వారా తక్కువ టైములో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ ఇమ్మానుయేల్‌. తన పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించడమే కాదు ... వర్షతో నడిపే లవ్‌ ట్రాక్‌తో మస్త్ ఫేమ్ కూడా సంపాయించాడు.  ప్రస్తుతం ఇమ్మానుయేల్‌ జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జాతి రత్నాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇపుడు రీసెంట్ గా కాస్ట్లీ కార్ కొన్నాడు ఈ కమెడియన్.   దీనికి  సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ ఫొటోల్లో ‘జబర్దస్త్’ లేడీ కమెడియన్  రోహిణి కూడా ఉంది. ‘‘మొత్తానికి నేను కన్న కల నిజమైంది. నా లైఫ్‌లో అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఈ మధుర క్షణాలను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు’’ అని టాగ్ లైన్ పెట్టి కార్ తో దిగిన ఫొటోస్  పోస్ట్‌ చేశాడు.  ఇక  నెటిజనులు ఇమ్మూకి  కంగ్రాట్స్‌ చెబుతున్నారు.  2017లో ‘పటాస్’ ప్రోగ్రామ్ ద్వారా మొదటిసారి బుల్లితెర మీద కనిపించాడు. తర్వాత  జబర్దస్త్‌ షోలో అవకాశం వచ్చింది. అలా 2019లో ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానుయేల్‌ ప్రారంభంలో వెంకీ మంకీస్ టీమ్‌లో చేశాడు.  తరవాత కెవ్వు కార్తీక్.. బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో కూడా చేశాడు. మొత్తానికి ‘జబర్దస్త్’లో అన్ని టీమ్‌లలో చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్ కొన్న విషయం తెలుసుకుని గెటప్ శీను "కంగ్రాట్స్ రా ఇమ్ము" అని మెసేజ్ చేసాడు. జ్యోతక్క కూడా విషెస్ చెప్పేసింది.

గోధుమ పిండికి, మరమరాలకి కూడా నువ్వు నామినేట్ చేస్తావ్!

బిగ్ బాస్ యాభై ఏడవ రోజు 'చిలకలూరి చింతామణి' పాటతో మొదలైంది.  ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ మధ్య గుసగుసలు. 'ఐ మిస్ యూ సూర్య' అని ఇనయా బాధపడుతూ కూర్చుంది. ఓ వైపు ఫైమా, గీతు 'ఇనయా ఫేక్' అని మాట్లాడుకున్నారు. మరో వైపు మెరీనా, కీర్తి భట్, ఇనయా "ఈ సారి గీతుకి నామినేషన్ వేయాలి" అని టార్గెట్ చేసారు. అయితే నిన్న జరిగిన నామినేషన్లో ఒక్కో కంటెస్టెంట్ చెప్పిన రీజన్స్ అన్నీ  కొత్తగా ఉన్నా , కొన్ని మాత్రం సిల్లీగా అనిపించాయి. అందులో ఒకటి ఇనయా, ఆదిరెడ్డిని నామినేట్ చేసిన తర్వాత ఆదిరెడ్డి చెప్పిన సమాధానం అని చెప్పుకోవచ్చు. అయితే నామినేషన్లో భాగంగా మొదట ఇనయా, గీతుని నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఆదిరెడ్డిని నామినేట్ చేసాకా మాట్లాడుతూ, "మీరు నన్ను ఫేక్ అన్నారు. నేను నాలాగా ఆడుతున్నాను. నా గేమ్ నేను ఆడుతున్నాను. కానీ నాకు మీ గేమ్ ఫేక్ అనిపించింది" అని ఇనయా అనగా, ఆదిరెడ్డి మాట్లాడుతూ, " ఏందమ్మా నువ్వు. సూర్య అంటే ఇష్టం అంటావ్. నమ్మకద్రోహం చేసావ్. వెన్నుపోటు పొడ్చావ్. సూర్యకి నామినేషన్లో గట్టిగా వేసావ్. బయటకు పోయాడు. అసలు రీజన్ ఏ లేదు. పాయింట్స్ చెప్పి నామినేషన్ వేయు. లాస్ట్ వీక్ చమ్కీలు అని చెప్పి శ్రీహాన్ ని నామినేట్ చేసావ్. రేపు పొద్దున గోధుమ పిండికి, మరమరాలకి కూడా నామినేట్ చేస్తావ్ నువ్వు" అని ఆదిరెడ్డి అనగా,  మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కాసేపు నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇనయా మాట్లాడుతూ, "నేను గోధుమ పిండికి, మరమరాలకి నామినేట్ చేసానా" అని గట్టిగా అరిచింది.  కాగా ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు. వీరిద్దరు ఒకరి మీద ఒకరు నామినేషన్ వేస్కోవడం అనేది ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో ఇనయా మీద ఎక్కువ నామినేషన్స్ పడ్డాయనే చెప్పాలి. కాగా ఇనయా, ఆదిరెడ్డిల నామినేషన్ చాలా కామెడీగా మారింది. అయితే ఈ వారం వీరిద్దరిలో ఎవరు సేవ్ అవుతారో చూడాలి మరి.

గీతు, రోహిత్ మధ్య కన్ఫ్యూజన్..ఇనయాపై రేవంత్ పంతం!

బిగ్ బాస్ హౌస్ లో పోటాపోటీగా సాగిన నామినేషన్ల ప్రక్రియలో  గీతు హైలైట్ కాగా, రేవంత్ సూపర్ అనిపించుకున్నాడు. అయితే గీతు మాట్లాడిన మాటతీరుని అందరూ కామెంట్ చేస్తూ ఉండగా, మరికొందరు మాత్రం ఒకవేళ గీతు హౌస్ నుండి బయటకొస్తే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ గా ఏమీ ఉండదు అని అభిప్రాయపడుతున్నారు. కాగా నిన్న జరిగిన నామినేషన్లు వాడివేడిగా సాగాయి. గీతు, మెరీనాని నామినేట్ చేసింది. కారణం చెబుతూ, "నువ్వు నాకు డిజాస్టర్ ఇచ్చావ్. కానీ ఫిజికల్ గేమ్ లో నువ్వు ఆట సరిగ్గా ఆడలేదు. అది నాకు నచ్చలేదు" అని చెప్పింది గీతు. ఆ తర్వాత తన సెకండ్ నామినేషన్ గా గీతు, రోహిత్ ని నామినేట్ చేసింది. గీతు మాట్లాడుతూ, "యూ ఆర్ ఏ కన్‌ఫ్యూజియస్ క్యారెక్టర్, అసలు నువ్వు ఏంటో అర్థం కాలేదు నాకు. ఎంత అర్థం చేసుకుందామనుకున్నా నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు. నీ గేమ్ నాకు కనిపించట్లేదు. నీ ఎంటర్టైన్మెంట్ నాకు కనిపించట్లేదు" అని రోహిత్ ని నామినేట్ చేసింది. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ, "అభిప్రాయం అనేది ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఉంటుంది. నేను మీకు అర్థం కాకపోవడం అనేది మీ ప్రాబ్లమ్" అని అన్నాడు. కాగా గీతుకి, రోహిత్ కి మధ్య నామినేషన్ వేసాక, వీరిద్దరి ఎమోషన్ కాస్త కన్ఫ్యూజన్ గా మారి, వీరిద్దరికి మధ్యలో గొడవ ముదిరిందేమోనని అనిపిస్తోంది. ఆ తర్వాత రేవంత్, ఇనయాని నామినేట్ చేసాడు. "ఏకాభ్రిప్రాయం అంటే మన ఇద్దరం కలిసి అనుకోవాలి. నాతో ఇక్కడ ఓకే అనేసి, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్వడం. సూర్య వచ్చి నిన్ను ఓదార్చడం. అక్కడ ఎలా ఉంది అంటే, నేనేదో నీకు రావాల్సింది లాగేసుకున్నట్టుగా అనిపించింది. అందుకనే నిన్ను నామినేట్ చేస్తున్నాను" అని రేవంత్ చెప్పుకొచ్చాడు. అయితే రేవంత్ మాట్లాడేటప్పుడు, ఇనయా ఒకే మాటని పదే పదే అంటూ, గట్టిగా అరుస్తుండటంతో, "ఇనయా గారు మీ మాట వింటున్నాను. కాసేపు నెమ్మదిగా మాట్లాడండి" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత ఇనయా, " మీరు నన్ను అలా ఎలా అంటారు" అని అనగా, "మీరు ఆడిన డ్రామాల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత సూర్య గురించి అడుగగా, "మీరు సూర్య గురించి ఇక్కడ తీసుకురావలసిన అవసరమే లేదు" అని ఇనయా చెప్పింది.  రేవంత్, ఇనయాల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రేవంత్, ఇనయాని ఫేక్ అని చెప్పకనే చెప్పాడు. ఇనయా మాత్రం నా ఆటే అంత అన్నట్టుగా ధీమా కనబరుస్తోంది. అయితే రేవంత్, ఇనయా మీద చూపిన అగ్రెసివ్ చాలా కరెక్ట్ అని తెలుస్తోంది. అయితే ఎక్కువ నామినేషన్లు ఇనయాకి పడిన కారణంగా ఈ వారం ఇనయా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. 

కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ల యుద్ధం.. ఇది చూడటానికి ప్రేక్షకులంతా సిద్ధం!

బిగ్ బాస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండేది సోమవారం జరిగే నామినేషన్ల ప్రక్రియ అనే చెప్పాలి. ఒక్కో కంటెస్టెంట్ చెప్పే కారణాలు, దానికి ప్రతి సమాధానాలు ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తాయి. హీటెడ్ సీన్స్ మధ్య జరిగే ఈ ఎపిసోడ్ ని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తారు అనేది నిజం. "ఈ వారం ఒకరిని ఇంటి నుండి బయటకు పంపించడానికి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది" అని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కో కంటెస్టెంట్ మధ్య ఉత్కంఠ, టెన్షన్ మొదలయ్యాయి. అయితే నామినేషన్ల ప్రకియలో రేవంత్, కీర్తి భట్ ని నామినేట్ చేసాడు. "మొన్న జరిగిన వరెస్ట్ పర్ఫామర్ టాస్క్ లో  మీరు నన్ను 'ఛీ థూ' అన్నారు. అది నాకు నచ్చలేదు" అని రేవంత్ అన్నాడు. దానికి సమాధానంగా కీర్తి భట్ మాట్లాడుతూ, " ఛీ థూ అనేది కూడా తప్పు వర్డ్ ఆ" అని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, " నువ్వు ఫేక్. నీదంతా యాక్టింగ్" అని అన్నాడు. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ గా రేవంత్, ఇనయాని నామినేట్ చేసాడు. రేవంత్ మాట్లాడుతుండగా మధ్యలో ఇనయా మట్లాడింది. "నేను చెబుతున్నాను. ఇనయా గారు మీరు మధ్యలో మాట్లాడకండి" అని రేవంత్ అరిచాడు‌. ఆ తర్వాత ఆదిరెడ్డి, రేవంత్ ని నామినేట్ చేసాడు. నామినేషన్ కి గల కారణం చెబుతూ, "రేవంత్ కేపబులిటీ ఉన్న కంటెస్టెంట్. అతను అగ్రెసివ్. బెస్ట్ పర్ఫామర్. కాని మొన్న జరిగిన టాస్క్ లో మీరు తప్పు గా ఆడారు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా" అని ఆదిరెడ్డి చెప్పాడు. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ గా ఇనయాని చేసాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, " నాకు ఈ హౌస్ లో ఇనయా ఫేక్,  ఫేకస్య, ఫేకోభ్యహ " అని అనిపించారు  అని  చెప్పగా, ఇనయా మాట్లాడుతూ, "నీకలా అనిపించింది. కాని నేను నా గేమ్ ఆడాను. నా గేమ్ నా ఇష్టం" అని సమాధానమిచ్చింది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా పోటాపోటీగా జరిగింది. అయితే ఈ సారి  నామినేషన్లో రాజ్, వసంతి, శ్రీహాన్ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్  అందరు కూడా నామినేషన్లో ఉన్నారు. కాగా వీరిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకు వెళతారో చూడాలి మరి. ఈ నామినేషన్లు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి అనడంలో సందేహమే లేదని చెప్పాలి.

పరదేశి నువ్వు స్టెప్పులేస్తున్నావా..మట్టి తవ్వుతున్నావా

జబర్దస్త్ బుల్లితెర మీద అలరిస్తున్న బెస్ట్ కామెడీ షో. ఇక ఈ షోలో ఎంతో మంది జడ్జెస్ మారుతూ వచ్చారు. ఐతే కొన్ని వారాలుగా స్థిరంగా ఇంద్రజ, కమెడియన్ కృష్ణ భగవాన్ జడ్జెస్ గా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.  మధ్యలో కమెడియన్ పరదేశి స్టేజి పైకి వచ్చి.. "సూపర్ మచ్చి" పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో జడ్జి ఇంద్రజ అందుకుని "తవ్వకమే..తవ్వకం..ఒకటే తవ్వకం..ఏం తవ్వుతున్నారు" అని ఇంద్రజ అడిగేసరికి కృష్ణభగవాన్ మాత్రం  ‘అయినా బాగుంది’ అనేసరికి . దీంతో ఇంద్రజ.. “అంతకంటే వరస్ట్ గా ఈయన చేస్తారు కాబట్టి బాగుంది అంటున్నారు” అని కృష్ణభగవాన్ ని చూపిస్తూ కౌంటర్ వేసింది. తర్వాత నూకరాజు స్కిట్ లో ఇంద్రజ ఆటోలో వెళ్లే క్లిప్ చూపించారు. "అదేంటి అమ్మ ఆటోలో వెళ్తోంది" అని పరదేశి అనేసరికి "అడిగిన వాళ్లందరికీ అన్నీ ఇచ్చేస్తూ ఉంటే మరి డబ్బుల్లేక చివరికి  ఆటోలో వెళ్తున్నారు" అని అన్నాడు నూకరాజు. ఇల్లా ఈ వారం స్కిట్స్ అన్ని కూడా ఎంటర్టైన్ చేయబోతున్నాయి.

ఆవిడ డాన్స్ అలా ఉంటది మరి!

ప్రతీ వారం లానే ఈ వారం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో ఎంతో అలరించింది. ఈ వారం ‘బంగారం ఒకటి చెప్పనా’ అనే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ నడిచింది. ఇక  ఈ ఎపిసోడ్ లో "దేవత" సీరియల్ జోడి సుహాసిని, అర్జున్ అంబటి  స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వారం షోలో  స్టేజిపై కమెడియన్ హైపర్ ఆది హంగామా మామూలుగా లేదు. అన్నపూర్ణమ్మతో రష్మీ డాన్స్ చేయించింది. "నాయనమ్మ గారి డాన్స్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పటికైనా కలవాలనుందా ఆవిడతో" అని ఆది అడిగేసరికి "ఆవిడ డాన్స్ చూసాక ఎవరికైనా ఆవిడని కలవాలని అనిపిస్తుందా చెప్పు" అని కౌంటర్ వేశారు కృష్ణ భగవాన్.  తర్వాత ఆది ముగ్గురమ్మాయిలతో కలిసి ‘ఊ అంటావా మావ’ పాటకు అల్లు అర్జున్, సమంత వేసిన ఫ్లోర్ స్టెప్ చేయడానికి ట్రై చేశాడు. కానీ.. ఇద్దరమ్మాయిలతో ప్రయత్నించినా స్టెప్ వేయడంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఫుల్ ఎంటర్టైన్ చేసింది.   ఆ తర్వాత  కృష్ణ భగవాన్, ఆది అంతా కలిసి రిక్షా స్కిట్ వేశారు. అందులో పంచ్ ప్రసాద్ వేసిన డైలాగ్స్ మీద కృష్ణ భగవాన్ స్పందించారు. "ఎవరికీ సంబంధం లేని జోకులు వేస్తాడు, ఇక్కడే నవ్వే జోకులేస్తాడు.. ఎవరికీ అర్థం కానీ జోకులేస్తాడు.. మనకే అర్థమయ్యే జోకులేస్తాడు." అంటూ ప్రసాద్  కామెడీ మీద కౌంటర్ వేశారు. 

'సండే సెలబ్రిటీ డే' .. సూర్య చెప్పిన ఫ్లవర్స్? ఫైర్స్ ఎవరు? 

బిగ్ బాస్ హౌస్ రోజుకో ట్విస్ట్ లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే నిన్నటి దాకా టాస్క్ లు ఆడిన హౌస్ మేట్స్, ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేయడం మొదలుపెట్టాడు నాగార్జున. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఏమో అని హౌస్ మేట్స్ షాక్ లో ఉన్నారు. సండే ఫండే అంటు నాగార్జున సెలబ్రిటీ లను తీసుకొచ్చాడు. హీరోయిన్ 'ఫరియా అబ్దుల్లా',  హీరో 'సంతోష్'  స్టేజ్ మీదకి వచ్చారు. వీరిద్దరు కలిసి నటించిన మూవీ 'లైక్.. షేర్..కామెంట్..' మూవీ ట్రైలర్ బిగ్ బాస్ టీవిలో చూపించాడు నాగార్జున. ఆ తర్వాత ఫైరా, సంతోష్ తో కాసేపు కబుర్లు చెప్పాక , హౌస్ మేట్స్ ని సెలబ్రిటీలకు పరిచయం చేసాడు. ఇలా కాసేపటి తర్వాత గేమ్స్ జరిగాయి. ఆ గేమ్స్ లో నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇలా సాగిన ఆదివారం ఎపిసోడ్ కాస్త ఉత్కంఠభరితంగా సాగింది. సూర్య శనివారం ఎలిమినేట్ అయ్యాడు.‌కానీ తన 'ఏవీ' ని చూపించలేదు. దీంతో హౌస్ మేట్స్, ప్రేక్షకులు సూర్యని సీక్రెట్ రూం లో ఉంచారేమో అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సూర్యని మళ్ళీ స్జేజ్ మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత నాగార్జున సూర్యతో మాట్లాడుతూ, " ఏంటి సూర్య ఎలా అనిపించింది హౌస్ లో, ఇప్పుడు బయటకెళ్తున్నావ్ కదా. నీ బుజ్జమ్మ ని కలుస్తావ్. ఇక ఫుల్ హ్యాపీ ఆ " అని నాగార్జున అడుగగా, "అదేం లేదు సర్. ఇన్ని రోజులు హౌస్ మేట్స్ తో చాలా మెమోరీస్ ఉన్నాయి. సో మిస్ అవుతాను. 'హార్ట్ లిటిల్ బిట్ వేట్ ' ఉంది అని సూర్య చెప్పాడు. ఆ తర్వాత సూర్య 'ఏవి'ని చూపించాడు నాగార్జున. అది చూసి ఎమోషనల్ అయ్యడు సూర్య. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో టీవిలో మాట్లాడించాడు నాగార్జున. మొదటగా 'ఐ మిస్ యూ సూర్య' అని ఇనయా అంది. ఆ తర్వాత హౌస్ లో ప్లవర్స్ ఎవరు? ఫైర్స్ ఎవరు అని  నాగార్జున అడుగగా‌, " 'రేవంత్ ఫైర్ బ్రాండ్, అగ్రెసివ్, గేమ్ లాస్ అయిపోయినప్పుడు మాటలు జారకుండా చూసుకో ', 'గీతు పైర్, స్మార్ట్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అందరి చేత అడించాలనుకుంటావ్. నీ గేమ్ నువ్వు ఆడు', 'శ్రీహాన్ ఫైర్, కెప్టెన్సీ తర్వాత చిన్న చేంజ్ చూసాను. దానవల్ల కొంతమంది హర్ట్ అవుతున్నారు చూసుకో ',  'ఆదిత్య ఫైర్, గేమ్ ను గేమ్ లా చూడు. గేమ్ లో బీ అగ్రెసివ్ అన్న అని అనగా, ఐ మిస్ యూ ఏ లాట్' అని ఆదిత్య అన్నాడు. 'ఫైమా ఫ్లవర్ అనుకుంటున్నా' , ఫైమా గేమ్ వైజ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ తగ్గేదేలే" అని చెప్పుకొచ్చాడు. సూర్య , ఇనయాతో 'వి నీడ్ ఫైర్' అని అనగా, 'నీ గేమ్ కూడా కలిపి నేనే ఆడుతాను. సూర్య బాగున్నావ్. నువ్వు ఎల్లో వేసుకుంటావ్ అని గెస్ చేసాను. మిస్ యూ సూర్య." అని ఇనయా చెప్పింది. ఆ తర్వాత టైం అయిపోయింది అని సూర్యని బయటకు పంపించేసాడు నాగార్జున. ఇలా ఆదివారం ఎపిసోడ్ ఎన్నో ట్విస్ట్ లతో ఆకట్టుకుంది.

ఊడిపోయిన ఇమ్ము జుట్టుతో విల్లా కొన్న వర్ష!

జబర్దస్త్ మాదిరి గానే ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఆడియన్స్ ని కొంచెం ఎక్సట్రాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఈ వారం జడ్జెస్ గా ఖుష్బూ బదులు పోసాని కృష్ణమురళి జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ స్కిట్ కొంచెం ఫన్నీగా ఉంది. "ఇమ్మూ! నీకు జుట్టు లేదని ఫీల్ అవ్వకు" అని వర్ష అనేసరికి, "నా ఊడిపోయిన జుట్టుతో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కొంటోందండి" అని ఇమ్ము చెప్పాడు.  "నీ ఊడిపోయిన జుట్టుకు సామాన్లు కూడా వస్తాయా?" అని రష్మీ కౌంటర్ వేసింది. "ముందు పోయిన జుట్టుతో విల్లా కొన్నది తెలుసా!" అని ఇమ్ము రివర్స్ కౌంటర్ వేసాడు. తర్వాత గెటప్ శీను స్కిట్ లో విమానాలకు కూడా ఇంజిన్ ఆయిల్ మార్చే ఫన్నీ కాన్సెప్ట్ అందరికీ నవ్వు తెప్పించేదిగా ఉంది. ఇక ఫైనల్ గా నాటీ నరేష్ కి, మరో చైల్డ్ ఆర్టిస్ట్ కి పోసాని స్టేజి మీదకు వచ్చి చెరో రూ. 500 ఇచ్చి వాళ్ళను బ్లెస్ చేశారు. 

కన్నీళ్ళతో బయటకొచ్చిన సూర్య!

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉన్నంత సందడిగా, ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తుంటే ఉండదు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ చూసి అటు హౌస్ మేట్స్ తో పాటు, ఇటు ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అవుతారు. కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ‌ఒక ఎమోషనల్ డ్రామాగా కొనసాగింది. అయితే నిన్న మొన్నటి దాకా సూర్య టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేస్తూ, బెస్ట్ పర్ఫామర్ గా కొనసాగుతూ, బెస్ట్ పర్ఫామర్స్ లిస్ట్ లో టాప్-5 కంటెస్టెంట్ గా ఉంటాడని అందరు అనుకున్నారు.  అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ బిగ్ బాస్ సూర్యని ఎలిమినేట్ చేసాడు. అయితే ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రకియ అనేది ఒక్కో‌ కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ రాగా, ఈ సారి కాస్త భిన్నంగా కొనసాగింది. ఏంటంటే శనివారం రోజు నాగార్జున వచ్చి, "ఈ సారి ఒక్కో కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ రావడం అనేది లేదు. డైరెక్ట్ గా ఎలిమినేషన్ ఉంది" అని‌ బాంబు పేల్చాడు. దాంతో హౌస్‌మేట్స్ అందరు షాక్ అయ్యారు. ఆ తర్వాత సూర్య ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున చెప్పేసరికి అందరు ‌అవాక్కయ్యారు. ఎలిమినేషన్ తర్వాత ఫైమా, ఇనయా బాగా ఏడ్చేసారు. ఎందుకంటే సూర్య వీరికి బాగా దగ్గరయ్యాడు.  సూర్య హౌస్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు, ఇనయా మాట్లాడుతూ, "ఐ మిస్ యూ రా. ప్లీజ్ రా.. వెళ్ళకు రా" అని హగ్ చేసుకొని బాగా ఏడ్చేసింది. ఇది చూసి హౌస్‌మేట్స్ అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే శనివారం తన‌ ఏవీని చూపించలేదు. "సండే కలుద్దాం" అని చెప్పి వెళ్ళిపోయాడు నాగార్జున.  

నేనెవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లతో ముడిపెట్టేస్తున్నారు

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు.  బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన   కొత్తలో బాగానే కష్టపడ్డాడు సూర్య. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. తర్వాత ఫెమినిస్ట్ అని చెప్పి కొన్నిసార్లు ఆడవాళ్లకు సపోర్ట్ కూడా చేశాడు. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వచేసాడు. హౌస్ లోంచి వచ్చాక బీబీ కేఫ్ లో శివతో  ఇంటర్వ్యూ జరిగింది. ఇక ఇనయతో లవ్ ట్రాక్ గురించి అడిగి సూర్యని ఇరుకున పెట్టాడు శివ. ఇనయాను మోటివేట్‌ చేయడానికి తనతో ఎక్కువగా ఉన్నాను,  మాట్లాడాను అని సూర్య చెప్పాడు. మొదట్లో సురోహిగా, తర్వాత సునాయాగా ఆడావ్ అలా ఎందుకు సూర్యలా ఆడొచ్చు కదా అనేసరికి "నేనెవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లతో ముడిపెట్టేస్తున్నారు" అని బాధపడ్డాడు. మరి ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు అని కొన్ని మీమ్స్ చూపించాడు. బిగ్‌బాస్ హౌజ్ లో సూర్య స్టార్టింగ్ లో ఫెమినిస్ట్ అని చెప్పి ఆ తర్వాత అమ్మాయిలకి ఫ్రీ హగ్స్ ఇవ్వడం, ఇనయా లవ్ ట్రాక్ గురించి కొన్ని మీమ్స్ చూపించాడు శివ.  "మీమ్స్ చేసే  వాళ్ళు వంద చేస్తారు" అన్నాడు సూర్య. ఇవి అసలు పట్టించుకోను అని అన్నాడు.

'యూ ఆర్ బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌస్'!

  బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు కంటెస్టెంట్స్ అందరు గెలవడానికే ఆడతారు. కాగా ఇలాంటి టాస్క్ ఫిజికల్ గేమ్ అయితే, హౌస్ మేట్స్ కి కచ్చితంగా గొడవలు, తోపులాటలు జరుగుతుంటాయి. అయితే నిన్న మొన్నటి దాకా ఉత్కంఠభరితంగా సాగిన టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన ఫిజికల్ గొడవలు కాస్త హీటెడ్ వాతావరణాన్ని తలపించాయి. కాగా శనివారం నాగార్జున వచ్చి రాగానే ఒక్కో కంటెస్టెంట్  చేసిన తప్పులను చెబుతు, గట్టిగా తిట్టాడు. అయితే ఇందులో రేవంత్ గురించి "నువ్వు ఆటని ఒక యుద్ధంలాగా ఆడుతున్నావ్. నీకు ఒక వీడియో చూపిస్తా" అని వీడియో ప్లే చేసి అందరికి చూపించాడు నాగార్జున. ఆ వీడియోలో రేవంత్ టాస్క్ లో భాగంగా గీతుని, కీర్తి భట్ ని కిందకి తోసుకుంటూ వెళ్ళడం ఉంది. ఆ వీడియో చూపించిన తర్వాత నాగార్జున, " రేవంత్ ఎందుకు అంత అగ్రెసివ్ గా ఆడుతున్నావ్? ఒక ఉన్మాదిలాగా ఆడుతున్నావ్. ఒక అగ్ని పర్వతం లాగా కన్పిస్తున్నావ్. ఆట అంటే కసి ఉండొచ్చు గాని మరీ ఇతరులను నెట్టేసి వెళ్లి ఆడేంతనా!" అని అన్నాడు. తర్వాత ఒక వైపు పొగుడుతు, మరో వైపు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "గేమ్ లో అంతలా ఇన్వాల్వ్ అవ్వడం మంచిదే కాని ఎదుటివారిని గాయపరిచి, గెలిచేంతలా వద్దు" అని చెప్పాడు. "యూ ఆర్ బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. కాని గేమ్ లో అగ్రెసివ్ గా కాకుండా కూల్ గా, మైండ్ తో ఆలోచించి  చూడు. సరిపోతుంది " అని నాగార్జున చెప్పాడు. "ఒకే సర్. తప్పకుండా" అని రేవంత్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత "నువ్వు, టాస్క్ లో ఇనయా గేమ్ పట్ల చూపిన ప్రతిభ ఫెన్టాస్టిక్. రేవంత్ చేపలు తీసుకురాగా, ఇనయా ప్రొటెక్ట్ చేసే పద్దతి సూపర్ అసలు. నీ బుట్ట దగ్గరికి ఒక్కరు‌ కూడా రాలేదు" అని నాగార్జున పొగిడేసాడు ఇద్దరిని.

'నువ్వెవ‌రివి అంద‌రినీ ఆడేలా చేయ‌డానికి?'.. గీతుపై నాగార్జున ఫైర్!

  బిగ్ బాస్ హౌస్ లో ప్ర‌తి శనివారం నాగార్జున వచ్చి, టాస్క్ లో మంచిగా పర్ఫామెన్స్ చేసిన వారిని పొగిడి, వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారిని తిడతాడనేది అందరికి తెలిసిన విషయమే. కాగా వారం రోజులుగా తన ప్రవర్తనతో అటు హౌస్ మేట్స్ కి, ఇటు ప్రేక్షకులకు చిరాకు తెప్పించిన గీతుకి, నాగార్జున తన స్టైల్ లో గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.  ఆ తర్వాత ఆదిరెడ్డితో "బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ లు ఇవ్వండి, గుద్ది పడేస్తా అని అంది కదా గీతు. మరి  ఇప్పుడు ఏది, తను ఫిజికల్ టాస్క్ లో గుద్ది పడేయలేదే" అని అన్నాడు నాగార్జున. ఆదిరెడ్డిని తన ఆట తీరు గురించి రివ్యూ అడుగగా, గీతు మధ్యలో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించింది. దాంతో నాగార్జున కోపగించుకున్నాడు. "మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇలానే మధ్యలో వస్తావ్. ఇది వరకే చెప్పాను కదా నీకు మధ్యలో మాట్లాడకు అని, ఎప్పుడు ఇలానే చేస్తావ్"  అని గీతుపై, నాగార్జున సీరియస్ అయ్యాడు‌.   ఆ తర్వాత "గేమ్ వదిలెయ్. సంచాలక్ గా తన‌ ఆట తీరు ఎలా ఉంది?" అని నాగార్జున అడుగగా, "గేమ్ పర్లేదు సర్.  సంచాలక్ గా నాకు బాగా అనిపించలేదు" అని చెప్పాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత "బిగ్ బాస్ చరిత్రలో లేని  విధంగా నీ ఆటతీరు ఉంది. సంచాలక్ గా రూల్స్ బ్రేక్ చేసావ్. హౌస్ లో అందరిని నీ మాట తీరుతో బాధపెట్టావ్. నీకు కోపమొస్తే కామన్ సెన్స్ మర్చిపోతావా? ఇతరులను తక్కువ చేసి, వాళ్ళ  వీక్ నెస్ మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేసావ్" అని నాగార్జున అన్నాడు.  దానికి గీతు, " అవును సర్. టాస్క్ లో ఎలాగూ ఎంటర్టైన్మెంట్ లేదు కదా అని అందరిని గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాను. కావాలని రెచ్చగొట్టాను సర్" అని గీతు, నాగార్జునతో చెప్పుకొచ్చింది. "నువ్వు ఎవరివి, అందరినీ ఆడేలా చేయడానికి, ఎంటర్టైన్మెంట్ గురించి బిగ్ బాస్ చూసుకుంటాడు. నీ ఆట నువ్వు ఆడు. అది చూసుకోకుండా ఇలా చేసినందుకే లీస్ట్ లో ఉన్నావ్. నీ ఆట పీత ఆట. అది కూడా అంతే. ఒక పీత పైకి వెళ్తు ఉంటే మరొక పీత వెన క్కి లాగుతూ ఉంటుంది. కాకపోతే అది కూడా వెనకే ఉంటుంది నీలాగా" అని నాగార్జున చెప్పుకొచ్చాడు. "నీ అట తీరు, మాట తీరు చేంజ్ కావాలి. హౌస్ లో ఉండాలంటే ఆ పని చెయ్యను, ఈ పని చెయ్యను అంటే కుదరదు. సంచాలక్ గా ఫెయిల్ అయ్యావ్. దీనికి పనిష్మెంట్ కచ్చితంగా ఉండాలి" అని కెప్టెన్ అయిన శ్రీహాన్ ని నాగార్జున చెప్పమన్నాడు. శ్రీహాన్ కిచెన్ విజిల్స్ క్లీన్ చెయ్యమన్నాడు. దానికి "సర్.. నేను అది కాకుండా ఏదైనా చేస్తా" అని గీతు అనగా బాత్రూమ్స్ క్లీన్ చెయ్యమని నాగార్జున చెప్పగా గీతు ఒప్పుకుంది.  ఎట్టకేలకు గీతుకి మంచి కౌంటర్ అయితే గట్టిగానే పడింది. నాగార్జున మాట విని హౌస్ లో ఇకనైనా తన ఆట‌తీరు, మాటతీరు మార్చుకొని, హౌస్ లో బెస్ట్ పర్ఫామర్ గా ఉంటుందో? లేక వరెస్ట్ పర్ఫామర్ గా ఉంటుందో? చూడాలి.

శ్రీహాన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్ గా ఎన్నికయిన శ్రీహాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి దాకా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఎవరి పర్ఫామెన్స్ వాళ్ళు ఇచ్చారు. అందులో ఒక్కొక్కరిని తప్పిస్తూ చివరికి కీర్తి భట్, సూర్య, శ్రీహాన్ మిగలాగా శ్రీహాన్ ని హౌస్ మేట్స్ కెప్టెన్ గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే "హౌస్ లో వరెస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పి, ఎవరిని జైలుకి పంపించాలనుకుంటున్నావో చెప్పు" అని బిగ్ బాస్, శ్రీహాన్ ‌ని అడుగగా, దానికి సమాధానంగా, "ఆదిత్యను వరెస్ట్ పర్ఫామర్ అని అనుకుంటున్నాను" అని బిగ్ బాస్ తో చెప్పాడు. అయితే దీనికి శ్రీహాన్ ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా జరిగిన చేపల టాస్క్ లో శ్రీసత్య, శ్రీహాన్ ఒక జట్టుగా ఉన్నారు. అయితే వారి బుట్టలోని చేపలను కాపాడే ప్రయత్నంలో ఉండగా, బాలాదిత్య వచ్చి వారి చేపలు లాక్కునే ప్రయత్నం చేసాడు. ఈ లాక్కునే ప్రయత్నంలో ఆదిత్య కొన్ని మాటలు శ్రీసత్య తో జారాడు అని శ్రీహాన్ ఆరోపించాడు. కానీ అది తప్పు డెసిషన్. ఎందుకంటే ఒక గేమ్ ఆడేటప్పుడు ఎమోషన్స్ అనేవి కామన్, ఆ టైంలో ఒక్కసారి మాటలు జారుతుంటాయి. అసలు విషయం శ్రీసత్యకి, ఆదిత్యకి జరిగింది కానీ శ్రీహాన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీహాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆదిత్య తన గేమ్ తను ఆడటం కూడా తప్పేనా అని శ్రీహాన్ ని విమర్శిస్తున్నారు. కాగా హౌస్ లో కొత్తగా కెప్టెన్ అయిన తర్వాత శ్రీహాన్ తీసుకున్న తొలి నిర్ణయం తప్పు అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

హ్యాపీ బర్త్ డే అద్విత.. ఇది చాలు బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడే బిగ్ బాస్ ని ప్రేక్షకులు  ఎక్కువగా వీక్షిస్తున్నారు. అందుకనే హౌస్ లో ప్రతి ఒక్కరికి సర్ ప్రైజ్ ఇవ్వడంలో బిగ్ బాస్ సాటి ఎవరు రారు అనే చెప్పాలి. బిగ్ బాస్ గత వారం జరిగిన ఫ్యామిలీ టాస్క్ లో భాగంగా అందరి ఫ్యామిలీలకు దగ్గరికి చేసి వారిలో ఉన్న ఎమోషన్స్ ని బయటపెట్టాడు. ఇలా ఎవరో ఒకరికి ఏదో ఒకటి సర్ ప్రైజ్ ఇస్తూ వస్తోన్నాడు బిగ్ బాస్. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేహా చౌదరికి తన పుట్టినరోజు నాడు సర్ ప్రైజ్ ఇవ్వగా, శ్రీహాన్ కి మాత్రం పుట్టినరోజు రోజుకి ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. దీంతో హౌస్ మేట్స్  బర్త్ డే సెలబ్రేట్ చేసారు. కాగా ఆదిరెడ్డి కూతురు బర్త్ డే ఉండడంతో ఆదిరెడ్డి గత వారం బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసుకున్నాడు. తన "నా కూతురు పుట్టిన రోజున తనని వీడియోలో చూడాలనుకుంటున్నా, తన బర్త్ డే సెలబ్రేషన్స్ మిస్ అవ్వొద్దు" అని ఆదిరెడ్డి, బిగ్ బాస్ ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాడు. కాగా నిన్న ఆదిరెడ్డి కూతురు పుట్టినరోజు కావడంతో, పాపతో కేక్ కట్ చేయించిన వీడియోని బిగ్ బాస్ టీవీలో చూపించాడు. ఈ వీడియోలో తన భార్య కవిత మాట్లాడుతూ, "మన కూతురు మొదటి పుట్టిన రోజున ఒక తండ్రిగా, నువ్వు పక్కన ఉండాలి‌. కానీ నువు బిగ్ బాస్ వెళ్ళావ్. అందులోకి వెళ్ళింది ఆమె కోసమే కదా, ఐ యామ్ హ్యాపీ" అని చెప్పింది‌. ఆ తర్వాత పాపతో కేక్ కట్ చేపించి, నీ బ్లెస్సింగ్స్ పాపకి ఎప్పుడు ఉండాలి అని చెప్పి దీవించమంది. ఆ తర్వాత ఆదిరెడ్డి మాట్లాడుతూ, "హ్యాపీ బర్త్ డే అద్విత. థాంక్స్ బిగ్ బాస్. థాంక్స్ కవిత. ఇది చాలు బిగ్ బాస్. మీకు ఋణపడి ఉంటాను" అని ఆదిరెడ్డి అనగానే హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా ఆదిరెడ్డి ని హగ్ చేసుకొని హ్యాపీ బర్త్ డే అద్విత అంటు విషెస్ చెప్పారు. ఇది నిన్నటి ఎపిసోడ్‌లో హైలైట్ గా నిలిచింది.

బెంజ్ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ హమీద

దుబాయ్ బ్యూటీ, బిగ్ బాస్ కంటెస్టెంట్ హమీద తన హ్యాపీనెస్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. హమీద సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని, క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్‌బాస్‌ 5  లో కంటెస్టెంట్స్ యాంకర్ రవి, హమీద, శ్రీరామ్ ఇలా ఒక గ్యాంగ్ లా ఉండేవారు. ఇక హౌస్ లో సింగర్‌ శ్రీరామ్‌, హమీదకు మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా నడిచింది.  దీపావళి సందర్భంగా హమీద ఖరీదైన కొత్త బెంజ్‌ కారు కొనుక్కుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది హమీద. ఈ ఫోటోల్లో చూస్తే హమీద కుటుంబ సభ్యులతో పాటు యాంకర్‌ రవి ఫ్యామిలీ కూడా ఉంది. కారు కొన్న తర్వాత వీరంతా డ్రైవ్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్‌ చేసింది. ఈ సందర్భంగా రవి.. కారు ఫోటో, వీడియోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. "వెల్‌కమ్‌ ది  బీస్ట్‌.. కంగ్రాట్యూలేషన్స్‌ హమీలు.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. నీ న్యూ ప్రాజెక్ట్‌ కు  ఆల్‌ ది బెస్ట్‌. జాగ్రత్తగా డ్రైవ్‌ చేయ్‌" అంటూ పోస్ట్‌ చేశాడు.  హమీద కారు కొనడంపై సింగర్‌ శ్రీరామచంద్ర  కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టేసరికి  అందుకు హమీద.. థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే యాని మాస్టర్, అరియనా గ్లోరీ, యాంకర్ శివ ఇలా అందరూ హమీదకి విషెస్ చెప్పారు. ఏదేమైనా ఈ ఏడాది బుల్లితెర, బిగ్ బాస్ స్టార్స్ చాలా మంది రకరకాల కార్లను కొనుక్కున్నారు.

ఓటీటీలోకి అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్

ఓటీటీలో తిరుగులేని రారాజుగా నిలబడడానికి 'ఆహా' వ్యూహాత్మకంగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. సింగింగ్ షో నిర్వహించింది, అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో, డాన్స్ షో ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తోంది.. ఇక ఇప్పుడు కామెడీ షోతో ఎంట్రీ ఇవ్వబోతోంది.  టాప్ స్టార్స్ అంతా కూడా హోస్ట్స్ గా, జడ్జెస్ గా బుల్లి తెర మీద కనిపిస్తూ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి బుల్లి తెర మీద తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షోకి జడ్జిగా ఉన్నారు. ఇక ఇప్పుడు  'కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌' పేరుతో ఓ కామెడీ షో ద్వారా ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ షోకి జబర్ధస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాడు.   అనిల్  రావిపూడి స్టైలిష్ లుక్ తో చేతిలో సూట్ కేస్ తీసుకుని  'అరె.. స్టాక్స్ దుమ్ము లేపడానికి అందరూ రెడీగా ఉండడి.. బొమ్మ దద్దరిల్లిపోద్ది' అని చెప్తూ ఎంట్రీ ఇచ్చాడు. అందరినీ అలరించే కామెడీ షో  'కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌' నవంబర్ నుంచి మొదలుకానుంది. ఈ షోని  ఎస్‌ఓఎల్‌ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈ షో నిర్వాహకులు తెలిపారు. ఐతే కామెడీ చిత్రాలతో అలరించే అనిల్ రావిపూడి బుల్లితెరపై ఎలా నవ్విస్తారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.