నీలాంబరిలా నా ఎలిమినేషన్ ని చూసుకుని బాధపడ్డా...

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి బిగ్ బాస్ సీజన్ 6 నుంచి కంటెస్టెంట్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీముఖి వీళ్లందరితో రకరకాల గేమ్స్ అవీ ఆడించింది. ఇక తర్వాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కొత్త పెళ్లి కూతురు నేహాతో ఒక సాంగ్ కి డాన్స్ చేయించింది. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో గీతూ ఏడ్చిన విషయం గురించి చెప్తూ శ్రీముఖి తన ఫీలింగ్ గురించి అడిగేసరికి అప్పటివరకు బాగా జోష్ తో గేమ్స్ ఆడి డాన్స్ చేసిన గీతూ ఒక్కసారిగా ఎమోషన్ ఐపోయింది. "నన్ను బిగ్ బాస్ హౌస్ విషయాలేవీ అడగొద్దు. నేను తట్టుకోలేను. ఇన్ని రోజులు ఇంట్లోంచి రాకుండా నా ఎలిమినేషన్ చూసుకుని ఏడుస్తూనే ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నా గురించి ఎవరూ అర్ధం చేసుకోలేదు కానీ బయటికి వచ్చాక అందరూ నన్ను అర్ధం చేసుకున్నారు. నాకు ఇప్పటివరకు 50 వేల మెసేజెస్ వచ్చాయి. అవి ఇంకా చదువుతూనే ఉన్నా. నరసింహ మూవీలో నీలాంబరి ఇంట్లోనే ఎన్నో ఏళ్ళు ఎలా ఉండిపోయిందో నేను కూడా అలాగే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి బాధపడ్డా " అని అనేసరికి బిగ్ బాస్ ని హ్యాపీ మెమరీగా మనసులో ఉంచుకో అని గీతూని ఊరుకోబెట్టింది హోస్ట్ శ్రీముఖి.

త్రోబ్యాక్ ఫోటో.. ఆమెకు నిజంగానే పెళ్లయిందా?

ఇనాయ సుల్తానా..బిగ్ బాస్ సీజన్ 6 లో పెద్ద ఆటంబాంబు. ఈ బోల్డ్ లేడీ తన గేమ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అమ్మాయిలు అంటే అలానే  ఉండాలి అనే విధంగా గేమ్ ఆడి చూపించింది. కంటెస్టెంట్ సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్ కే చెప్పేసింది ఇనాయ. ఎలాంటి ఎమోషన్ ని ఐనా వెంటనే ఎక్సప్రెస్ చేసేస్తుంది. అలాంటి ఇనాయ 14వ వారం ఎలిమినేట్ ఐపోయింది. మూడు నెలలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇనయా బయటకు వచ్చిన వెంటనే తన క్రష్ సూర్యను,  ఫ్రెండ్ వాసంతిని కలిసింది. అలా వాళ్ళతో  కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి అవి  ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇనాయకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. అదే ఆమెకు గతంలో పెళ్లి అయ్యింది అని. తనకు ఎన్నో ఏళ్ళ క్రితం పెళ్లి ఐన ఫోటో ఒకటి త్రో బ్యాక్ మెమోరీస్ ద్వారా బయటికి వచ్చింది. ఇక ఆ ఫోటోలో ఆమె పెళ్ళికూతురి ముస్తాబుతో కనిపించింది.  ఐతే ఆమెకు అసలు పెళ్లి నిజంగానే అయ్యిందా, లేదా? అంటూ ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ఐతే ఇది పెళ్లి ఫోటోనా లేక ఇంకా ఏదైనా ఫంక్షన్ కి రెడీ ఐన ఫోటోనా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకొచ్చేస్తుందా!

హోరా హోరీగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్-6 చివరి దశకి చేరుకుంది. అయితే ఈ వారంలోనే గ్రాండ్ ఫినాలే కావడంతో ఆ పనుల్లో బిజీ అయిపోయిన బిగ్ బాస్, అందులో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. సోమవారం నుండి బుధవారం వరకు జరిగే ఓటింగ్స్ లో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు ఫినాలే రేస్ నుండి అవుట్ అని బిగ్ బాస్ చెప్పగా, శ్రీసత్య అందరి కన్నా తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉంది. దీంతో తనే కచ్చితంగా బయటకొచ్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఓటింగ్ పరంగా చూస్తే.. ఇప్పటివరకు రోహిత్, శ్రీసత్య, కీర్తి లీస్ట్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో రోహిత్ జర్నీ వీడియో చూసి చాలా మంది ఫ్యాన్స్ కూడా రోహిత్ కి ఓట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో‌ ఓటింగ్ లో రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇక కీర్తిభట్, ‌శ్రీసత్య మధ్య స్వల్ప ఓట్ల తేడానే ఉండటంతో ఎవరు బయటకొస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్ గా ఉంది. కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే  'శ్రీసత్య ఎలిమినేటెడ్' అంటూ పోస్ట్ లు కనిపిస్తుండటంతో తనే ఎలిమినేట్ అని నమ్మేవాళ్ళు లేకపోలేదు. 

రోహిత్ అమేజింగ్ జర్నీ!

బిగ్ బాస్ హౌస్ లోకి మెరీనా-రోహిత్ జంటగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వారాలు గడిచిన తర్వాత.. వీరిద్దరిని సెపరేట్ చేసి గేమ్స్, టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్. ఆ తర్వాత మెరీనా ఎలిమినేట్ అయ్యింది. రోహిత్ హౌస్ లో ఒంటరిగా మిగిలాడు. ఇక అప్పటి నుండి రోహిత్ తనలో ఉన్న ఇంట్రోవర్ట్ ని పక్కన పెట్టి.. మెల్లి మెల్లిగా హౌస్ మేట్స్ అందరితో కలవడం మొదలుపెట్టాడు. అయితే మొన్నటి ఫ్యామీలి వీక్ ఎపిసోడ్‌లో రోహిత్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు "రోహిత్ బేటా నిన్ను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నా.. ఒక్కసారి కెప్టెన్ గా ఉండు బేటా" అని చెప్పింది. ఆ డ్రీమ్ కూడా నెరవేరలేదు. అయితే ఇప్పుడు ఫినాలే వరకు వచ్చాడు రోహిత్. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి రోహిత్ ని పిలిచి, అతని జర్నీ వీడియోని చూపించాడు. "రోహిత్.. కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చిన మీకు.. ఈ ప్రయాణంలో తోడు లభించింది. మీ ఆట మెరుగుపరుచుకోడానికి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. కెప్టెన్ కావాలనేది మీ అమ్మ గారి కల.. కానీ ఆ కల నెరవేరలేదు. అది మీ మనసుకి బాధ కలిగించింది. కానీ మీరు ఇప్పుడు ఫినాలేలో ఉన్నారు.‌ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. హౌస్ లో ఫ్రెండ్స్ కలిసి ఆడినప్పుడు తప్పు అనిపించలేదు. కానీ మీరు ఇద్దరు కలిసి ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యిందో అర్థం కాలేదు. అయినా మీరు మీ సహనాన్ని కోల్పోలేదు" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రోహిత్ "థాంక్స్ బిగ్ బాస్.. థాంక్స్ మెరీనా.. థాంక్స్ ఫ్యాన్స్" అని చెప్పాడు.

కామన్ మ్యాన్ ఆదిరెడ్డి జర్నీ సాగిందిలా!

బిగ్ బాస్ ప్రతీ సీజన్లోనూ కామన్ మ్యాన్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సారి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఏ కంటెస్టెంట్ కూడా ఇన్ని వారాలు హౌస్ లో లేరు. అయితే ఫినాలేకి వచ్చిన తొలి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి ఇప్పుడు హౌస్ లో ఉన్నాడు. ఆదిరెడ్డి జర్నీ సాగిందిలా.. ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. నాగార్జున సైతం ప్రతీ వీకెండ్ లో అతడిని డ్యాన్స్ చేయమని చెప్తూ ప్రోత్సహించేవాడు. తనకు వచ్చి రాని డ్యాన్స్ తో హౌస్ లో నవ్వులు పూయించాడు. మొదటి నుండి గీతూతో కలిసి ఉండేవాడు. గీతక్క గీతక్క అంటూ ఎప్పుడూ కలిసి తిరిగేవాడు. గీతు ఎలిమినేట్ అయ్యాక ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో  హౌస్ మేట్స్ కి మెల్లి మెల్లిగా దగ్గర అయ్యాడు.  ఫ్యామిలీ వీక్ లో తన పాప, భార్య రావడంతో ఆ ఎపిసోడ్‌ మొత్తం 'ఆదిరెడ్డి కామన్ మ్యాన్ షో' గా మారిందనే చెప్పాలి.  ఆ తర్వాత ఆదిరెడ్డికి ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగింది.  "ప్రేక్షకులు ఏ స్థానం ఇచ్చినా నేను స్వీకరిస్తాను. మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఏ పొజిషన్ ఇచ్చినా మీకు ఋణపడి ఉంటా బిగ్ బాస్.. నా లైఫ్ మార్చింది బిగ్ బాస్. నా వంద శాతం ఇచ్చి, ఫైనలిస్ట్ లో ఉన్నాను బిగ్ బాస్. లవ్ యూ కవిత.. నీ సపోర్ట్ లేకుంటే నేను బిగ్ బాస్ కి వచ్చేవాడిని కాదు. ఈ ఆనందం ఎంతలా ఉందంటే.. ఇదే ఆనందం ఒక రెండు, మూడు నెలలు ఉంటే లైఫ్ టైమ్ బ్రతుకుతా బిగ్ బాస్" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

'అన్‌స్టాపబుల్' క్రేజ్.. ప్రభాస్ ఎపిసోడ్ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్!

అభిమాన హీరో సినిమా గ్లింప్స్, టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం సహజం. అయితే ఒక ఓటీటీ షో ఎపిసోడ్ గ్లింప్స్, ప్రోమో కోసం ప్రేక్షకులంతా ఎదురు చూడటం ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా అది 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్ విషయంలో జరిగింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ గ్లింప్స్ కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాకుండా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ట్విట్టర్ లో సైతం ఇది ట్రెండింగ్ గా మారింది. 'బాహుబలి మీట్స్ బాలయ్య' అంటూ విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. "రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్" అంటూ ప్రభాస్ సరదాగా మాట్లాడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా సందడి చేయనుండగా.. రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. "ప్రభాస్ ఓ న్యూస్ చెప్తాడు" అంటూ చరణ్ వీడియో కాల్ లో అనడంతో.. "ఏం చెప్తున్నావ్ డార్లింగ్" అని ప్రభాస్ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కానుంది.

మా తల్లి అంటూ ఢీ స్టేజ్ ని ముద్దాడిన శేఖర్ మాస్టర్!

బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి వచ్చిన ఈ ప్రొడక్ట్ ఇప్పటికీ హై స్పీడులో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 14 సీజన్స్‌ను కంప్లీట్ చేసుకొని ఇటీవలే ఢీ 15వ సీజన్‌‌లోకి అడుగు పెట్టింది. ఢీ 15 లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుదేవా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. కాగా ఢీ 15కి సంబంధించిన సెకండ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది మల్లెమాల. ఈ ప్రోమోలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కనిపించేసరికి ఢీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే శేఖర్ మాస్టర్ ఢీకి గుడ్ బై చెప్పి వేరే ఛానల్‌లో ప్రసారమవుతున్న మరో ప్రోగ్రామ్‌‌కి జడ్జిగా వ్యవహరించారు. మరలా తిరిగి ఢీ షోకి జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేశారు. హీరోయిన్ శ్రద్దాదాస్‌తో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ... మేము కొన్ని కమిట్ మెంట్స్ వల్ల అలా వెళ్లి ఇలా వస్తాము తప్ప.. మా తల్లి మాత్రం ఈ తల్లే అంటూ ఢీ స్టేజ్‌ని ముద్దుపెట్టుకున్నాడు. ఇక ఈ ఢీ షో విషయానికి వస్తే... ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఢీ అనేది డ్యాన్స్ షో కాదు.. కామెడీ షో అయిందంటూ నెగెటివ్ కామెంట్లు వచ్చినా కూడా టీఆర్పీ రేటింగ్‌ మాత్రం ఈ షోకి బాగానే వస్తుంది. ఇక ఈ ఢీ 15కి ప్రదీప్ హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఆది టీమ్ మెంటర్‌గా కనిపించబోతున్న ఈ షోలో శేఖర్ మాస్టర్‌తో పాటు హీరోయిన్ శ్రద్దాదాస్ మరో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పిన గుడ్ న్యూస్ అదేనా!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఈ షోలో ప్రభాస్ ఒక శుభవార్తని పంచుకున్నట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ప్రభాస్ తో పాటు ఈ ఎపిసోడ్ లో ఆయన స్నేహితుడు, హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడట. అంతేకాదు "ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు" అని చరణ్ అనడంతో.. ఆ న్యూస్ ఏంటని బాలయ్య ప్రభాస్ ని అడిగి తెలుసుకుంటాడట. 'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు ప్రభాస్ కి సంబంధించిన గుడ్ న్యూస్ అంటే పెళ్లి గురించే అయ్యుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా ఆయన ఇటీవల హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను కృతి ఇప్పటికే ఖండించింది. మరి ప్రభాస్ ఈ షోలో పెళ్లి గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి.

శ్రీసత్య ఎమోషనల్ జర్నీ.. ఓటింగ్ కి ప్లస్ పాయింటా!

బిగ్ బాస్ ఫినాలే వీక్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకుంటుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మొదటి వారం నుంచి నిర్వహించిన టాస్క్ లు, వాటికి సంబంధించిన  వస్తువులను గార్డెన్ ఏరియాలో పెట్టి, లాంతరు దీపాలతో అలంకరించాడు. ఫినాలేలో ఉన్న కంటెస్టెంట్ కి.. తను హౌస్ లో గడిపిన ముఖ్యమైన క్షణాలను ఫోటో రూపంలో బంధించి, గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదట రేవంత్ జర్నీ వీడియోని బిగ్ బాస్ ప్లే చేయగా, రెండవ వీడియో శ్రీసత్యది కావడం విశేషం.  ఆ తర్వాత బిగ్ బాస్, శ్రీసత్యని గార్డెన్ ఏరియాకి పిలిచి.. ఆమెకి సంబంధించిన ఫొటోస్ ని, ఇంకా తను హౌస్ లో గడిపిన మధురమైన క్షణాలన్నింటిని ఫోటోలుగా చూపించాడు. బిగ్ బాస్ మాట్లాడుతూ,  "ఈ హౌస్ లోకి మీరు భయంతో అడుగుపెట్టి, ఎవరికి దగ్గర కావాలో తెలియని సంకోచంలో ఉన్నారు. మీ అమ్మ కోసం మీరు బిగ్ బాస్ కి వచ్చారని మీకు మీరే సర్ది చెప్పుకొని ముందుకెళ్ళారు. మీ ప్రయాణం లో, మీ జర్నీని సులభతరం చేసే ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. కష్టం వచ్చిన ముందుకెళ్లగలగాలి. మీరు అలా ఒంటరితనం నుండి హౌస్ లో, అందరితో కలిసి ముందుకెళ్ళారు. ఇలాగే జీవితంలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్ ది బెస్ట్" అని చెప్పాడు. శ్రీసత్య తన జర్నీ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయింది. వీడియో ప్లే అవుతున్నంత సేపు ఏడ్చేసింది. అయితే అక్కడ డెకరేట్ చేసిన దీపకాంతలు.. తనని ఎంతగానో అబ్బురపరిచాయి. శ్రీసత్య జర్నీ వీడియోకి చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్‌ తో శ్రీసత్యకి ఓటింగ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిడ్ వీక్ ఎలిమినేషన్ గా రేవంత్.. అబ్బురపరిచిన రేవంత్ జర్నీ వీడియో!

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఒక ప్రత్యేక శైలి కలిగిన  కంటెస్టెంట్. తన గాత్రంతో ఫ్యాన్స్ ని సంపాదించుకొని, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన చివరి కంటెస్టెంట్. బిగ్ బాస్ ప్రతీ సీజన్ ఫినాలే ఎపిసోడ్స్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ యొక్క జర్నీ వీడియోను లీస్ట్ నుండి చూపించడం అలవాటు. రేవంత్ జర్నీ వీడియో మొదట ప్లే చేసాడు బిగ్ బాస్. దీంతో విశ్లేషకులు ఈ సారి రేవంత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జర్నీ వీడియో ప్లే చేసే ముందు బిగ్ బాస్ మాట్లాడుతూ "ఇది ఫిజకల్ గేమ్స్ కి సంబంధించినది కాదు. ఇది పర్సనాలిటీ గేమ్. ఎవరి వ్యక్తిత్వం ఏంటో తెలిపే రియాలిటీ షో. ఇప్పటి వరకు మీరు మీ ఆటను ఫిజికల్ గా మాత్రమే చూసారు. కానీ మీ కోపం సరైనది కాదు. ఇక్కడ మనిషి యొక్క అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఉండగలగాలి. మీరు తండ్రి అయ్యే క్షణాలలో మీ వాళ్ళ దగ్గర లేకుండా బిగ్ బాస్ కోసం త్యాగం చేసారు. మీ వాళ్ళకి దూరంగా ఉండి, గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్ళాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఇక ముందు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి" అని చెప్పాడు. "థాంక్స్ బిగ్ బాస్. నేను తెలిసో, తెలియకో హౌస్ మేట్స్ ని ఇబ్బంది పెట్టాను. అందరికీ ఇప్పుడు సారీ చెప్తున్నా, ఇక నుండి నా కోపాన్ని మార్చుకుంటాను. నా వాళ్ళ కోసం కష్టపడతాను. నేను టైటిల్ గెలిచి ఆ కప్ నా కూతురికి బహుమతిగా ఇస్తాను. థాంక్స్ ఫర్ జర్నీ వీడియో. వేరే లెవెల్ బిగ్ బాస్" అంటూ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.

ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే అన్నారు...కానీ ఫైనల్ గా అలా జరిగిపోయింది!

ఆర్ ఆర్ ఆర్ మూవీలో "నాటు నాటు" సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందన్న  విషయం అప్పట్లో నాకు తెలీదు అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్ ఆలీతో సరదాగా షోలో.  ఎందుకంటే ఆ సాంగ్ పాడేటప్పుడు కీరవాణి గారు ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే..ఇదే ఫైనల్ కాదు  అని చెప్పారు.  మొదట్లో ఈ సాంగ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలోది అన్న విషయం తెలియదు. లిరిక్స్ అవీ పాడేటప్పుడు తెలిసింది ఈ మూవీ కోసం పాడుతున్నామని.. అప్పుడు కీరవాణి గారు చెప్పారు. నేను ఈ సాంగ్ పాడిన  ఏడాదిన్నర తర్వాత  రిలీజ్ అయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. నాకు టెన్షన్ గా ఉంది. నా సాంగ్ ఉంటుందా ఉండదా అనే విషయం తెలియదు. అసలే పెద్ద మూవీ..ఎప్పటికప్పుడు డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి, వాయిస్ సెట్ అవ్వదేమో అనిపించింది. కానీ దేవుడి దయ వలన  తమిళ్, కన్నడ, హిందీలో కూడా నేనే పాడాను. నేను రాంచరణ్ గారికి పాడితే, కాలభైరవ జూనియర్ ఎన్టీఆర్ కి పాడారు. అన్ని భాషల్లో పాడాలనేది కీరవాణి గారి డెసిషన్ మాత్రమే ఇందులో నేను రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు.  ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తే బెస్ట్ అవుట్ ఫుట్ అనేది ఇవ్వలేం..ఫైనల్గా మనం ఇండస్ట్రీలో ఉండాలంటే కష్టపడాల్సిందే. కీరవాణిగారు అవకాశం ఇవ్వడమే పెద్ద కాంప్లిమెంట్ నాకు. తర్వాత జనాలలోకి వెళ్ళింది వాళ్ళు కూడా ఈ సాంగ్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు అంతకుమించిన కాంప్లిమెంట్  ఏముంది " అన్నాడు రాహుల్ సిప్లిగంజ్.

తన కంటెస్టెంట్ అప్పుల్ని తీరుస్తాను అని గొప్ప మనసును చాటుకున్న సుదర్శన్ మాస్టర్!

ఢీ-15 ఛాంపియన్ షిప్  బ్యాటిల్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోలో కంటెస్టెంట్ రాహుల్, అతని కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్ తో కలిసి వచ్చి స్టేజి మీద డాన్స్ ని  ఇరగదీసాడు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక ప్రదీప్ వాళ్ళ అమ్మను, తమ్ముడు రుతురాజ్ ను  స్టేజి మీదకు పిలిచాడు. వాళ్ళను అలా  చూసేసరికి రాహుల్ ఏడ్చేశాడు. తన తమ్ముడు స్పెషల్ పర్సన్ అని చెవుడు, మూగ అని చెప్పాడు. రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతోంది ముక్కులోంచి రక్తమొస్తోందని చెప్పేసరికి తనకు ఏం చేయాలో అర్ధం కాలేదన్నాడు.  ఇక రాహుల్ వాళ్ళ అమ్మ మాట్లాడుతో "నేను ఇళ్లల్లో పాచిపని చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లోకి సరిపడినంత డబ్బులు కూడా ఉండవు. రాహుల్ ఇలా డాన్స్ షోకి వస్తాను అన్నప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు. అందరి దగ్గరా డబ్బులు పోగేసి ఇలా పోటీలకు పంపించాను. ఇప్పుడు నా బిడ్డ నా పేరు నిలబెట్టాడు" అని ఏడుస్తూ గర్వంగా చెప్పింది. ఇక సుదర్శన్ మాస్టర్ తన కంటెస్టెంట్ కోసం తన ఉదారతను చాటాడు. "ఇలాంటి మంచి డాన్సర్ ని మాకు అందించారు. రాహుల్ కి  ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ నేను తీర్చడానికి సాయం చేస్తాను. ఈసారి వచ్చే పేమెంట్ మొత్తం రాహుల్ ఫామిలీకి ఇచ్చేస్తాను" అని చెప్పాడు.  ఇక ప్రభుదేవా కూడా "నీకేం భయం అక్కర్లేదు మేమంతా ఉన్నాం, ఈ ఢీ టీమ్ అంతా నీ వెనక ఉంది...భయపడకు, నీ డాన్స్ నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యి" అని అభయమిచ్చారు.  

ఒక కామెడీ రోల్ లో మీరే చేయాలి అని అడిగినందుకు ఆయన చేసిన పని ఇది!

"ఆలీతో సరదాగా" షోకి ఈ వారం రాహుల్ సిప్లిగంజ్, సోహైల్ ఇద్దరూ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళిద్దరూ ఎన్నో విషయాలు ఈ షోలో చెప్పారు. ఇక సోహైల్ ఆలీ సర్ గురించి మీకెవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తాను అని అన్నాడు " నేను ఆలీ సర్ ఒక ఫంక్షన్ లో కలిసాము  అంతే..ప్రత్యేక పరిచయం అంటూ ఏమీ లేదు.  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే "మిస్టర్ ప్రెగ్నెంట్" అనే ఒక మూవీ చేసాను. ఆ మూవీలో కామెడీ డాక్టర్ గా చేయడానికి ఒక రోల్ ఉంది. దానికి ఒక వ్యక్తి కావాలి అనేసరికి సెట్ లో అంతా  ఆలీ సర్ ఐతే కరెక్ట్ అని చెప్పేసరికి నేను ఆయనకు ఫోన్ చేసాను. ఫోన్ తీసి చెప్పు సోహైల్ అన్నారు  బాగా పరిచయమున్న వ్యక్తిలా..దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది.  తర్వాత ఇలా ఈ మూవీ విషయం అందులో పాత్ర గురించి చెప్పాను...ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చుకునే పరిస్థితి లేదని చెప్పాను. ఆయన అవేమీ ఆలోచించకుండా వచ్చి ఆ రోల్ చేసి వెళ్లారు. మాలాంటి ఎంతో మందిని ఆయన ఇలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మణికొండ నుంచి కొంపల్లి దాకా అంటే రెండు గంటలు ప్రయాణం చేసి నా కోసం వచ్చి ఆ రోల్ చేసి వెళ్లారు " దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా అని ఈ షోలో సోహైల్ ఆలీ గురించి చెప్పారు.

ఘనంగా యాదమ్మ రాజు పెళ్లి వేడుకలు..హాజరైన సెలబ్రిటీస్

"పటాస్" కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు.  బుల్లితెర మీద కనిపిస్తూనే అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.  అమాయకమైన హావభావాలతో ఆడియన్స్ ని  నవ్వించడం ఇతని స్టైల్. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతున్నాడు. మొన్న హల్దీ వేడుకల ఫోటోలు వైరల్ ఆయాయ్యి.  ఇక ఇప్పుడు వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగిపోయింది. వీళ్ళ ఇద్దరి పెళ్ళికి బిగ్ బాస్ సెలబ్రిటీలు వచ్చి  సందడి చేశారు. ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లు  సోహెల్, ముక్కు అవినాష్, హైపర్ ఆది, పరదేశి, శ్రీవాణి ఫామిలీ, నాగబాబు, వేణు వండర్స్, ఆకాష్ పూరి, డాన్సర్ పండు, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, ఇక కామెడీ స్టాక్ ఎక్స్చేంజి షో కమెడియన్స్ అంత వీళ్ళ పెళ్ళికి వచ్చి విషెస్ చెప్పారు.

ఘనంగా అమరదీప్, తేజు హల్దీ వేడుకలు!

అమర్ దీప్ చౌదరి ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన నటుడు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా "ఐరావతం" అనే మూవీలో కూడా మెరిశాడు. ఇక అలాంటి అమర్ దీప్ కు రీసెంట్ గా ‘ కోయిలమ్మ’ సీరియల్  ఫేమ్ తేజస్విని గౌడ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.  ఇక ఇప్పుడు వీరి పెళ్లి డేట్ దగ్గర పడుతుండేసరికి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయి.  తేజస్విని గౌడ.. తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇక అమర్ దీప్ ను కూడా వాళ్ళ ఫామిలీ మెంబర్స్   పెళ్లి కొడుకును చేశారు. హల్దీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. పసుపు కొట్టే కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమర్ దీప్ ను అభినందించేవారు.. అలాగే అతని ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు.

'ఢీ' షో అనేది మాహిష్మతి సామ్రాజ్యం..అందులో బాహుబలి ప్రభుదేవా!

ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్ చాలా జోష్ గా స్టార్ట్ అయ్యింది. ఈ షోలో "డి" ఫర్ "దేవా" అంటూ ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ ఐన గణేష్, జానీ, నోబెల్, శ్రీధర్  అలాగే మిగతా డాన్స్ మాస్టర్స్ తో కలిసి స్టెప్పులేసి స్టేజి మీదకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ- 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు గ్రాండ్ గా 15 సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ షో.  ఇక ఈ షో హోస్ట్ ప్రదీప్ మాట్లాడుతూ "ఇంటికి పెద్దన్నయ్య వచ్చినట్లు ఉంది..మీరే కొబ్బరికాయ కొట్టి ఈ షోని స్టార్ట్ చేశారు. మళ్ళీ మీ రాజ్యానికి రాజుగా వచ్చేసారు. ఢీ షో అనేది మాహిష్మతి సామ్రాజ్యం ఐతే అందులో బాహుబలి మీరే అనేసరికి ప్రభుదేవా కూడా తన సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తోంది అన్నారు..నా పొలంలో కూడా ఇంత పెద్ద పెద్ద మొలకలొచ్చాయి. తమిళనాడు వెళ్తే హీరో అవుతాను, బొంబాయికి వెళ్తే డైరెక్టర్ అవుతాను, ఆంధ్రాకి వస్తే కొరియోగ్రాఫర్ ని ఐపోతాను. మల్లెమాల వారికి ధన్యవాదాలు.  ఇక్కడున్న డాన్సర్స్  చాలా డెంజరస్. వాళ్ళతో  నేను పోటీ పడలేను. హమ్మయ్య నేను ముందే వచ్చేశాను. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు.  నా తర్వాతే మీరంతా పుట్టినందుకు చాలా థాంక్స్' అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. కొరియోగ్రాఫర్స్ అందరినీ పేరుపేరునా పిలిచి విషెస్ చెప్పారు. "శేఖర్ మాస్టర్ ని మిస్ అవుతున్నా. నాకు తెలుగు సాంగ్స్ అంటే చాలా ఇష్టం"  అని చెప్పి అందరినీ ఆయన మాటలతో మెస్మోరైజ్ చేశారు.

యాంకర్ శివకి దిమ్మ తిరిగే షాకిచ్చిన ఇనయా!

బిగ్ బాస్ సీజన్-6 లో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా హౌస్ నుంచి బయటకొచ్చాక, యాంకర్ శివతో ఎగ్జిట్ ఇంటర్వ్యూ జరిగింది. "ప్రతిసారీ బిగ్ బాస్ విన్నర్ నేనే అంటూ అరిచేదానివి కదా.. ఏమైంది నీ ఓవర్ కాన్ఫిడెన్స్" అని శివ అనగా, "అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. నా మీద నాకున్న నమ్మకం" అని ఇనయా సమాధానమిచ్చింది. "మొదటి వారమే బయటకొస్తావనుకున్నా.. కానీ సడెన్ గా నీ గ్రాఫ్ పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గింది" అని శివ అన్నాడు. "ఎక్కడ తగ్గింది?" అని ఇనయా అడిగేసరికి, "సూర్య విషయంలో.‌. లవ్ ట్రాక్ వల్ల తగ్గింది" అని శివ రిప్లై ఇవ్వడంతో.. "నేను లవ్ అని ఎప్పుడైనా చెప్పానా" అని అంది ఇనయా. "హౌస్ లో గట్టి పోటీ ఇచ్చి అనవసరంగా నోరు జారావ్ కదా" అని ప్రశ్నించగా, "నన్ను హౌస్ మేట్స్ రెచ్చగొట్టారు. ఆ ఫ్రస్టేషన్ లో కొన్ని మాటలు జారాను. అందరూ నన్ను కార్నర్ చేసారు. నాకు సపోర్ట్ లేదు. ఎంకరేజ్ లేదు.‌. ఎవరికీ నేను ఇష్టం లేదని అనిపించింది" అని చెప్పింది.  ఆ తర్వాత శివ మాట్లాడుతూ, "హౌస్ లో శ్రీహాన్ తో కొన్ని రోజులు గొడవ పడ్డావ్. మళ్ళీ కలిసిపోయి కాంప్లిమెంట్ ఇచ్చావ్. మళ్ళీ నామినేట్ చేసావ్. నువ్వు నీ మాట మీద ఉండవా" అని అడగగా, "హౌస్ లో శ్రీహాన్ కి నాకు గొడవ ఉంది. కానీ ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ మా మధ్య ఏదో ఉంది అని అనుకోవడం, నాకు ఇష్టం లేదు. అందుకే మళ్ళీ అతడిని నామినేట్ చేశాను" అంటూ చెప్పుకొచ్చింది ఇనయా. "హౌస్ మేట్స్ గురించి నీ మాటల్లో చెప్పు" అని అడగగా, "కీర్తి భట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఇంకా రేవంత్ కి రెండు ముఖాలు ఉన్నాయి. ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడుతాడు. శ్రీసత్య చాలా రెచ్చగొడుతుంది. ఆదిరెడ్డి పర్ఫెక్ట్ గేమర్. రోహిత్ జెన్యూన్ పర్సన్. ఇంకా నా హార్ట్ లో మెరీనా అక్కకి సెపరేట్ స్పేస్ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

రోజు రోజుకి ట్విస్ట్ లతో ప్రేక్షకుల అంచనాలను దాటి వినోదాన్ని అందిస్తున్నాడు బిగ్ బాస్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇనయాని ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ మరో షాక్ ఇచ్చాడు. అయితే సోమవారం నుండి బుధవారం వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటారో.. వారు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతారని.. నాగార్జున ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో చెప్పాడు. అయితే  తాజాగా జరిగిన‌ ఓటింగ్ లో రోహిత్ రేవంత్ ల మధ్య మొదటి స్థానానికి పోటీ జరుగుతోంది. గంట గంటకి వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం జరుగుతుంది. ఆయితే రోహిత్ జెన్యూన్ గా, జెంటిల్ మెన్ గేమ్ ఆడతాడు కాబట్టి ఈ సారి అతనే టైటిల్ విజేత అనే ఊహాగానాలు వస్తోన్నాయి. కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మూడవ స్థానంలో, శ్రీహాన్ నాల్గవ స్థానంలో, కీర్తి భట్ ఐదవ స్థానంలో ఉండగా, చివరి స్థానంలో శ్రీసత్య ఉంది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీసత్య దాదాపు బయటకొచ్చేస్తుందనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రెండు రోజుల్లో శ్రీసత్యకి ఓటింగ్ ఎక్కువ అవుతుందేమో చూడాలి మరి.

'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రెడీ అన్న ఆర్పీ

జబర్దస్త్ కమెడియన్ గా కిర్రాక్ ఆర్పీ ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఐతే తర్వాత షో నుంచి నాగబాబు వెళ్లిపోయేసరికి ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక మూవీ తియ్యడానికి ట్రై చేసాడు కానీ దాని డీటెయిల్స్ ఏమీ తెలీదు.  ఇక జబర్దస్త్ గురించి సోషల్ మీడియాలో ఆర్పీకి మిగతా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కి బాగా గొడవలు కూడా జరిగాయి. అలా ఆర్పీ టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఎక్కడా స్థిరంగా ఉండని ఆర్పీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రీసెంట్ గా  ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ.  ఈ నెల్లూరు పెద్దారెడ్డి రెస్టారెంట్ ప్రత్యేకతల గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ లో అన్ని వంటకాలు కట్టెల పొయ్యి పైనే  వండుతామని.. పదేళ్ల కిందటే  మొదలు పెడదామనుకున్న రెస్టారెంట్ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ ఊరు నెల్లూరు అని తెలిసిన విషయమే. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రుచిని హైదరాబాద్ వాసులకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినట్లు చెప్పాడు.