పెళ్ళికి చీరల షాపింగ్.. చీరల్ని కాబోయే భర్తకు చూపించిన నేహా!

బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ అయిన నేహా చౌదరి త్వరలో  పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే పెళ్లి మండపం సెట్ చేసేసుకుంది. అలాగే పెళ్లి చీరల షాపింగ్ కూడా చేసేసింది. అన్ని రకాల చీరల్ని వేసుకుని ట్రై చేసింది. నేహా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో ఈమె నేషనల్ ఛాంపియన్. కానీ ఈమెకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అందుకే స్మాల్ స్క్రీన్ మీద ఎక్కువగా షోస్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లి చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండగా తన కాబోయే భర్త అనిల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమేం చీరలు సెలెక్ట్ చేస్తున్నావో అన్నీ కూడా పిక్స్ పెట్టు అని మెసేజ్ పెట్టేసరికి నేహా కూడా తనను అనిల్ బాగా సపోర్ట్ చేస్తాడని మంచి కంపెనీ ఇస్తాడని, తనకు అలా ఉండడం అంటే చాలా ఇష్టం అని  చెప్పుకొచ్చింది. పెళ్ళికి కావాల్సిన చీరలు, పెట్టుబడి చీరలు ఇలా మొత్తంగా ఎన్నో రకాల చీరల్ని తీసుకుంది నేహా.

ఘనంగా 'కోడలా కోడలా కొడుకు పెళ్ళామా' హీరోయిన్ వివాహ వేడుక

ఒకప్పుడు బుల్లితెర మీద  ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అనే సీరియల్ ఒక రేంజ్ లో సక్సెస్ సాధించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ ‘సాథ్ నిబానా సాథియా’ని తెలుగులో అనువదించారు. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ని రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో  గోపిక పాత్రలో నటించిన దెవోలీనా భట్టాచార్జీ తెలుగు ప్రేక్షకులకు బాగా  దగ్గరయ్యింది. ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదయ్యింది. రీసెంట్ గా  ఆమె హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి అన్ని  ఫంక్షన్స్ ని అలాగే తన  ప్రీ వెడ్డింగ్ - వెడ్డింగ్ మూమెంట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. లోనావాలాలో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈమె ఫేమస్ జిమ్ ట్రైనర్ షోనుని వివాహం చేసుకున్నట్లు అని చెప్తూ ఆ ఫొటోస్ ని ఫాన్స్ కోసం షేర్ చేసింది.

చాలా సాధారణ జీవితం నాది...నా జీతం చిన్నారి కాన్సర్ పేషెంట్స్ కి ఇస్తుంటాను

"ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్ తో కస్తూరి బుల్లితెర మీద ఫుల్ ఫేమస్ అయ్యింది. అందులో తులసి పాత్రలో కస్తూరి పడే కష్టాలు చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్  ఫీలైపోతుంటారు. ఇక ఈమె  నాగార్జున నటించిన  ‘అన్నమయ్య’ సినిమాలో ఒక  హీరోయిన్ గా చేసింది.. అలాగే  ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ లో ఒక బోల్డ్ క్యారెక్టర్ కూడా చేసింది. ఇక ఈమె ఇన్ స్టా పోస్టులు చూస్తే.. ఈమె అందం ముందు యంగ్ బ్యూటీస్ ఎవరూ సరిపోరని అనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. రీసెంట్ గా  ఆమె చెన్నై మెట్రోలో ప్రయాణిస్తూ తన ఫోన్ పారేసుకుంది. దీని గురించి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయడంతో  వాళ్లు వెంటనే ఆమె ఫోన్ ని వెతికి తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో కస్తూరి తెగ మురిసిపోయింది.. చెన్నై మీద, అక్కడి ఆఫీసర్స్ మీద తనకు మంచి రెస్పెక్ట్ ఉందని చెప్తూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.  ఇక ఇదంతా చూసిన ఒక  నెటిజన్.. ‘మీలాంటి వాళ్లకు సొంతంగా కార్లుంటాయి కదా ..వాటిల్లో వెళ్తే ఫోన్ పారేసుకుని అవకాశమే ఉండదు కదా..మరి ఎందుకు ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా ?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి రెస్పాండ్ అవుతూ ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఎలాంటి ఖరీదైన వస్తువులు లేవు . నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని రీట్వీట్ చేసింది. అలాగే మీరు సంపాదించే డబ్బులు ఎం చేస్తారు అని మరో నెటిజన్ అడిగేసరికి ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్ అవసరమైన చిన్నారి  క్యాన్సర్ పేషెంట్స్ కోసం  ఖర్చు పెడతాను’ అని చాలా జనరల్ గా హార్ట్ టచింగ్ గా ఆన్సర్ చేసింది. ఆమె నవ్వులాగే ఆమె జవాబు కూడా ఉంది అంటున్నారు ఆమె ఫాన్స్.

గూగుల్ తల్లి చెప్పిన బిగ్ బాస్ విన్నర్ రోహిత్!

బిగ్ బాస్ సీజన్-6 లో రోజు రోజుకి అంచనాలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా రేవంత్ టైటిల్ విన్నర్ అవుతాడు అని అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు తాజాగా ఈ రేస్ లోకి రోహిత్  వచ్చాడు. బిగ్ బాస్ లో రోహిత్ ప్రస్థానం యునిక్. ఎవరితో గొడవలు లేవు. ఎవరికీ నచ్చకపోవడానికి పెద్దగా రీజన్స్ కూడా లేవు. అయితే బిగ్ బాస్ కి రాకముందు రోహిత్ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడయితే బిగ్ బాస్ లోకి వచ్చాడో.. తన రూటే సపరేట్ అయ్యింది. మొదట్లో మెరీనా-రోహిత్ ఇద్దరు కలిసి ఆడినప్పుడు పెద్దగా కనిపించలేకపోయాడు. కానీ ఎప్పుడయితే మెరీనా బయటకొచ్చిందో, అప్పటి నుండి రోహిత్ తనని తాను మల్చుకుంటూ వచ్చాడు. హౌస్ లో అందరితో బాగా క్లోజ్ అయ్యాడు. తన మాటతో, ఆటతో, నిజాయితీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నాగార్జున కూడా పలుసార్లు రోహిత్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. అటు హౌస్ మేట్స్, ఇటు ప్రేక్షకులు రోహిత్ కి జెంటిల్ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్, కూల్ అంటూ పేర్లు కూడా పెట్టి హైలైట్ చేసారు. అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం స్వల్ప ఓట్ల తేడాతో రోహిత్, రేవంత్ మొదటి స్థానానికి పోటీ పడుతున్నారు.  అయితే బిగ్ బాస్ ముగియడానికి ఇంకా అయిదు రోజుల సమయం ఉన్నా.. గూగుల్ లో 'బిగ్ బాస్ సీజన్-6 విజేత ఎవరు' అని సెర్చ్ చేయగానే రోహిత్ పేరు రావడంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులు హ్యాపీగా  సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. మరి అతను నిజంగానే టైటిల్ గెలుస్తాడో.. లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎమోషనల్ గా కీర్తి భట్ జర్నీ.. ఓటింగ్ లో గెలుస్తుందా మరి!

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ కీర్తి భట్. హౌస్ లోకి అడుగుపెట్టిన నుండి కీర్తి భట్ అనగానే 'ఎప్పుడూ ఏడుపే' అనేంతలా గుర్తుండిపోయే పేరుగా మారింది. కానీ ఆ తర్వాత తన శైలిని మార్చుకుంది. తనలో మరో రూపాన్ని హౌస్ మేట్స్ తో పాటు, ప్రేక్షకులకు పరిచయం చేసింది. హౌస్ లోకి అన్నీ కోల్పోయి అడుగుపెట్టిన కీర్తికి, అన్నీ తానై అక్కున చేర్చుకుంది బిగ్ బాస్. హౌస్ మేట్స్ తో తను మాట్లాడేందుకు సమయం ఇచ్చింది. తనకంటూ కొంత అభిమానం దొరికేలా చేసి, ప్రేక్షకుల సపోర్ట్ లభించేలా ప్రోత్సహించింది. అన్నింటికీ మించి ఎవరు లేరని, తనలో తాను బాధపడుతున్న కీర్తికి..  మేము ఉన్నామంటూ హౌస్ మేట్స్ నే ఒక ఫ్యామిలిలా ఇచ్చి, తనలోని కళని బయటకు తీసుకొచ్చింది బిగ్ బాస్ షో. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కీర్తిని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్. ఆ తర్వాత తన మెమోరీస్ అన్నింటిని చూపించాడు. "మొదటి నుండి మీ మొండితనం, దేన్నయినా సాధించాలనే దృఢమైన సంకల్పమే మిమ్మల్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. మీకంటూ ఓ కుటుంబం లేదని బాధపడ్డారు. మనసులోని ఆ బాధని మీ కన్నీళ్ళు దాచలేకపోయాయి. హౌస్ లో మీరు అనుకున్న విషయాన్ని గట్టిగా తెలిపినా కూడా.. హౌస్ లో మీకు ‌సపోర్ట్ చేసేవాళ్ళు కరువయ్యారు. అయినా సరే ఒంటరిగా పోరాడారు. పద్నాలుగు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. మీలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒక్కటి కాదు.. కొన్ని లక్షలు" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎమోషనల్ అయిన కీర్తి "థాంక్స్ బిగ్ బాస్.‌ దిజ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్.. నన్ను వదిలేసిన వాళ్ళకి చెప్తున్నా 'ఇది కీర్తి.. ఇదే కీర్తీ" అని చెప్పింది.

ఘనంగా అమరదీప్, తేజస్విని పెళ్లి వేడుకలు..విషెస్ చెప్పిన ఫాన్స్!

స్మాల్ స్క్రీన్ సెలెబ్స్ అంతా ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. లేటెస్ట్ గా అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ ఇద్దరూ కూడా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.   బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వీళ్ళు ఇప్పుడు  మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. రెండు రోజుల క్రితమే వీళ్ళ హల్దీ ఫంక్షన్ జరిగింది. అమర్ దీప్  ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో నటిస్తుండగా.. ‘కేరాఫ్ అనసూయ’ సీరియల్ లో హీరోయిన్ గా తేజస్విని  నటిస్తోంది. ఇక అమర్ దీప్ లండన్ లో బీటెక్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి ‘పరిణయం’ అనే షార్ట్ ఫిల్మ్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసాడు. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో  నటించాడు. `ఉయ్యాల జంపాల` అనే సీరియల్‌ తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత `సిరిసిరి మువ్వ` సీరియల్ తో లీడ్ యాక్టర్ గా మారాడు. ఇక  కర్ణాటకకు చెందిన తేజస్విని బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో కంప్లీట్ చేసి మోడలింగ్ రంగంలోకి  అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుని ఒకింటి వారయ్యారు. నెటిజన్స్, ఫాన్స్ వీళ్లకు "హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని విషెస్ చెప్తున్నారు.

నైట్ టైం వీడియో కాల్స్ మాట్లాడుతున్నా అందుకే అంత జ్ఞానం వచ్చేసింది!

స్మాల్ స్క్రీన్ మీద రోజు రోజుకు ఎన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా అలా స్టార్ట్ అయ్యిందే ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ ఒకరికి ఒకరు అనే ప్రోగ్రాం.  యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జెస్ గా  ఉన్నారు.  ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ కాబట్టి.. ప్రతి ఎపిసోడ్ లో రియల్ జంటలతో పాటు రీల్ జంటలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి.  సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ తో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా వచ్చి ఈ షోలో సందడి చేస్తూ ఉంటారు.  ఈటీవీలో ప్రతి మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఇక ఇప్పుడు వచ్చే వారం  ఎపిసోడ్ కి సంబంధించి సరికొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హోస్ట్  శ్రీముఖి రచ్చరచ్చ చేసేసింది. సీరియల్ నటి శ్రీవాణి భర్తపై.. కమెడియన్ రాకింగ్ రాకేష్ పై డబుల్ మీనింగ్ పంచ్ డైలాగ్స్ వేసేసింది. ఆఖరికి జడ్జిలు శివబాలాజీ, స్నేహ ‘లవ్ గేమ్స్’ అనంటే.. "అమ్మానాన్న ఆటలు" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయింది.   "నీకు అంత నాలెడ్జి ఎలా వచ్చింది అని శ్రీవాణి భర్త అడిగేసరికి ఈమధ్య నేను కూడా నైట్ టైం వీడియో కాల్స్ మాట్లాడుతున్నా అందుకే చాలా జ్ఞానం వచ్చేసింది" అని పంచ్ డైలాగ్ వేసింది. 

నీలాంబరిలా నా ఎలిమినేషన్ ని చూసుకుని బాధపడ్డా...

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి బిగ్ బాస్ సీజన్ 6 నుంచి కంటెస్టెంట్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీముఖి వీళ్లందరితో రకరకాల గేమ్స్ అవీ ఆడించింది. ఇక తర్వాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కొత్త పెళ్లి కూతురు నేహాతో ఒక సాంగ్ కి డాన్స్ చేయించింది. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో గీతూ ఏడ్చిన విషయం గురించి చెప్తూ శ్రీముఖి తన ఫీలింగ్ గురించి అడిగేసరికి అప్పటివరకు బాగా జోష్ తో గేమ్స్ ఆడి డాన్స్ చేసిన గీతూ ఒక్కసారిగా ఎమోషన్ ఐపోయింది. "నన్ను బిగ్ బాస్ హౌస్ విషయాలేవీ అడగొద్దు. నేను తట్టుకోలేను. ఇన్ని రోజులు ఇంట్లోంచి రాకుండా నా ఎలిమినేషన్ చూసుకుని ఏడుస్తూనే ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నా గురించి ఎవరూ అర్ధం చేసుకోలేదు కానీ బయటికి వచ్చాక అందరూ నన్ను అర్ధం చేసుకున్నారు. నాకు ఇప్పటివరకు 50 వేల మెసేజెస్ వచ్చాయి. అవి ఇంకా చదువుతూనే ఉన్నా. నరసింహ మూవీలో నీలాంబరి ఇంట్లోనే ఎన్నో ఏళ్ళు ఎలా ఉండిపోయిందో నేను కూడా అలాగే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి బాధపడ్డా " అని అనేసరికి బిగ్ బాస్ ని హ్యాపీ మెమరీగా మనసులో ఉంచుకో అని గీతూని ఊరుకోబెట్టింది హోస్ట్ శ్రీముఖి.

త్రోబ్యాక్ ఫోటో.. ఆమెకు నిజంగానే పెళ్లయిందా?

ఇనాయ సుల్తానా..బిగ్ బాస్ సీజన్ 6 లో పెద్ద ఆటంబాంబు. ఈ బోల్డ్ లేడీ తన గేమ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అమ్మాయిలు అంటే అలానే  ఉండాలి అనే విధంగా గేమ్ ఆడి చూపించింది. కంటెస్టెంట్ సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్ కే చెప్పేసింది ఇనాయ. ఎలాంటి ఎమోషన్ ని ఐనా వెంటనే ఎక్సప్రెస్ చేసేస్తుంది. అలాంటి ఇనాయ 14వ వారం ఎలిమినేట్ ఐపోయింది. మూడు నెలలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇనయా బయటకు వచ్చిన వెంటనే తన క్రష్ సూర్యను,  ఫ్రెండ్ వాసంతిని కలిసింది. అలా వాళ్ళతో  కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి అవి  ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇనాయకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. అదే ఆమెకు గతంలో పెళ్లి అయ్యింది అని. తనకు ఎన్నో ఏళ్ళ క్రితం పెళ్లి ఐన ఫోటో ఒకటి త్రో బ్యాక్ మెమోరీస్ ద్వారా బయటికి వచ్చింది. ఇక ఆ ఫోటోలో ఆమె పెళ్ళికూతురి ముస్తాబుతో కనిపించింది.  ఐతే ఆమెకు అసలు పెళ్లి నిజంగానే అయ్యిందా, లేదా? అంటూ ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ఐతే ఇది పెళ్లి ఫోటోనా లేక ఇంకా ఏదైనా ఫంక్షన్ కి రెడీ ఐన ఫోటోనా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకొచ్చేస్తుందా!

హోరా హోరీగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్-6 చివరి దశకి చేరుకుంది. అయితే ఈ వారంలోనే గ్రాండ్ ఫినాలే కావడంతో ఆ పనుల్లో బిజీ అయిపోయిన బిగ్ బాస్, అందులో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. సోమవారం నుండి బుధవారం వరకు జరిగే ఓటింగ్స్ లో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు ఫినాలే రేస్ నుండి అవుట్ అని బిగ్ బాస్ చెప్పగా, శ్రీసత్య అందరి కన్నా తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉంది. దీంతో తనే కచ్చితంగా బయటకొచ్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఓటింగ్ పరంగా చూస్తే.. ఇప్పటివరకు రోహిత్, శ్రీసత్య, కీర్తి లీస్ట్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో రోహిత్ జర్నీ వీడియో చూసి చాలా మంది ఫ్యాన్స్ కూడా రోహిత్ కి ఓట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో‌ ఓటింగ్ లో రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇక కీర్తిభట్, ‌శ్రీసత్య మధ్య స్వల్ప ఓట్ల తేడానే ఉండటంతో ఎవరు బయటకొస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్ గా ఉంది. కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే  'శ్రీసత్య ఎలిమినేటెడ్' అంటూ పోస్ట్ లు కనిపిస్తుండటంతో తనే ఎలిమినేట్ అని నమ్మేవాళ్ళు లేకపోలేదు. 

రోహిత్ అమేజింగ్ జర్నీ!

బిగ్ బాస్ హౌస్ లోకి మెరీనా-రోహిత్ జంటగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వారాలు గడిచిన తర్వాత.. వీరిద్దరిని సెపరేట్ చేసి గేమ్స్, టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్. ఆ తర్వాత మెరీనా ఎలిమినేట్ అయ్యింది. రోహిత్ హౌస్ లో ఒంటరిగా మిగిలాడు. ఇక అప్పటి నుండి రోహిత్ తనలో ఉన్న ఇంట్రోవర్ట్ ని పక్కన పెట్టి.. మెల్లి మెల్లిగా హౌస్ మేట్స్ అందరితో కలవడం మొదలుపెట్టాడు. అయితే మొన్నటి ఫ్యామీలి వీక్ ఎపిసోడ్‌లో రోహిత్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు "రోహిత్ బేటా నిన్ను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నా.. ఒక్కసారి కెప్టెన్ గా ఉండు బేటా" అని చెప్పింది. ఆ డ్రీమ్ కూడా నెరవేరలేదు. అయితే ఇప్పుడు ఫినాలే వరకు వచ్చాడు రోహిత్. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి రోహిత్ ని పిలిచి, అతని జర్నీ వీడియోని చూపించాడు. "రోహిత్.. కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చిన మీకు.. ఈ ప్రయాణంలో తోడు లభించింది. మీ ఆట మెరుగుపరుచుకోడానికి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. కెప్టెన్ కావాలనేది మీ అమ్మ గారి కల.. కానీ ఆ కల నెరవేరలేదు. అది మీ మనసుకి బాధ కలిగించింది. కానీ మీరు ఇప్పుడు ఫినాలేలో ఉన్నారు.‌ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. హౌస్ లో ఫ్రెండ్స్ కలిసి ఆడినప్పుడు తప్పు అనిపించలేదు. కానీ మీరు ఇద్దరు కలిసి ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యిందో అర్థం కాలేదు. అయినా మీరు మీ సహనాన్ని కోల్పోలేదు" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రోహిత్ "థాంక్స్ బిగ్ బాస్.. థాంక్స్ మెరీనా.. థాంక్స్ ఫ్యాన్స్" అని చెప్పాడు.

కామన్ మ్యాన్ ఆదిరెడ్డి జర్నీ సాగిందిలా!

బిగ్ బాస్ ప్రతీ సీజన్లోనూ కామన్ మ్యాన్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సారి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఏ కంటెస్టెంట్ కూడా ఇన్ని వారాలు హౌస్ లో లేరు. అయితే ఫినాలేకి వచ్చిన తొలి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి ఇప్పుడు హౌస్ లో ఉన్నాడు. ఆదిరెడ్డి జర్నీ సాగిందిలా.. ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. నాగార్జున సైతం ప్రతీ వీకెండ్ లో అతడిని డ్యాన్స్ చేయమని చెప్తూ ప్రోత్సహించేవాడు. తనకు వచ్చి రాని డ్యాన్స్ తో హౌస్ లో నవ్వులు పూయించాడు. మొదటి నుండి గీతూతో కలిసి ఉండేవాడు. గీతక్క గీతక్క అంటూ ఎప్పుడూ కలిసి తిరిగేవాడు. గీతు ఎలిమినేట్ అయ్యాక ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో  హౌస్ మేట్స్ కి మెల్లి మెల్లిగా దగ్గర అయ్యాడు.  ఫ్యామిలీ వీక్ లో తన పాప, భార్య రావడంతో ఆ ఎపిసోడ్‌ మొత్తం 'ఆదిరెడ్డి కామన్ మ్యాన్ షో' గా మారిందనే చెప్పాలి.  ఆ తర్వాత ఆదిరెడ్డికి ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగింది.  "ప్రేక్షకులు ఏ స్థానం ఇచ్చినా నేను స్వీకరిస్తాను. మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఏ పొజిషన్ ఇచ్చినా మీకు ఋణపడి ఉంటా బిగ్ బాస్.. నా లైఫ్ మార్చింది బిగ్ బాస్. నా వంద శాతం ఇచ్చి, ఫైనలిస్ట్ లో ఉన్నాను బిగ్ బాస్. లవ్ యూ కవిత.. నీ సపోర్ట్ లేకుంటే నేను బిగ్ బాస్ కి వచ్చేవాడిని కాదు. ఈ ఆనందం ఎంతలా ఉందంటే.. ఇదే ఆనందం ఒక రెండు, మూడు నెలలు ఉంటే లైఫ్ టైమ్ బ్రతుకుతా బిగ్ బాస్" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

'అన్‌స్టాపబుల్' క్రేజ్.. ప్రభాస్ ఎపిసోడ్ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్!

అభిమాన హీరో సినిమా గ్లింప్స్, టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం సహజం. అయితే ఒక ఓటీటీ షో ఎపిసోడ్ గ్లింప్స్, ప్రోమో కోసం ప్రేక్షకులంతా ఎదురు చూడటం ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా అది 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్ విషయంలో జరిగింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ గ్లింప్స్ కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాకుండా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ట్విట్టర్ లో సైతం ఇది ట్రెండింగ్ గా మారింది. 'బాహుబలి మీట్స్ బాలయ్య' అంటూ విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. "రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్" అంటూ ప్రభాస్ సరదాగా మాట్లాడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా సందడి చేయనుండగా.. రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. "ప్రభాస్ ఓ న్యూస్ చెప్తాడు" అంటూ చరణ్ వీడియో కాల్ లో అనడంతో.. "ఏం చెప్తున్నావ్ డార్లింగ్" అని ప్రభాస్ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కానుంది.

మా తల్లి అంటూ ఢీ స్టేజ్ ని ముద్దాడిన శేఖర్ మాస్టర్!

బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి వచ్చిన ఈ ప్రొడక్ట్ ఇప్పటికీ హై స్పీడులో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 14 సీజన్స్‌ను కంప్లీట్ చేసుకొని ఇటీవలే ఢీ 15వ సీజన్‌‌లోకి అడుగు పెట్టింది. ఢీ 15 లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుదేవా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. కాగా ఢీ 15కి సంబంధించిన సెకండ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది మల్లెమాల. ఈ ప్రోమోలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కనిపించేసరికి ఢీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే శేఖర్ మాస్టర్ ఢీకి గుడ్ బై చెప్పి వేరే ఛానల్‌లో ప్రసారమవుతున్న మరో ప్రోగ్రామ్‌‌కి జడ్జిగా వ్యవహరించారు. మరలా తిరిగి ఢీ షోకి జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేశారు. హీరోయిన్ శ్రద్దాదాస్‌తో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ... మేము కొన్ని కమిట్ మెంట్స్ వల్ల అలా వెళ్లి ఇలా వస్తాము తప్ప.. మా తల్లి మాత్రం ఈ తల్లే అంటూ ఢీ స్టేజ్‌ని ముద్దుపెట్టుకున్నాడు. ఇక ఈ ఢీ షో విషయానికి వస్తే... ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఢీ అనేది డ్యాన్స్ షో కాదు.. కామెడీ షో అయిందంటూ నెగెటివ్ కామెంట్లు వచ్చినా కూడా టీఆర్పీ రేటింగ్‌ మాత్రం ఈ షోకి బాగానే వస్తుంది. ఇక ఈ ఢీ 15కి ప్రదీప్ హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఆది టీమ్ మెంటర్‌గా కనిపించబోతున్న ఈ షోలో శేఖర్ మాస్టర్‌తో పాటు హీరోయిన్ శ్రద్దాదాస్ మరో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పిన గుడ్ న్యూస్ అదేనా!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఈ షోలో ప్రభాస్ ఒక శుభవార్తని పంచుకున్నట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ప్రభాస్ తో పాటు ఈ ఎపిసోడ్ లో ఆయన స్నేహితుడు, హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడట. అంతేకాదు "ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు" అని చరణ్ అనడంతో.. ఆ న్యూస్ ఏంటని బాలయ్య ప్రభాస్ ని అడిగి తెలుసుకుంటాడట. 'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు ప్రభాస్ కి సంబంధించిన గుడ్ న్యూస్ అంటే పెళ్లి గురించే అయ్యుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా ఆయన ఇటీవల హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను కృతి ఇప్పటికే ఖండించింది. మరి ప్రభాస్ ఈ షోలో పెళ్లి గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి.

శ్రీసత్య ఎమోషనల్ జర్నీ.. ఓటింగ్ కి ప్లస్ పాయింటా!

బిగ్ బాస్ ఫినాలే వీక్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకుంటుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మొదటి వారం నుంచి నిర్వహించిన టాస్క్ లు, వాటికి సంబంధించిన  వస్తువులను గార్డెన్ ఏరియాలో పెట్టి, లాంతరు దీపాలతో అలంకరించాడు. ఫినాలేలో ఉన్న కంటెస్టెంట్ కి.. తను హౌస్ లో గడిపిన ముఖ్యమైన క్షణాలను ఫోటో రూపంలో బంధించి, గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదట రేవంత్ జర్నీ వీడియోని బిగ్ బాస్ ప్లే చేయగా, రెండవ వీడియో శ్రీసత్యది కావడం విశేషం.  ఆ తర్వాత బిగ్ బాస్, శ్రీసత్యని గార్డెన్ ఏరియాకి పిలిచి.. ఆమెకి సంబంధించిన ఫొటోస్ ని, ఇంకా తను హౌస్ లో గడిపిన మధురమైన క్షణాలన్నింటిని ఫోటోలుగా చూపించాడు. బిగ్ బాస్ మాట్లాడుతూ,  "ఈ హౌస్ లోకి మీరు భయంతో అడుగుపెట్టి, ఎవరికి దగ్గర కావాలో తెలియని సంకోచంలో ఉన్నారు. మీ అమ్మ కోసం మీరు బిగ్ బాస్ కి వచ్చారని మీకు మీరే సర్ది చెప్పుకొని ముందుకెళ్ళారు. మీ ప్రయాణం లో, మీ జర్నీని సులభతరం చేసే ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. కష్టం వచ్చిన ముందుకెళ్లగలగాలి. మీరు అలా ఒంటరితనం నుండి హౌస్ లో, అందరితో కలిసి ముందుకెళ్ళారు. ఇలాగే జీవితంలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్ ది బెస్ట్" అని చెప్పాడు. శ్రీసత్య తన జర్నీ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయింది. వీడియో ప్లే అవుతున్నంత సేపు ఏడ్చేసింది. అయితే అక్కడ డెకరేట్ చేసిన దీపకాంతలు.. తనని ఎంతగానో అబ్బురపరిచాయి. శ్రీసత్య జర్నీ వీడియోకి చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్‌ తో శ్రీసత్యకి ఓటింగ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిడ్ వీక్ ఎలిమినేషన్ గా రేవంత్.. అబ్బురపరిచిన రేవంత్ జర్నీ వీడియో!

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఒక ప్రత్యేక శైలి కలిగిన  కంటెస్టెంట్. తన గాత్రంతో ఫ్యాన్స్ ని సంపాదించుకొని, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన చివరి కంటెస్టెంట్. బిగ్ బాస్ ప్రతీ సీజన్ ఫినాలే ఎపిసోడ్స్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ యొక్క జర్నీ వీడియోను లీస్ట్ నుండి చూపించడం అలవాటు. రేవంత్ జర్నీ వీడియో మొదట ప్లే చేసాడు బిగ్ బాస్. దీంతో విశ్లేషకులు ఈ సారి రేవంత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జర్నీ వీడియో ప్లే చేసే ముందు బిగ్ బాస్ మాట్లాడుతూ "ఇది ఫిజకల్ గేమ్స్ కి సంబంధించినది కాదు. ఇది పర్సనాలిటీ గేమ్. ఎవరి వ్యక్తిత్వం ఏంటో తెలిపే రియాలిటీ షో. ఇప్పటి వరకు మీరు మీ ఆటను ఫిజికల్ గా మాత్రమే చూసారు. కానీ మీ కోపం సరైనది కాదు. ఇక్కడ మనిషి యొక్క అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఉండగలగాలి. మీరు తండ్రి అయ్యే క్షణాలలో మీ వాళ్ళ దగ్గర లేకుండా బిగ్ బాస్ కోసం త్యాగం చేసారు. మీ వాళ్ళకి దూరంగా ఉండి, గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్ళాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఇక ముందు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి" అని చెప్పాడు. "థాంక్స్ బిగ్ బాస్. నేను తెలిసో, తెలియకో హౌస్ మేట్స్ ని ఇబ్బంది పెట్టాను. అందరికీ ఇప్పుడు సారీ చెప్తున్నా, ఇక నుండి నా కోపాన్ని మార్చుకుంటాను. నా వాళ్ళ కోసం కష్టపడతాను. నేను టైటిల్ గెలిచి ఆ కప్ నా కూతురికి బహుమతిగా ఇస్తాను. థాంక్స్ ఫర్ జర్నీ వీడియో. వేరే లెవెల్ బిగ్ బాస్" అంటూ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.

ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే అన్నారు...కానీ ఫైనల్ గా అలా జరిగిపోయింది!

ఆర్ ఆర్ ఆర్ మూవీలో "నాటు నాటు" సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందన్న  విషయం అప్పట్లో నాకు తెలీదు అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్ ఆలీతో సరదాగా షోలో.  ఎందుకంటే ఆ సాంగ్ పాడేటప్పుడు కీరవాణి గారు ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే..ఇదే ఫైనల్ కాదు  అని చెప్పారు.  మొదట్లో ఈ సాంగ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలోది అన్న విషయం తెలియదు. లిరిక్స్ అవీ పాడేటప్పుడు తెలిసింది ఈ మూవీ కోసం పాడుతున్నామని.. అప్పుడు కీరవాణి గారు చెప్పారు. నేను ఈ సాంగ్ పాడిన  ఏడాదిన్నర తర్వాత  రిలీజ్ అయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. నాకు టెన్షన్ గా ఉంది. నా సాంగ్ ఉంటుందా ఉండదా అనే విషయం తెలియదు. అసలే పెద్ద మూవీ..ఎప్పటికప్పుడు డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి, వాయిస్ సెట్ అవ్వదేమో అనిపించింది. కానీ దేవుడి దయ వలన  తమిళ్, కన్నడ, హిందీలో కూడా నేనే పాడాను. నేను రాంచరణ్ గారికి పాడితే, కాలభైరవ జూనియర్ ఎన్టీఆర్ కి పాడారు. అన్ని భాషల్లో పాడాలనేది కీరవాణి గారి డెసిషన్ మాత్రమే ఇందులో నేను రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు.  ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తే బెస్ట్ అవుట్ ఫుట్ అనేది ఇవ్వలేం..ఫైనల్గా మనం ఇండస్ట్రీలో ఉండాలంటే కష్టపడాల్సిందే. కీరవాణిగారు అవకాశం ఇవ్వడమే పెద్ద కాంప్లిమెంట్ నాకు. తర్వాత జనాలలోకి వెళ్ళింది వాళ్ళు కూడా ఈ సాంగ్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు అంతకుమించిన కాంప్లిమెంట్  ఏముంది " అన్నాడు రాహుల్ సిప్లిగంజ్.

తన కంటెస్టెంట్ అప్పుల్ని తీరుస్తాను అని గొప్ప మనసును చాటుకున్న సుదర్శన్ మాస్టర్!

ఢీ-15 ఛాంపియన్ షిప్  బ్యాటిల్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోలో కంటెస్టెంట్ రాహుల్, అతని కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్ తో కలిసి వచ్చి స్టేజి మీద డాన్స్ ని  ఇరగదీసాడు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక ప్రదీప్ వాళ్ళ అమ్మను, తమ్ముడు రుతురాజ్ ను  స్టేజి మీదకు పిలిచాడు. వాళ్ళను అలా  చూసేసరికి రాహుల్ ఏడ్చేశాడు. తన తమ్ముడు స్పెషల్ పర్సన్ అని చెవుడు, మూగ అని చెప్పాడు. రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతోంది ముక్కులోంచి రక్తమొస్తోందని చెప్పేసరికి తనకు ఏం చేయాలో అర్ధం కాలేదన్నాడు.  ఇక రాహుల్ వాళ్ళ అమ్మ మాట్లాడుతో "నేను ఇళ్లల్లో పాచిపని చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లోకి సరిపడినంత డబ్బులు కూడా ఉండవు. రాహుల్ ఇలా డాన్స్ షోకి వస్తాను అన్నప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు. అందరి దగ్గరా డబ్బులు పోగేసి ఇలా పోటీలకు పంపించాను. ఇప్పుడు నా బిడ్డ నా పేరు నిలబెట్టాడు" అని ఏడుస్తూ గర్వంగా చెప్పింది. ఇక సుదర్శన్ మాస్టర్ తన కంటెస్టెంట్ కోసం తన ఉదారతను చాటాడు. "ఇలాంటి మంచి డాన్సర్ ని మాకు అందించారు. రాహుల్ కి  ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ నేను తీర్చడానికి సాయం చేస్తాను. ఈసారి వచ్చే పేమెంట్ మొత్తం రాహుల్ ఫామిలీకి ఇచ్చేస్తాను" అని చెప్పాడు.  ఇక ప్రభుదేవా కూడా "నీకేం భయం అక్కర్లేదు మేమంతా ఉన్నాం, ఈ ఢీ టీమ్ అంతా నీ వెనక ఉంది...భయపడకు, నీ డాన్స్ నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యి" అని అభయమిచ్చారు.