ఘనంగా వివాహం చేసుకున్న బుల్లితెర నటి సునందమాల!

బుల్లితెర సెలబ్రిటీస్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ ఐపోతున్నారు.రీసెంట్ గా టీవీ యాక్టర్స్ ఐన అమర్ దీప్-తేజస్విని వివాహం చేసుకోగా ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో  లేడీ విలన్ రోల్స్ చేసిన సునందమాల వివాహం చేసుకుంది. వైజాగ్ లో పుట్టి పెరిగిన సునందమాల, ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిలైపోయింది. చిన్నప్పటినుంచి ఆమెకు డాన్స్ అంటే పిచ్చి. అలా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాక సీరియల్స్ లో చిన్నచిన్న రోల్స్ చేస్తూ  గుర్తింపు తెచ్చుకుంది.  సునంద తన కెరీర్ స్టార్టింగ్ లో ఈటీవీ, జీ తెలుగులో యాక్ట్ చేసి పాపులారిటీ సంపాదించుకుంది. అలానే ప్రేక్షకులకు ఆమె దగ్గరయింది. ఇక ‘ముద్ద మందారం’ సీరియల్ లో విలన్ రోల్ చేసాక టు స్టేట్స్ లో ఫుల్ ఫేమస్ ఐపోయింది. ‘హిట్లర్ గారి భార్య’ సీరియల్ లో చేసే టైములో  సునంద తను ప్రేమించిన శంకర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అది కూడా చాలా సైలెంట్ గా చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది.  ఇప్పుడు పెళ్లి కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంది. ఇక ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. సునంద పెళ్లికి బుల్లితెర నటి రోహిణితో పాటు ‘ముద్ద మందారం’లో హీరోయిన్ గా చేసిన తనూజ వచ్చి  కొత్త జంటకు విషెస్ అందించారు. ఈమె పెళ్ళికి సంబంధించిన  వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.  

ఆఫ్ట్రాల్ టీవీ కాదు సర్...మన షో చాలా కొత్తగా ఉంది

"కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఫస్ట్ సెగ్మెంట్ "అట్లుంటది మనతోని"లో టీవీ గురించిన  కాన్సెప్ట్ తో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాలను చెప్పి స్కిట్స్ వేశారు. ఇక ఈ కాన్సెప్ట్ లో అవినాష్ వాళ్ళ నానమ్మ టీవీలో వచ్చే సీరియల్ యాక్టర్స్ తో ఎలా కనెక్ట్ అయ్యి మాట్లడుకుంటూ ఉంటుందో చేసి చూపించాడు. ఇక కామెడీ ఇండెక్స్ ప్రకారం ఈ థీమ్ లో అవినాష్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత వేణు వన్డర్స్ వచ్చి తన కొడుకు తొక్కలో టీవీ అన్నందుకు కోపం వచ్చి టీవీ గురించి ఒకప్పటి హిస్టరీ మొత్తాన్ని "ఆఫ్ట్రాల్ టీవీ కాదు సర్" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక యాదమ్మ రాజు చిన్నప్పుడు తన చెల్లి ఉంటే రిమోట్ కోసం ఎలా కొట్టుకుని వాళ్ళ నాన్న చేతిలో తన్నులు తిని టీవీని ఎలా పగలగొట్టాడో చేసి చూపించాడు. ఇలా స్టాక్స్ అందరూ ఒక్కో రకమైన యాంగిల్ లో టీవీ గురించి స్కిట్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. "నేను ఒక విషయాన్ని గర్వంగా చెప్పగలను..కామెడీ షోస్ చాలా ఉన్నాయి. చాలా చూస్తున్నాం. కానీ మన షోలో సంథింగ్ కనెక్టింగ్ ఇన్సిడెంట్స్ తో చేయడం చాలా కొత్తగా ఉంది" అని చైర్మన్ అనిల్ రావిపూడి షో గురించి చెప్పారు.

బీబీ జోడీ జడ్జ్ గా అలనాటి అందాల నటి రాధ!

బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇక ఈ బిగ్ బాస్ నుంచి ఆడియన్సు దృష్టిని మరల్చకుండా ఉండడం కోసం బీబీ జోడి పేరుతో ఒక డాన్స్ షోని తెరపైకి తీసుకొచ్చారు. ఇక బీబీ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేలో ఈ బీబీ జోడి గ్లిమ్ప్స్ చూపించారు నాగార్జున.  ఈ బీబీ జోడి డిసెంబర్ 25 న మొదలుకాబోతోందని చెప్పారు. ఇక ఈ షోకి జడ్జెస్ గా బ్యూటిఫుల్ రాధ, వెళ్ళవయ్యా వెళ్ళు సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించనున్నారు. ఇక డ్యాన్సర్స్ గా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్  చేసిన కంటెస్టెంట్లు ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయించనున్నారు.  బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-స్రవంతి, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. ఇక ఈ షోకి హోస్ట్ గా బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 3  రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది.

నేను నాలాగే ఉన్నాను.. అందుకే గెలిచాను!

బిగ్ బాస్ సీజన్-6 టైటిల్ విజేత రేవంత్.. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. యాంకర్ శివ మాట్లాడుతూ, "రేవంత్ బ్రో.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్. ఇప్పుడు ఎలా ఉంది నీ ఫీలింగ్. ఆ ట్రోఫీని అలా పైకి లేపినప్పుడు ఏం అనిపించింది?" అని అడిగాడు. "ఏం జరిగింది, ఎలా జరిగింది?.. అనేది నా దృష్టిలో మ్యాటరే కాదు. ఇప్పుడు టైటిల్ నా చేతిలో ఉంది. పేరు సంపాదిస్తే డబ్బు ఆటోమేటిక్ గా సంపాదించొచ్చు" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత శివ మాట్లాడుతూ, "తన కోపమే తన శత్రువు అని అంటారు.. నీకు మాత్రం ఆ కోపం మిత్రుడు అయ్యింది" అని శివ అన్నాడు. "ఈ 105 రోజుల్లో కోపం వచ్చినప్పుడు కోపం.. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ.. ఎలా ఉండాలో అలానే ఉన్నా తప్ప.. నేనైతే నా క్యారెక్టర్ ని మార్చుకోలేదు. జనం కోసం ఒక అమ్మాయిని పొగడాలి. జనం కోసం ఒక అమ్మాయికి స్టాండ్ తీసుకోవాలి. జనం కోసం ఇలా ఉండాలని చెప్పి ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాననే నమ్మకం నాకుంది" అని చెప్పాడు. "అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసారు. అందరూ మిమ్మల్ని మాటలు అన్నారు. అవి మీరు ఎలా తీసుకున్నారు?" అని శివ ప్రశ్నించగా, "నా బ్యాడ్ లక్ ఏంటంటే.‌. ఎవరైతే నా వాళ్ళు అని అనుకుంటానో..వాళ్ళు కూడా వేరే వాళ్ళతో కలిసి ఒక మాట అన్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఇంకా హౌస్ లో ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు.. వాళ్ళలోని పాజిటివ్ ని మాత్రమే ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. నేను మాత్రం నా నెగెటివ్ ని కూడా పాజిటివ్ గా మల్చుకున్నానో అప్పుడే నేను గెలిచాను. దట్స్ ద రీజన్ ఐ ఆమ్ ద విన్నర్" అని రేవంత్ చెప్పుకొచ్చాడు.

డాన్స్ చేయకుండా అస్సలు ఉండలేను...యాక్టింగ్ కన్నా అదే ఇష్టం!

బిగ్ బాస్ స్టేజి మీద  అలనాటి అందాల తార రాధా ఎంట్రీ ఇచ్చింది. బిబి జోడి షోకి రాధా జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. వేదికపైకి వచ్చిన రాధాతో నాగార్జున సరదాగా మాట్లాడింది. "ఏమిటి డాన్స్ స్టెప్స్ వేసుకుంటూనే వచ్చారు" అని నాగ్ అడిగేసరికి "అవును నాకు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం.  మా అమ్మ ఒక కండిషన్ కూడా పెట్టింది. డాన్స్, మ్యూజిక్ వీటిల్లో కచ్చితం ఫస్ట్ త్రీ ప్రైజెస్ లో ఏదో ఒకటి గెలుచుకోవాలి లేదంటే ఇంటికి రావద్దు" అని చెప్పింది. అలా యాక్టింగ్ కన్నా డాన్స్ అంటే చాలా ఇష్టం. "ఫోర్త్ క్లాస్ నుంచి డాన్స్ చేస్తున్నా. అది కూడా క్లాసికల్ డాన్స్. మన ప్యాషన్ ని పోలిష్ చేస్తూ ఉంటే అదే మనల్ని ఒక రేంజ్ లో నిలబెడుతుంది" అని చెప్పింది రాధ.  బాలాదిత్య తనకు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పేసరికి  ఆమెతో కలసి డ్యాన్స్ చేసే అవకాశాన్ని నాగార్జున ఇచ్చారు అలా "రాధా రాధా మదిలోన" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు.  

ఆమెను చూసినవారు సూసైడ్ చేసుకోరు...

బిగ్ బాస్ హౌస్ లోంచి ఆది రెడ్డి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక హౌస్ లో ఉన్న కీర్తి, రేవంత్, శ్రీహాన్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. కీర్తిని ఈ స్టేజి మీద చూసిన రెండు రాష్ట్రాల ప్రజల్లో ఎవరైనా సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా  ఆగిపోతారు. కీర్తి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. పీకల్లోతు కష్టాల్లో ఉండి కూడా టాస్కులు ఆడింది.. లైఫ్ లో తనను తాను బాగా డెవలప్ చేసుకుంది..ఇక రేవంత్ విషయానికి వస్తే 20 నెగటివ్స్ ఉంటే అతనిలో 40 పాజిటివ్స్ ఉన్నాయి. నెగటివ్స్ చెప్పడానికే అవకాశం వచ్చింది కానీ పాజిటివ్స్ చెప్పే అవకాశం రాలేదు. ఇక శ్రీహాన్ చాలా మంచి వాడు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్ కూడా. బయటకి వచ్చాక మంచి అవకాశాలు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాడు. అతని మనసులో ఎప్పుడూ యాక్టింగ్ తప్ప వేరేది ఉండదు అని చెప్పాడు ఆదిరెడ్డి. ఇక రేవంత్ మాట్లాడుతూ "ఆది నువ్వు బిగ్ బాస్ లో ఎలా ఉండాలో చెప్పినప్పుడల్లా నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను . నీ ఫోటో నా దగ్గరే ఉంది..నువ్వెప్పటికీ నా గుండెల్లో ఉంటావ్ " అని చెప్పాడు. ఇక ఆదిరెడ్డి మాట్లాడుతూ "నేనేమన్నా తప్పు చేసి ఉంటే క్షమించండి. లైఫ్ లో ఎవరూ పర్ఫెక్ట్ కారు.  నా డాన్స్ స్టెప్స్ తో ఇరిటేట్ చేసి ఉంటే దానికి సారీ" అని చెప్పాడు. ఇక స్టేజి మీదకు వాళ్ళ నాన్నను కూడా పిలిపించాడు. "వ్యవసాయం చేసి డబ్బు పోగొట్టుకుని అప్పులు చేసి అప్పులు వాళ్ళు వస్తే ఇంట్లో దాక్కునే వ్యక్తిని ఈరోజు ఇలా స్టేజి మీద నిలబెట్టడం చాలా గర్వంగా ఉంది" అని చెప్పాడు. ఇక వాళ్ళ వైఫ్ తో కలిసి స్టేజి మీద తన మార్క్ డాన్స్ వేసి ఎంటర్టైన్ చేసాడు.

‘పాడుతా తీయగా’ విన్నర్ మాస్టర్ సార్థక్... డబుల్ ఫ్రైజ్ మనీ

ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ లోకి  ఉత్తమమైన కార్యక్రమంగా "పాడుతా తీయగా" అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు సీజన్ 20 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ప్రతీ వారం పోటాపోటీగా చిన్నారి కంటెస్టెంట్స్ పాడేవారు. ఇక ఈ సిరీస్ 20 టైటిల్ విన్నర్ గా సార్థక్, ఇక సెకండ్ ప్లేస్ విన్నర్ గా కీర్తన, ఇక థర్డ్ ప్లేస్ విన్నర్ ఆశ్రిత్ రాఘవ నిలిచారు. ఇక వీళ్లకు బహుమతులు అందించారు క్రేన్ వక్కపొడి-దుర్గ డెయిరీ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు. ఇక ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రైజ్ అమౌంట్ ని డబుల్ చేస్తున్నట్టుగా ఆయన స్టేజి మీద ప్రకటించేసరికి ఆడియన్స్ ఈలలతో స్టేజి దద్దరిల్లిపోయింది. 1st ప్రైజ్ విన్నర్ కి 10 లక్షలు, 2nd ప్రైజ్ విన్నర్ కి 6 లక్షలు, 3rd ప్రైజ్ విన్నర్ కి 4 లక్షలు అనౌన్స్ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ " మీ నాన్నగారు బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రాన్ని నిర్వహించేవారు. తర్వాత మీరెలా చేస్తారో అని అందరూ అనుకున్నారు..కానీ మీరు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. వీళ్ళు పిల్లలు కాదు..ఎంతో అద్భుతంగా పాడారు. నెక్స్ట్ సీజన్ కి కూడా మేమే స్పాన్సర్ చేస్తున్నాం " అని చెప్పారు. ఇక ఫైనల్ గా విన్నర్స్ కి ట్రోఫీస్, సర్టిఫికెట్స్, చెక్స్ ఇచ్చి ఈ సీజన్ ని ఎండ్ చేశారు ఎస్పీ చరణ్.

గీతూ కంటే బావగారే బెటర్ అన్న బాలాదిత్య..యజ్ఞ విధాత్రికి అర్ధం అడిగిన నాగ్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ఎక్స్ హౌస్ మేట్స్ ని అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని ఇన్వైట్ చేశారు. ఇక ఎక్స్ హౌస్ మేట్స్ తో హోస్ట్ నాగ్ మాట కలిపారు.  "బాలన్న యజ్ఞ విధాత్రి ఎలా ఉంది" అనేసరికి "మా అమ్మాయి పేరు మీ నోటి నుంచి వినడం చాలా ఆనందంగా ఉంది" అన్నాడు బాలాదిత్య. "యజ్ఞ విధాత్రి అంటే అర్ధం చెప్పు" అనేసరికి "పవర్ అలాగే సరస్వతి దేవి" అని చెప్పాడు అంటే "సరస్వతి దేవి విత్ పవర్ అన్నమాట" అన్నారు నాగ్. "నీ సిగరెట్ అలవాటు ఎలా ఉంది" అనేసరికి "అంతా క్లోజ్ సర్ ప్రస్తుతానికి ఏమీ లేదు" అన్నాడు బాలాదిత్య. "నేను మా అమ్మ మనసుతో పాటు ఎంతో మంది అమ్మలా మనసును గెలుచుకున్నాను అది చాలా హ్యాపీ.  ఇక మా చెల్లి గీతుతో నా రిలేషన్ బిగ్ బాస్ హౌస్ లో కంటే కూడా చాలా బాగుంది. గీతూ హౌస్ లో కంటే బయట బాగుంది. ఎందుకంటే బయట బావగారు కూడా ఉన్నారు కదా. గీతూ కంటే బావగారే చాలా బెటర్ ఎందుకంటే ఆయన బంగారం, గీతూ వజ్రం" అని చెప్పాడు బాలాదిత్య.

బిగ్ బాస్ స్టేజి నుంచి డైరెక్టుగా పెళ్లిమండపానికి...ఇప్పటివరకు ఇలా ఎవరికీ జరగలేదు!

బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కి ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా వచ్చేసారు. ఇక కొత్త పెళ్లికూతురు  నేహా చౌదరి కూడా వచ్చింది. ఐతే  బిగ్‌బాస్‌ ఫినాలే రోజునే… నేహా చౌదరి పెళ్లి కూడా. దీంతో పెళ్లి కూతురిని చేసిన తర్వాత.. నేహా చౌదరి.. డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ ఫినాలేలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. "మీరు ఇక్కడ విన్నర్ ని అనౌన్స్ చేస్తూ ఉంటారు అక్కడ నేను తాళి కట్టించుకుంటూ ఉంటాను.  విధి ఆడిన వింత నాటకం సర్  ఇది. రెండూ ఒకే టైమింగ్ లో వచ్చింది. ఇకపొతే నాకు  చాలా హ్యాపీ ఐన విషయం ఏమిటి అంటే 13 ఇయర్స్ గా తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ నే పెళ్లి చేసుకుంటున్నా. ఐతే బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు లేనే లేదు. పెళ్లి కూతురిగా రెడీ అయ్యి బిగ్ బాస్ సెట్ కి వచ్చి మీ నుంచి విషెస్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పింది నేహా చౌదరి.  ఇక నాగార్జున కూడా ఆమెకు అనిల్ కి ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఇక అలా బిగ్ బాస్ సెట్ నుంచి పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకుంది నేహా.

ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కీర్తి భట్!

బిగ్ బాస్ సీజన్-6 లో ఈ సారి కూడా అమ్మాయిలకు నిరాశే మిగిలింది. టాప్-3 లో ఉన్న కీర్తి భట్.. టైటిల్ గెలవకపోయినా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది కీర్తి భట్.  'కార్తీక దీపం' సీరియల్ తో బుల్లితెరపై కనిపించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఒక యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయి.. ఆ తర్వాత ఒంటరిగా మిగిలిన తను ఒక పాపని అడాప్ట్ చేసుకుంది. అనారోగ్యంతో ఆ పాప కూడా చనిపోయింది. దీంతో తను ఇష్టపడిన ప్రతీది తనకు దూరం అవుతున్నా కూడా ఎక్కడ కూడా కృంగిపోకుండా, పైకి లేచి నిలబడింది. ఇక్కడ దాకా వచ్చింది. హౌస్ లోకి వచ్చాక కూడా తనని ఎవరూ పట్టించుకోకుండా ఉండేవారు హౌస్ మేట్స్. అయినప్పటికీ తను కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. చివరి వరకూ పోరాడుతూ వచ్చి.. టాప్-3 లో నిలిచింది. అయితే రవితేజ హౌస్ లోకి వచ్చి 30 లక్షల మనీ ఆఫర్ ఇచ్చినప్పుడు, కీర్తి తీసుకొని వచ్చేయొచ్చు. కానీ తను అలా చేయలేదు. ప్రేక్షకుల ఓటింగ్ ని గౌరవిస్తూ వారికి కట్టుబడి ఉండి,  నిజాయితీగా ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చింది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చాక ఆదిరెడ్డి కూడా కీర్తి గురించి చెప్పాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ "కీర్తీ.. నువ్వు చాలా టఫ్ అమ్మ. చాలా స్ట్రాంగ్. వేలికి గాయం అయినా సరే టాస్క్ లు ఆడి గెలిచావ్. నీలా ధైర్యంగా ఉంటే ఎవరూ కూడా సూసైడ్ చేసుకోరమ్మా.. హ్యాట్సాఫ్ టు యూ" అని చెప్పాడు. దీంతో నాగార్జునతో పాటుగా కంటెస్టెంట్స్ అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో కీర్తి భట్ ప్రస్థానం.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

రవితేజా! నువ్వు ఫ్లర్టింగ్‌లో మాస్టర్‌వి!!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో సెలబ్రిటీల రాకతో బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లిపోయింది. హోస్ట్ నాగార్జున మంచి మాస్ బీట్ సాంగ్ తో స్టేజ్ మీదకు వచ్చేసాడు. వచ్చి రాగానే టాప్-5 కంటెస్టెంట్స్ కి కంగ్రాట్స్ చెప్పి ఉత్సాహపరిచాడు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల వచ్చారు. ఇక వీరిదద్దరు కలిసి నటించిన 'ధమాక' మూవీ గురించి ప్రమోషన్స్ చేసారు. తర్వాత "నాగార్జున నాకు ఫస్ట్ చెక్ ఇచ్చారు. దానిని దాచుకుందామనుకున్నా కానీ అవసరం ఉండి వాడేసాను" అని చెప్పాడు రవితేజ. ఆ తర్వాత రవితేజని, హౌస్ మేట్స్ తో మాట్లాడించాడు నాగార్జున. ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చాడు. నాగార్జున మాట్లాడుతూ, "ఆదిరెడ్డి పక్కన ఉన్నది శ్రీహాన్. అతను ఫ్లర్టింగ్ లో కింగ్" అని అనేసరికి.. "సర్..!" అని శ్రీహాన్ ఆశ్చర్యపోగా, "హే సర్ ఏంటి..గుడ్ గుడ్.. ఎంత వీలైతే అంత చేసేయ్" అని రవితేజ అన్నాడు. ఇది విని నాగార్జున "ఆ స్కూల్లో రవి మాస్టర్" అని అనగా, "మీరు తక్కువ బాగా.. మీకేం తెలియదు పాపం" అంటూ రవితేజ నాగార్జునని అనేసరికి నాగార్జున నవ్వేసాడు.

నాగ్ సర్ ముద్దులిస్తుంటే నిద్రపట్టడంలేదు అన్న ఫైమా!

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే చాలా కూల్ కూల్ గా జరిగింది. చూస్తున్నంతసేపు చాలా టెన్షన్ గా అనిపించేసరికి మధ్యమధ్యలో డాన్స్, పాటలు, సరదా సెటైర్స్ తో ఈ ఫైనల్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.  ఇక టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ వీక్ నెస్ ని ఫన్నీగా చెప్పి నవ్వించారు కింగ్ నాగార్జున. మాజీ హౌస్ మేట్స్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని నాగార్జున  ఆదిరెడ్డిని అడిగేసరికి ఇప్పటివరకు నేనే అనుకున్నా కానీ ఫైమా కూడా ఉంది అని ఆమె పేరు చెప్పాడు.  దీనితో నాగార్జున బెస్ట్ డ్యాన్సర్ అవార్డు ఇచ్చేందుకు ఫైమాని వేదిక మీదకు పిలిచారు.  ఇక ఈ సీన్ చూస్తే ఎవ్వరైనా సరే పడీ పడీ నవ్వుకోకుండా ఉండరు. నాగార్జున ఫైమా చేయి పట్టుకుని ముద్దు ఇవ్వబోయారు. దీనితో ఫైమా ఒక్కసారిగా  ఉలిక్కి పడి "అయ్యో వద్దు సర్.. మీరు ముద్దులు ఇస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు సర్" అని  ఫైమా కామెంట్ చేసేసరికి అక్కడ అందరూ నవ్వేశారు. ఫైమా వెళ్ళేటప్పుడు కూడా నాగ్ ఆమె చేతిని పట్టుకుని ముద్దులివ్వడానికి ఎంతో ట్రై చేశారు కానీ తప్పించుకుని వెళ్ళిపోయింది.  

రేవంత్ గెలుపుకు కారణం అతనే!

105 రోజులు సాగిన‌‌ బిగ్ బాస్ సీజన్-6 నిన్నటితో ముగిసింది. 'ఎంటర్‌టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్ లైన్ తో మొదలై, విశేషమైన ప్రేక్షకుల ఆదరణ పొందిన‌ ఈ సీజన్ ప్రేక్షకులతో ఎన్నో జ్ఞాపకాలను పంచుకుంది. మొదట 21 మందితో మొదలైన బిగ్ బాస్-6.. కంటెస్టెంట్స్ చేసిన‌ అల్లరి, గొడవలు, ఎమోషన్స్, వినోదం.. ఇలా‌ ఎన్నింటినో ప్రేక్షకులకు అందించింది. ఆయితే శుక్రవారమే గ్రాండ్ ఫినాలే రేస్ నుండి శ్రీసత్య ఎలిమినేషన్ అయ్యి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన వాళ్ళు టాప్-5. వీరిలో నుండి మొదట రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. 'కార్తికేయ-2' ఫేమ్ నిఖిల్ హౌస్ లోకి వచ్చి, రోహిత్ ని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యి వచ్చాడు. ఇంకా హౌస్ లో  కీర్తి, రేవంత్, శ్రీహాన్, ముగ్గురు ఉన్నప్పుడు రవితేజ సూట్ కేస్ తో హౌస్ లోకి వెళ్లి వారికి మనీ ఆఫర్ ఇచ్చాడు‌. కానీ ఎవరు అంగీకరించలేదు. ఇక "ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్ లో ఉన్నారో వారిని తీసుకొచ్చేయ్" అని నాగార్జున చెప్పేసరికి, రవితేజ మాట్లాడుతూ " ప్రతీ మనిషికి కీర్తి ప్రతిష్ఠలు కావాలి" అని చెప్పి కీర్తిని హౌస్ నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్ లో శ్రీహాన్, రేవంత్ ఇద్దరే మిగిలారు.‌ వారిని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకురావడానికి.. స్వయంగా నాగార్జునే గోల్డెన్ సూట్ కేస్ తో హౌస్ లోకి  వచ్చాడు. ఇక లోపలికి వచ్చాక ఇద్దరికీ మనీ ఆఫర్ చేసాడు. "అందులో 40లక్షలు ఉన్నాయి. అవి రన్నర్ కి.. మీ ఇద్దరిలో ఎవరికి కావాలో డిసైడ్ చేసుకోండి" అని చెప్పాడు. అయితే ఈ ఆఫర్ కి శ్రీహాన్ తీసుకుంటున్నట్టు ఒప్పుకొని రన్నర్ గా మిగిలాడు. రేవంత్ విజేతగా నిలిచాడు.

రోహిత్ ని ఎలిమినేట్ చేసిన కార్తికేయ హీరో నిఖిల్!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మంచి కలర్ ఫుల్ గా తయారు చేశారు. టాప్ 5 లో ఉన్న ఒకరిని ఎలిమినేట్ చేయమంటూ గెస్ట్ గా వచ్చిన నిఖిల్ ని  కింగ్ నాగ్ హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ వేదిక మీద నిఖిల్ కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ గురించి, 18 పేజెస్ రిలీజ్ గురించి సరదాగా ముచ్చటించారు. కార్తికేయ 2 అంత పెద్ద విజయం సాధించినందుకు నాగార్జున నిఖిల్ ని అభినందించారు.  చాలా మంది అప్ కింగ్ యాక్టర్స్ కి కింగ్ నాగ్ ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పారు నిఖిల్. ఇక అప్పుడు నాగార్జున నిఖిల్ కి ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్తూ రెడ్ హాట్ ఒకదాన్ని నిఖిల్ చేతిని ఇచ్చి పంపించారు.  ఇక నిఖిల్ హౌస్ లోకి వెళ్లి అందరితో సరదాగా ఆడిపాడారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు టాప్ 5 కంటెస్టెంట్స్ ని  తెగ టెన్షన్ పెట్టాడు. చివరికి నిఖిల్ రెడ్ హ్యాట్ ని రోహిత్ తలపై పెట్టేసరికి  రోహిత్  ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్ ఎలిమినేట్ అయినప్పుడు అతడి తల్లిదండ్రులు, భార్య మెరీనా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక  నిఖిల్ అతడిని వేదిక మీదకు తీసుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో  అద్భుతమైన జర్నీ చేసినందుకు  నాగార్జున రోహిత్ ని అభినందించారు.

బిగ్ బాస్ వేదికపై బయటపడిన రవితేజ..నాగార్జున మధ్యన ఉన్న సీక్రెట్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ షోకి "ధమాకా" మూవీ జోడి మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల బిగ్ బాస్ వేదికకు మీదకు వచ్చారు. రవితేజ ఖాతాలో ఉన్న  హిట్స్ గురించి  ఫ్లాప్స్ గురించి మాట్లాడుతో మధ్యమధ్యలో సెటైర్లు వేశారు నాగ్. ఇక శ్రీలీల అందం గురించి తెగ పొగిడేశారు. ఇక ఈ వేదిక మీద రవితేజ లైఫ్ కి సంబంధించి ఒక సీక్రెట్ కూడా రివీల్ చేశారు. అదేంటంటే తాను మూవీ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలు పెట్టింది నాగార్జున గారి మూవీతోనే అని రవితేజ అన్నారు. ఆయన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ తన కెరీర్ ని స్టార్ట్ చేసినట్లు చెప్పారు. అలా తనకు  ఫస్ట్ రెమ్యునరేషన్ నాగార్జున గారు చెక్ రూపంలో ఇచ్చారు అంటూ రవితేజ చెప్పారు. ఆ చెక్ ని దాచుకుందాం అనుకున్నా కానీ ఖర్చయిపోయిందన్నారు. తనను నాగార్జున గారు ఎంతో ఎంకరేజ్ చేసేవారని చెప్పుకొచ్చారు. చాలా విషయాల్లో ఆయన నాకు ఇన్స్పిరేషన్  అంటూ రవితేజ నాగ్ గురించి చెప్పారు.  ఇక శ్రీలీల హౌస్ లో ఉన్న కీర్తితో కన్నడలో మాట్లాడి సర్ప్రైజ్ చేసింది. శ్రీలీల కన్నడలో మాట్లాడుతుంటే నాగ్, రవి తేజ అర్థం కాక తలలు బాదుకున్నారు.  

ఆఫర్ కోసం ట్రోఫీని వదిలేసుకున్న శ్రీహాన్..విన్నర్ ఐన సింగర్ రేవంత్!

బీబీ హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఐతే వీరిలో  ముందుగా రోహిత్,  తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు.  చివరకి రేవంత్, శ్రీహాన్ మాత్రమే  మిగిలారు. వీరిద్దరిలో ఎవరు విన్నర్  అనే ఉత్కంఠ చాలా సేపు కొనసాగింది. ఐతే నాగార్జున వీరి ముందు డబ్బును పెట్టి బేరాలు మొదలుపెట్టారు.  25 లక్షల నుంచి బేరం మొదలు కాగా.. రేవంత్, శ్రీహన్ ఎక్కడా టెంప్ట్ కాలేదు. వారంతట వారే పోటీ నుంచి తప్పుకుంటే 30 లక్షల ఆఫర్ అని ప్రకటించారు. ఐనా రేవంత్, శ్రీహాన్ అంగీకరించలేదు.  కానీ నాగార్జున ఒక్కసారిగా 40 లక్షల ఆఫర్ ప్రకటించేసరికి  ఇద్దరూ ఆలోచించడం మొదలు పెట్టారు. చెప్పాలంటే  విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దానితో పోల్చుకుంటే 40 లక్షలు ఏమంత చిన్నఅమౌంట్ కాదు.  ఇక అప్పుడు  శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి ఒప్పుకున్నాడు. దీంతో  రేవంత్ విన్నర్ అయ్యాడు.  ఐతే ఇక్కడ కథ వేరేలా ఉంది. అదేంటంటే రేవంత్ కంటే శ్రీహన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐతే శ్రీహన్ తొందరపడి  40 లక్షలకు టెంప్ట్ కాకపోయి ఉంటే విన్నర్ అయ్యేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్కింది. అంటే రేవంత్ ని విన్నర్ గా శ్రీహన్ చేసినట్లే లెక్క. ఏదేమైనా డబ్బు పరంగా ఇద్దరికీ పెద్ద తేడా లేదు.

ఎమోషనల్ ఐన గీతూ.. ఫీల్ ఐన నాగార్జున!

బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ హౌస్ మేట్స్ తో కాసేపు నాగ్ మాట్లాడి ఎంటర్టైన్ చేశారు. "గీతూ ఎలా ఉన్నావ్.. ఎందుకు అంత ఫీలవుతున్నావ్? నువ్ ఎక్కడున్నా స్పెషలే".. అని నాగ్ అనేసరికి "ఏమో సర్.. నాకు మాత్రం ఆ ఫీల్ పోవట్లేదు .. ఏంటోలా ఉంది.. అందుకే ఆ ఫీల్‌ని ఇక్కడితో ఎండ్ చేసేద్దామనుకుంటున్నా" అని చెప్పింది. "ఈ బిగ్ బాస్ అనేది బ్యూటిఫుల్ జర్నీ.. అందరికి మంచి లైఫ్ వచ్చింది. నాకు కూడా" అంది. దాంతో, "అవును. నాకు కూడా చాలా బాధగా ఉంది ఈరోజుతో బిగ్ బాస్ ఐపోతోంది అనుకుంటే" అని అన్నారు నాగ్. ఇక  తర్వాత  "చంటి ఎలా ఉన్నావ్?" అని నాగ్ అడిగేసరికి చంటి నవ్వేసాడు. "నువ్వు నన్ను చూస్తున్నప్పుడల్లా కామెడీనా లేదా ఇంకా ఏమన్నానా అర్థం కావడం లేదు" అని నాగ్ అనేసరికి, "మిమ్మల్ని చూస్తే నాకు తెలియని ఆనందం వచ్చేస్తుంది.. బయటికి వచ్చాక నా గేమ్ ని చూసుకున్నాక అర్థమయ్యింది, నేను ఇంకా కొంచెం బాగా ఆడి ఉంటే బాగుండేదని" అని చెప్పాడు చంటి. 

జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌ బాస్‌ 6 విన్నర్‌ రేవంత్‌!

బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌ ఎట్టకేలకు ఆదివారంతో ముగిసిపోయింది.  105 రోజులపాటు జరిగిన ఈ సీజన్ కి  ఇక్కడితో ఎండ్ కార్డు పడింది. టాప్‌ 5గా ఉన్న రేవంత్‌ , శ్రీహాన్‌ , ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ లో ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా రేవంత్‌ నిలిచారు.  ఐతే అందులోనే పెద్ద ట్విస్ట్ ఉందని అదేంటంటే  ఓటింగ్‌ ప్రకారం శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు హోస్ట్.  రేవంత్‌కి మొత్తంగా ఎంత వచ్చిందనేది చూస్తే, బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ట్రోఫీతో పాటు 10 లక్షల ప్రైజ్‌ మనీ దక్కుతుంది. దీంతోపాటు `సువర్ణభూమి` వారి 650గజాల ఫ్లాట్‌ దక్కబోతుంది. అంటే సుమారు 30 లక్షల విలువ చేసే దీన్ని  సువర్ణభూమి వారు విన్నర్‌కి ఈ గిఫ్ట్ ని ప్రకటించారు.  మరోవైపు పది లక్షల విలువైన బ్రేజ్జా కారుని బహుమతిగా మారుతి సుజికి వారు ప్రకటించారు. ఇలా మొత్తంగా రేవంత్‌కి యాభై లక్షలు అందుకున్నారని చెప్పొచ్చు.  మొత్తంగా రేవంత్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా సుమారు డెబ్భై నుంచి ఎనబై లక్షల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌కి ఇటీవలే కూతురు పుట్టింది. తన ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చిందని ఆయన ఎంతో సంబరపడ్డారు. తన కూతురుకి ట్రోఫీని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడం విశేషం. అదే విషయాన్ని ఆయన స్టేజ్‌పై ఎమోషనల్‌ అవుతూ చెప్పారు.  శ్రీహాన్‌ కారణంగా రేవంత్‌ జాక్ పాట్‌ కొట్టాడు. రియల్‌ హీరో అయ్యారు. అయితే ఈ సీజన్‌కి మాత్రం రేవంత్‌, శ్రీహాన్‌ ఇద్దరూ విన్నర్సే అని చెప్పొచ్చు.

ఆరోహి స్లాంగ్ కి ఫిదా ఐపోయిన హోస్ట్ నాగ్...వాసంతి నేను వైఫ్ అండ్ హజ్బెండ్

బీబీ స్టేజి మీద అందరూ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక నాగ్ లైన్ లోకి వచ్చి "ఆరోహి ఎలా ఉన్నావ్ ?" అనేసరికి "బాగున్నా సర్ " అంది "బయటికి వెళ్ళాక చాలా మంది నా స్లాంగ్ కి ఫాన్స్ ఇపోయారు" అని చెప్పింది. "అవును నేను కూడా నీ స్లాంగ్ ని మిస్ అవుతున్నా..నాకు నీ స్లాంగ్ అంటే ఇష్టం" అని చెప్పారు నాగ్. నాకు బిగ్ బాస్ చాలా మంచి చేసింది. నాకు పెద్ద ఫామిలీని ఇచ్చింది. చాలామంది నాతో బాగా క్లోజ్ అయ్యారు. చెప్పాలంటే బయటికి వచ్చాక వాసంతి నా హజ్బెండ్ ఐపోయింది " అనేసరికి "అవునా అదేంటి ఏ  సైడ్ చూసినా వాసంతి అసలు అబ్బాయిలాగే ఉండదు కదా" అన్నారు నాగార్జున. "నేను అబ్బాయిలానే ఉంటా కదా సర్ అందుకే వాసంతికి నేను భర్త అనుకోండి." అనేసరికి అందరూ నవ్వేశారు.  ఇక మన్మధుడు మూవీలో "పూల చెట్టు ఊగినట్టు" అనే లైన్ పాడి నాగార్జునకి  డేడికేట్ చేసింది. తర్వాత "వాసంతి ఎలా ఉన్నావ్..బయటికి వెళ్లేసరికి బిజీ ఇపోయావ్" అన్నారు నాగ్. "అవును సర్ నిజమే .కానీ నేను బిగ్ బాస్ ని అస్సలు మిస్ అవ్వలేదు. ఎందుకంటే బీబీ జోడితో మళ్ళీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను" అని చెప్పింది.