సస్పెన్స్ గా మారిన మిడ్ వీక్ ఎలిమినేషన్.. శ్రీసత్య అవుటా? కాదా?

బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. కాగా బుధవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉంటాయని బిగ్ బాస్ చెప్పగా, గురువారం కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉండటమనేది పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే గత వారం శ్రీసత్య ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిబి మేనేజ్మెంట్ కోటా అని శ్రీసత్యని పంపించకుండా, ఇనయాని పంపించిన బిగ్ బాస్ ని ఇప్పటికే జనాలు ఫేక్ పీపుల్, అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ టీం సందిగ్ధంలో పడిందా.. లేదంటే మరోక ట్విస్ట్ ఉండబోతుందా అన్నట్టుగా మారింది. బిగ్ బాస్ చరిత్రలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇదే తొలిసారి. అయితే ఇది ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటివరకు జరిగిన అఫీషియల్ ఓటింగ్ లో శ్రీసత్య లీస్ట్ లో ఉంది. అయితే సోషల్ మీడియాలో అనఫీషియల్ గా శ్రీసత్య ఎలిమినేట్ అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ బిగ్ బాస్ గురువారం జరిగిన ఎపిసోడ్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చూపించకపోవడం.. ఓటింగ్ లైన్స్ లో శ్రీసత్య పేరు ఉండటం వల్ల మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా? లేదా అనేది ప్రేక్షకులకు ఇంకా సస్పెన్స్ గా ఉంది. అయితే ఇప్పటికే హౌస్ లో ఉన్నవాళ్ళవి.. అందరి జర్నీ వీడియోలు చూపించడంతో, ఎవరు బయటకొస్తారనేది గందరగోళంగా మారింది.

జడ్జెస్ లో ఆల్ రౌండర్ ఇంద్రజగారే.. రాంప్రసాద్ కామెంట్స్ వైరల్!

ఇంద్రజ ఎప్పటికప్పుడు కొత్త పోకడలకు తగ్గట్టుగానే తనను తాను డిజైన్ చేసుకుంటూ మెరుగవుతూ వస్తోంది. ఏ షో చేసినా అందులో తనదైన ఒక మార్క్ ని చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు.  ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ 100 వ ఎపిసోడ్ లో బ్లాక్ కలర్ సారీలో అద్భుతంగా మెరిసింది ఇంద్రజ. "ఏదో ఒక రాగం" అని పాట పాడి అందరిని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. అలాగే "ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా" అనే సాంగ్ కూడా అద్భుతంగా పాడి  స్టేజి మీద ఉన్న అందరి చేతా "సూపర్ సూపర్ సూపర్" అని అనిపించుకున్నారు. ఇక ఆటో రాంప్రసాద్ లేచి "జడ్జెస్ లో ఆల్ రౌండర్ మీరే మేడం" అన్నాడు..ఆది ఐతే "ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో మీ వాయిస్ లో అంత డెప్త్ ఉంది" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు.  ఇంద్రజ ఇప్పుడున్న అందరి జడ్జెస్ లోకి చాలా స్పెషల్..ఎందుకంటే ఈమె యాక్టర్, సింగర్, డాన్సర్ అన్ని రంగాల్లో ఆరితేరిన మనిషి. ఇక నెటిజన్స్ కూడా ఆమె పాడిన పాటలకు ఫిదా అవుతూ కామెంట్స్ చేశారు.. అలాగే ఒకే ఫ్రేమ్ లో రష్మిని, సౌమ్యను చూడడం కూడా బాగుంది అంటున్నారు.

జబర్దస్త్ లో కొత్త టీమ్స్..ఇక కామెడీ పీక్స్ అంటున్న నెటిజన్స్!

జబర్దస్త్ లో ప్రతీ వారం కొత్త కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు వచ్చే వారం నుంచి కనిపించబోతోంది. 22 న ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కొత్త యాంకర్ వచ్చింది. కొత్తకొత్త జడ్జెస్ కూడా వస్తూ ఉన్నారు.  ఇక ఇప్పుడు కొత్త టీమ్స్ కూడా వస్తున్నాయి. నాన్స్టాప్ నూకరాజు టీమ్, ఖిలాడీ ఖాజా టీమ్, రాకెట్ రాఘవ టీమ్, వెంకీ మంకీస్ టీమ్, రైసింగ్ రాజు టీమ్ కనిపించి అలరిస్తోంది. ఇక వచ్చే వారం నుంచి సూపర్ సద్దాం-యాదమ్మ రాజు టీమ్, షైనింగ్ శాంతకుమార్ టీమ్స్  ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సద్దాం-యాదమ్మ రాజు ఆల్రెడీ ప్రూవెన్ కమెడియన్స్. వీళ్ళు జబర్దస్త్ స్టేజి మీదకు రావడం ఇదే మొదటి సారి. వీళ్ళు ఇప్పటికే ఆహాలో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో స్టాక్స్ గా అందరినీ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు వచ్చే వారం నుంచి జబర్దస్త్ స్టేజి మీద కూడా కనిపించబోతున్నారు.  ఇక షైనింగ్ శాంతకుమార్ గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసాడు తర్వాత షో నుంచి కొంత బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ "సద్దాం, రాజు.... వెల్కమ్ బ్యాక్ అలాగే  చంద్రన్న కూడ రావాలి... వెల్కమ్  బ్యాక్ జబర్దస్త్ శాంతి కుమార్ " అని కామెంట్స్ చేస్తున్నారు.  

కూతురి కోరికకు షాకైన శ్రీవాణి!

బుల్లితెర నటి శ్రీవాణి గురించి అందరికీ బాగా తెలుసు. సీరియల్స్ లో నటిస్తుంది..షోస్ లో పార్టిసిపేట్ చేస్తుంది..సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటుంది. అంతే కాదు రీసెంట్ గా ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కుంది..అందులోకి గృహప్రవేశం కూడా చేసేసింది. ఇక తన యూట్యూబ్ ఛానల్ లో డైలీ అప్ డేట్స్, పర్సనల్ విషయాలు, ప్రాంక్ వీడియోస్  అన్ని రెగ్యులర్ గా  అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన ఇంటి గృహప్రవేశం ముందు చేసిన చీరల  షాపింగ్ వీడియోని రీసెంట్ గా పోస్ట్ చేసింది.  ముందు చీరల షాప్ కి తన కూతురు నందినిని తీసుకుని వెళ్ళింది శ్రీవాణి. అక్కడ ఎంట్రన్స్ లో కంచి కామాక్షమ్మ విగ్రహం చూసి "ఏదైనా కోరిక కోరుకో అమ్మవారు తీరుస్తారు" అని నందినికి చెప్పింది. "నేను హైట్ అవ్వాలి" అని నందిని కోరుకునే సరికి శ్రీవాణి షాకయ్యింది. ఇక నందినికి పట్టు లంగావోణి సెలెక్షన్స్ లో చాలా బిజీగా ఉండగా "అమ్మా ఈరోజు నువ్వింత బాగున్నావేంటి" అని శ్రీవాణికి బిస్కెట్ వేసేసరికి  "ఇలాంటి మాటలు చెప్పకుండా నీకేం కావాలో చెప్పు" అని కౌంటర్ వేసింది. ఇలా  ఇంకా ఎన్నో రకాల చీరలు, బోర్డర్స్, కలర్ కాంబినేషన్స్ చూసి చివరికి నందినికి ఒక కలర్ ఫుల్ లంగా వోణి వేసి చూసుకుని మురిసిపోయింది శ్రీవాణి.

స్టేజీపై రచ్చ రచ్చ చేసిన రష్మీ, సౌమ్యరావు

సిల్వర్ స్క్రీన్ కి తగ్గట్టుగానే బుల్లితెర కూడా పోటీ పడుతోంది. ఎన్నో కొత్త షోస్ తో అలరిస్తూ ఉంది. జబర్దస్త్ తర్వాత స్టార్ట్ ఐన షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు  శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసొడ్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు. జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావుతో పాటు రష్మీ చేసిన మాస్ డ్యాన్స్ షో ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. రష్మీ తనదైన స్టైల్లో మాస్ డ్యాన్స్ తో స్టేజిని అల్లాడించింది.  పుష్ప సినిమాలోని చూపే బంగారమాయనే శ్రీవల్లీ పాటకు సౌమ్య లంగా ఓణీ వేసుకుని డాన్స్ చేసింది. ఇక ఆది కూడా ఎప్పుడెప్పుడు సౌమ్యతో డాన్స్ చేద్దామా అన్నట్టుగా ఎదురుచూస్తున్నాడేమో వెళ్లి తనతో కలిసి స్టెప్పేసి తన పంచులతో రెచ్చిపోయాడు. తర్వాత ఇమ్మానుయేల్, వర్ష ఇద్దరూ ఉప్పెన మూవీలోని సాంగ్ కి డాన్స్ చేశారు.

ఐ మిస్ యు బిగ్ బాస్ అని కన్నీళ్లు పెట్టుకున్న ఆరియానా!

బిగ్ బాస్ సీజన్ 6  ఫైనల్ కి వచ్చేసింది. గత సీజన్స్ కి వచ్చినంత రేటింగ్ కావొచ్చు, ఎంటర్టైన్మెంట్ కావొచ్చు ఏదీ కూడా ఈ సీజన్ లో కనిపించలేదు. ఇక "బీబీ కెఫె"కి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది.  బీబీ కెఫె లో అందరిని ఇంటర్వ్యూ చేసే ఆరియానాని ఇప్పుడు కాజల్ ఇంటర్వ్యూ చేసింది. "ఇన్ని ఎపిసోడ్స్ నువ్వు హోస్టింగ్ చేసావ్ కాబట్టి.. " అని కాజల్ అనేసరికి "ఇప్పుడు నన్ను రోస్ట్ చేస్తున్నావ్" అని కామెడీ చేసింది అరియనా. "ప్రతీ రోజు నువ్వు గెస్టులకు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో ఈరోజు ఆ టార్చర్ నీకు పెట్టబోతున్నా" అంది కాజల్. "నేను హోస్ట్ గా ఉంటే గెస్ట్ కి టార్చర్..అదే నేను గెస్ట్ గా ఉంటే హోస్ట్ కి ఫ్రాక్చర్" అని పంచ్ వేసింది ఆరియానా.  "నాకు బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్, సొసైటీలో నాకు పేరు, ఐడెంటిటీ, రెస్పెచ్త్  వచ్చింది అంటే అది బిగ్ బాస్ వల్లనే.. దాని కోసం నేను ఎంతో కష్టపడ్డాను..బీబీ కెఫెని నేను నిజంగా మిస్ అవుతాను..ఐ మిస్ యు బిగ్ బాస్" అని కన్నీళ్లు పెట్టుకుంది  ఆరియానా.

సుధీర్ జూనియర్..నేను సీనియర్.. మర్చిపోయారా ? రిపోర్టర్ కి గట్టిగా ఇచ్చిన అనసూయ!

అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకుని పెద్ద పెద్ద మూవీస్ లో మంచి ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. సుడిగాలి సుధీర్ కూడా అనసూయతో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఆ ఒదిగి ఉండే గుణంతోనే సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.  ఐతే రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో అనసూయ సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. అనసూయ రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ఫలో మంగళం శ్రీను భార్య పాత్రలో  మెరిసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయింది. ఐతే ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనసూయను " సుధీర్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ? అని రిపోర్టర్ అడిగేసరికి ఆమె  కాస్త సీరియస్ అయ్యింది.  “సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ ని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్ ని అడగండి నన్ను కాదు. అతడు నా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. నేనూ అతడి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను” అని అనసూయ చెప్పింది.  ఐతే అనసూయ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.  సుధీర్ ను జూనియర్ అనడం ఏంటి ? ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్లు అనసూయను ఘాటుగా తిడుతున్నారు.

సుధీర్ రావాలంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ

ఏ షో ఐనా సరే స్క్రీన్ మీద ఒక  హిట్ పెయిర్ అనేది ఉంటుంది. బుల్లితెర మీద  అలాంటి హిట్ పెయిర్ సుడిగాలి సుధీర్-రష్మీ జంట. వీళ్ళు కలిసి షో చేస్తే చాలు దాని రేటింగ్ మాములుగా ఉండదు. ఇక వీళ్ళు అన్ని షోస్ తో పాటు "ఢీ" లో కూడా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఈ షోని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఢీ ప్రోగ్రామ్ లో మొదట రవి-లాస్య టీమ్ లీడర్స్ గా ఉండేవారు. ఆ పెయిర్ కూడా స్క్రీన్ మీద ఎంతో సక్సెస్ అయ్యింది. తర్వాత వాళ్ల ప్లేసులో సుడిగాలి సుధీర్-రష్మీతో పాటు యాంకర్ గా ప్రదీప్ ఉండేసరికి ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ప్రతీ వారం సరదాసరదాగా సాగేది.  సుధీర్ చేసే కామెడీ కోసమే ఆడియన్స్ వెయిట్ చేసేవారు. అలాంటి సుధీర్ కొన్ని సీజన్స్ నుంచి ఢీ షోకు దూరమైపోయాడు. తర్వాత ఆది-ప్రదీప్ ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ సుధీర్ తో ఆది మ్యాచ్ అయ్యే పరిస్థితి ఆడియన్స్ కి కనిపించలేదు. ఎందుకంటే ఆది కామెడీ ఓకే కానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం కాస్త హెడ్ వెయిట్ అన్నట్టుగా చేస్తుంటాడు, కానీ సుధీర్ బాడీ లాంగ్వేజ్ మాత్రం కామన్ మాన్ లా కనిపిస్తూ అలరిస్తూ ఉంటాడు అంటున్నారు నెటిజన్స్. ఆది ఎంతసేపు తాను తప్ప వేరే వారు లేరు అన్నట్టుగా డైలాగ్స్ వేస్తూ ఉంటారు.  ఆయన పంచ్ వేస్తే వేరే వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే తప్ప ఆయన మీద అసలు పంచ్ అనేది వేయకూడదు అనే ఒక రూల్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది.  ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉండేసరికి ఆడియన్స్ కూడా సుధీర్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా ‘ఢీ 15’ సీజన్ స్టార్ట్ చేశారు. కొన్ని సీజన్లుగా ఈ  షోకు దూరమైన శేఖర్ మాస్టర్ ని మళ్లీ తీసుకొచ్చారు. మరి సుధీర్ ని కూడా షోకు తీసుకురండి అని నెటిజన్స్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి మల్లెమాల టీమ్ నెటిజన్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సుధీర్ ని షోకి తీసుకొస్తారా ? చూడాలి

ఆ పదాలకు అర్థాలా అవి ..సుమకి చాట భాష నేర్పిన ఆలీ!

"ఆలీతో సరదాగా షో"లో సుమ, ఆలీ ఆడియన్స్ ని మస్త్ ఎంటర్టైన్ చేయడానికి వచ్చే వారం రాబోతున్నారు. ఆ న్యూ ఎపిసోడ్ ప్రోమో చూస్తే గనక కొన్ని ఫన్నీ థింగ్స్ నవ్వు తెప్పించేవి గా ఉన్నాయి. "30  రోజుల్లో ఆలీ గారి చాట భాష నేర్చుకోవడం ఎలాగా ? అనే విషయం గురించి తెలుసుకుని  రమ్మని పంపించారు " అని సుమ అనేసరికి "ఆలీ నవ్వుతూ అది చాలా కష్టం" అన్నట్టుగా చెప్పారు. "మీరు ఎక్కువగా ఫ్లాన్తర్ పకిడి అంటారు కదా..అంటే ఏమిటి " అని అడిగేసరికి "ఫ్లవర్" అని ఆన్సర్ చేశారు ఆలీ.  "సుమ అంటే ఫ్లవర్ అని తెలుసు ఐతే మీరు చెప్పిన అర్ధం బట్టి సుమ = ఫ్లవర్ = ఫ్లాన్తర్ పకిడినా అయ్యో రామ" అని తల కొట్టుకుని మరీ నవ్వింది సుమ. మరి "జంబల్ హార్ట్ రాజా" అంటే ఏమిటి అని అడిగింది సుమ. "మీ ఆయన పేరు అదే"  అన్నారు నవ్వుతూ ఆలీ. ఆయన పేరు జంబల్ హార్ట్ రాజా కాదు కనకాల రాజా అని చెప్పింది సుమ.  "మీరెప్పుడైనా అనుకున్నారా ఇలా హీరో అవుతానని" అని అడిగేసరికి "నాకు రాజబాబు గారంటే ఇన్స్పిరేషన్ ..ఆయనలా కమెడియన్ అవుదామనుకున్నా కానీ హీరో అవుదామని అనుకోలేదు" అన్నారు  "మరి షోలే కొన్ని వందల సార్లు చూసారు కదా మరి ధర్మేంద్రలా ట్రై చేద్దామని అనుకోలేదా అని కౌంటర్ వేసింది సుమా.. ఆయనలా కండలు లేవు, అమితాబ్ లా చేయడానికి అంతా హైట్ కూడా లేదు" అని రివర్స్ కౌంటర్ వేశారు ఆలీ.

గుడ్ న్యూస్.. ఒకే ఫ్రేమ్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో రెండో సీజన్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లు కొద్దిరోజులు క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనడానికి తాజాగా పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఆహాలో ప్రసారమవుతోన్న 'అన్ స్టాపబుల్' షోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వచ్చిన గెస్ట్ లతో చాలా సరదాగా మాట్లాడుతూ.. బాలయ్య తన ఎనర్జీతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. మొదటి సీజన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ సందడి చేయగా.. రెండో సీజన్ లోనూ స్టార్స్ పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ షూట్ పూర్తయింది. ఇక ఇప్పుడు పవన్ సైతం ఈ షోలో పాల్గొనడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూట్ జరగనుందని సమాచారం. మొదటి సీజన్ లో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ ని చివరి ఎపిసోడ్ గా ప్రసారం చేశారు. అలాగే పవన్ ఎపిసోడ్ ని కూడా రెండో సీజన్ చివరి ఎపిసోడ్ గా ప్రసారం చేసే అవకాశముందని అంటున్నారు.

'ఆలీతో సరదాగా' షోకి బ్రేక్!

ఈటీవీలో ప్రసారమవుతున్న "ఆలీతో సరదాగా" టాక్ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ఐతే ఇప్పుడు ఈ షోకి బ్రేక్ పడబోతోంది అని ఆలీ తన షోలో చెప్పారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. 19 వ తేదీన ప్రసారమయ్యే ఈ షోలో ఆలీని ఇంటర్వ్యూ చేయడానికి సుమ కనకాల వచ్చింది. ఇక ఆలీకి పూల బొకే ఇచ్చి, షాల్ కప్పింది. "నేను మీకన్నా వయసులో చాలా చిన్నదాన్ని నన్ను ఆశీర్వదించండి" అని సుమ ఆలీ కాళ్ళ మీద పడి  ఆయన ఆశీర్వాదం తీసుకుంది. "ఈరోజు ఆలీ గారిని అడగాల్సివన్నీ అడిగేసి కడిగేస్తా" అని ఒక రేంజ్ లో సీరియస్ గా చెప్పేసరికి దానికి  ఆలీ జోక్ గా "కడగడానికి వాటర్ తెచ్చావా అని అడిగారు.  వాటర్ మాత్రమే కాదు వేరేవి కూడా తెచ్చాను ఎందుకులెండి చెప్పడం" అంది సుమ   కూడా సరదాగా. ఇక ఆలీ మాట్లాడుతూ "ఈ షోని మొదట మంచు లక్ష్మితో స్టార్ట్ చేసాం..ఆమెకు మొదట థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అలా స్టార్ట్ ఐన ఈ షో 300 ప్లస్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఐతే ఇప్పుడు ఈ షోకి కొద్దిగా బ్రేక్ ఇస్తున్నాం. త్వరలో మరో అద్భుతమైన షోతో మీ ముందుకు వస్తాం" అని చెప్పారు ఆలీ.

శ్రీముఖి హోమ్లీ లుక్.. క్యూట్ ఫ్యామిలీ అంటున్న నెటిజన్స్!

శ్రీముఖి ఎప్పుడూ హాట్ ఫోటో షూట్స్ తో కిక్కెక్కిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం తన ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తే చాలా క్యూట్ గా చుడిదార్ లో అందంగా, సంప్రదాయంగా కనిపిస్తోంది. అది కూడా తన  అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి దిగిన ఫామిలీ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఫామిలీ ఫొటోస్ చూసి ఆమె ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.  ఇక శ్రీముఖి కూడా కొత్త ఇల్లు కొనుక్కున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడే తన ఫామిలీతో కలిసి ఫొటోస్ దిగినట్లు తెలుస్తోంది శ్రీముఖి. ఇక బుల్లితెర నటి సుష్మకిరణ్ "కంగ్రాట్యులేషన్స్" అని మెసేజ్ పెట్టింది. ఇక నెటిజన్స్, రాములమ్మ ఫాన్స్ అంతా కూడా  విషెస్ చెప్తున్నారు. "కొత్త ఇంట్లో పాలు పొంగించి మాకు కూడా పాయసం పంపండి..కొత్త ఇంట్లోకి వెళ్ళాక న్యూ హోమ్ టూర్ వ్లగ్ చెయ్యి అక్కా" అని  కామెంట్స్ చేస్తున్నారు.  ఇక శ్రీముఖి ఇప్పుడు బిజీ యాంకర్. ఇటు షోస్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో అవకాశాలు వస్తుంటే చేస్తోంది అలాగే ఫారెన్ లో జరిగే ఈవెంట్స్ లోనూ తనదైన మార్క్ చూపిస్తూ మొత్తాన్ని ఎలేస్తోంది. ఇప్పుడు బుల్లితెర మీద శ్రీముఖి హవా బాగా నడుస్తోంది.

అస్మిత హోం టూర్.. ఇల్లు కాదు అది తెల్లని ఇంద్రభవనం!

న‌టిగా అస్మిత బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద అందరికీ పరిచయమే. "యాష్ ట్రిక్స్" పేరుతో చేసిన వీడియోలతో కూడా ఆమె ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈటీవీలో ఒకప్పుడు ప్రసారమైన 'పద్మవ్యూహం' సీరియల్ తో పాటు మరెన్నో సీరియల్స్ లో నటించింది. అలాగే మహేష్ బాబు 'మురారి' మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసింది.  ఇక తర్వాత 'అగ్ని సాక్షి' సీరియల్ లో విలన్ రోల్ లో నటించింది. ఇక ఇప్పుడు అస్మిత యాక్టింగ్ కి బై బై చెప్పేసి యూట్యూబ్ మీద కాన్సంట్రేట్ చేస్తోంది. ఐతే రీసెంట్ గా సోషల్ మీడియాలో  అస్మిత హోమ్ టూర్ కి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. మొదట్లో ఈ ఇంటిని చూసినప్పుడు డబ్బాలా ఉంది.. దీంతో ఏం చేయాలి అనుకున్నాం కానీ ఆర్కిటెక్ట్స్ ని పిలిచి నచ్చిన విధంగా ఇంటిని మోడిఫై చేసుకున్నామని చెప్పింది. ఇల్లంతా ఎక్కువగా వైట్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక కిచెన్ ఐతే బెడ్ రూమ్ కన్నా చాలా బాగుంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తోంది. ఇక చిన్న లివింగ్ రూమ్, టు బెడ్ రూమ్స్, మామూలువి మూడు గదులు, రొటేటింగ్ షెల్ఫ్ చూపించింది. అలాగే స్పానిష్ టైల్స్ తో డిజైన్ చేయించుకున్న బాల్కనీ కూడా అదిరిపోయింది. అన్ని రకాల వస్తువులు కొనేయకుండా, ఏది అవసరమో అవే కొనుక్కుని వాటినే జాగ్రత్తగా వాడుకుంటామని చెప్పింది. ఇల్లు మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ అని చూపించింది. ఇక స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న సిటౌట్, హోమ్ థియేటర్ ని అందులో తమ కొత్త వెబ్ సిరీస్ ని కూడా చూపించింది. ఇలా అస్మిత, సుధీర్ తమ ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పారు.

సూర్య పులిహోర.. బయట కూడా నలుగురికి ప్రపోజ్ చేసేశాడు!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లో లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఆర్జే సూర్య ఫుల్ ఎంటర్టైన్ చేసాడు.  ఇక ఇందులో  సూర్యకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. లేడీస్ నుంచి వాసంతి, గీతూ, నేహా, ఆరోహిని రకరకాల హీరో వాయిసెస్ తో లవ్ ప్రొపోజ్ చేయాలని చెప్పింది.  ఇక ఈ టాస్క్ పేరు "సూర్య పులిహోర" అని పేరు పెట్టింది శ్రీముఖి. "ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా కవులకు మాత్రం చందమామే కనపడుతుంది, నా చందమామ నువ్వు ..ఐ లవ్ యు వాసంతి" అని రాజశేఖర్ వాయిస్ తో ప్రొపోజ్ చేసాడు. ఇక తర్వాత గీతూ వచ్చేసరికి పుష్పలో అల్లు అర్జున్ వాయిస్ తో ప్రొపోజ్ చేసాడు. ఇక నేహాకి బాలయ్య బాబులా ప్రొపోజ్ చేసాడు.. "నీ వెంట తిరిగి ఫ్లవర్స్ ఇచ్చి ఐ లవ్ యు అని చెప్పినప్పుడు కన్నెత్తి చూడలేదు, నీకు ఇష్టమైన కేక్ ని పంపిస్తే కనీసం కత్తితో కొయ్యలేదు" అని చెప్పేసరికి "కేక్ పంపారు కానీ కత్తి పంపలేదు అంది నేహా.  ఇదిగో కేక్ ని కొయ్యడానికి గొడ్డలి" అని ఇచ్చాడు సూర్య.  ఇక ఆరోహికి ఆర్జీవీ వాయిస్ తో ప్రొపోజ్ చేసాడు.."సి నేను గనులను, కత్తులను ఎంత ప్రేమిస్తానో అంతకంటే వన్ పర్సెంట్ ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా..ఐ లవ్ యు ..నాకు వెంటనే రిప్లై ఇవ్వొద్దు..ట్విట్టర్ లో టాగ్ చెయ్యి..చూసుకుందాం" అని చెప్పేసరికి స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు.

నిప్పంటుకుని చెల్లి చనిపోయింది.. రెండు రూపాయలతో నా సంపాదన మొదలయ్యింది

"ఆలీతో సరదాగా షో" లో ప్రతీ వారం ఆలీ ఎంతోమంది  సెలెబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళను మనకు పరిచయం చేయడం చూసాం. ఇక ఇప్పుడు తన షోలో తానే సెలెబ్రెటీగా మారి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. "మిమిక్రి చేస్తే వచ్చిన నా ఫస్ట్ ఇన్కమ్ రెండు రూపాయల కాగితం ఎర్రగా ఉండేది. ఇక ఆ టైంలో నేను మా అమ్మకు ఒక కండిషన్ పెట్టాను. అదేంటంటే మా అమ్మకు నాకు వచ్చిన రెండు రూపాయలు ఇచ్చేసాక  ఆమె తిరిగి నాకు అర్ద రూపాయి ఇవ్వాలి అని. అలా రెండు రూపాయలతో మొదలైన నా సంపాదన తర్వాత ఐదు, తర్వాత పది, పదిహేను రూపాయలు అయ్యింది" అని ఆలీ చెప్పేసరికి "ఇప్పుడు ఎంత అయ్యింది అని చాలా ఆసక్తిగా సుమ అడిగింది. ఆ ఎంతో కొంత అయ్యిందిలే, ఇప్పుడు నేను అడిగితే తర్వాత నా రెమ్యూనరేషన్ ఎంత అని నన్ను అడుగుతారు తరువాత వేరే వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు ఇదంతా  ఎందుకులెండి అంది సుమ కనకాల. ఫస్ట్, సెకండ్ జెనెరేషన్స్ చూసారు మరి నాలాంటి థర్డ్ జనరేషన్ కూడా కూడా చూసారు అని సుమ పంచ్ వేసేసరికి ఆలీ షాకయ్యాడు. ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఖయ్యూమ్, మీరు కాదా మొత్తం సంతానం కదా అని సుమ అడిగేసరికి   ఖయ్యుమ్ కి ముందు ఒక చెల్లి పుట్టింది ఐతే  తన చున్నీకి పొరపాటున నిప్పంటుని ఆమె చనిపోయింది" అని చెప్పి ఎమోషన్ అయ్యారు ఆలీ.

మా మధ్య కావాలనే గ్యాప్ క్రియేట్ చేశారు!

ఇండస్ట్రీలో  పవన్ కల్యాణ-ఆలీ ఎంతో మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈ మధ్య కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఇక ఈ విషయం మీద ఆలీతో సరదాగా షోలో "మీకూ పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ? అని సుమ అడిగేసరికి ”నాకు పవన్ కు మధ్య గ్యాప్ లేదు. దాన్ని కొంతమంది క్రియేట్ చేశారు. మా అమ్మాయి పెళ్లికి కూడా వస్తా అన్నారు. కానీ ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయారు” అని ఆలీ  చెప్పారు. పెళ్ళికి ముందు ఆలీ గారికి ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయ్ అని సుమ అడిగేసరికి "ఆలీ  సిగ్గుపడుతూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారు. చిన్నప్పుడు ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. ఒకరోజు వర్షంలో చున్నీ నెత్తి మీద కప్పుకుని తడుస్తూ వస్తోంది. అప్పుడు నేను ఒక ఇంపోర్టెడ్ గొడుగుని కొని మా చెల్లికి ఇచ్చి ఆమెకు ఇవ్వమని చెప్పాను. అలా ఆ గొడుగు తీసుకున్న ఆ అమ్మాయి రెండో రోజు వర్షం లేకపోయినా నా కోసం గొడుగు వేసుకుని వెళ్ళింది." అని నవ్వుతూ  చెప్పారు ఆలీ.

ఢీ 15ని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు.. ఇక పాతుకుపోవడమే!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైనింగ్ గా, జోష్ గా, కలర్ ఫుల్ గా  స్టార్ట్ అయ్యింది. టీం ఏ- టీం బిగా కంటెస్టెంట్స్,  మాస్టర్స్ డివైడ్ అయ్యారని హోస్ట్ ప్రదీప్ చెప్పాడు. అలాగే 12 మంది కంటెస్టెంట్స్, 12 మంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు అని జడ్జి శేఖర్ మాస్టర్ చెప్పారు. అలాగే ఇప్పుడు వేసే మార్క్స్ అన్నీ కూడా ఎలిమినేషన్ రౌండ్ లో టాలీ చేసి ఎవరికి మార్క్స్ తక్కువ వచ్చాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని ఈ షోకి సంబందించిన  రూల్స్ చెప్పేసారు. ఇక ఈ షోలో జడ్జెస్ జడ్జిమెంట్ తో పాటు తోటి మాస్టర్స్ జడ్జిమెంట్ ని కూడా పరిగణలోకి తీసుకుంటాం అన్నారు.  ఇక ఇది వరకు లాగే ఆది వచ్చి తన మాటలతో ఎంటర్టైన్ చేసాడు. ఇక మొన్నటి వరకు జడ్జిగా శ్రద్దాతో పాటు పూర్ణ ఉండేది. కానీ ఇప్పుడు పూర్ణ పెళ్ళై వెళ్ళిపోయింది. ఇక జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, శ్రద్ద దాస్ మాత్రమే కనిపిస్తున్నారు. "శేఖర్ మాస్టర్ మీరే చాలామందికి ఇన్స్పిరేషన్.. ఇక ఈ షో నుంచి మీరు ఇకముందు వెళ్ళరుగా ఉంటారుగా" అని ప్రదీప్ అనేసరికి "సమస్యే లేదు..పాతుకుపోవడమే" అని జోక్ చేశారు.

అవకాశం వస్తే న్యూడ్ గా నటిస్తానంటున్న సుడిగాలి సుధీర్!

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. చైర్మన్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో హోస్ట్స్ సుధీర్, దీపికా పిల్లి ఆధ్వర్యంలో ఈ షో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటోంది. ఇక ఇందులో కామెడీ పీక్స్ లో ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇక రాబోయే వారం కామెడీ స్టాక్ ఎక్స్చేంజి ఎపిసోడ్ లో న్యూస్ బులెటిన్స్ లో వచ్చే స్క్రోలింగ్స్ ని మిక్స్ చేసి చదివితే ఎలా ఉంటుంది అనే అంశంపై వేణు వండర్స్ చేసిన కామెడీ చదివిన స్క్రోలింగ్స్ బాగా నవ్వు తెప్పించాయి. "అవకాశం వస్తే  న్యూడ్ గా నటిస్తానంటున్న సుడిగాలి సుధీర్, త్వరలో భూకంపం పొంచి ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారులు" అని చెప్పాడు. తర్వాత సద్దాం వచ్చి న్యూస్ యాంకర్ లా పైన కోట్ వేసుకుని న్యూస్ చదువుతూ న్యూస్ చదివే వాళ్ళు  పైకి ఇలా పోష్ గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఇలా లుంగీ కట్టుకుని ఉంటారు అని చేసి చూపించాడు. అలాగే న్యూస్ చదివేవాళ్ళు తప్పసరిగా ప్రాసలతోనే చదువుతారు అవి ఎలా ఉంటాయి అంటే "అమీర్ పెట్ లో జరిగిన హత్య..వాడి పేరు సత్య" "నిన్న రాత్రి ఎంఎల్ ఏల విందు, 11 దాటితే మందు బందు" అని చెప్పి ఎండ్ చేసాడు.  ఇక సుడిగాలి సుధీర్ టీవీ పెట్టి ప్రోగ్రామ్స్ బాలేదంటూ చానెల్స్ మార్చుతుంటే ఆ ప్రోగ్రామ్స్ హోస్ట్ లు లైవ్ లో ఇంటికి వచ్చి మరీ సుధీర్ ని సతాయిస్తారు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద రాబోయే వారం అంటే 16 వ తేదీన ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.

'బిగ్ బాస్-7' హోస్ట్ గా బాలకృష్ణ!

బిగ్ బాస్ తెలుగు సీజన్-6 క్లైమాక్ కి చేరుకుంది. ఓ వైపు ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే చర్చలు జరుగుతుంటే, మరోవైపు నెక్స్ట్ సీజన్ కి కొత్త హోస్ట్ అంటూ ప్రచారం మొదలైంది. బిగ్ బాస్-7 కి నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వచ్చే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది. బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మూడు, నాలుగు సీజన్లకు రికార్డు స్థాయిలో రేటింగ్స్ నమోదు కాగా.. ఐదో సీజన్ నుంచి జోరు తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా ఈ ఆరో సీజన్ కి ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ లభించడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో నాగార్జున షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ నుంచి హోస్ట్ గా తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు సైతం.. గత నాలుగు సీజన్లుగా నాగార్జునే హోస్ట్ గా చేస్తుండటంతో.. ఈసారి కొత్త హోస్ట్ ని రంగంలోకి దించడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్' షోతో సంచలనం సృష్టిస్తున్న బాలకృష్ణను బిగ్ బాస్-7 కి హోస్ట్ గా తీసుకురావడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.