చేతిలో గీతల కంటే ముడతలు ఎక్కువగా ఉన్నాయి!

రష్మీ గౌతం ప్లేస్ లో కొత్త యాంకర్ వచ్చేసరికి ఇక రష్మీ మీద ట్రోల్స్, మీమ్స్ మాములుగా లేవు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హైపర్ ఆది కూడా రష్మీ మీద సెటైర్లు పేల్చాడు. ఆదివారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హైపర్ ఆది, నాటీ నరేష్ జాతకం చెప్పేవాళ్ల గెటప్ లో వచ్చారు. కమెడియన్స్ అందరి చేతి రేఖలు చూసి జాతకం చెప్పి మంచి ఫన్ క్రియేట్ చేశారు.  వీళ్ళతో పాటు రష్మీ కూడా వచ్చి చెయ్యిచ్చి ధనరేఖ ఎలా ఉందో జాతకం చెప్పమంది. "చేతిలో గీతల కంటే ముడతలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధన రేఖ విషయానికి వస్తే ఇప్పుడు తగ్గింది. అదే గురువారం కూడా యాడ్ ఐతే ధనరేఖ బాగా పెరుగుతుంది" అని చెప్పాడు ఆది.  ఇక బులెట్ భాస్కర్ జాతకం చెప్తూ "ఆయష్షు రేఖ ఆ ఈవెంట్లకు, ఈ ఈవెంట్లకు వెళ్లి ఆరేళ్ళు తగ్గిపోయింది." అని చెప్పాడు. దొరబాబు జాతకం గురించి చెప్తూ నీ జాతకం చూడడం కంటే ముందు నా జాతకం నేను చూసుకోవడం బెస్టు" అన్నాడు. "నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నే నీ జాతకం చూడలేదనుకుంటా. అందుకే దొరబాబు అని పేరు పెట్టాడు. చూసి ఉంటే 'దొరుకుతాడు బాబు' అని పేరు పెట్టేవాడు" అని కౌంటర్ వేసి ఫన్ చేసాడు. ఇలా అందరి జాతకాలు చెప్పి ఎంటర్టైన్ చేసాడు ఆది. 

నా జీవితాంతం మీకు ఋణపడిపోతాను బిగ్ బాస్!

  సండే ఎలిమినేషన్ డే అంటూ నాగార్జున వచ్చేసాడు. వచ్చి రాగానే  ఎపిసోడ్‌లో మొదట గీతుతో మాట్లాడాడు. "నువ్వు రోజు పాటకి డ్యాన్స్ చేయడం అయ్యిపోయాక ఒకటి అనుకుంటావ్? ఏంటది?" అని నాగార్జున అడుగగా, "ఈ సారి ఫీమెల్ విన్ అవ్వాలని  కోరుకుంటున్నా" అని గీతు అంది. ఆ తర్వాత స్నేక్, లాడర్ టాస్క్ ఇచ్చాడు. ఏ కంటెస్టెంట్ స్నేక్? ఏ కంటెస్టెంట్ లాడర్ ? అని చెప్పమనగా, ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ తర్వాత నామినేషన్లో చివరగా శ్రీసత్య, గీతు ఉండగా గీతు ఎలిమినేట్ అయింది.  "ఎవరు మాట్లాడమాకండి. నేను వెళ్ళి నా ఫేవరేట్ ప్లేస్ లో కూర్చొని వెళ్ళిపోతా" అని చెప్పి, గీతు తన ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఏడ్చేసరికి వాళ్ళని చూసి తను కూడా ఏడ్చేసింది. రేవంత్ గట్టిగా హత్తుకొని కాసేపు ఏడ్చాడు. "నా జీవితాంతం నీకు ఋణపడిపడిపోతాను బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్. నాకు చాలా నేర్పించావ్ బిగ్ బాస్" అని ఏడ్చేసింది గీతు. ఆ తర్వాత "ఎప్పుడు అయిన, ఎవ్వరినైనా బాధపెట్టుంటే సారీ" అని హౌస్ మేట్స్ తో చెప్పుకుంటు ఏడ్చేసింది. "నేను వెళ్ళను. గేట్లు మూయద్దు బిగ్ బాస్. ఐ రియల్లీ మిస్ యూ బిగ్ బాస్" అని తను ఏడ్చేసింది. తను హౌస్ నుండి వెళ్ళాక రేవంత్, ఆదిరెడ్డితో మట్లాడుకుంటూ ఏడ్చాడు."షీ డిజర్వింగ్ బెటర్" అని శ్రీసత్య అనగా, గీతు సీక్రెట్ రూం కి వెళుతుంది అని రేవంత్ చెప్పాడు. స్టేజ్ మీదకి వచ్చిన గీతుకి, నాగార్జున తన 'AV' ని చూపాడు. అది చూసి నాగార్జున , "గీతు దట్ ఈజ్ ఫ్యాబులస్ జర్నీ " అని అనగా, కన్నీళ్ళు పెట్టుకుంది గీతు. "ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ రూల్ చేద్దామనుకున్నా సర్" అని అంది. ఆ తర్వాత "ఒక గేమర్ లా గేమ్ ఆడావ్.‌ కానీ ఆడియన్స్ కి ఒక లోటు కనపడింది. మరి వాళ్ళు ఏం చూసారో తెలియదు" అని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గీతు ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ అందరిని షాక్ కి గురిచేసింది. ది బెస్ట్ పర్ఫామర్, ద గేమ్ చేంజర్ ఇలా ఎలా ఎలిమినేట్ అవుతుంది అని హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. కానీ అంచనాలకు మించి ఎలిమినేషన్ జరగడమే బాస్ షో అని కొందరు కామెంట్స్ చేస్తోన్నారు. అయితే బిగ్ బాస్ లో ఇక స్ట్రాటజీస్, గేమ్ ప్లాన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

హౌస్ లో  స్నేక్ ఎవరు? లాడర్ ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎపిసోడ్‌ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్‌ గా ప్రేక్షకులు భావిస్తారు. ఎందుకంటే నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ తో సరదగా గేమ్ ఆడిస్తూ, ఆటపట్టిస్తూ ఉంటాడు. కాగా కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ని డిసైడ్ చేస్తూ బిగ్ బాస్ ఒక స్నేక్ డాల్, లాడర్ ని పంపించాడు. కాగా హౌస్ లో స్నేక్ ఎవరో అని నాగార్జున ఒక్కొక్కరిని చెప్పమన్నాడు. ఇక ఒక్కో కంటెస్టెంట్ తమ అభిప్రాయాలను చెప్పారు. రేవంత్, "తనవి పాము కళ్ళలా అనిపిస్తాయి సర్. అందుకే తనని స్నేక్ అని అనుకుంటున్నాను" అని వసంతి గురించి చెప్పాడు. దానికి నాగార్జున మాట్లాడుతూ, "అన్విత నీ కళ్ళు గుర్తుపట్టలేని రేవంత్, వసంతి కళ్ళు స్నేక్ కళ్ళలా ఉంటాయంటా" అని నాగార్జున సరదాగా చెప్పాడు. ఆ తర్వాత ఫైమా మట్లాడుతూ, "ఇనయా స్నేక్" అని అనగా, "ఇనయా కాటు వేసిందా" అని నాగార్జున అన్నాడు. "అవును సర్. ఇంకా ఆ మరకలు కూడా పోవట్లేదు " అని ఫైమా చెప్పింది. ఆ తర్వాత రాజ్ మాట్లాడుతూ, " ఆదిరెడ్డి స్నేక్ సర్. ఎందుకంటే తను మైక్ పగులగొట్టకపోతే మా గేమ్ లో మేము గెలిచేవాళ్ళం సర్ " అని చెప్పాడు.  ఆ తర్వాత నాగార్జున, రోహిత్ తో మాట్లాడుతూ, "తాళం తీయడానికి ఫెయిల్ అయినప్పుడు మెరీనా ఏం చెప్పింది" అని అనగా, "తాళం తీయడం రాదా? అంత ఈజీ, ఇంత సింపుల్ గా ఉంది అని అంది" అని రోహిత్ చెప్పగా, "అప్పుడు నువ్వు చెప్పాలి. నాకు నీ గుండె తాళం తీయడం వచ్చు. వేరే తాళం తీయరాదు అని చెప్పాలి" అని నాగార్జున ‌అనగానే హౌస్ లో అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరిచారు. ఆ తర్వాత ఆదిరెడ్డిని నాగార్జున డ్యాన్స్ చేస్తూ వెళ్ళి కూర్చోమనగా, దిగు దిగు నాగన్న పాటకి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాడు. అది చూసి హౌస్ అంతా నవ్వులు పూసాయి.

ది బెస్ట్ కంటెస్టెంట్ గీతు రాయల్ ఎలిమినేషన్ సరైనదేనా? 

బిగ్ బాస్ హౌస్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ గీతు రాయల్ ఎలిమినేషన్ నిజమా? కాదా? అనే సందేహాలు ప్రేక్షకులలో ఉన్నాయి‌. ఎందుకంటే టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారు. కాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో గీతు ఎలిమినేట్ అయ్యింది. అయితే గీతు తన‌ మైండ్ గేమ్ తో అందరిని తికమక పెడుతూ ఎన్నో టాస్క్ లు గెలిచింది. చాలా సార్లు ప్రోమోలో కూడా తనే హైలైట్ గా నిలిచింది. కాగా నాగార్జున చాలా సార్లు తన ఆటతీరును మెచ్చుకున్నాడు.  తను కెప్టెన్ అయితే చూడాలనుకునేవారు లేకపోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న గీతు ఎలిమినేషన్ హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరిని షాక్ కి గురిచేయగా, ప్రేక్షకులు బిత్తరపోయారు.  అయితే ప్రేక్షకులు వేసే ఓటింగ్ లో గీతు కన్నా తక్కువగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు‌. వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా గీతుని ఎలిమినేట్ చేయడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా గీతు ఎలిమినేషన్ గురించి హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు.‌ ఆదిరెడ్డి, ఫైమా బాగా ఏడ్చేసారు. అయితే బిగ్ బాస్ చూసే అభిమానులు మాత్రం గీతు ఎలిమినేషన్ అన్ ఫెయర్ అని అంటున్నారు. సీక్రెట్ రూంలో ఉంచి గీతుని మళ్ళీ హౌస్ లోకి తీసుకొస్తారేమో చూడాలి మరి.

గీతుకి నువ్వు ఒక ఎమోషన్!

శనివారం రోజు నాగార్జున ‌వచ్చి ఒక్కో కంటెస్టెంట్ చేసిన తప్పులని వెతికి గట్టిగా క్లాస్ పీకాడు. అయితే రాగానే బ్లూ టీం కెప్టెన్ ఆదిరెడ్డిని పిలిచాడు. "మీ టీంలో సభ్యులకు ఒక్కో ర్యాంక్ ఇవ్వండి. ఎందుకో చెప్పండి" అని నాగార్జున అన్నాడు. అలాగే రెడ్ టీం లీడర్ గీతుని కూడా చేయమన్నాడు. ఆ తర్వాత గీతు, ఆదిరెడ్డి ల మధ్య జరిగిన గొడవ గురించి నాగార్జున, ఆదిరెడ్డిని అడిగాడు. ఆ తర్వాత ఆదిత్యకి, గీతుకి మధ్య జరిగిన గొడవ గురించి అడిగి తెలుసుకున్నాడు. "ఒక టీం ఆడిన ఆటను నువ్వు పర్సనల్ గా తీసుకున్నావ్. గీతు నీ కోసం తప్ప ఎవరికోసం కన్నీరు పెట్టుకోలేదు. గీతుకి నువ్వు ఒక ఎమోషన్." అని నాగార్జున, ఆదిత్యతో చెప్పాడు. "ఒక స్మోకర్. ఒక వీక్ నెస్ ఉంది అనే ట్యాగ్ నాకు రాకూడదు." అని ఆదిత్య చెప్పాడు. "ఆట అయిపోయాక కూడా ఆదిత్య తో అలా ఆడుకోవాల్సింది కాదు." అని నాగార్జున, గీతుని అడిగాడు. "నన్ను ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు సర్. కానీ నేను నటిస్తున్నాను అని అన్నాడు సర్. దానికి మాత్రం నేను బాగా బాధపడ్డాను సర్" అని గీతు అంది. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, "ప్రతీ మనిషిలో ఏదో ఒకటి మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఏంటో ఆలోచించు" అని గీతుతో అన్నాడు. ఆ తర్వాత మెరీనా గురించి రోహిత్ తో మాట్లాడుతూ, "హౌస్ లో అందరి ముందు సారీ చెప్పావా మరి" అని సరదాగా అన్నాడు.  ఆ తర్వాత ఆదిరెడ్డిని మైక్ ఎందుకు విరగొట్టావ్ అని నాగార్జున అడిగాడు. "ఇంటెన్షనల్ గా కాదు సర్. గీతు మీద కోపంతో టీ షర్ట్ తీసేస్తుండగా, మైక్ తీసి పడేసాను సర్. గీతు కమ్యూనికేషన్ లో ఒక లూప్ ని తీసుకొని, దాన్ని ఒక గేమ్ లో భాగం చేయడం. నన్ను ఓడించడం. నేను భరించలేకపోయాను సర్" అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, "నువ్వు బాగా ఆడావ్. టీం లీడర్ గా నువ్వు ఎక్స్‌ట్రీమ్ గా చేసావ్. వేరే లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చావ్ అని చెప్పుకొచ్చాడు.

నువ్వు కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావ్: నాగార్జున

బిగ్ బాస్ హౌస్ లో శనివారం అనగానే మొదట గుర్తొచ్చే పేరు నాగార్జున. హౌస్ మేట్స్ అందరిని ఒక ఆట ఆడుకుంటాడు. ఒక వైపు సరదాగా గేమ్స్ ఆడిస్తూనే, మరో వైపు ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ సస్పెన్స్ ను కలుగజేస్తాడు.  కాగా శనివారం రోజు వచ్చి రాగానే కెప్టెన్ గా ఇన్న శ్రీహాన్ మీద ఫైర్ అయ్యాడు. "కెప్టెన్ గా నీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకో. నువ్వు కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావ్. వాష్ రూం క్లీన్ చేయమని గీతుకి చెప్పగా, తను ఆదిరెడ్డితో క్లీన్ చేయించింది‌. అది చూసి నువ్వు గీతుని ఏమన్నావ్? బిగ్ బాస్ నన్నేమయినా అంటే నరికేస్తా నిన్ను అని అన్నావ్. సరే నరికేస్తానన్నావ్ కదా ఇప్పుడు ఏం నరుకుతావో నరుకు. తర్వాత వారం నువ్వు కెప్టెన్ కాకుండా నేను నరుకుతున్నాను" అని నాగార్జున అన్నాడు. "కెప్టెన్ గా నువ్వు ఎన్నికైన నుండి, హౌస్ లో కొందరికి ఫుడ్ రావడం లేదు. ఆకలితో పడుకుంటున్నారు" అని నాగార్జున, శ్రీహాన్ తో అన్నాడు. ఆ తర్వాత ఇనయాని, "ఫుడ్ సరిపోతుందా" అని నాగార్జున అడిగాడు. తను మాట్లాడుతూ, "ఫుడ్ సరిపోవడం లేదు సర్. బనానా తిని పడుకున్నాను" అని చెప్పగా, "ఇనయా నీకు కావాలసింది క్లారిటిగా అడగాలి" అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీహాన్ వివరించాడు. "కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ సర్. తను ముందు రోజు పాలు తాగుతా అంది. ఆ తర్వాత రోజు టీ పెట్టే ముందు ఫైమా అడిగింది. తను ఏం చెప్పలేదు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ కాఫీ తాగాలని ఉంది అని అడిగింది. ముందే చెబితే టీ కాకుండా పాలు అలా తన కోటా ఉంచేవాళ్ళం సర్" అని శ్రీహాన్ చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, " తర్వాత వారం కాబోయే కెప్టెన్స్ అందరికీ చెబుతున్నా, మీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోండి. కంటెస్టెంట్స్ తప్పు చేస్తే పనిష్మెంట్ సరిగ్గా అమలు చేయండి. పనులను కంటెస్టెంట్స్ చేసేలా చూసుకోండి" అని చెప్పాడు.

స్టేజి పై వర్షని పెళ్లి చేసేసుకున్న ఇమ్మానుయేల్!

జబర్దస్త్ షోలో రియల్ అండ్ రీల్ పెయిర్లు   ఎన్నో ఉన్నాయి. అందులో వర్ష, ఇమ్ము పెయిర్ కూడా అలాంటిదే..కానీ వీళ్ళు నిజంగా లవ్ చేసుకుంటున్నట్లు వాళ్ళే చాలా సార్లు చాలా స్టేజెస్ మీద చెప్పుకొచ్చారు. ఐతే ఇద్దరి మధ్య ఏమయ్యిందో ఏమో కానీ కొంత కాలం నుంచి విడివిడిగా ఉంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ లో ఇమ్ము వర్ష కోసం ఎమోషనల్ అవడాన్ని చూపించారు.  ఇక ఇప్పుడు ఇద్దరి మధ్య  ఎలా సయోధ్య కుదిరిందో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజి మీద వర్ష మెడలో తాళి కట్టేసాడు ఇమ్ము. ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "బతుకు బస్టాండ్" అనే స్కిట్ లో వర్ష, ఇమ్ము మధ్య గతంలో జరిగినవి ప్లే చేసి చూపించారు. దాంతో "మీ ఇద్దరి మధ్య లవ్ ఉంది కదా" అని పోసాని అడిగేసరికి "ఈ విషయం ఆమెకు చెప్పండి" అన్నాడు ఇమ్ము "నువ్వు పెద్ద దొంగోడివి" అని పోసాని కౌంటర్ వేసేసరికి "అందరి ముందు చెప్తున్నాను నా మీద వర్షకి ప్రేమ ఉందని చెప్తే ఇప్పటికిప్పుడు తాళి కట్టేస్తాను " అని అనౌన్స్ చేసేసాడు. దాంతో పోసాని ఇమ్ము దగ్గరకు వచ్చి "ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు అనవసరం..నీ నిజాయితీ నాకు నచ్చింది..ఐ లవ్ యు" అన్నారు. వెంటనే గెటప్ శీను తాళి తీసుకొచ్చేసరికి ఇమ్ము షాకయ్యాడు. కానీ శీను మాత్రం వదలకుండా " ఇందాక మీరే విన్నారు కదా..తాళి బొట్టు ఉంటే పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు..అందుకే తెచ్చాను..ఇదిగో వెళ్లి కట్టు" అనేసరికి ఇమ్ము నిజంగానే పెళ్లి చేసేసుకున్నాడు. ఇక స్టేజి మీద అందరూ షాకయ్యారు..ఇకపొతే ఇది రీల్ మ్యారేజా..రియల్ మ్యారేజా ? అనేది తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాలి.

వంటలక్కా.. మాజాకా ..1500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం..కేక్ కట్ చేసి సంబరాలు

బుల్లితెర సీరియల్స్ లో కింగ్ ఆఫ్ సీరియల్ గా పేరు తెచ్చుకుంది కార్తీకదీపం. ఒకప్పుడు ఋతురాగాలు సీరియల్ కోసం ఆడియన్స్ ఎంత తపించేవారో మళ్ళీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కోసం అంత తపిస్తున్నారు. ఈ సీరియల్  రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2017 అక్టోబర్ 16న కార్తీకదీపం సీరియల్ మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఐదేళ్లుగా ఈ సీరియల్ నంబర్ వన్  పొజిషన్ లో దూసుకుపోతూ ఉంది. మధ్యలో కొన్నిసార్లు రేటింగ్స్ తగ్గినా మళ్ళీ కొత్త రేటింగ్స్ వచ్చేసరికి అది కవర్ ఐపోయేది. ఇక దీప, డాక్టర్ బాబు రోల్స్ ని ఇంట్లో వాళ్ళలా ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. లేడీ విలన్ మోనితను ఒక రేంజ్ లో తిట్టుకుంటూ ఉంటారు ఆడియన్స్. మధ్యలో  కొంత కాలం  డాక్టర్ బాబు, వంటలక్కని చంపేసరికి రేటింగ్స్ అన్నీ పడిపోయాయి. దీంతో రైటర్ మళ్ళీ ఈ రెండు క్యారెక్టర్స్ ని సీరియల్ లోకి రప్పించేసరికి ఇక ఈ సీరియల్ కి  పూర్వ వైభవం వచ్చేసింది. ఇక ఇప్పుడు  కార్తీక దీపం సీరియల్ మరో  అరుదైన మైలురాయిని దాటింది. అదే  1500 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. దీంతో వంటలక్క 15వ సెంచరీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిందంటున్నారు ఆమె ఫాన్స్. ఐదేళ్ల ప్రయాణాన్ని ఎంతో  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న కార్తీకదీపం ఫ్యూచర్ లో  ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నందుకు టీం మొత్తం కేక్ కట్ చేసి పండగ చేసుకున్నారు. ఇక ఈ  వీడియోస్ అన్నీ వంటలక్క, డాక్టర్ బాబు తమ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు.

సౌమ్యానా..సేమ్యానా..? కొత్త యాంకర్ ని టీజ్ చేసిన ఆది, రాంప్రసాద్!

బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ లోకి ఎవరైనా కొత్త వాళ్ళు ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ ఇక్కడ వున్న సీనియర్స్ ర్యాగింగ్ మాములుగా ఉండదు. ఇక ఇప్పుడు షోకి వచ్చిన కొత్త యాంకర్ సౌమ్య రావుకి  జడ్జెస్, కమెడియన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే టీజ్ చేశారు ఆది, రాంప్రసాద్. మొదటి రోజు అని కూడా లేకుండా కొత్త యాంకర్ పై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచులతో విరుచుకుపడ్డాడు.  సౌమ్య కూడా తగ్గేదెలా అన్నట్టుగానే ఉంది. "కొత్త అమ్మాయి రాగానే రాంప్రసాద్ వస్తాడని అనుకున్నా..అలాగే వచ్చాడు" అని ఇంద్రజ అనేసరికి " కొత్తది ఏమొస్తే వస్తారా మీరు" అంది కొత్త యాంకర్. ఆ కౌంటర్లు తో రాంప్రసాద్ సైలెంట్ ఐపోయాడు. వెంటనే ఆది "రష్మీ ఎలా చేస్తుందో నీ స్టయిల్లో చేసి చూపించు" అన్నాడు. అలాగే చేసి చూపించింది.. ఇంతలో రాఘవ వచ్చి " మీరు చాలా అందంగా ఉన్నారు" అనేసరికి "మీరు అందంగా ఉంటే పొగిడేదాన్ని" అని కౌంటర్ వేసింది కొత్త యాంకర్. "పర్లేదు నాలాగే అబద్దం చెప్పండి" అని రివర్స్ కౌంటర్ వేసాడు రాఘవ. ఇంతలో రాంప్రసాద్, ఆది వచ్చి "కొత్తగా వచ్చింది కదా..పేరేమిటో" అన్నాడు ఆది. "సౌమ్య" అని యాంకర్ పేరు చెప్పేసరికి " నువ్వెంత సౌమ్యమైనా మా కన్ను పడితే సేమ్యానే" అన్నాడు ఆది.  ఇలా సౌమ్య వాళ్ళతో ఢీ అంటే ఢీ అన్నట్టుగానే కౌంటర్లు వేసింది. ఐతే జబర్దస్త్ యాంకరింగ్ అనేది ఒక బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ ని మెప్పించి ఎక్కువ కాలం మనగలిగితే నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే  రష్మీ, అనసూయ డేట్స్ కుదరని టైంలో టెంపరరీగా కొంతమంది యాంకర్స్ గా వ్యవహరించారు కానీ ఆడియెన్స్ ని  మెప్పించలేకపోయారు. మరి ఇప్పుడు సౌమ్య రావుకి జబర్దస్త్ ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.  చూడాలి..రాబోయే రోజుల్లో  సౌమ్య రావు ఎంత మేరకు సక్సెస్ అవుతుందా అనేది...

"నువ్విక్కడనుంచి వెళ్లకపోతే ముద్దిచ్చేస్తా " విక్రమాదిత్యకు శ్రీముఖి స్వీట్ వార్నింగ్

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఎపిసోడ్ ప్రోమో హాట్ హాట్ డైలాగ్స్ తో కట్ చేశారు. శ్రీముఖిని చూస్తేనే హాట్ గా ఉంటుంది ఇక అలాంటి యాంకర్ హాట్ డైలాగ్ చెప్తే ఇంకెంత హాట్ గా ఉంటుందో కదా. ఇక ఈ ఎపిసోడ్ కి ఈవారం "కలిసి ఉంటే కలదు సుఖం" సీరియల్ టీం, "నువ్వు నేను ప్రేమ" టీమ్స్ వచ్చాయి. ఇక ఎవరికి వాళ్ళు తమ తమ సీరియల్స్ మీద అద్దిరిపోయే స్లొగన్స్ ఇచ్చేసారు. " ఇక్కడ ఉంది కలిసి ఉంటే కలదు సుఖం టీం..మాతో పెట్టుకుంటే చూపిస్తా నరకం" అని సీరియల్ హీరో చరణ్ డైలాగ్ చెప్పేసరికి వెంటనే "ప్రేమకు అర్ధం కోనసీమ..పౌరుషానికి అర్ధం రాయలసీమ..గెలుపుకి అర్ధం నువ్వు నేను ప్రేమ" అని సీరియల్ హీరోయిన్ పద్దు అదిరిపోయే పంచ్ వేసేసింది. ఇక "నువ్వు నేను ప్రేమ" సీరియల్ హీరో విక్రమాదిత్య స్టేజి మీదకు వచ్చేసరికి "టీవీలో చూసి ఏమో అనుకున్నా కానీ మంచి హైటే ఈ అబ్బాయి..కత్తి లాగున్నాడు" అని ఒక హాట్ కంప్లిమెంట్ ఇచ్చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక వెంటనే పుష్ప డైలాగ్ ని రీమిక్స్ చేసి చెప్పింది శ్రీముఖి "ఏంది స్వామి..నిన్ను చూడట్లేదని పులిపెక్కిపోతాండావంట...ఎక్కువ చేసావనుకో..ముద్దిచ్చేస్తా..అప్పుడు అదే ప్రోమోలో చూపిస్తారు..వెళ్ళిపో ఇక్కడనుంచి" అని విక్రమ్ ని ఒక రేంజ్ ఆడేసుకుంది..ఇక భావన "చంద్రముఖి"ని "బంగారం"ని  రెండిటిని మిక్స్ చేసి వేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్...ఇక ఈ ఎపిసోడ్ రేపు అలరించబోతోంది.

జబర్దస్త్ లోకి కొత్త బటర్ ఫ్లై!

జబర్దస్త్ ప్రతీ వారం ఆడియన్స్ కి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే అటెంషన్ మొత్తాన్ని తన వైపు తిప్పేసుకుంటోంది. పాత జడ్జెస్ వెళ్ళిపోయాక కొత్తవాళ్లను తెచ్చింది...కొత్తవాళ్ళలో కొందరు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తవాళ్లను తెచ్చింది. ఒక యాంకర్ వెళ్ళిపోతే ఇంకో యాంకర్ వచ్చింది..ఇప్పుడా యాంకర్ వెళ్ళిపోయింది..మరో కొత్త యాంకర్ వచ్చింది. కంటెస్టెంట్స్ కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు.  ఇలా ప్రతీ వారం ఫుల్ గా  ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతూ వస్తోంది. ఇక త్వరలో సుడిగాలి సుధీర్ కూడా రాబోతున్నాడు. ఇక జబర్దస్త్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తోంది. అనసూయ వెళ్ళిపోయాక కొత్త యాంకర్ అంటూ పుకార్లు వచ్చినా కొత్త అమ్మాయిని తేకుండా రష్మినే తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు రష్మీకి డేట్స్ కుదరకపోవడం కావొచ్చు, అలాగే మూవీ ప్రొమోషన్స్ తో బిజీ ఐపోయిన కారణంగా కావొచ్చు లేదంటే జబర్దస్త్ తో చేసుకున్న అగ్రిమెంట్ టైం ఐపోవడం కావొచ్చు కానీ  నెక్స్ట్ ఎపిసోడ్ నుండి రష్మీ  జబర్దస్త్ లో కనిపించదు. దానికి కారణం ఆమె ప్లేస్ లో  కొత్త యాంకర్ వచ్చేసింది.  లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో ద్వారా కొత్త యాంకర్ ని పరిచయం చేశారు.  జబర్దస్త్ కి కొత్తగా వచ్చిన ఆ యాంకర్ పేరు సౌమ్య రావు. సౌమ్య రావు గ్లామర్ ముందు రష్మీ, అనసూయ సరిపోరు అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన స్టైల్  చూపించింది. కొత్త యాంకర్ ని జడ్జి ఇంద్రజ పరిచయం చేసింది. ఆల్రెడీ సౌమ్య గతంలో ఆదితో కలిసి ఒక స్కిట్ కూడా వేసింది. సౌమ్య కూడా రష్మీ లానే..తెలుగు మొత్తం తప్పుల తడకే..ఈమధ్య షోస్ లో తెలుగులో ఇంగ్లీష్ పదాల మోత విచ్చలవిడిగా కొనసాగుతోంది. తెలుగుని తింగరిగా మాట్లాడితేనే క్లిక్ అయ్యే అవకాశం ఎక్కువుందని భావిస్తున్నారో ఏమో అందరూ తెలుగును వెరైటీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మరి సౌమ్య రాబోయే రోజుల్లో ఎలా చేస్తుంది ఎలా మాట్లాడుతుంది, ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

గంగూభాయ్ గెటప్ లో శ్రీముఖి!

బుల్లితెర మీద ఇటీవల ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నో రియాలిటీ షోస్ కూడా అలరిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నే కూడా ఆడియన్స్ ని  విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటివి ఉన్నవి..వీటితో పాటు ప్రతీ శని, ఆదివారాల్లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి.  ఇక పండగల టైంలో చెప్పక్కర్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో భాగంగా లేటెస్ట్ గా  ‘మిస్టర్ & మిసెస్’ అనే రియాలిటీ షో ఒకటి స్టార్ట్ అయ్యింది. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటుడు , బిగ్ బాస్ కంటెస్టెంట్  శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి  ఈ షో ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఈ షోకి సంబందించిన కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేశారు షో మేకర్స్. వచ్చే వారం కొత్తగా ఒక థీమ్ ని ప్లాన్ చేశారు. " గెటప్ థీమ్ "తో ఆడియన్స్ ని అలరించడానికి కపుల్ కంటెస్టెంట్స్ రెడీ అయ్యారు. అయితే.. గెటప్ థీమ్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి రెగ్యులర్ గెటప్ లో  కాకుండా.. కొత్త గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది.  అలియా భట్ పోషించిన ‘గంగూబాయ్ కతియావాడి’ గెటప్ లో వైట్ శారీతో వెన్నెలలా వచ్చేసింది. తెల్లటి చీరకట్టుకొని.. నల్ల కళ్లద్దాలు.. నుదుటిపై ఎర్రని బొట్టు ఇలా వేషధారణతో ఆకట్టుకుంది శ్రీముఖి. దీంతో గంగూబాయి గెటప్ లో శ్రీముఖిని చూసి నటుడు శివబాలాజీ కంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఫాన్స్ కి స్వీట్ న్యూస్..జబర్దస్త్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్న గాలోడు!

స్మాల్ స్క్రీన్  హీరో ‘సుడిగాలి సుధీర్’ గురించి  కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరై ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.  మరో వైపు బిగ్ స్క్రీన్ మీద అడపాదడపా నటిస్తున్నాడు. తాను నటించిన "గాలోడు" మూవీ  ప్రమోషన్స్ లో భాగంగా  తన ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “6 నెలల క్రితం నేను ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాను. ఆ విషయాన్ని జబర్దస్త్ మానేజ్మెంట్ కి చెప్పి ఆ సమస్యలు తీరిపోయాక తిరిగి వస్తానని చెప్పి మరీ వెళ్లాను. ఇప్పుడు డబ్బు సమస్యలు తీరిపోయాయి. మళ్ళీ జబర్దస్త్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని... అవకాశం ఉంటే చెప్పమని చెప్పాను దానికి వారు కూడా సరే అన్నారు.  త్వరలోనే జబర్దస్త్ లోకి మళ్ళీ  ఎంట్రీ ఇవ్వబోతున్నాను” అని తన  ఫ్యాన్స్ కి ఒక స్వీట్ న్యూస్ చెప్పేసాడు. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక  హీరోగా కాస్త బిజీ అయ్యాడు కానీ హోస్ట్ గా మాత్రం తన స్థాయికి తగ్గ షోస్ చేయలేదనే విషయం తెలిసిందే. ఇక వచ్చే వారమో ఆ పై వారమో సుధీర్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు.

ప్రొపోజ్ కూడా చేయలేనంత బాడ్ గా ఉన్నానా ఏంటి నేను..?" రోహిణి పై శివాని ఫైర్

"డాన్స్ ఇండియా డాన్స్" షో మిగతా డాన్స్ షోస్ తో పోటాపోటీగా పరిగెత్తడానికి ట్రై చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో "అహ నా పెళ్ళంట" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్, శివాని ఎంట్రీ ఇచ్చేసారు. ఇక రాజ్ తరుణ్ మంచి జోష్ మీద ఉన్నాడేమో ఈ ఎపిసోడ్ లో సరదాగా జోక్స్ వేసాడు. ఇక రౌడీ రోహిణి తన పేరుకు తగ్గట్టే బిహేవ్ చేసింది. ఉయ్యాలైన జంపాలైనా అని రాజ్ తరుణ్ తో కలిసి పాట పాడడమే కాదు అతన్ని రెండు చేతులతో ఎత్తేసి బొంగరంలా తిప్పేసింది. "అవకవక పెళ్లౌతోంది" అని రోహిణి అనేసరికి " ఆల్ ది బెస్ట్ అండి..మిమ్మల్ని చేసుకోబోయేవాడికి" అని కౌంటర్ వేసాడు రాజ్ తరుణ్. తర్వాత హోస్ట్ అకుల్ బాలాజీ " మీ లైఫ్ లో బార్బీ డాల్ ఎవరూ లేరా" అని రాజ్ తరుణ్ ని అడిగేసరికి " ఉందిగా" అని రోహిణి చూపించాడు. "నా గురించి వద్దు " అని రోహిణి కామెడీ చేసేసరికి "బిస్కెట్ వేసినప్పుడు తీసుకోవాలి" అన్నాడు రాజ్.. "మీరు మరీ ఎక్కువ బిస్కెట్స్ వేసేస్తున్నారు..నాకే నమ్మకం కుదరట్లేదు" అని కౌంటర్ వేసింది రోహిణి. ఇక తర్వాత "నీకెవరూ ప్రొపోజ్ చేయలేదా" అని శివానిని రోహిణి అడిగేసరికి " జరుగుతూ ఉంటాయి కదండీ..ప్రొపోజ్ కూడా చేయలేనంత  బాడ్ గా ఉన్నానా ఏంటి నేను" అని నవ్వేసింది. ఇక డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఒక్కోటి ఒక్కో లెవెల్లో  చేశారు కంటెస్టెంట్స్. ఇక మూడు జోడీలు ఎలిమినేషన్ రౌండ్ లోకి అడుగుపెట్టాయి. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు..ఏ ఒక్క జోడి సేవ్ అవుతుందో చూడాలి...

జబర్దస్త్ కొత్త యాంకర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్ సౌమ్యశారద నడిగి అలియాస్ సౌమ్య రావు ఎవరో మీకు తెలుసా ? సౌమ్యరావు కర్ణాటక అమ్మాయి. 1992 సెప్టెంబర్ 29న కర్ణాటకలోని శివమొగ్గలో పుట్టింది. మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కర్ణాటకలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసాక  బెంగళూరులోని కువెంపు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత కన్నడ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా తన  కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి నుంచి తనకు యాక్టింగ్ మీద ఉన్న ఇంటరెస్ట్ తో అటువైపు అడుగులు వేసింది.  అలా కన్నడ, తమిళ్ సీరియల్స్ లో నటించింది. సన్ టీవీలో వచ్చిన "వల్లి" అనే సీరియల్ లో  "ఉమా మహేశ్వరి" పాత్ర ద్వారా ఆమె అరంగేట్రం చేసింది.  జీ కన్నడ టెలివిజన్ లో ప్రసారమైన ‘పత్తేదారి ప్రతిభ’ సీరియల్లో అదితి పాత్రలో నటించి మంచి  గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం సన్ టీవీలో "రోజా"  లో సాక్షి అనే పాత్రలో ఇంకా " నెంజమ్ మరప్పతిల్లై"లో సత్య అనే నెగిటివ్ రోల్ పోషించింది. ఈటీవీలో "శ్రీమంతుడు" సీరియల్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో  సత్య క్యారెక్టర్ లో తన విలనిజాన్ని చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. మరో పక్క ఇదే పేరుతో సత్య అనే క్యారెక్టర్ లో "మనసు మాట వినదు" సీరియల్ లో నటించింది. ఇక  ఈ సీరియల్స్ లో ఆమె నటన చూసి ఇప్పుడు యాంకర్ గా ఈమెకు అవకాశం ఇచ్చింది  మల్లెమాల యాజమాన్యం. ఇప్పటివరకూ విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను భయపెట్టిన సౌమ్యరావు ఒక రష్మీ లాగ, ఒక అనసూయలాగ ఎంటర్టైన్ చేస్తుందా.. లేదా అనేది చూడాలి.

గీతు దెబ్బ..ఆదిరెడ్డి అబ్బా!

బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ లు, గేమ్ లు, వార్ లు, ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతోన్నాయి. మొన్నటి వరకు సప్పగా సాగిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవల వల్ల కలిసి ఉన్నవాళ్ళు విడిపోవడం జరుగుతూ ఉంటే మరింతగా హైప్ ని పెంచేస్తోంది. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డికి గీతు మధ్య జరిగిన వాగ్వాదం చూసే ప్రేక్షకులకు ఇంటెన్స్ గా అనిపిస్తూ సాగింది. గేమ్ తర్వాత గీతు, ఆదిరెడ్డికి సారీ చెప్పింది. "నా మైక్ విసిరేసి, నేను గేమ్ లో నుండి అవుట్ అయ్యాను. ఇది కేవలం నీ వల్ల. నేను అక్కడ గేమ్ లో  భౌతికంగా చనిపోయాను" అని ఆదిరెడ్డి, గీతుతో కోపంగా అన్నాడు. ఆ తర్వాత గీతు మాట్లాడింది. "నా టీం సభ్యులు అందరు నా మాట విన్నారు. అందులో ముఖ్యంగా రేవంత్ నా మాట విన్నాడు. లీడర్ చెప్పింది విన్నారు మా వాళ్ళు. మేము అన్ ఫేయిర్ గా ఉంటాం అని చెప్పి అన్ ఫేయర్ గా ఉన్నాం. మీరు ఫేయిర్ గా ఉంటాం అని చెప్పి ఉండలేకపోయారు. మేము బుద్ధి బలం చూపాం.‌ కానీ మీరు చూపించలేకపోయారు" అని ఆదిరెడ్డితో గీతు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత, "ఇక ముందు చూడు ఆదిరెడ్డి. గీతు ఆట ఏంటో చూపిస్తా. నా దెబ్బ ఏంటో చూపిస్తా. ఆ తర్వాత 'గీతు దెబ్బ..ఆదిరెడ్డి అబ్బా' అని అందరు అనుకుంటారు." అని గీతు, ఆదిరెడ్డికి సవాల్ విసిరింది. దానికి రిప్లైగా "సరే చూస్కుందాం" అని ఆదిరెడ్డి అన్నాడు. 'Everything is Fair In Game' అని గీతు, ఆదిరెడ్డితో చెప్పింది. "వీక్ నెస్ ని  గేమ్ లో ఆడాలి. అంతే కానీ మనం బయట పర్సనల్ గా మాట్లాడుకున్నది. ఇలా గేమ్ లో చూపుతావా? ఎప్పుడు ఇలానే చేస్తావా? ఏదోకటి చెప్తావ్ " అని అరుస్తూ తన మైక్ ని, టీషర్ట్ ని విసిరేస్తూ, కిందకి కొట్టాడు. ఇది చూసి హౌస్ మేట్స్ అందరు ఆశ్చర్యపోయారు.

ఫలించని ఇనయా ఒంటరి పోరాటం..కొత్త కెప్టెన్ గా శ్రీసత్య!

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి వరకు కెప్టెన్ గా శ్రీహాన్ ఉన్నాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ రేస్ లో 'కీర్తి భట్, శ్రీసత్య, వసంతి, ఫైమా, మెరీనా, ఇనయా, గీతు' ఉండగా బెలూన్స్ టాస్క్ లో  శ్రీసత్య గెలిచి, కొత్త కెప్టెన్ గా ఎన్నుకోబడింది. అసలు ఏం జరిగిందంటే  మిషన్ ఇంపాజిబుల్ గేమ్ తర్వాత బెలూన్ పగులగొట్టడానికి ఒక్కో టీం నుండి ముగ్గురు వచ్చారు. టాస్క్ ఏంటంటే, "ప్రతీ ఒక్కరి దగ్గర ఒక్కో బెలూన్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోను, ఈ బెలూన్ పగిలిపోకూడదు. కిందపడిపోకూడదు" అని బిగ్ బాస్ నియమాలను పోటీదారులకు వివరించాడు. ఆ తర్వాత గేమ్ మొదలైంది. కానీ ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేపోయారు. "మీరు బజర్ మోగే లోపు గేమ్ ముగించకపోతే టాస్క్ ఆగిపోతుంది. తర్వాత వారం మొత్తానికి కెప్టెన్ ఎవరు ఉండరు" అని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ చేసాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ పోటాపోటీగా ఆడారు. అందరి బెలూన్స్ పగిలిపోగా, చివరకు ఇనయా, శ్రీసత్య ఉన్నారు. అయితే ఇనయాను అందరు టార్గెట్ చేసారు. శ్రీసత్య బెలూన్ పగులగొట్టకుండా, ఇనయా బెలూన్ పగులగొట్టారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. శ్రీసత్య గెలవడం అనేది ఒక చీటింగ్ అని అన్ ఫేయిర్ గేమ్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇనయాకి మద్దతుగా నిలబడలేకపోవడం అనేది మొత్తంగా అన్ ఫేయిర్ గా అనిపిస్తోంది. ఇనయా బాగా పర్ఫామెన్స్ చేసినా కూడా హౌస్ మేట్స్ సపోర్ట్ లేకుండా ఒక్కరిగా పోరాటం చేయడం వల్ల గెలవడం అసాధారణమని మరోసారి తెలిసింది. కాగా ఇనయా ఒంటరి పోరాటం వృధా అయింది. ఆ తర్వాత శ్రీసత్య విజేతగా నిలిచి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంది. కాగా మిగిలిన హౌస్ మేట్స్ అందరు అభినందనలు తెలిపారు. "మన హౌస్ లో పెరుగు లేదు.. సత్యకి తిరుగులేదు" అని ఫైమా చెప్పగా, "దొండకాయ..బెండకాయ సత్య నా బెండకాయ" అని గీతు ఫన్నీగా అంది. అలా కొత్త కెప్టెన్ గా శ్రీసత్య ఎన్నికైంది. ఇక మునుముందు హౌస్ లో కొత్త కెప్టెన్ గా తన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తుందో చూడాలి మరి‌.

ఇనాయని కావాలనే డి-గ్రేడ్ చేస్తున్నారు

బిగ్ బాస్ సీజన్ 6  లో కంటెస్టెంట్స్ గురించి రివ్యూస్ చెప్పించడానికి బీబీ కేఫ్ హిమజని పిలిచింది..ఇక హిమజ హౌస్ లో జరుగుతున్న ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. ఇనాయ సూర్య ఉన్నప్పుడు సూర్య లేకుండా గేమ్ ఆడేది కాదు...ఇప్పుడు సూర్య వెళ్ళిపోయాక మిస్ ఐపోతున్నా అంటూ ఫీలవుతోంది. ఆ విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. రెండు పడవల మీద కాళ్ళు వేయడం ఎందుకు..స్ట్రైట్ గా గేమ్  ఆడాలి. ఫైమా వెటకారం తాను ఎంజాయ్ చేయడానికి చేస్తుందా లేదా ఎదుటి వాళ్ళను ఎంటర్టైన్ చేయడానికి చేస్తుందా అనేది ఆమెకే క్లారిటీ లేదు." అని హిమజ ఓవర్ ఆల్ గా రివ్యూ ఇచ్చింది. ఐతే నెటిజన్స్ మాత్రం వీళ్ళ మీద సెటైర్లు పేల్చుతున్నారు. "ఇనాయ గేమ్ ఆడుతోంది..కానీ బీబీ కేఫ్ లో వాళ్లంతా ఆమెను డి-గ్రేడ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఎందుకు ?..శ్రీసత్య వలన అటు రేవంత్, ఇటు శ్రీహాన్ చాలా ఇబ్బంది పడుతున్నారు..ఇదేమీ కనిపించడం లేదా ? అని ఆరియానాని టార్గెట్ చేసి ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్స్.

కొనసాగుతోన్న రేవంత్ రోహిత్ మధ్య గొడవ!

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి గేమ్ ఇంటెన్స్ లెవల్ పెరుగుతు వస్తోంది. మొన్న మొదలైన 'మిషన్ ఇంపాజిబుల్' టాస్క్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అయితే  ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య జరుగుతోన్న గొడవలు పీక్స్ స్టేజ్ కి వెళుతున్నాయి. మొన్న జరిగిన రేవంత్, రోహిత్  ల మధ్య గొడవ పెరుగుతుంది. నిన్న జరిగిన గేమ్ లో ఇరు జట్లు పోటాపోటీగా పాల్లొనగా, అందులో రేవంత్ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల రోహిత్ మెరీనా బాధపడాల్సి వచ్చింది. అయితే గేమ్ మొదలయ్యాక రేవంత్ , రోహిత్ టీ షర్ట్ కి ఉన్న స్ట్రిప్స్ లాగే ప్రయత్నం చేసాడు. రోహిత్ చేతులతో డిఫెండ్ చేయగా, రేవంత్ కి గాయం అయింది. దీంతో ఒక్కసారిగా రేవంత్ హైపర్ అయ్యాడు. ఆ గాయం అయిన సెన్స్ లో ఏదో మాట జారాడు. అది రోహిత్ కి వేరేలా చేరింది. 'నీ యమ్మా అని అన్నావ్' అని రోహిత్ అన్నాడు. రోహిత్ కి సపోర్ట్ గా  మెరీనా మాట్లాడుతూ, "రేవంత్  అలా మాట్లాడకూడదు. తప్పు. నీ యమ్మా అని అనొచ్చా" అని అనగా, "ఏ ఎవరన్నారు.నేనెందుకు అంటా నీ యమ్మా అని" అని రేవంత్ అన్నాడు. అయితే రేవంత్ కి, రోహిత్ ఏదో చెప్పబోతుండగా, "నువ్వు మాట్లాడకు..నువ్వు మాట్లాడకు" అని రేవంత్ కోపంగా అనేసాడు. అయితే ఈ సీన్ కి ముందు ఆదిరెడ్డికి, రేవంత్ కి మధ్య కూడా ఇలాంటి గొడవనే జరిగింది. కానీ ఆదిరెడ్డి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం వల్ల రేవంత్ సైలెంట్ అయ్యాడు. లేదంటే మరో గొడవ జరిగేది. కాగా రేవంత్ అగ్రెసివ్ అని హౌస్ మేట్స్ అందరికి తెలిసి, అతనితో జాగ్రత్తగా ఉంటూనే వస్తోన్నారు. అయితే రోహిత్ , రేవంత్ మధ్య జరిగిన ఈ గొడవ వరుసగా రెండో రోజుకి చేరుకుంది.