ఇలాంటి రొమాంటిక్ గేమ్స్ ఆపేస్తే మా ఊపిరి ఆగిపోతుంది!
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. "బావగారు బాగున్నారా" టైటిల్ తో ఈ ఎపిసోడ్ రన్ అయ్యింది. ఇక ఈ షోలోకి "అహ నా పెళ్ళంట" వెబ్ సిరీస్ నుంచి రాజ్ తరుణ్, శివాని ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం షోలో ఒక వెరైటీ సెగ్మెంట్ ప్లాన్ చేశారు. ఈ సెగ్మెంట్ ని రొమాంటిక్ గా ప్లాన్ చేసింది ఇంద్రజ.
స్టేజి మీద ఒక ఉయ్యాలను ఏర్పాటు చేసి బావల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఒళ్ళో మరదళ్ళు కూర్చుని ఊగుతూ పక్కన పెట్టిన బాల్స్ ని ఎదురుగా ఉండే టబ్ లో వేయాలి. ఇది సెగ్మెంట్ థీమ్. ఇక జెస్సి-అంకిత, ఆదర్శ్-అన్షు, శ్రీకర్ - నీలిమ, మహేష్-రమ్య, ఆది-శ్వేతవర్మ, నాటీ నరేష్-పవిత్ర, నూకరాజు-ఆసియా, ప్రవీణ్-సింధు, అజర్-మోనికా, పరదేశి-కావ్య.. ఇలా ఈ సెగ్మెంట్ లో ఆది-శ్వేతవర్మ విన్ అయ్యారు.
ఈ సెగ్మెంట్ గురించి ఆది మాట్లాడుతూ "శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్ని ఎపిసోడ్స్ చేసానో తెలీదు కానీ..కుర్చీలాట ఎపిసోడ్, ఈ ఉయ్యాల ఎపిసోడ్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. రాబోయే వారాల్లో ఇలాంటి సెగ్మెంట్స్ పెట్టాలి అని కోరుకుంటున్నా. ఇలాంటి గేమ్ లు అస్సలు ఆపొద్దు..గేమ్ లు ఆపేస్తే మా ఊపిరి ఆగిపోతుంది"అన్నాడు.
ఇక ఫైనల్ గా రాజ్ తరుణ్- శివాని వచ్చారు కానీ పక్క పక్కన కూర్చునేసరికి ఇంద్రజ అదేంటి "మా షో చూసారు కదా పక్క పక్కన కూర్చున్నారేంటి" అనేసరికి "ఏమిటి మీరు రాజశేఖర్ గారి అంకుశం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారా" అని ఆది కౌంటర్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ఫైనల్ గా రాజ్ తరుణ్- శివాని ఎక్కువ బాల్స్ వేసి ఆది-శ్వేతవర్మ ని బీటౌట్ చేసింది.