రోహిత్ ని ఎలిమినేట్ చేసిన కార్తికేయ హీరో నిఖిల్!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మంచి కలర్ ఫుల్ గా తయారు చేశారు. టాప్ 5 లో ఉన్న ఒకరిని ఎలిమినేట్ చేయమంటూ గెస్ట్ గా వచ్చిన నిఖిల్ ని  కింగ్ నాగ్ హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ వేదిక మీద నిఖిల్ కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ గురించి, 18 పేజెస్ రిలీజ్ గురించి సరదాగా ముచ్చటించారు. కార్తికేయ 2 అంత పెద్ద విజయం సాధించినందుకు నాగార్జున నిఖిల్ ని అభినందించారు.  చాలా మంది అప్ కింగ్ యాక్టర్స్ కి కింగ్ నాగ్ ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పారు నిఖిల్. ఇక అప్పుడు నాగార్జున నిఖిల్ కి ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్తూ రెడ్ హాట్ ఒకదాన్ని నిఖిల్ చేతిని ఇచ్చి పంపించారు.  ఇక నిఖిల్ హౌస్ లోకి వెళ్లి అందరితో సరదాగా ఆడిపాడారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు టాప్ 5 కంటెస్టెంట్స్ ని  తెగ టెన్షన్ పెట్టాడు. చివరికి నిఖిల్ రెడ్ హ్యాట్ ని రోహిత్ తలపై పెట్టేసరికి  రోహిత్  ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్ ఎలిమినేట్ అయినప్పుడు అతడి తల్లిదండ్రులు, భార్య మెరీనా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక  నిఖిల్ అతడిని వేదిక మీదకు తీసుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో  అద్భుతమైన జర్నీ చేసినందుకు  నాగార్జున రోహిత్ ని అభినందించారు.

బిగ్ బాస్ వేదికపై బయటపడిన రవితేజ..నాగార్జున మధ్యన ఉన్న సీక్రెట్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ షోకి "ధమాకా" మూవీ జోడి మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల బిగ్ బాస్ వేదికకు మీదకు వచ్చారు. రవితేజ ఖాతాలో ఉన్న  హిట్స్ గురించి  ఫ్లాప్స్ గురించి మాట్లాడుతో మధ్యమధ్యలో సెటైర్లు వేశారు నాగ్. ఇక శ్రీలీల అందం గురించి తెగ పొగిడేశారు. ఇక ఈ వేదిక మీద రవితేజ లైఫ్ కి సంబంధించి ఒక సీక్రెట్ కూడా రివీల్ చేశారు. అదేంటంటే తాను మూవీ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలు పెట్టింది నాగార్జున గారి మూవీతోనే అని రవితేజ అన్నారు. ఆయన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ తన కెరీర్ ని స్టార్ట్ చేసినట్లు చెప్పారు. అలా తనకు  ఫస్ట్ రెమ్యునరేషన్ నాగార్జున గారు చెక్ రూపంలో ఇచ్చారు అంటూ రవితేజ చెప్పారు. ఆ చెక్ ని దాచుకుందాం అనుకున్నా కానీ ఖర్చయిపోయిందన్నారు. తనను నాగార్జున గారు ఎంతో ఎంకరేజ్ చేసేవారని చెప్పుకొచ్చారు. చాలా విషయాల్లో ఆయన నాకు ఇన్స్పిరేషన్  అంటూ రవితేజ నాగ్ గురించి చెప్పారు.  ఇక శ్రీలీల హౌస్ లో ఉన్న కీర్తితో కన్నడలో మాట్లాడి సర్ప్రైజ్ చేసింది. శ్రీలీల కన్నడలో మాట్లాడుతుంటే నాగ్, రవి తేజ అర్థం కాక తలలు బాదుకున్నారు.  

ఆఫర్ కోసం ట్రోఫీని వదిలేసుకున్న శ్రీహాన్..విన్నర్ ఐన సింగర్ రేవంత్!

బీబీ హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఐతే వీరిలో  ముందుగా రోహిత్,  తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు.  చివరకి రేవంత్, శ్రీహాన్ మాత్రమే  మిగిలారు. వీరిద్దరిలో ఎవరు విన్నర్  అనే ఉత్కంఠ చాలా సేపు కొనసాగింది. ఐతే నాగార్జున వీరి ముందు డబ్బును పెట్టి బేరాలు మొదలుపెట్టారు.  25 లక్షల నుంచి బేరం మొదలు కాగా.. రేవంత్, శ్రీహన్ ఎక్కడా టెంప్ట్ కాలేదు. వారంతట వారే పోటీ నుంచి తప్పుకుంటే 30 లక్షల ఆఫర్ అని ప్రకటించారు. ఐనా రేవంత్, శ్రీహాన్ అంగీకరించలేదు.  కానీ నాగార్జున ఒక్కసారిగా 40 లక్షల ఆఫర్ ప్రకటించేసరికి  ఇద్దరూ ఆలోచించడం మొదలు పెట్టారు. చెప్పాలంటే  విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దానితో పోల్చుకుంటే 40 లక్షలు ఏమంత చిన్నఅమౌంట్ కాదు.  ఇక అప్పుడు  శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి ఒప్పుకున్నాడు. దీంతో  రేవంత్ విన్నర్ అయ్యాడు.  ఐతే ఇక్కడ కథ వేరేలా ఉంది. అదేంటంటే రేవంత్ కంటే శ్రీహన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐతే శ్రీహన్ తొందరపడి  40 లక్షలకు టెంప్ట్ కాకపోయి ఉంటే విన్నర్ అయ్యేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్కింది. అంటే రేవంత్ ని విన్నర్ గా శ్రీహన్ చేసినట్లే లెక్క. ఏదేమైనా డబ్బు పరంగా ఇద్దరికీ పెద్ద తేడా లేదు.

ఎమోషనల్ ఐన గీతూ.. ఫీల్ ఐన నాగార్జున!

బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ హౌస్ మేట్స్ తో కాసేపు నాగ్ మాట్లాడి ఎంటర్టైన్ చేశారు. "గీతూ ఎలా ఉన్నావ్.. ఎందుకు అంత ఫీలవుతున్నావ్? నువ్ ఎక్కడున్నా స్పెషలే".. అని నాగ్ అనేసరికి "ఏమో సర్.. నాకు మాత్రం ఆ ఫీల్ పోవట్లేదు .. ఏంటోలా ఉంది.. అందుకే ఆ ఫీల్‌ని ఇక్కడితో ఎండ్ చేసేద్దామనుకుంటున్నా" అని చెప్పింది. "ఈ బిగ్ బాస్ అనేది బ్యూటిఫుల్ జర్నీ.. అందరికి మంచి లైఫ్ వచ్చింది. నాకు కూడా" అంది. దాంతో, "అవును. నాకు కూడా చాలా బాధగా ఉంది ఈరోజుతో బిగ్ బాస్ ఐపోతోంది అనుకుంటే" అని అన్నారు నాగ్. ఇక  తర్వాత  "చంటి ఎలా ఉన్నావ్?" అని నాగ్ అడిగేసరికి చంటి నవ్వేసాడు. "నువ్వు నన్ను చూస్తున్నప్పుడల్లా కామెడీనా లేదా ఇంకా ఏమన్నానా అర్థం కావడం లేదు" అని నాగ్ అనేసరికి, "మిమ్మల్ని చూస్తే నాకు తెలియని ఆనందం వచ్చేస్తుంది.. బయటికి వచ్చాక నా గేమ్ ని చూసుకున్నాక అర్థమయ్యింది, నేను ఇంకా కొంచెం బాగా ఆడి ఉంటే బాగుండేదని" అని చెప్పాడు చంటి. 

జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌ బాస్‌ 6 విన్నర్‌ రేవంత్‌!

బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌ ఎట్టకేలకు ఆదివారంతో ముగిసిపోయింది.  105 రోజులపాటు జరిగిన ఈ సీజన్ కి  ఇక్కడితో ఎండ్ కార్డు పడింది. టాప్‌ 5గా ఉన్న రేవంత్‌ , శ్రీహాన్‌ , ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ లో ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా రేవంత్‌ నిలిచారు.  ఐతే అందులోనే పెద్ద ట్విస్ట్ ఉందని అదేంటంటే  ఓటింగ్‌ ప్రకారం శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు హోస్ట్.  రేవంత్‌కి మొత్తంగా ఎంత వచ్చిందనేది చూస్తే, బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ట్రోఫీతో పాటు 10 లక్షల ప్రైజ్‌ మనీ దక్కుతుంది. దీంతోపాటు `సువర్ణభూమి` వారి 650గజాల ఫ్లాట్‌ దక్కబోతుంది. అంటే సుమారు 30 లక్షల విలువ చేసే దీన్ని  సువర్ణభూమి వారు విన్నర్‌కి ఈ గిఫ్ట్ ని ప్రకటించారు.  మరోవైపు పది లక్షల విలువైన బ్రేజ్జా కారుని బహుమతిగా మారుతి సుజికి వారు ప్రకటించారు. ఇలా మొత్తంగా రేవంత్‌కి యాభై లక్షలు అందుకున్నారని చెప్పొచ్చు.  మొత్తంగా రేవంత్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా సుమారు డెబ్భై నుంచి ఎనబై లక్షల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌కి ఇటీవలే కూతురు పుట్టింది. తన ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చిందని ఆయన ఎంతో సంబరపడ్డారు. తన కూతురుకి ట్రోఫీని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడం విశేషం. అదే విషయాన్ని ఆయన స్టేజ్‌పై ఎమోషనల్‌ అవుతూ చెప్పారు.  శ్రీహాన్‌ కారణంగా రేవంత్‌ జాక్ పాట్‌ కొట్టాడు. రియల్‌ హీరో అయ్యారు. అయితే ఈ సీజన్‌కి మాత్రం రేవంత్‌, శ్రీహాన్‌ ఇద్దరూ విన్నర్సే అని చెప్పొచ్చు.

ఆరోహి స్లాంగ్ కి ఫిదా ఐపోయిన హోస్ట్ నాగ్...వాసంతి నేను వైఫ్ అండ్ హజ్బెండ్

బీబీ స్టేజి మీద అందరూ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక నాగ్ లైన్ లోకి వచ్చి "ఆరోహి ఎలా ఉన్నావ్ ?" అనేసరికి "బాగున్నా సర్ " అంది "బయటికి వెళ్ళాక చాలా మంది నా స్లాంగ్ కి ఫాన్స్ ఇపోయారు" అని చెప్పింది. "అవును నేను కూడా నీ స్లాంగ్ ని మిస్ అవుతున్నా..నాకు నీ స్లాంగ్ అంటే ఇష్టం" అని చెప్పారు నాగ్. నాకు బిగ్ బాస్ చాలా మంచి చేసింది. నాకు పెద్ద ఫామిలీని ఇచ్చింది. చాలామంది నాతో బాగా క్లోజ్ అయ్యారు. చెప్పాలంటే బయటికి వచ్చాక వాసంతి నా హజ్బెండ్ ఐపోయింది " అనేసరికి "అవునా అదేంటి ఏ  సైడ్ చూసినా వాసంతి అసలు అబ్బాయిలాగే ఉండదు కదా" అన్నారు నాగార్జున. "నేను అబ్బాయిలానే ఉంటా కదా సర్ అందుకే వాసంతికి నేను భర్త అనుకోండి." అనేసరికి అందరూ నవ్వేశారు.  ఇక మన్మధుడు మూవీలో "పూల చెట్టు ఊగినట్టు" అనే లైన్ పాడి నాగార్జునకి  డేడికేట్ చేసింది. తర్వాత "వాసంతి ఎలా ఉన్నావ్..బయటికి వెళ్లేసరికి బిజీ ఇపోయావ్" అన్నారు నాగ్. "అవును సర్ నిజమే .కానీ నేను బిగ్ బాస్ ని అస్సలు మిస్ అవ్వలేదు. ఎందుకంటే బీబీ జోడితో మళ్ళీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను" అని చెప్పింది.

అప్పుడలా ఇప్పుడిలా.. తప్పుగా అర్థం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్!

శనివారం జరిగిన ఎపిసోడ్‌ లో బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. "ఇప్పుడు మీకు ఇస్తున్న టాస్క్.. 'ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ టాస్క్'. ఒకరి తర్వాత ఒకరు వచ్చి, మొదటి వారం నుండి ఇప్పటివరకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది? ఇప్పుడు లాస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది. వారితో ఇన్ని రోజులు ఎలా ఉన్నారు. మీకు ఎలా అనిపించిందో" చెప్పండని బిగ్ బాస్ అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలని చెప్తూ అనుభవాలను పంచుకున్నారు. శ్రీహాన్ మాట్లాడుతూ "నేను హౌస్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ గా కీర్తి ఉంది. అప్పటి నుంచి మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. నువ్వు స్ట్రాంగ్ కీర్తి. అసలు ఇంతవరకు రావడం మాములు విషయం కాదు" అని మాట్లాడాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి మాట్లాడుతూ, "ఫస్ట్ వీక్ లో రేవంత్ ని చూసి.. ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నాడని అనుకున్నాను. ఆ తర్వాత అది అతని సహజ గుణమని తెలిసింది" అని చెప్పాడు. అతని తర్వాత రోహిత్ వచ్చి ఆదిరెడ్డి గురించి మాట్లాడాడు. అలాగే రేవంత్ వచ్చి మాట్లాడుతూ, "ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి పెద్ద మానిపులేటర్ అని అనుకున్నాను. ఫస్ట్ నుండి నన్ను అర్థం చేసుకోలేదని అనుకున్నాను. కాని తర్వాత తెలిసింది నేనే ఆదిరెడ్డిని అర్థం చేసుకోలేదని" చెప్పాడు. ఆ తర్వాత కీర్తి వచ్చి మాట్లాడుతూ, "శ్రీహాన్ ని మొదట ఫేక్ అని అనుకున్నాను. వారాలు గడుస్తూ ఉంటే తెలిసింది. ఒక పర్సన్ ని నేను ఇంత రాంగ్ గా జడ్జ్ చేసానని.. ఇప్పుడు అయితే బాగా కలిసిపోయాం" అని చెప్పింది.

హౌస్ లో‌ 'బీబీ జోడీ'ల సందడి!

నిన్న జరిగిన బిగ్ బాస్-6 ఎపిసోడ్ సరికొత్త ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఉన్న కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి  జోడిలుగా రాబోతున్నారు. అందులో‌ నిన్న కొందరు వచ్చారు. దీంతో హౌస్ లో‌ వినోదం డబుల్ అయ్యింది. హౌస్ లోకి మొదటగా రోల్ రైడా వచ్చాడు. వచ్చి రాగానే మచ్చా అంటూ రేవంత్ కి హాగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అందరితో మాట్లాడాడు. రోల్ రైడా, రేవంత్ కలిసి డ్యాన్స్ చేసారు. హౌస్ మేట్స్ కి చిన్న ఛాలెంజ్ పెట్టి.. అందులో గెలిచిన వారికి సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పాడు. అందులో కీర్తి గెలిచింది. దీంతో రోల్ రైడా ఒక బర్గర్ ఇచ్చాడు కీర్తీకి. కాసేపు హౌస్ మేట్స్ తో మాట్లాడి బయటకొచ్చేసాడు. ఆ తర్వాత హౌస్ లోకి  మెహబూబ్, అషు రెడ్డి జంటగా వచ్చారు. ఇక హౌస్ మేట్స్ తో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు. ఇక టైం అయిపోయిందని బయటకు పంపించేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత 'కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో' పాటకి డ్యాన్స్ చేస్తూ ముక్కు అవినాష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ తర్వాత అరియాన వచ్చింది. వీళ్ళిద్దరు వేరే లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మస్త్ ఆట, పాటలతో వినోదాన్ని పంచారు. ఆ తర్వాత యాంకర్ కృష్ణచైతన్య, RJ కాజల్ వచ్చారు. మొదట డ్యాన్స్ చేసి, తర్వాత కంటెస్టెంట్స్ తో సరదగా గడిపారు. ఆ తర్వాత సీరియల్ యాక్టర్ రవికిరణ్, యాంకర్ భాను వచ్చారు. ఆ తర్వాత 'బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు‌' దీన్ని మూడు సార్లు ఆపకుండా, తడబడకుండా రిపీట్ చేయమని చెప్పాడు రవికిరణ్. రోహిత్ రెండు సార్లు బాగానే రిపీట్ చేసాడు.. కానీ మూడవ సారి మిస్టేక్ చెప్పాడు. ఆ తర్వాత శ్రీహాన్ కూడా ఇలాగే మరొకటి రిపీట్ చేసాడు. కీర్తి యూ ఆర్ స్ట్రాంగ్ అని భాను చెప్పింది. 'ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు' రిపీట్ చేసింది కీర్తి. అలా రిపీట్ చేస్తూ అన్నీ తప్పులుగా చెప్తుంటే భాను హెల్ప్ చేసింది. దీంతో కీర్తి కంటే భానునే ఎక్కువ చేసింది. "ఇది నీకు ఇచ్చిన టాస్క్ లా లేదు. మాకు ఇచ్చిన పనిష్మెంట్ లా ఉంది" అని అంది.

రాణి కోసం గొడవపడిన ప్రభాస్, గోపీచంద్!

బాలకృష్ణని ప్రభాస్ 'డార్లింగ్' అని పిలిచారు. అలా కావాలని పిలిపించుకున్నారు బాలయ్య బాబు. ప్రభాస్ 'అన్ స్టాపబుల్' షోకి వచ్చిన ప్రోమో చూస్తేనే అర్ధమవుతోంది ఈ ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది. ఇక ఇద్దరి ఫాన్స్ కూడా ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోకి సోషల్ మీడియా షేకైపోయింది.  "కాశ్యపస్య గోత్రోభవస్య ఉప్పలపాటి ప్రభాస్ రాజు నామధేయస్య.. బహుపరాక్" అంటూ ఒక రేంజ్ లో బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో స్వాగతం పలికిన బాలయ్య బాబు వాయిస్ వింటే నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సభాముఖంగా అడుగుతున్నా "నన్ను  కూడా  డార్లింగ్ అని పిలవాలి అని రిక్వెస్ట్ చేసేసరికి  ప్రభాస్ సరే డార్లింగ్ సార్ అని అన్నారు. "మొన్నామధ్య శర్వానంద్ వచ్చాడు. పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నాడు" అని బాలకృష్ణ అనగా.. "నేను సల్మాన్ తర్వాత అనాలేమో" అంటూ పంచ్ డైలాగ్ వేసాడు. "నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏది అని అడిగేసరికి డార్లింగ్ చాలా ఇబ్బంది పడ్డారు.  "మీకు అప్పట్లో  ఏ ఇబ్బందులూ లేవు కానీ ఇప్పుడు  మాకు ఏది లేకపోయినా అనవసరమైన గోల ఎక్కువ" అని ప్రభాస్ అన్నారు.  తర్వాత బాలకృష్ణ.. చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ ని ఆటపట్టించారు. "ఓ చరణూ.. రేయ్ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా?" అని ప్రభాస్ అన్నారు. షో ఇలా సాగుతుండగా గోపీచంద్ ఎంట్రీ ఇచ్చారు. "మనవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు. చరణ్ చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు" అని బాలకృష్ణ అనగానే.. "రాణి గురించే కదా సార్" అని గోపీచంద్ అన్నారు. దీంతో ప్రభాస్ "ఒరేయ్ ఇరికించకురా" అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. "ఫస్ట్ మూవీ నిన్ను మోసం చేసింది కదా ఏ ధైర్యంతో ఇంత దూరం వచ్చావ్" అని గోపీచంద్ ని అడిగేసరికి "ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది" అప్పుడు ప్రభాస్ పరిచయమయ్యాడు. "పడినప్పుడు లేచేవాడే అన్ స్టాపబుల్ అన్నారు బాలయ్యా"...ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 30 న ప్రసారం కాబోతోంది.

రేవంత్, కీర్తికి నా ఫుల్ సపోర్ట్!

బీబీ కేఫ్ లోకి వాసంతి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆరియానా ఎన్నో ప్రశ్నలు వేసింది. అలాగే టాప్ 1 లో రేవంత్ ఉంటాడని చెప్పింది. అలాగే ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పింది.  "బిగ్ బాస్ ఫినాలే చూస్తుంటే నేను కూడా ఉండి ఉంటే బాగుండనిపిస్తోంది. నాకు బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ మూమెంట్ ఏమిటి అంటే నా పేరెంట్స్ ని కలవడం.. అలాగే ఆడియన్స్ కి బాగా దగ్గరవడం. నాకు హౌస్ లో ఎవరితో అంత అటాచ్మెంట్ లేదు. నా గేమ్ ఆడుకుని నేను వచ్చేసాను. కానీ ఫైనల్ వీక్ లో మాత్రం నేను కీర్తికి, రేవంత్ కి సపోర్ట్ చేయాలి అనిపించింది. ఐతే హౌస్ లో ఎన్ని గొడవలు పడినా ఎండ్ ఆఫ్ ది డేలో నాకు రేవంత్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కీర్తి నాకు వచ్చే ముందర బాగా దగ్గరయింది. చాలామంచి ఫ్రెండ్ నాకు. నేను హౌస్ లోకి వెళ్లే ముందు పాత ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఆడిన గేమ్స్ చూసి వెళ్ళాల్సింది. కానీ అలా బ్లాంక్ గా వెళ్ళిపోయాను. ఇప్పుడు చూసుకుంటుంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఫినాలే వీక్ లో ఇనాయ ఉంటే బాగుండు అనిపించింది. ఆదిరెడ్డి బాగా ఆడుతున్నాడు. మ్యూచువల్ ఓట్స్ విషయానికి వస్తే గీతూ ఓట్లన్నీ ఆదిరెడ్డికి, అలాగే మరీనా ఓట్లన్నీ రోహిత్, నా ఓట్లన్నీ రేవంత్ కి వెళ్తాయి" అని చెప్పింది వాసంతి. కొత్తగా మాటీవీలో రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా అందుకు నీకు కంగ్రాట్యులేషన్స్ అని చెప్పింది ఆరియానా. 

నేహా చౌదరి పెళ్ళి.. బిబి-6 కంటెస్టెంట్స్ సందడి!

బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్న నేహా చౌదరి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. టీవీ యాంకర్ గా చేసిన తను.. బిగ్ బాస్ కి రావడంతో ప్రపంచమంతా సుపరిచితమైంది. ఇక ఇప్పుడు నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకోబోతోంది. అతని పేరు అనిల్. వారిద్దరికి చిన్నతనం నుండి ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పుకొచ్చింది నేహా. అయితే నిన్న తనని పెళ్ళికూతురిని చేసారు. అలా రెడీ చేసాక "I'm that Hyper Excited bride!!!" అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది. తన మ్యారేజ్ కి సంబందించిన పనులు ఎలా జరుగుతున్నాయో ప్రతీది, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈరోజు(ఆదివారం) జరగనున్న నేహా పెళ్ళికి బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వస్తున్నట్టు ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే తన ఎంగేజ్మెంట్ కి సూర్య, సుదీప, చంటి, రాజ్, గీతు, ఫైమా‌ ఇంకా తదితరులు వచ్చారు. దీంతో పెళ్ళికి అందరూ హాజరు అవుతారని తెలుస్తోంది. అయితే తన ఎంగేజ్మెంట్ జరిగాక ఎక్కడా కూడా అనిల్ ఫోటోని రివీల్ చేయలేదు. దీంతో తన ఫాలోవర్స్ అంతా "Where is Pellikoduku..why this much suspense" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్ళికొడుకుని డైరెక్ట్ గా పెళ్ళి పీటల మీదే అందరికీ చూపించాలని నేహా అనుకుంటున్నట్టుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

శ్రీసత్యపై యాంకర్ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ నుండి నిన్నటి ఎపిసోడ్‌లో బయటకొచ్చిన శ్రీసత్య.. బిబి కేఫ్ లో ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే అందులో యాంకర్ శివ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. "అర్జున్ కళ్యాణ్ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్. అతనికి నీ మీద ఏం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నావ్" అని శివ అడుగగా, " అర్జున్ డీసెంట్.. గుడ్ బాయ్. అతనికి నా మీద ఇష్టం, లవ్ ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నాను " అని చెప్పింది. "అవునా అది నిజం కాదు అసలు అర్జున్ కళ్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్" అని శివ అన్నాడు. దీంతో షాక్ అయ్యింది శ్రీసత్య. శివ మాట్లాడుతూ, "ఇనయా దృష్టిలో నువ్వు, శ్రీహాన్ చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నావా?" అని అడుగగా.. "అవును అలా చేయకూడదు. బాధ అనిపించింది. ఆ తర్వాత తనకి సారీ కూడా చెప్పా" అని అంది శ్రీసత్య. "నువ్వు బెస్ట్ కెప్టెన్ అని అనుకుంటున్నావా?" అని శివ అడిగేసరికి అవునని చెప్పింది. "మరి ఇనయా ఎందుకు బెస్ట్ కెప్టెన్ అయ్యింది" అని అడుగగా, "ఎవరికి అలా అనిపించిందో అలా చెప్పారు. నా దృష్టిలో నేను గుడ్ కెప్టెన్" అని శ్రీసత్య చెప్పింది. "ఫ్లిప్పింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా సత్య? " అని శివ అడిగేసరికి, "నేనెక్కడ ఫ్లిప్ అయ్యాను" అని అమాయకంగా అడిగింది. "గెలుపుని తీసుకుంటున్నావ్. ఓటమిని తీసుకోవట్లేదు అని రేవంత్ తో అన్నావ్. ఇదే సత్య అన్నం ప్లేట్ ని విసిరేసావ్" అని చెప్పేసరికి, ఆశ్చర్యపోయింది శ్రీసత్య.

ఫినాలే రేస్ నుండి శ్రీసత్య అవుట్!

బిగ్ బాస్ హౌస్ నుండి మిడ్ వీక్ ఎవిక్షన్ గా శ్రీసత్య బయటకొచ్చింది. అయితే గత వారమే హోస్ట్ నాగార్జున ఈ వీక్ మిడ్ వీక్ ఎవిక్షన్ ఉంటుందని చెప్పాడు.  మిడ్ వీక్ ఎవిక్షన్ అనగానే అందరూ బుధవారమో లేక గురువారమో ఉంటుందని అనుకున్నారంతా.. కానీ శుక్రవారం  శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం చెప్పే ముందు కంటెస్టెంట్స్ ని ఉదయం ఆరు గంటలకే నిద్రలేపి, వారందరిని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పాడు బిగ్ బాస్. ఆ తర్వాత "అందరికి ఈ రోజు మిడ్ వీక్ ఎవిక్షన్ ఉంటుంది. అందరూ టైం వేస్ట్ చేయకుండా తొందరగా మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి" అని చెప్పాడు. ఇంకో రెండు రోజుల్లో, ఫినాలే ఉంది.. ఇప్పుడు  ఎలిమినేషన్ ఏంటి అని కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు.  ఆ తర్వాత కాసేపటికి అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చారు. "ఈ హౌస్ లో ఎవరు ఫినాలేకి అర్హులు కాదని మీరు అనుకుంటున్నారో వారి పేరు చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్ లో మెజారిటీ సభ్యులంతా కీర్తి బయటకెళ్ళాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత "మీరు చెప్పినదానిని బట్టి కీర్తి ఎలిమినేషన్ అవ్వాలని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఎవరికైతే ఓట్లు తక్కువ వేస్తారో వాళ్లే ఎలిమినేట్ అవుతారు" అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీసత్య ఎలిమినేటెడ్ అని ప్రకటించాడు. "ఫస్ట్ హౌస్ లో నాతో గొడవ పడిన అమ్మాయి శ్రీసత్య" అని రేవంత్ ఏడ్చాడు. శ్రీసత్య బై చెప్పేసి వెళ్తుంటే హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు.

నాలో చాలా ఎనెర్జీ ఉంది..మీకు కావాలా అని అడిగిన సుధీర్!

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక హోస్ట్స్ ఇద్దరూ "బుట్టబొమ్మ" సాంగ్ కి డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. దీపికా మెలికలు తిరిగిపోతూ తన డ్రెస్, తన నవ్వు, తన హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని అడిగేసరికి సుధీర్ కూడా అంతే మెలికలు తిరుగుతూ బాగున్నావని చెప్పాడు. మరి చైర్మన్ గారికి నచ్చుతానా అనేసరికి సుధీర్ ఏడుపు మొహం పెట్టేస్తాడు.  ఇక సుధీర్ ఆ ఏడుపు ముఖంతోనే చైర్మన్ ని పిలుస్తాడు. అలా కాదు పిలవాల్సింది అని వగలుపోతూ దీపికా మత్తుగా పిలుస్తుంది ఆయన వచ్చేసాడు. రావడంతోనే టీవీ రిమోట్ తీసుకురావడం చూసి "ఇదేంటి రిమోట్ తెచ్చారు"  అని సుధీర్ అడిగేసరికి "మనకు  లేని ఎంటర్టైన్మెంట్ ఇంట్లో వాళ్లకు ఎందుకు అని రిమోట్  తెచ్చేసానని చెప్పాడు". "ఇది పని చేస్తుందో లేదో చూడు అనేసరికి బాగా పని చేస్తుంది" అని అబద్దం చెప్పాడు సుధీర్. తీరా చూస్తే అందులో బ్యాటరీలు ఉండవ్. "సర్ నాలో చాలా ఎనెర్జీ, పవర్ ఉంది. బ్యాటరీలు లేకపోయినా పని చేసేస్తుంది..అలాంటిది మన పవర్ మీకు కూడా కొంచెం కావాలా" అని అడిగేసరికి ఆ ఒక్క మాటతో చైర్మన్ జేబులో చెయ్యి పెట్టుకుని వచ్చేసి సీటులో కూర్చుంటాడు.  "సరే కానీ ఈ టీవీ రిమోట్ ని ఏం చేయమంటారు" అని సుధీర్ అడిగేసరికి "అలాగే మీ ఇంటికి తీసుకెళ్లి ఏసీకి వాడేసుకో అని అనిల్ రావిపూడి చెప్పాడు. అదేంటి సర్ అలా ఎలా వాడుకోవాలి అనేసరికి కామెడీ చేసానయ్యా కామెడీ స్టాక్ ఎక్స్చేంజి కదా" అన్నాడు.

మీ ఇంటి కూతురిలా చూశారు.. ఓట్ చేయండి!

బిగ్ బాస్ హౌస్ షో ముగింపుకి చేరుకుంది. ఈ తరుణంలో ఒక్కో హౌస్ మేట్ తమ అప్పీల్ ను ప్రేక్షకులకు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పీల్ అనేది చాలా కీలకం. ఎవరు ఎంత బాగా రిక్వెస్ట్ చేస్తారో వారికి అంత ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఈ అప్పీల్ పొందాలంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో గెలవాల్సిందే. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో అప్పీల్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. "ఈ టాస్క్ పేరు 'హెడ్ బాల్ టాస్క్'. ఇందులో విజేతగా నిలిచినవారికే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ టాస్క్ కి శ్రీహాన్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి ముగ్గురు ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఆట ముగిసేసమయానికి కీర్తి ఫాస్ట్ గా వచ్చి గెలిచి, ఓట్ అప్పీల్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత 'ఓట్ ఫర్ మీ' ఫ్రేమ్ లో నిల్చొని తనకు ఓట్ వేయమని కీర్తి, ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. "ఈ హౌస్ నా కోసం ఏం సింపతీ చూపించలేదు. నాకు కావలసింది మీ అందరి సపోర్ట్. ఇప్పటి దాకా మీ ఇంటి కూతురిలా చూసారు. నా శక్తి మీరి ఆడానని అనుకుంటున్నాను. ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నాను. ట్రోఫీ గెలిచాక కూడా నా సొంతంగా వాడుకోను. అది ఒక మంచి సోషల్ వర్క్ కోసం వాడుతాను. కీర్తి ఏమీ లేని అమ్మాయి. ప్లీజ్ ఓట్ వేయండి. అందరికీ ఓట్ వేయండి. నాక్కొంచెం ఎక్కువ ఓట్ వేయండి" అని కీర్తి భట్ చెప్పుకుంది.

మరోసారి శ్రీహాన్ కుట్ర.. బలైన రోహిత్!

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో ఆటతీరు, ఒక్కో మాటతీరు ఉంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో శ్రీహాన్ కన్నింగ్ ప్రేక్షకులకు స్పష్టంగా అర్థం అయ్యింది. బిగ్ బాస్ కమల్ హసన్ గా పిలుచుకునే శ్రీహాన్.. మొదటి నుండి ఒక్కొక్క హౌస్ మేట్ దగ్గర ఒక్కోలో నటిస్తూ వస్తున్నాడు. ఎలా అంటే శ్రీసత్యతో గొడవపడితే రేవంత్ కి చెప్పుకోవడం. రేవంత్ గురించి శ్రీసత్య దగ్గర మాట్లాడటం. ఒక వీక్ లో  "ఏంటి శ్రీహాన్.. సోమవారం నుండి శుక్రవారం ఒకలా కన్పిస్తావ్. శని, ఆదివారాలలో మరోలా కన్పిస్తావ్.. కన్పించడం కాదు నటించడం. ఎందుకు నటిస్తావ్?" అని అన్నాడు. నాగార్జున చెప్పినా సరే శ్రీహాన్ ఏ మాత్రం మారలేదు. ఎందుకంటే తను చేసే యాక్టింగ్ తో ప్రేక్షకులను నమ్మించాలి కదా.. నమ్మించడం అనే దానికంటే జీవించడం అంటే సరిపోతుంది.. అంతలా పర్ఫామెన్స్ చేస్తూ వస్తున్నాడు శ్రీహాన్.  "హౌస్ లో ఉండటానికి ఎవరిని అనర్హులుగా భావిస్తున్నారో? ఎవరి అభిప్రాయం వారు చెప్పండి" అని బిగ్ బాస్ అడిగిన ప్రతీసారి.. శ్రీహాన్ ఒక్క రోహిత్ పేరు మాత్రమే చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే రోహిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్. ఇలాంటి పర్సన్ ఉన్నాక, ఇక నాకేం ఓట్లు వేస్తారని అనుకున్నట్టున్నాడో ఏమో. అయితే ఇది చూసినవాళ్ళంతా శ్రీహాన్ ని " @కమల్ హాసన్" అని ట్రోల్స్ చేస్తున్నారు.

'ఓట్ ఫర్ మీ' అప్పీల్ కి అర్హత సాధించిన రోహిత్.. ఓటింగ్ లో మొదటి స్థానం దక్కేనా!

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. కాగా హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి ప్రేక్షకులు వేసే ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసుకునే ఒక అవకాశం కల్పించాడు బిగ్ బాస్. అదే 'ఓట్ ఫర్ మి'.  అయితే ఈ 'ఓట్ ఫర్ మి' కి అర్హత సాధించాలంటే.. కండ బలంతో పాటుగా.. బుద్ది బలం కూడా ఉండాలని మళ్ళీ ఋజువు చేసాడు బిగ్ బాస్. రోహిత్ బెస్ట్ అని మళ్ళీ ఋజువైంది. బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ కి మూడు ఛాలెంజ్ లు ఇచ్చాడు. ఈ మూడు ఛాలెంజ్ లు ముగిసే సమయానికి ఆదిరెడ్డి, రోహిత్ ఇద్దరూ సరిసమానమైన పాయింట్లతో ఉన్నారు. దీంతో బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ ని ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అభిప్రాయాన్ని చెప్పమనగా, అందరూ కలిసి రోహిత్ కి ఓటు వేసారు. దీంతో రోహిత్ 'ఓట్ ఫర్ మీ' అప్పీల్ కి అర్హత సాధించాడు. ఆ తర్వాత రోహిత్ తన అప్పీల్ ని ప్రేక్షకులకు తెలియజేసాడు. "నేను రోహిత్.. నేను ఎలా మాట్లాడుతున్నాను. ఎలా వచ్చాను. ఎలా మొదలైంది నా జర్నీ. అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరికి అన్ ఫెయిర్ జరుగకూడదని, ప్రతీసారి టాస్క్ లో సింగిల్ గానే పాల్గొన్నాను. నాకు లక్ తక్కువ సపోర్ట్ చేస్తుంది. నేను ప్రతీ టాస్క్ లో వంద శాతం ఇచ్చాను‌. కానీ బ్యాడ్ లక్.. గెలవలేదు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. 'ఐ రిక్వెస్ట్ టూ ఆడియన్స్.. ఓట్ ఫర్ మి' నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. లవ్ యూ ఆడియన్స్" అని రిక్వెస్ట్ చేసాడు. అయితే ఈ అప్పీల్ తో రోహిత్ కి ఓటింగ్ లో భారీ మెజారిటీ లభించే అవకాశం ఉంది.

శ్రీహాన్ ని డిస్టబ్ చేసిన శ్రీసత్య!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఇంకా గొడవలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 'ఆఖరి పోరాటం' అనే టాస్క్ ఇచ్చాడు. "మీకు ఆడియో రూపంలో భిన్నమైన సౌండ్స్ ఒక సీక్వెన్స్ గా వినిపిస్తాయి. అవి ఏంటో గుర్తించి, ఎవరు ఎక్కువగా రాస్తారో వారే ఈ టాస్క్ విజేత. ఈ టాస్క్ లో గెలిచిన వారు 'వోట్ ఫర్ మి' అప్పీల్ కి అర్హత సాధిస్తారు" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ ఈ టాస్క్ లో చురుకుగా పాల్గొన్నారు. మొదటి ఛాలెంజ్ లో సరిసమానమైన పాయింట్లతో ఆదిరెడ్డి, రోహిత్ లీడ్ లో ఉన్నారు. అయితే రెండవ ఛాలెంజ్ మొదలయ్యాక, మధ్యలో శ్రీసత్య మాట్లాడింది. దీంతో శ్రీహాన్ పాయింట్లు కోల్పోవలసి వచ్చింది. ఇదే విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. "దండం పెడతాను.. దయచేసి టాస్క్ జరిగేటప్పుడు ఎవ్వరూ మాట్లాడకండి" అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత ఛాలెంజ్ పూర్తి అయ్యింది. ఛాలెంజ్ లో రోహిత్, ఆదిరెడ్డి గెలిచారు. ఇక ఓడిపోయాననే బాధతో శ్రీహాన్, శ్రీసత్యతో గొడవకు దిగాడు. శ్రీసత్య మాట్లాడుతూ "నా వల్ల గేమ్ పోయింది అంటున్నావ్. నేను ఒక ఛాలెంజ్ లో డిస్టబ్ చేసాను. మరి మిగిలిన రెండింటిలో నువ్వు పాయింట్లు సంపాదించుకోవచ్చు కదా" అని శ్రీహాన్ తో చెప్పింది. శ్రీహాన్ మాట్లాడుతూ "నువ్వు యాక్సెప్ట్ చేయవు. నువ్వు అరవలేదు. కామ్ గా ఉన్నావ్. అప్పుడే నా రెండు పాయింట్లు పోయాయి. అక్కడ రెండు వచ్చి ఉంటే.. మేం ముగ్గురం ఈక్వల్ గా ఉండేవాళ్ళం. సరే సత్య నువ్వే కరెక్ట్. ఒక రౌండ్ లో పోయింది నీ వల్లే. కానీ అలా అంటే నువ్వు ఒప్పుకోవు. తప్పు అయితే ఒప్పుకోవడం రావాలి. మనవల్ల ఏదైనా అయినప్పుడు ఏం ఫీలింగ్ లేకుండా ఉంటారు కదా.. అలా ఉండటం నా వల్ల కాదు" అని శ్రీసత్య మీద కోపంతో అరిచాడు.

ఘనంగా బాలాదిత్య రెండో కుమార్తె నామకరణ వేడుక!

చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలాదిత్య ఆడియన్స్ కి బాగా పరిచయమే. "చంటిగాడు" మూవీతో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత "1940లో ఓ గ్రామం" అనే మూవీ చేసాడు కానీ తనకు అనుకున్నంత క్రేజ్ రాలేదు.   తర్వాత కొంతకాలం స్మాల్ స్క్రీన్  మీద యాంకర్‌గా చేసాడు. ఇక ఆ తర్వాత  జాబ్ చేసుకుంటూ తన లైఫ్ లో బిజీ ఐపోయాడు. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాడు..హౌస్‌లో బాలాదిత్య ఆటతీరు, ప్రవర్తనకు ఎంతో మంది ఫాన్స్ ఫిదా ఇపోయారు. ఇక బాలాదిత్య బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లేముందు  అతడి భార్య.. రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో   బాలాదిత్య హౌస్‌లోకి వెళ్లాల్సి రావడంతో  తన కూతురికి నామకరణ వేడుక చేయలేకపోయాడు. ఇక  హౌస్‌ నుంచి బయటకు వచ్చాకా మంచి ముహూర్తం చూసుకుని  రీసెంట్ గా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకున్నాడు.   ఇక ఈ ఫంక్షన్ కి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. ఆర్జే సూర్య, గీతూ, ఇనయా, ఆరోహిరావు, వాసంతి ఇలా చాలా మంది  ఇక్కడ సందడి చేశారు. ఇక కుమార్తెకు యజ్ఞ విధాత్రి అని పేరు పెట్టాడు బాలాదిత్య.