దేవత సీరియల్ కి ఎండ్ కార్డ్..త్వరలో పార్ట్-2 తో రీఎంట్రీ!

దేవత సీరియల్ కి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఈ విషయాన్ని సీరియల్ టీం ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపింది. 2020 ఆగష్టు నుంచి స్టార్ మా ఛానల్‌లో స్టార్ట్ అయ్యింది.  ‘దేవత సీరియల్ అయిపోయింది.. పార్ట్ 2తో మళ్లీ వస్తాం.. తొందర్లోనే మేం అంతా మళ్ళీ కలుస్తాం.. మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ రుణపడి ఉంటాం’ అంటూ ఈ సీరియల్ లో  భాగ్యమ్మ రోల్ లో  నటించిన నటకుమారి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ సీరియల్ ముక్కోణ ప్రేమ కథ. రుక్మిణిగా సుహాసిని, ఆదిత్యగా అర్జున్ అంబటి లీడ్ రోల్ పోషించారు. వీరితో పాటు సత్య, మాధవ, దేవి, చిన్మయి, భాగ్యమ్మ, దేవుడమ్మ, కమల, సూరి, రంగ, రాజమ్మ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.  కొంచెం సాగతీతగా అనిపించినా కూడా దేవత సీరియల్ మంచి రేటింగ్‌తో దూసుకుపోయింది. అయితే త్వరలో దేవత -  2 ఉంటుందని ఈ సీరియల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పడంతో ఆడియన్స్ ఫుల్ కుష్ లో ఉన్నారు.  

సోలో బ్రతుకే సో బెటరూ.. హ్యాపీ సింగిల్స్ డే అంటున్న షన్ను!

షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఇద్దరూ కూడా యూట్యూబర్స్‌గా అందరికీ తెలుసు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. ఈ జంట చూడముచ్చటగా ఉండేది ఒకప్పుడు. కానీ షన్ను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి వచ్చాక ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన అందరూ మళ్ళీ కలిసి హాయ్‌లు చెప్పుకుని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే షన్ను-దీప్తి మాత్రం అస్సలు కలవడం లేదు. 'అరే బాబు పంతాలు వదిలేసి కలవండిరా' అని నెటిజన్స్ చెప్పినా నో యూజ్.. ఎవరికి వారే సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.  ఇక ఇలాంటి సింగిల్స్ కోసం ఒక స్పెషల్ డే కూడా ఉంది. అది ఎప్పుడు అనుకుంటున్నారా? నవంబర్ 11న సింగిల్స్ డే జరుపుకుంటారు. ఇంతకీ ఈ సింగిల్స్ డే అంటే ఏమిటబ్బా?.. అనే సందేహం మీకు వచ్చింది కదా. చైనాలో దీన్ని ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటారు. 1993 నుంచి ఈ రోజును సింగిల్స్ డేగా అంటే బ్యాచిలర్స్ డేగా చేసుకుంటున్నారు. నాన్జింగ్ యూనివర్సిటీలో మొదట ఈ సింగిల్స్ డే అనేది స్టార్ట్ అయ్యింది. 11వ నెల 11వ తేదీ ఈ అంకెలు అన్ని సింగల్ గానే ఉన్నాయి అని గుర్తించిన ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇదే రోజున సింగిల్స్ డేగా జరుపుకుంటే బాగుటుందని యూనివర్సిటీలోని బ్యాచిలర్స్ అంతా సెలెబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారట.  తర్వాత ఈ సెలెబ్రేషన్స్ మిగతా యూనివర్సిటీస్‌కి కూడా పాకేసరికి అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక  ఇప్పుడు దీప్తి నుంచి విడిపోయాక సింగిల్‌గా ఉన్నాడు కాబట్టి ఈ పండగను సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించి విషెస్ చెప్తూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా  పోస్ట్ చేసుకున్నాడు.

తన గొయ్యి తానే తవ్వుకుంటున్న ఫైమా..తనకి ఎలిమినేషన్ తప్పేలా లేదు!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఆటతీరుకి ప్రేక్షకులు స్పందిస్తూ, తమ అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో చూపిస్తారు. అయితే గేమ్ ఎంత బాగా ఆడినా, నోటి దురుసు ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చేయడం కామన్ గా జరిగేదే. గత వారం గీతు ఎలిమినేట్ అవ్వడానికి కూడా తన రూడ్ బిహేవియర్  అని అందరికి తెలుసు. కాగా ఈ వారం ఫైమా మీద కూడా అలాంటిదే రిపీట్ అవుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లో ఆటతో పాటు, మాటలను అదుపుచేసుకోవాలి. కానీ ఫైమా గత మూడు రోజులుగా సాగుతోన్న టాస్క్ లో ప్రతీ ఒక్కరితో నోటి దురుసును చూపిస్తుంది. కాగా ఈ ప్రవర్తన వల్ల తను ఓటింగ్ లో చివరి స్థానంలో ఉంది. ఇలా పర్ఫామెన్స్ చేస్తే ప్రేక్షకులు ఓట్లు వేయరు అనే చిన్న లాజిక్ మర్చిపోయినట్టుంది. తన జబర్దస్త్ జోక్ లు నాన్ సింక్ లో ఉండటం. ఇనయాతో కావాలని గొడవకి దిగడం. రేవంత్ తో వాగ్వాదం. ఇవన్నీ చూసే ప్రేక్షకులకు చాలా ఇరిటేటింగ్ ని కలుగజేస్తున్నాయి. అయితే వసంతి, ఫైమా చివరి రెండు స్థానాలలో ఉండగా, వసంతి గొడవలు ఏమీ లేకుండా సైలెంట్ గా ఉండటం. అనవరంగా నోరు జారకపోవడంతో ఓటింగ్ లో తన గ్రాఫ్ మెరుగపడి,  ఫైమా కన్నా లీడింగ్ లో ఉంది. అయితే ఈ రెండు రోజుల గేమ్ లో ఫైమా తన బిహేవియర్ మార్చుకోకపోతే హౌస్ నుండి బయటకే అని ప్రేక్షకులు భావిస్తున్నారు.  ఏ గొడవలకు పోకుండా, సైలెంట్ గా ఉంటూ, బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుందో లేక చిరాకు తెప్పించి బయటకు వస్తుందో చూడాలి మరి.  

నా ఆట ఏంటో చూపిస్తానంటోన్న రేవంత్..ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా?

బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తంలో అగ్రెసివ్ బిహేవియర్ ఎవరికి ఉంది అంటే, అందరు ఠక్కున రేవంత్ పేరు చెప్పేస్తారు. అలాంటి రేవంత్ మెల్లి, మెల్లిగా కామ్ అయి, మారిపోతున్నాడు.  గత వారం "అగ్రెసివ్ బిహేవియర్ తో పాటు పక్కన హౌస్ మేట్స్ తో జాగ్రత్తగా ఉండాలి. అలా లేనందున నీకు ఎల్లో కార్డ్ ఇస్తున్నా, నెక్స్ట్ ఇక రెడ్ కార్డ్ " అని నాగార్జున చెప్పాడు. దీంతో రేవంత్ చాలా  చేంజ్ అయ్యాడు. అయితే మొన్న జరిగిన 'నాగమణి' టాస్క్ లో తను రత్నాలు కాపాడుకునే ప్రయత్నంలో, "ఫిజికల్ అవకు రేవంత్" అని ఆదిరెడ్డి ఒక వైపు, "ఫిజికల్ కాకుండా ఆడు" అని ఫైమా మరో వైపు, "గేమ్ ఆడు రేవంత్" అని శ్రీసత్య అరవడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు రేవంత్. "నేను ఏం ఫిజికల్ అవ్వట్లేదు అని చెప్పినా ఎవరూ వినకుండా ఫిజికల్ అంటే ఎలా ఆడేది" అని రేవంత్  చెప్పాడు. ఆ తర్వాత గేమ్ లో రేవంత్, శ్రీసత్య కి సపోర్ట్ చేస్తుండగా, "రేవంత్ నా తల ఉంది పక్కకి వెళ్ళు" అని శ్రీసత్య అంది‌. "సరే నా వల్లే ప్రాబ్లమా" అని పక్కకి వెళ్ళిపోయాడు రేవంత్ . అలా ఆ రోజు అంతా గేమ్ ఆడలేదు. ఆ తర్వాత ఒక్కడే కూర్చొని ఏడుస్తూ మాట్లాడుకున్నాడు. "అంత కష్టపడి మట్టి తెచ్చి ఆడినా, నాకు ప్రతిఫలం రాలేదు. అసలు రాకుండా ఉండాల్సింది భయ్యా" అని రేవంత్ అన్నాడు. "వదిలెయ్ రేవంత్. దట్ ఈజ్ గేమ్. ఎక్కువ థింక్ చేస్తే లూసర్ అవుతావ్" అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత మెరీనా వచ్చి ఓదార్చింది. "నీ ఆట నువ్వు ఆడు. దిజ్ ఈజ్ గేమ్. గట్టిగా ఆడు. సపోర్ట్ కావాలంటే ప్లీజ్ కాల్ మి. నేను సపోర్ట్ చేస్తాను" అని రేవంత్, మెరీనాతో అన్నాడు. ఆ తర్వాత ఒక్కడే కూర్చొని మాట్లాడుకున్నాడు. "ఆట ఆడకుండా కాళ్ళు చేతులు కట్టేసారు బిగ్ బాస్. ఆడితే ఫిజికల్ అంటున్నారు. ఈ రోజు నేను గేమ్ ఆడలేకపోయాను. నాలా నేను లేనప్పుడు, గుండె పగిలిపోయింది బిగ్ బాస్. నా ఆట ఏంటో చూపిస్తా. చివరి వరకు ఉండి ఈ సీజన్ లో విజేతని అవుతా బిగ్ బాస్ " అని రేవంత్ చెప్పుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ అగ్రెసివ్ ని పక్కన పెట్టి, ఆలోచించి ఆడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ రకంగా అగ్రెసివ్ బిహేవియర్ తగ్గించుకొని కామ్ గా టాస్క్ ఆడితే  రేవంత్ టాప్ త్రీ లో ఉంటాడు అని అనడంలో సందేహమే లేదు. ఈ సీజన్ లో విజేతగా నిలిచే ఛాన్స్ లు ఎక్కువగా రేవంత్ కే ఉన్నాయి. ఎందుకంటే ప్రతీవారం రేవంత్ ఓటింగ్ లో టాప్ లో ఉంటున్నాడు.

జబర్దస్త్ లో కొత్త డైరెక్టర్లు, కొత్త యాంకర్లు, కొత్త టీములు

జబర్దస్త్ లో లేటెస్ట్ అప్ డేట్స్ గురించి తెలియాలంటే హైపర్ ఆది స్కిట్ చూస్తే తెలిసిపోతుంది. ఇక ఈ వారం జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ లో రాఘవ స్కిట్, హైపర్ ఆది స్కిట్ బాగా పేలాయి. ఇక హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా స్టేజి మీదకు వచ్చి ఆది.."జబర్దస్త్ విశేషాలు ఏమిటి అని రాంప్రసాద్ అడగడం...ఏముంది.. డైరెక్టర్ మారాడు..యాంకర్ మారింది...టీములు మారాయి...ఇక మారాల్సింది నువ్వూ నేనే " అన్నాడు. వీళ్ళ కామెంట్స్ వింటే మాత్రం  ఇతర షోస్ కి పోటీగా జబర్దస్త్ లో కూడా చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న విషయం అర్ధమైపోతుంది. "మరి మీ కొత్త లీడర్ వచ్చాడు కదా అతని ముఖ చిత్రం ఏమిటి" అని రాంప్రసాద్ అడిగేసరికి "ఎన్నాళ్లకు వచ్చిందనే ఆనందం ఒక పక్కన, ఎన్నాళ్ళు ఉంటుంది అనే  ఒక బాధ " అని ఆది అనేసరికి స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. "ఏదైమైనా జబర్దస్త్ స్టార్టింగ్ లో ఎలాంటి గ్లామర్ తో వచ్చావో ఆ గ్లామర్ నే మెయింటైన్ చేస్తున్నావ్ " అని ఆది అనేసరికి "గ్లామర్ మెయింటైన్ చేయడం ఒక ఆర్ట్" అని రాంప్రసాద్ ఒక రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. "అవునులే గ్లామర్ ఉంటది మరి వదినకు తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేస్తున్నావో మరి" అని ఆది రివర్స్ కౌంటర్ వేశారు.

నాకు పిఆర్లు లేరు..పాజిటివ్ కామెంట్స్ కోసం ఒకరికి 25 వేలు ఇచ్చి మోసపోయాను

గలాటా గీతూకి  బిగ్ బాస్ ఎలిమినేషన్ షాక్ బాగానే కొట్టింది. ఎందుకంటే ఇంకా ఆ షాక్ నుంచి కోలుకులేక అన్ని ఇంటర్వూస్ లో కన్నీరుమున్నీరవుతోంది. ఇక ఇప్పుడు కూడా తన ఎలిమినేషన్ కి గల కారణాలను రాసుకుని సుదీర్ఘంగా వివరిస్తూ ఒక గంట వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. " హౌస్లో నేను ప్రతి నిమిషం చాలా కరెక్ట్ గానే  ఆడాను. అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా నాది ఫేక్ గేమ్ కాదు. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేశారు. అందుకే హౌస్ నుంచి బయటికి వచ్చాక ఎవరితోనూ నేను  మాట్లాడలేదు. ఒక రివ్యూవర్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫండ్ రైజ్ చేశాను. ఐనా అతనికి  కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు. నేను పిఆర్ లను పెట్టుకోలేదు. ఫస్ట్ వీక్ లో  నెగిటివ్ కామెంట్స్ కి పాజిటివ్ కామెంట్స్ వచ్చేలా చూడమని చెప్తూ ఒక వ్యక్తికి మాత్రం రూ. 25 వేలు ఇచ్చా. వాళ్ళు డబ్బు తీసుకుని చెక్కేశారు. నేను రివ్యూవర్ గా ఉన్నప్పుడు  పిఆర్ లను పెట్టుకున్న వాళ్ళను బాగా  విమర్శించాను  కాబట్టి  ఇప్పుడు  నేను పిఆర్ లను పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు బయటికి వచ్చాక తెలుస్తోంది బిగ్ బాస్ కి పిఆర్ లు చాలా అవసరం అని. ఏదేమైనా నా ఆట కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యాను. మిగతా వారితో నా ప్రవర్తన  ఆటలో భాగమే" అని చెప్తూ ఎమోషనల్ అయ్యింది గీతూ.

అలాంటి వారికోసమే నా "కామాతురాణాం" రీల్!

అష్షు రెడ్డి ఎంతో బోల్డ్ గా ఉండే అమ్మాయి. ఆమె ఎంత బోల్డో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉండే ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. ఇక అలాంటి ఫొటోస్ ని పోస్ట్ చేసినప్పుడల్లా నెటిజన్స్  ఫుల్ గా ట్రోల్ చేస్తూ చెత్త చెత్త కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఐతే  అషూరెడ్డి అలాంటి వాటిని అసలు పట్టించుకోదు.  కానీ, ఈ మధ్య ట్రోల్స్ చేసేవారికి, ఇలాంటి కామెంట్స్ పెట్టేవారికి అషూ చాలా  స్ట్రాంగ్‌ గానే కౌంటర్‌ ఇచ్చి పడేస్తోంది. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ అషూ తాజాగా ఓ రీల్‌ చేసింది. "దేశముదురు" మూవీలో రమాప్రభ చెప్పిన "కామాతురాణం" అనే  డైలాగ్‌ని రీల్‌ గా చేసి తన ఖాతాలో పోస్ట్‌ చేసి చాలామందికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  అంతేకాదు  ఆ రీల్‌కి ఒక  క్యాప్షన్‌ కూడా పెట్టింది. "నా ప్రొఫైల్‌ లో కామెంట్‌ చేసే కొందరికి దీనిని అంకితం చేస్తున్నా" అని చెప్పింది .  అయితే ఈ రీల్‌కి కూడా నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు కొంతమంది. "కొందరైతే ముందు నీకు అవన్నీ ఉన్నాయా"  అని అడుగుతుంటే "ఇంకొందరు అయితే మాకు అవన్నీ లేవు.. మేము ఎప్పుడో వదిలేశాం" " నువ్వే చెప్పాలి మాకు" అని కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరు ఆమె డ్రెస్సింగ్‌ గురించే కామెంట్‌ చేస్తున్నారు.

గుర్రం మీద మహారాణిలా వద్దామనుకున్నా.. చిత్తూర్ చిరుత ఎమోషనల్ పోస్ట్ వైరల్!

గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడి అందరిలో నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. తర్వాత పర్సనల్ గా కొన్ని  వీడియోస్ చేసింది. ఎన్నో ఇంటర్వూస్ కూడా ఇచ్చింది.  ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చాలా ఎమోషనల్ లైన్స్ పెట్టుకుని బాధపడుతోంది. "నా జీవితంలో ఇది చాలా అందమైన జర్నీ..కానీ చాలా ఎమోషనల్ గా పూర్తి అయ్యింది. నా ఎగ్జిట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాను...ఒక గుర్రం మీద మహారాణి లాగా వద్దామని అనుకుని కలలు కన్నాను. ఇంత దారుణంగా అవుతుంది అని అస్సలు అనుకోలేదు. బిగ్ బాస్ లో నా ప్రాణం పెట్టి ఆడాను. ప్రాణాలేపోయినంత బాధలో తిరిగొచ్చేశాను. చాలా ఎక్కువగా ఆశపడ్డాను, ఆవేశపడ్డాను అని హౌస్ నుంచి బయటికి వచ్చాక అర్ధమయ్యింది. నా నుంచి మీరు రెండు మోరల్స్ నేర్చుకోవాలి. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు..అలాగే మన మాటే కాకుండా అప్పుడప్పుడు ఇతరుల మాట కూడా వినాలి అని.  బిగ్ బాస్ మీద ఎంతో ప్రేమ ఉన్నా అందులో ఓడిపోయాను. మీరు నా  మీద పెట్టుకున్న ప్రేమలో ప్రాణంపోయినా మిమ్మల్ని  ఓడిపోనివ్వను.. ప్రామిస్" అంటి ఒక పోస్ట్ పెట్టింది.

‘ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటి నుండి మరో లెక్క..సూర్య ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్’!

బిగ్ బాస్ హౌస్ స్టార్ట్ ఐన దగ్గర నుంచి  ప్రారంభం నుండి టాస్కులు ఆడడంలో కానీ..మిమిక్రీ చేసి ఎంటర్టైన్ చేయడంలో కంటెస్టెంట్ ఆర్జే సూర్య వేరే లెవెల్. కానీ కొంతమంది వలన ఆయన ఇటీవల ఎలిమినేట్ ఐపోయాడు. హౌస్ లోకి వెళ్లిన  దగ్గర నుంచి తనకి తాను  ఫెమినిస్ట్ అని చెప్పుకునే సూర్య ఆరోహితో తర్వాత ఆమె ఎలిమినేట్ ఐపోయాక ఇనాయతో క్లోజ్ గా ఉన్నాడు.. ఇక ఇద్దరి మధ్య ముద్దులు, హగ్గులతో చిన్న సైజు రొమాంటిక్ షోని చూపించేసరికి  ఆడియన్స్ ఆయన్ని ఎలిమినేట్ చేసి పారేశారు..అలాంటి సూర్య ఇప్పుడు తనని ఇష్టపడే వారి కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పేసాడు. ఇప్పుడు ఆ  గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జే సూర్య  వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది..ఈ విషయం గురించి  ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింగ్ పోస్ట్ ద్వారా అర్థమైపోతుంది.  ఇక ఇప్పుడు పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. అలాగే  ‘ఇప్పటి వరకు  ఒక లెక్క..ఇప్పటి నుండి మరో లెక్క..సూర్య ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్’ అని ఒక టాగ్ లైన్ పెట్టాడు ..ఆ పోస్ట్ లో బిగ్ బాస్ హాష్ టాగ్ కూడా వాడేసరికి సూర్య మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సూర్య నిజంగానే  రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా ఏదైనా మూవీకి సంబందించిన స్టిల్లా అనేది ఇంకా తెలీదు. ఐతే నెటిజన్స్ మాత్రం రీఎంట్రీ ఇస్తున్నావా ? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఒకవేళ సూర్య రీఎంట్రీ ఇస్తే గనక  ఆ తర్వాత గీతూని కూడా  వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి తీసుకురావొచ్చేమో అభిమానుల కోరిక మేరకు. ఎందుకంటే కొంత మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు వచ్చిన రేటింగ్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక ఆ షోకి అంత రేటింగ్ రావడం లేదు. సో. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

నాగ్ వేస్ట్.. నాని బెస్ట్.. గీతూ షాకింగ్ కామెంట్స్!

గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాక ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున హోస్టింగ్ మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.  ఇంటర్వ్యూలో "ఇన్ని సీజన్స్ లో ఎవరి హోస్టింగ్ బెస్ట్.. అలాగే నెక్స్ట్ సీజన్ కి ఏ హోస్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు" అని యాంకర్ అడిగేసరికి "అన్ని సీజన్స్ లోకి నాని హోస్టింగ్ ది బెస్ట్ అని చెప్తా. చాలా మంది అన్నారు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ అదరగొట్టారని కానీ ఫస్ట్ సీజన్ చూడలేదు కాబట్టి నాకు తెలీదు. నా వరకు నాని హోస్టింగ్ బాగా నచ్చుతుంది. నాగార్జున గారు వీకెండ్స్ లో వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళను రోస్ట్ చేసేస్తారని అనుకుంటాను.. కానీ అక్కడంతా రివర్స్ అవుతుంది. వాళ్ళను  నెమ్మదిగా బుజ్జగించి మాట్లాడతారు, తప్పు చేయని వాళ్ళను తిడతారు. ఇది నాకు నచ్చలేదు. నెక్స్ట్ సీజన్ కి బిగ్ బాస్ హోస్ట్ గా రామ్ గోపాల్ వర్మ గారు వస్తే బాగుటుంది కానీ ఆయన అమ్మాయిలకే ఫేవర్ గా మాట్లాడతారు. రానా, విజయదేవరకొండ హోస్ట్స్ గా వస్తే ఇంకా బాగుంటుంది. అందరికన్నా నాని ఏక్దం ఫస్ట్ క్లాస్ గా చేశారు. తప్పు చేసిన వాళ్ళను ఆయన షంటుతూనే ఉంటారు. అందుకే నాని హోస్టింగ్ బెస్ట్ అందరిలోకి..నెక్స్ట్ సీజన్ కి నాని వస్తే బాగుంటుంది" అంది గీతూ. ఆల్రెడీ నాగ్ హోస్టింగ్ మీద ఆడియన్స్ కి పెద్ద ఆసక్తి లేనట్లుగానే కనిపిస్తోంది. కానీ మరి ఎందుకో ఆయన్నే హోస్ట్ తీసుకొస్తున్నారో అర్ధం కావట్లేదు. బిగ్ బాస్ టీం ఈ కామెంట్స్ విని నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ ని చేంజ్ చేస్తారా లేదా అనే విషయం చూడాలి.

మైకేల్ జాక్సన్ తర్వాత నువ్వే!

ప్రతీ వారం సెలబ్రిటీలను తీసుకొచ్చే 'ఆలీతో సరదాగా' అనే  టాక్ షో అంటే ఆడియన్స్ కి చాలా ఇష్టం. ఈ టాక్ షో ద్వారా సెలబ్రిటీల లైఫ్, కెరీర్ గురించి వాళ్ళ మాటల్లో నిజాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈ షో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫేమస్ యాక్టర్ తులసి, నటుడు ప్రభాస్ శ్రీను ఈ షోకి  హాజరయ్యారు.  తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా విషయాలు ఈ షోలో చెప్పాడు శీను. అయితే.. నటుడిగా ప్రభాస్ శ్రీనులో ఇంతవరకు ఆడియన్స్ అంత కామెడీ యాంగిల్ నే చూసారు కానీ శీనులో మంచి డాన్సర్ కూడా ఉన్నాడనే  విషయం ఈ షో ద్వారానే తెలిసింది. "శీను ఎక్కడ డాన్స్ నేర్చుకున్నావు నువ్వు" అని అడిగేసరికి "సాంగ్ పెట్టి డాన్స్ చేయమంటే ఎన్ని గంటలైనా చేస్తూనే ఉంటా... మీరు కౌంట్ ఇచ్చారా ఇక బండి వెళ్ళదు.." అని చెప్పాడు.   ఇక తర్వాత ఏక్ నిరంజన్ మూవీ నుంచి మైకేల్ జాక్సన్ మ్యూజిక్ తో వచ్చే సాంగ్ "అరెరే నర్తన తార" సాంగ్ ప్లే చేసేసరికి అద్దిరిపోయే స్టెప్పులు వేసి వావ్ అనిపించాడు. ఇక ఆలీ, తులసి ఆ స్టెప్స్ చూసి  షాకయ్యారు. "మైకేల్ జాక్సన్ తర్వాత అలా డాన్స్ చేసేవాడిని నిన్నే చూసాను" అని అలీ అనేసరికి "ఇద్దరం నల్లగానే ఉంటాం కదా" అని ప్రభాస్ శీను కామెడీ గా ఆన్సర్ ఇచ్చాడు.

ఎవరు రాకపోయినా 'జబర్దస్త్' చేయడానికి నేను రెడీ!

జబర్దస్త్ షోకి జబర్దస్త్ గా కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చేసింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమె ఇక నుంచి ఈ షోని నడిపించబోతోంది. వస్తూనే తన మార్క్ కామెడీని చేసి ఆదికి కౌంటర్ వేసింది. ఐతే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేకుండా రష్మిని సడెన్గా ఆపేసి కొత్త యాంకర్ ని తీసుకొచ్చేసరికి మీడియా అటెన్షన్ మొత్తం రష్మీ మీదకు మళ్లింది. అనసూయ వెళ్ళిపోతున్నట్లు ముందుగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా ప్రకటించి మరీ వెళ్ళింది. కానీ రష్మీ విషయంలో అలా జరగలేదు.  సరే పోనీ కొత్త యాంకర్ రానే వచ్చింది షోకి యాంకరింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. మరి రష్మీ ఫీలింగ్ ఏమిటో అంటూ కెమెరాలు, మైకులు అన్నీ ఇప్పుడు రష్మీని టార్గెట్ చేశాయి. దానికి రష్మీ "సౌమ్య రావు మీద  నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు. నా స్థానంలోకి కొత్త యాంకర్ వస్తుందని ముందే చెప్పారు. నేను కూడా స్టాండ్ బై గా వచ్చానని ఎప్పుడో చెప్పా కదా. అనసూయ మానేయడంతో కొత్త యాంకర్ ని తీసుకునే వరకు నన్ను యాంకర్ గా ఉండమన్నారు. అలాగే చేసాను. ఎప్పుడైనా అనసూయకి షో చేయడం కుదరని పక్షంలో నేను స్టాండ్ బైగా కూడా చేసాను. ఇన్-కేసు రేపు సౌమ్యరావుకి ఏదైనా కుదరని పక్షంలో అప్పుడు కూడా నేను ఈ షో చేస్తాను. ఇది నా మల్లెమాల.. నా షో... జబర్దస్త్ యాంకర్ గా నేను వ్యవహరించేది కొద్దికాలమే అని నాకు తెలుసు, కాబట్టి ఈ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు." అని చెప్పుకొచ్చింది. ఇక సౌమ్యరావు రాకతో రష్మీ ఎక్స్ట్రా ఇన్కమ్ ను కోల్పోయారు అనే విషయం అర్ధమవుతోంది. దానికి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది సెటైర్ కూడా వేసాడు. జబర్దస్త్ యాంకర్స్ గా రష్మీ గౌతమ్, అనసూయ ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్లారు. వాళ్ళు లేకపోతే షో లేదు అన్నట్టుగా మెస్మరైజ్ చేసేసారు. ఇక ఇప్పుడు సౌమ్య రావు వంతు వచ్చింది. ఆ ఇద్దరినీ ఆమె బీటౌట్ చేస్తే మాత్రం ఆమె దశ తిరిగినట్టే లేదంటే ఆడియన్స్ నుంచి విమర్శలు తప్పవు. 

అక్కడ చాలా పాలిటిక్స్ ఉంటాయి..ఆది, సుధీర్ మీద కామెంట్స్ వైరల్

అదుర్స్ ఆనంద్ ఒకప్పుడు జబర్దస్త్ లో దాదాపు ఐదేళ్లు చమ్మక్ చంద్ర టీమ్ లో కంటెస్టెంట్ గా చేసేవాడు. తర్వాత ఈ షో నుంచి చమ్మక్ చంద్ర తప్పుకున్న తర్వాత ఆనంద్‌కు టీమ్ లీడర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత తనను జబర్దస్త్ నుంచి బయటకి వెళ్లిపోయేలా చేశారు చాలామంది అని   తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. "పాత డైరెక్టర్స్ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు టాప్ రేటింగ్ లో ఉన్న టీంలీడర్స్ మాటనే  వినేవాళ్ళు. మరి నా స్కిట్స్ నచ్చలేదా..లేదా నేను నచ్చలేదా అనే విషయం తెలియదు. నా టీంని షో నుంచి తీసేయమని చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అవి నిజమైన పబ్లిక్ పెట్టారో లేదా పెట్టించారో తెలియదు నాకు. ఆ తర్వాత జబర్దస్త్ గంటన్నర షో నుంచి వన్ అవర్ షోకి వచ్చేసరికి 5 టీమ్స్ ని సెలెక్ట్ చేసి నాది ఆరవ టీమ్ అయ్యేసరికి నన్ను బయటికి వెళ్లిపోయేలా చేశారు. నాకు పిల్లలు, ఫామిలీ ఉంది..అలాంటి టైములో వాళ్లకు చేతులెత్తి  కూడా మొక్కాను. ఐనా వాళ్ళు నా గురించి ఆలోచించలేదు.. ఒక టైంలో నా టీంలో నేనేంటి అనే విషయం నాకే అర్ధం కాలేదు. తర్వాత నాకు ఎవరూ ఫోన్స్ చేయలేదు. ధనరాజ్ అన్న నన్ను చేరదీసాడు. ఎవరు ఎవరినీ తొక్కేయలేరు..హైపర్ ఆది గారు, సుడిగాలి సుధీర్ గారు స్కిట్స్ మాత్రమే విన్నింగ్ అనుకుంటే ఎలా...డైరెక్టర్స్ కి ఏ టీం లీడర్ ఐనా విన్ అవకపోతే వాళ్లకు ఒక ఫోబియా ఉంటుంది..ఇంకా వాళ్ళు విన్ ఎవరు అని..ఏదేమైనా నేను బయటికి వచ్చేసి యూట్యూబ్ పెట్టుకున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, మూవీస్ లో చేస్తున్నా, జబర్దస్త్ నుంచి బయటికి వచేసాక "ఆకాశమంత" అనే సీరియల్ ఒకటి చేసాను, మూవీస్ లో, వెబ్ సిరీస్ లో చేస్తున్నా. అలాగే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని కాబట్టి నాకు బయట ఈవెంట్స్ అవి వచ్చినప్పుడు చేస్తూనే ఉన్నా. " అని ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.

వాళ్లకి ఆడటం చేతకాదు.. నీ ఓవరాక్టింగ్ తగలెయ్య!

బిగ్ బాస్ హౌస్ లో రోజుకో గొడవ కామన్ గా జరుగుతోంది.  అయితే ఇది టాస్క్ లోనే కావడం విశేషం. కాగా బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. అది  'Sticky situation'. అయితే ఈ టాస్క్ ని, ముందు గేమ్ లో ఓడిన కంటెస్టెంట్స్ కి కల్పించారు. ఇందులో గెలిచి కెప్టెన్సీ పోటీదారుల రేస్ లోకి వచ్చే అవకాశం‌ శ్రీసత్య, ఇనయా, ఫైమా, రోహిత్ కి కల్పించారు. ఈ గేమ్ లో శ్రీసత్య, రోహిత్ గెలిచి కెప్టెన్సీ పోటీకి మళ్ళీ అర్హత సాధించారు. అయితే ఈ గేమ్ లో ఇనయా తప్పుగా మట్లాడింది. ఆ తర్వాత కాసేపటికి "నేను గేమ్ లో తప్పుగా మట్లాడాను. సారీ" అని ఇనయా అందరి ముందు చెప్పింది. "తప్పు చేసి సారీ చెప్పడం కాదు. తప్పు చేయకుండా ఉండటం ఇంపార్టెంట్" అని ఆదిరెడ్డి, రాజ్ తో చెప్పాడు. ఆ తర్వాత ఫైమా, రేవంత్ కి మధ్య వాగ్వాదం జరిగింది. "ఓవర్ యాక్టింగ్ చేయకు. ప్రతీ ఒక్కరు ఫిజికల్ అంటున్నారు" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత "రేవంత్ చూసుకొని ఆడు" అని శ్రీసత్య అంది. "ఆడితే ఫిజికల్ అంటారు. వాళ్ళకి ఆడటానికి చాతనవ్వదు" అని రేవంత్ అనగా, "ఏంటి నీ ఓవరాక్టింగ్ తగలెయ్య" అని కీర్తి భట్ అంది.  "నా మీద ఒక్క గోరు పడ్డా, నేను ఫిజికల్ అవుతాను. కావాలంటే నా మీద నామినేషన్ వేసుకో" అని ఆదిరెడ్డితో, రేవంత్ అనగా, "నేను సైలెంట్ గా ఆడుతాను. నామినేషన్ లో నిన్ను వెతుక్కోనవసరం లేదు. అరగంటకో నామినేషన్ పాయింట్ ఇస్తావ్. నేను నీట్ గా ఆడుతాను. నువ్వు ఫిజికల్ గా ఆడినా, నేను సైలెంట్ గానే ఆడుతాను" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత "నువ్వు ఎలాగైతే ఫ్లోలో చేసావో. నేను అలాగే చేసాను" అని ఫైమా అంది. "నువ్వు డైలాగ్ లేకుండా ఆడు" అని రేవంత్ అనగా, నువ్వు ఫిజికల్ లేకుండా ఆడు" అని ఫైమా అంది. "మెరీనా దగ్గర బంగారు మణి ఉన్నందువల్ల ఎవరికి మీరు కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ కోరగా, అందరూ కలిసి మెరీనా ని కెప్టెన్సీ పోటీకి ఎంపిక చేసారు.

ఆకట్టుకుంటోన్న ఆదిత్య ఆట.. బెస్ట్ పర్ఫామర్ గా రాజ్!

కంటెస్టెంట్స్ టాస్క్ లో చేసే పర్ఫామెన్స్ ని బట్టి  హౌస్ లో ఎవరు ఉండాలో? ఉండకూడదో? అని ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పటిదాకా జరిగిన టాస్క్ లో పర్ఫామెన్స్ పరంగా రాజ్, ఆదిత్య బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. అయితే మొన్న నామినేషన్ జరిగిన తర్వాత మొదలైన పోలింగ్ లో ఆదిరెడ్డి, రేవంత్ మొదటి రెండు స్థానాలలో ఉండగా రాజ్, బాలాదిత్య తర్వాత స్థానాలలో ఉన్నారు. దీనికి కారణం నో ఓవరాక్షన్, నో డ్రామా, సైలెంట్ గేమర్స్. కాగా ఆదిత్య మాత్రం కాస్త డిఫరెంట్. మొన్నటి దాకా అందరు మాస్క్ వేసుకొని నటిస్తున్నాడు అని అనుకున్నారు‌. కానీ అలా ఉండటం. అతని సహజమైన శైలి అని తెలుస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్ లో ఇనయాకి ఎవరు సపోర్ట్ చేయకపోయిన తను సపోర్ట్ చేసాడు. ఇలా తనని నామినేషన్ చేసిన వాళ్ళతో కూడా కలిసిపోవడం అనేది చాలా ఉత్తమమైన గుణం అని ప్రేక్షకులు భావిస్తోన్నారు. అయితే ఎవరు ఏది అడిగినా ఇస్తూ, ఎవరి దగ్గర నుండి ఏ హెల్ప్ ఆశించకుండా ఉంటున్నాడు. కాగా ఇప్పుడు ఇదే విషయం ప్రేక్షకులను ఆకట్టుకోగా, ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. అలాగే రాజ్ కూడా సైలెంట్ గా ఉంటూ, తన అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతుంటాడు. హౌస్ మేట్స్ తో తన అవసరం ఉంటేనే ముందుకు వచ్చి మాట్లాడటం. ఎలాంటి గొడవలకు పోకుండా హౌస్ లో యూనిక్ గా ఉంటూ వస్తోన్నాడు. ఒక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన తనకి చాలా ఓపిక. ఇదే ఇప్పుడు రాజ్ ని బెస్ట్ పర్ఫామర్ ని చేస్తూ, ఇంకా ముందుకు తీసుకెళ్తోంది అని చెప్పాలి.

'నాగమణి'ని సొంతం చేసుకునేదెవరు?

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. దీనికి కారణం మొన్న జరిగిన స్నేక్-లాడర్ గేమ్ లో ఫిజికల్ గా గొడవలు పడటం ఒక కారణం అయితే, నిన్న మొదలైన 'నాగమణి' టాస్క్ మరొక కారణం.   "కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ 'నాగమణి'. ఈ నాగమణిని ఒక టీం సభ్యులు కాపాడుకోవాలి. మరొక టీం సభ్యులు తీసుకోవాలి. ఫైనల్ బజర్ మోగేసరికి ఎవరి దగ్గర ఎక్కువ 'నాగమణి' రత్నాలు ఉంటాయో, వారే ఈ టాస్క్ లో విజేతలు. ఈ టాస్క్ లో ఇనయా, వసంతి సంచాలకులుగా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు. ఇనయా, వసంతి కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి వారి దగ్గర ఉన్న 'బంగారు మణి' ని లాడర్ టీంకి ఇచ్చారు. కాగా టాస్క్ లో రేవంత్ మళ్ళీ తన అగ్రెసివ్ బిహేవియర్ ని చూపించాడు. కీర్తి భట్ ఎప్పటిలాగే ఏడుపు కొనసాగించగా, ఆదిత్య ఓదార్చాడు. అయితే హౌస్ లో ఏ గొడవకు పోకుండా, తమ గేమ్ తాము ఆడేది రోహిత్, రాజ్ మాత్రమే. కాగా ప్రేక్షకులు ఆదిరెడ్డి ఆటను బాగా ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. వసంతి ఎప్పటిలాగే వెనుకాల ఉండిపోయింది. ఇలా ఒక్కొక్కరుగా ఆడుతోన్న హౌస్ మేట్స్ ఒక టీంగా ఆడుతారో? లేదో? చూడాలి మరి. అయితే వీరిలో ఈ నాగమణి టాస్క్ లో ఎవరు గెలుస్తారో? అనే ఉత్కంఠ మొదలైంది.

ఆలీ పెద్ద కోతి..మందు కొట్టి చేపలతో మాట్లాడే శీను

ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఒక పక్క కమెడియన్ గా బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు సెలెబ్రిటీస్ ని తన షోకి తీసుకొచ్చి ఎన్నో విషయాలను వాళ్ళ నుంచి రాబడతున్నాడు. ఇక ఇప్పుడు ఆలీతో సరదాగా షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో  సీనియర్ నటి తులసి,  ప్రభాస్ శ్రీను వచ్చారు. డార్లింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఈ డార్లింగ్ దొరికాడని చెప్పింది తులసి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారినట్లు చెప్పింది. తులసి మూవీ ఇండస్ట్రీలోకి  మూడు నెలల పసి కాదుగా  ఉన్నప్పుడే ఎంటర్ అయ్యిందని చెప్పింది. " మూడు నెలలప్పుడు సినిమాకు పరిచయమయ్యాను.. మూడేళ్లకు డైలాగ్ చెప్పాను. వందేళ్ల సినీ పరిశ్రమలో నేను 56 ఏళ్ళ నుంచి ఉంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఆలీతో కలిసి చిన్నప్పుడే కలిసి నటించాను అని చెప్పిన తులసి ఆలీ ఒక సినిమా సెట్ లో చేసిన అల్లరి పనిని చెప్పుకొచ్చింది. "నాలుగు స్తంభాలాట సినిమాసెట్ లో నాకు ఆలీ సైట్ కొట్టేవాడు.. చాలా చిన్నగా ఉండేవాడు.. కానీ పెద్ద కంత్రీ” అని చెప్పగా ఆలీ “నేను అప్పుడు నిక్కరు వేసుకున్నాను కానీ  బటన్ పెట్టుకోలేదు.. అప్పుడు ఆమె చూసి.. ఒరేయ్.. బటన్ వేసుకోలేదురా అని నవ్వింది. వెంటనే నేను సౌండ్స్ చేసి ఏడిపించాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ శ్రీను మందు బాగా కొడతాడని, ఆ సమయంలో అక్వేరియంలో ఉన్న  చేపలతో మాట్లాడతాడని చెప్పి నవ్వులు పూయించాడు.

చెప్పుకోదగ్గ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లేవు.. ఢీ షో చాలా స్లోగా ఉంది

ఢీ షో క్వార్టర్ ఫైనల్స్ కి అడుగుపెట్టింది. కానీ ఆ ఫైర్, జోష్ అనేవి ఈ ఎపిసోడ్ లో ఎక్కడా కనిపించలేదు. ఆ హడావిడి లేదు. ఎంతసేపు ఆది, అఖి, ప్రదీప్ కుళ్ళు జోక్స్ చెత్త స్కిట్స్ తప్ప. డాన్స్ షోలో స్కిట్ ఏంటో అని నెటిజన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. జతిన్, మహాలక్ష్మి డాన్స్ చేసాక ప్రదీప్ ఒక టాస్క్ ఇచ్చాడు.  ఆదికి శ్వేతకి, అఖిల్ కి నయనిపావనికి పెళ్ళైతే అని ప్రదీప్ ఒక లైన్ చెప్పేసరికి ఒక కామెడీ స్కిట్ అనేది ఢీ 14 షోలో పేలింది. అఖిల్ ఆఫీస్ కి వెళ్తూ ఆదిని భోజనం చేశారా అనేసరికి "ఎక్కడా చేసే లోపే నువ్వొచ్చావ్" అన్నాడు ఆది. ఇంతలో ప్రదీప్ బుక్ పట్టుకొచ్చి "రావు గారు కెమిస్ట్రీలో నాకు ఒక డౌట్ ..ఔరంగజేబు a + b హోల్ స్క్వేర్ అనేసరికి "ఏమిటి నీకేమన్నా మెంటలా కెమిస్ట్రీ లో ఔరంగజేబ్ కాదు ఉండేది అవి ఉంటాయి" అని డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాడు ఆది. ఇక జతిన్, మహాలక్ష్మి, తనుశ్రీ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. ఇక ఆది కెమిస్ట్రీ గురించి చెప్పేసరికి నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. "ఆది ఆకలికి  బాగా ఆలవాటు పడ్డారు.. ఆది ఫైర్" అని ఎమోజిఎస్ పెట్టి కామెంట్స్ పెట్టారు. అంతే కాదు ఈ షో మీద కూడా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. " చెప్పుకోదగ్గ  డాన్స్ లేదు..... ఢీ షో చాలా స్లోగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్ కి మ్యాచ్ అయ్యే  డాన్స్ అసలు లేదు. ఇంతక ముందు ఢీ షో  చాలా బాగుండేది." అని అంటున్నారు నెటిజన్స్.

ఏంటి శ్రీరామ్ పొటాటో కట్ చేయడానికి అంత కుస్తీ పడుతున్నావ్

"ఆహా"లో మంచి లక్ష్మి హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ చెఫ్ మంత్ర సీజన్ 2 .  ఈ క్రమంలోనే ఎపిసోడ్  7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి  గెస్ట్ లుగా ఫేమస్  సింగర్ శ్రీరామ్ చంద్ర, నటి రాశిసింగ్ ఎంట్రీ ఇచ్చి  సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ‘పాపం పసివాడు’ అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇది త్వరలో ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇక ఇప్పుడు   చెఫ్ మంత్రాకు వచ్చిన వీరిద్దరితో మంచు లక్ష్మీ తనదైన శైలిలో అల్లరిచేసింది, చేయించింది. వారితో రకరకాల వంటకాలను చేయించింది. "శ్రీరామచంద్రని పిలిస్తే ఆయన డూప్ ని తీసుకొచ్చారేమిటి" అని సెటైర్ వేసింది మంచు లక్ష్మి. "శ్రీరామ్... రాశిసింగ్  ఫుట్ వేర్ సైజు ఏమిటి అని అడిగేసరికి సిగ్గుపడ్డాడు. దాంతో ఇద్దరి మధ్యన ఏదో జరుగుతోంది" అని చెప్పింది లక్ష్మి. "ఏంటి శ్రీరామ్ పొటాటో కట్ చేయడానికి అంత కుస్తీ పడుతున్నావ్" అంది. ఇక శ్రీరామ్ చపాతీని హార్ట్ షేప్ లో చేసి తెలియకుండా హార్ట్ షేప్ వచ్చేసిందని చెప్పేసరికి "అందుకేనా ఇంకా సింగల్ గా వున్నావ్ " అని కౌంటర్ వేసింది హోస్ట్. ఇక శ్రీరామచంద్ర ఫైనల్ గా ఒక సాంగ్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్  నవంబర్ 11 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు  ప్రసారం కానుంది.