Illu illalu pillalu : ధీరజ్ కి సపోర్ట్ గా ప్రేమ.. రామరాజు ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -118 లో....ధీరజ్ ని వాటర్ క్యాన్ ఆర్డర్ వచ్చింది వెళ్ళమని తన ఓనర్ పంపిస్తాడు. మరొకవైపు శ్రీవల్లి రెడీ అవుతుంటే కాaమాక్షి, నర్మద వాళ్ళు వస్తారు. ఇవ్వన్నీ బంగారమేనా అని శ్రీవల్లిని కామాక్షి అడుగుతుంది. అవునండి బంగారమే అని శ్రీవల్లీ చెల్లెలు చెప్తుంది. మరి అయితే హల్ మార్క్ లేదేంటని నర్మద అడుగుతుంది. మాకు బంగారం చేసే అతను మర్చిపోయి ఉంటాడు అని శ్రీవల్లి అంటుంది. బంగారం బాగుందని మా నాన్నని అడిగి చేయించుకుంటాను.. ఎక్కడో చెప్పండి అని కామాక్షి అడుగుతుంది.. దొరికిపోయామని శ్రీవల్లి టెన్షన్ పడుతుంటే అప్పుడే ముహూర్తం టైమ్ అయిందని భాగ్యం వస్తుంది. మాకు ఈ నగలు బాగా నచ్చాయి.. మీకు చేసిన అతని నెంబర్ చెప్పండి అని కామాక్షి అడుగుతుంది. నెంబర్ ఫోన్ లో ఉంది..  ఫోన్ మా ఆయన దగ్గర ఉందని భాగ్యం అంటుంది. వీళ్ళ మాటల్లో ఏదో తేడా కొడుతుందని నర్మదకి డౌట్ వస్తుంది.  ప్రేమని భాగ్యం చూసి అమ్మాయి ఒకతే వచ్చింది. తన భర్త రాలేదా అని అడుగుతుంది. ఏదో పని ఉండి రాలేదని  వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ జరుగుతు ఉంటుంది. ధీరజ్ కూడా అదే గుడికి వాటర్ క్యాన్ తీసుకొని వస్తాడ.  తన అన్న ఎంగేజ్ మెంట్ ని కళ్ళారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత చందు, శ్రీవల్లి ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అది చూసి రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ వాటర్ క్యాన్ తీసుకొని వెళ్తుంటే.. భాగ్యం కి డాష్ ఇస్తాడు. నువ్వు రామరాజు చిన్న కొడుకువి కదా అని భాగ్యం అడుగుతుంటే.. ధీరజ్ అటు పక్క చూస్తాడు. రామరాజు వాళ్ళందరిని పిలుస్తుంది భాగ్యం. మీకు అంత ఆస్తులు ఉండి మీ కొడుకు ఇంటింటికి వాటర్ క్యాన్ లు వేస్తున్నాడని భాగ్యం అంటుంది. చిన్నోడా నువ్వు ఈ పని చేస్తున్నావా అని వేదవతి అడుగుతుంది. నువ్వు ఈ పని చెయ్యడం ఏంటని భాగ్యం అడుగుతుంది. చెయ్యకూడదా చేస్తే తప్పేంటి? అన్యాయం చెయ్యడం లేదు కదా.. న్యాయంగా కష్టం చేసి సంపాదిస్తున్నాడని ప్రేమ సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ సక్సెస్.. దీప అసహ్యించుకున్న ఆ ఇంటి వాళ్ళు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -317 లో.... జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోవడానికి కారణం దీప అని దీప దగ్గరికి సుమిత్ర వస్తుంది. నీకు నా కూతురు ఏం అన్యాయం చేసింది.. ఎందుకు ఇలా పగ బట్టావని దీప ని సుమిత్ర తిడుతుంది‌. వాడు నిజంగానే మంచివాడు కాదు అమ్మ అని దీప అంటుంటే.. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా అని సుమిత్ర అడుగుతుంది. దీప సైలెంట్ గా ఉండడంతో సాక్ష్యం లేదు కదా అన్ని ఇలాంటి పనులే చేస్తావ్.. అందరిని బాధపెడుతావని సుమిత్ర తిడుతుంది. నిన్ను నా కూతురు కన్నా ఎక్కవగా నమ్మాను.. నా గుండెల మీద తన్నావ్ అని సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని సుమిత్రని అడుగుతాడు. నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని అడగడానికి వచ్చానని సుమిత్ర అంటుంది. నువ్వు ఇలా అడిగినంత మాత్రాన ఆగిపోయిన ఎంగేజ్ మెంట్ జరగదు కదా.. పదా వెళదామని సుమిత్రని తీసుకొని వెళ్తు.. నీ కోడలిని బాధపెట్టి ఉంటే క్షమించు అని కాంచనతో దశరత్ అనగానే.. కాంచన బాధపడుతుంది. మరొకవైపు జ్యోత్స్నకి జ్యూస్ తీసుకొని వస్తుంది పారిజాతం. గౌతమ్ గురించి ఆ దీప చెప్పింది నిజమేనా అని అడుగుతుంటే నన్ను ఇర్రిటేట్ చెయ్యకని పారిజాతాన్ని పంపిస్తుంది. నిజమేనా ఏంటి గ్రానీ.. నిజమే ఇదంతా నా ప్లాన్.. ఆ రోజు గౌతమ్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడే వాడి గురించి తెలిసింది. అక్కడ పనిమనిషితో మాట్లాడ్డం దాన్ని దీప అడ్డుకోవడం అంతా చూసాను.. అంతా తెలిసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను కావాలనే క్యాటరింగ్ దీప వాళ్ళకి ఇచ్చాను.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ కి వచ్చేలా చేసాను అత్తని పిలవడానికి తాతను పంపాను. ఇదంతా ఎందుకంటే నాపై ఎవరికి డౌట్ రాదు.. ఇదంతా దీప కావాలని చేసిందని అందరు తనని ఛీ కొడుతారు. సో నేను అనుకున్నట్లే అయింది.. ఇదంతా నా బావ కోసం అని జ్యోత్స్న నవ్వుకుంటూ రాక్షసనందం పొందుతుంది. మరొకవైపు దీప బాధపడుతుంటే శౌర్య వచ్చి.. ఏమైంది అంటుంది.‌ శౌర్యని లోపలికి తీసుకొని వెళ్తుంది అనసూయ. నువ్వు అందరిలో గౌతమ్ ని కొట్టి ఉండాల్సింది కాదని కాంచన అంటుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆపితే నాకేం వస్తుందని దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి వారం రోజుల గడువు పెట్టిన సవతి తల్లి.. రామలక్ష్మి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -364 లో..... సీతాకాంత్ ని రామలక్ష్మి ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తాడు రామ్.. మా మిస్ ఇంకా నీ భార్య రామలక్ష్మి ఒకేలా ఉండడం వల్లే కదా.. నువ్వు మా మిస్ వెంట పడుతున్నావని రామ్ అనగానే నా బాధ నీకు అర్థం అయింది.. ఇక తనకెప్పుడు అర్ధమవుతుందోనని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత వాళ్లు టిఫిన్ చెయ్యడానికి కూర్చుంటారు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రమ్యని పెళ్లి చేసుకోమని సీతాకాంత్ ని శ్రీలత అడుగుతుంది. ఇక ఆ టాపిక్ వదిలెయ్యండి అని సీతాకాంత్ అంటాడు. అంటే ఇప్పుడు రమ్య పరిస్థితేంటి? ఇంతవరకు వచ్చి ఇలా జరిగిందంటే అందరు చిన్నచూపు చూస్తారని శ్రీలత అంటుంది. నేను ముందే రమ్యతో అన్ని చెప్పిన.‌ తను ఒప్పుకుంటేనే ఎంగేజ్ మెంట్ వరకు వచ్చానని సీతాకాంత్ అంటాడు. అయిన ఇప్పుడు తన గురించి కూడా ఆలోచించాలి కదా అని శ్రీలత అంటుంది. నా భార్యకి తప్ప ఎవరికి చోటు లేదని సీతాకాంత్ చెప్తాడు. దాంతో రమ్య ఏడుస్తూ డోర్ వేసుకుంటుంది. సీతాకాంత్ టెన్షన్ పడుతూ డోర్ నెట్టి లోపలికి వెళ్తాడు. రమ్య ఏదో టాబ్లెట్ వేసుకోబోతుంటే ఆపుతాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడ నేను పెళ్లి చేసుకోనని సీతాకాంత్ అనగానే.. ఇక నా మాట కూడా విను.. ఈ వారం రోజులు టైమ్ ఇస్తున్నా‌‌‌.‌ ఈ లోపు రమ్య ని పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను చచ్చిపోతానని శ్రీలత అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అంటూ శ్రీలత, శ్రీవల్లి, రమ్య లు హ్యాపీగా ఫీల్ అవుతారు. రామలక్ష్మికి శ్రీలత ఫోన్ చేసి.. రమ్య ఇలా సుసైడ్ చేసుకోబోయింది నేను సీతాకి వారం రోజులు టైమ్ ఇచ్చానని శ్రీలత చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అయితే నాకేంటి మీ ఫ్యామిలీ విషయాలు నాకెందుకు చెప్తున్నారని రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. తను మైథిలీనో కాదో నేను తెలుసుకుంటాను.. ఒకవేళ రామలక్ష్మి అయితే తన గదిలో బావగారికి సంబంధించినవి ఉంటాయి కదా అని శ్రీలత వాళ్ళతో అంటుంది. రామ్ ని తీసుకొని వెళ్లి నా ప్లాన్ అమలు చేస్తానని శ్రీవల్లి అంటుంది. మరొకవైపు ఎందుకు రమ్య ఇలా చేస్తుందని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : యామిని వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్.. పెళ్లికి ఒప్పుకున్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -681 లో.....కావ్య పంపిన భోజనం రాజ్ తింటుంటాడు. చాలా బాగుందని లోట్టలేసుకొని తింటుంటే యామినికి కోపం వస్తుంది. ఇంత ఆయిల్ ఉన్న ఫుడ్ తినకూడదని డాక్టర్ చెప్తేనే కదా నీకు రోజు లైట్ ఫుడ్ చేస్తున్నానని యామిని అంటుంది. ఈ ఒక్క రోజే కదా అని రాజ్ తింటాడు. దాంతో యామిని కోపంగా అక్కడ నుండీ వెళ్ళిపోతుంది. ఈ ఒక్కరోజే కదా తినండి అంకుల్ అని యామిని వాళ్ళ నాన్నతో రాజ్ అంటాడు. నేను చేసిన వంట నచ్చిందో లేదో అని కావ్య టెన్షన్ పడుతుంది. మరొకవైపు కళావతి గారు చేసిన వంటలు చాలా బాగున్నాయి. ఆ విషయం ఇప్పడు తనకేలా చెప్పాలని రాజ్ ఆలోచిస్తాడు. క్యారేజ్ కి ఉన్న పేపర్ ని యామిని చింపేసింది.. గుర్తు చేసుకొని డస్ట్ బిన్ లో నుండి తీసి పేపర్ పై ఉన్న నెంబర్ తీసుకొని వంటలు చాలా బాగున్నాయంటూ కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు. దాంతో కావ్య చాలా ఎక్సైట్ అవుతుంది. అదంతా రుద్రాణి చూసి దీనికేం అయింది.. ఇలా చేస్తుంది అనుకుటుంది. మరొకవైపు రాజ్ కావ్యతో చాటింగ్ చేయడం యామిని చూసి ఇక నేను ఇలా ఉంటే నడవదు.. నేనంటే ఏంటో చుపిస్తానని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి ఆ క్యారేజ్ ఎవరికి పంపావని అడుగుతుంది. మీ బావగారికి అంటూ జరిగింది మొత్తం అప్పుకి కావ్య చెప్తుంది. అసలు ఆ డాక్టర్ , యామిని కలిసి ఇదంతా చేస్తున్నారని కావ్య అంటుంది. రేపు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో కనుకోవాలని అప్పు, కావ్య ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత యామిని వాళ్ళ నాన్న జాగింగ్ చేసి వచ్చి రాజ్ తో మాట్లాడుతుంటే. హార్ట్ ఎటాక్ వస్తుంది. రాజ్ వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అతను బానే ఉంటాడు. నాకు ఏమైనా అయితే నా కూతురు పరిస్థితి ఏంటి వెంటనే నీకు యామినికి పెళ్లి చెయ్యాలని అతను అంటాడు. తరువాయి భాగంలో యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ తన తండ్రికి మాటిస్తాడు. మరొకవైపు అప్పు, కావ్య ఇద్దరు యామిని నటించమని చెప్పిన డాక్టర్ దగ్గరికి వచ్చి అసలు నిజం తెలుసుకుంటారు. యామిని రాజ్ ని హగ్ చేసుకొని థాంక్స్ పెళ్లికి ఒప్పుకున్నందుకని చెప్పడం కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోడు... ధన్ రాజ్ వైఫ్ శిరీష

జబర్దస్త్ తో పాటు సిల్వర్ స్క్రీన్ మీద ధన్ రాజ్ ఎంతో పాపులర్ అన్న విషయం అందరికీ తెలుసు. ధనరాజ్ ఎన్నో మూవీస్ లో నటించాడు. రీసెంట్ గా సముద్రఖనితో కలిసి "రామం రాఘవం" సినిమాలో  కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఆయన వైఫ్ శిరీష సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. సుధీర్ పెళ్లి చేసుకోడు అని అతనికి ఒక దగ్గర అలా స్టక్ ఐపోయి ఉండడం అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఐతే సుధీర్ ఆలోచన ఇలా ఉంది అని మరి ఫ్యూచర్ లో ఎం చేస్తాడో తెలీదు..ఆలోచన మారి పెళ్లి చేసుకోవచ్చేమో అని చెప్పుకొచ్చింది. గెటప్ శీను, చంద్ర, సుధీర్, రాంప్రసాద్  వేణు వీళ్లంతా ఎక్కుగా తమ ఇంట్లోనే ఉండేవాళ్ళు అని వీళ్లంతా ఒకే కంచంలో తిని ఒకే దగ్గర నిద్రపోయేవారని వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఉందని చెప్పుకొచ్చింది. సుధీర్ ఎక్కువగా ముక్కుసూటిగా ఉంటాడు. కాబట్టి తనకు అలా ఉండేవాళ్ళంటే ఇష్టం అని చెప్పింది. సుధీర్ సైలెంట్ గా ఉంటాడు కానీ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి చక్కగా సమాధానం చెప్తాడు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు అని చెప్పింది. సుధీర్ బయట అందరూ అనుకునేంతగా నెగటివ్ గా ఏమీ ఉండడు.. అలాగే వేణు, చంద్ర వాళ్ళ భార్యలు పద్దు, లతా అంతా క్లోజ్ అని చెప్పుకొచ్చింది. తామంతా బాగా క్లోజ్ అని రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎవరి మీద డిపెండ్ కాకుండా సిరి ఈవెంట్స్ పేరుతో ఈవెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

ప్రియాంక జైన్ తో బ్రేకప్ చేసుకున్న శివ్....మీ అమ్మగారితో మాట్లాడాక చెప్తా నీ పని

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 కూడా మంచి హాట్ గా అలాగే మంచి ఫైట్స్ తో రచ్చ రంబోలా చేసేలాగే కనిపిస్తోంది. ఈ షోలో అదిరిపోయే డాన్సులు ఉన్నాయి..స్కిట్స్, టాస్కులు అన్నీ అలరించబోతున్నాయి. ఇక లేటెస్ట్ గా రిలీజయిన ప్రోమో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ప్రియాంక జైన్ కి బ్రేకప్ చెప్పాడు శివ్..ఈ కొత్త ప్రోమో ఎండింగ్ లో చూస్తే అనకూడని మాట అనేశాడు. హోస్ట్ శ్రీముఖి "పరి కదా" అనేసరికి శివ్ ఐతే మరీ ఘోరంగా "తొక్కలో పరి..."అన్నాడు దాంతో అనసూయ, హమీద, శ్రీముఖి, తేజస్విని మడివాడ, శేఖర్ మాష్టర్ అంతా ఒక్కసారిగా  నోరెళ్లబెట్టారు. మరో వైపు పరి అలియాస్ ప్రియాంక జైన్ ఆన్లైన్ లోకి వచ్చింది..ఆ మాటల్ని ఆమెతోనే చెప్పేసాడు. "ఈ షో అయ్యేవరకు, బాయ్స్ మళ్ళీ గెలిచేవరకు నేను నీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నా" అని చెప్పేసాడు. ఆ మాటకు ప్రియాంక జైన్ కూడా షాకయ్యింది. ఆన్లైన్ లో అంత మంది ఆడియన్స్ చూస్తుండగా బ్రేకప్ అన్న మాట వినేసరికి స్క్రీన్ మీద రంగులు కూడా మారిపోయాయి. "సరే నేను మీ అమ్మ గారికి ఫోన్ చేసి ఈ బ్రేకప్ విషయం గురించి మాట్లాడతాను..ఈ చెత్త మాటలు మొత్తాన్ని కూడా నువ్వే క్లియర్ చేయాలి..లేదంటే" అన్నట్టుగా సీరియస్ గా ఆన్లైన్ వీడియోని కట్ చేసేసింది. వెంటనే శ్రీముఖి "పరి పరి సారీ " అని చెప్పినా కూడా ప్రియాంక జైన్ వినిపించుకోలేదు. ప్రియాంక జైన్, శివ్ మౌనరాగం సీరియల్ నుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. ఐతే ఏమయ్యిందో ఏమో కానీ శివ్ మాత్రం ఈ షోలో పరికి బ్రేకప్ చెప్పడంతో ఇప్పుడు అందరూ షాకయ్యే మాటలు చెప్పారు. మరి ఇది నిజమా కాదా అన్నది తెలియాలంటే షో చూడాల్సిందే.

Brahmamudi : రాజ్, కావ్య చాటింగ్.. యామిని వారిమధ్య బ్రహ్మముడిని తీసేయగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -680 లో....రాజ్ దగ్గర నుండి కావ్య వెళ్ళిపోతుంది. ఏంటి వచ్చినావిడకి మర్యాదలు చేస్తున్నారని యామిని తన పేరెంట్స్ పై కోప్పడుతుంది. రాజ్ హెల్ప్ చేసాడని థాంక్స్ చెప్పడానికి వచ్చింది.. చాలా పద్ధతిగా ఉంది మంచి పిల్లలాగా ఉందని యామినితో వైదేహి అంటుంది. మంచి పిల్ల కాదు ముంచే పిల్ల అని, తను కావ్య అని.. రాజ్ భార్య అని చెప్పగానే యామిని పేరెంట్స్ షాక్ అవుతారు. ఆ విషయం మరి ఎందుకు చెప్పలేదని వైదేహి అడుగుతుంది. మనం ఏం చేసిన రాజ్ చూడనంత వరకే అని యామిని అంటుంది. రాజ్ గతం మర్చిపోయాడు.. మరి తను బానే ఉంది కదా.. గతం గురించి రాజ్ తో ఎందుకు మాట్లాడడం లేదని వైదేహి అనగానే‌.. తను మాములు ఆడది కాదు వెళ్ళేటప్పుడు రాజ్ అని మళ్ళీ రామ్ అని అంది. మెల్లిగా రాజ్ కి గతం గుర్తు చెయ్యాలని ట్రై చేస్తుందని తన పేరెంట్స్ తో యామిని అంటుంది.‌ ఆ తర్వాత రాజ్ కోసం కావ్య వంటలు చేస్తుంది.. అదంతా చూస్తారు రాహుల్, రుద్రాణి. ఇదేంటీ ఇంత హుషారుగా చేస్తుందని రుద్రాణి అనగానే.. ఎన్ని మాటలు అన్నా కూడా దైర్యంగా ముందుకు వెళ్తుందని రాహుల్ అంటాడు. కావ్య దగ్గరికి రుద్రాణి వస్తుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి యామిని, తన పేరెంట్స్ వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పి అక్కడ నుండి రాజ్ వెళ్తాడు. కావ్య క్యారేజ్ కట్టి రాజ్ కి పంపిస్తుంది. దానిపై హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతతో అని రాస్తుంది. క్యారేజ్ తీసుకొని ఒకతను రాజ్ దగ్గరికి వెళ్తాడు. కళావతి పంపించిందని అతను చెప్పగానే అవునా అంటూ రాజ్ తీసుకుంటాడు. దానిపై రాసి ఉన్న పేపర్ ని రాజ్ చదువుతాడు. ఆ పేపర్ ని యామిని విసిరేస్తుంది  కావ్య పంపిన భోజనాన్ని యామిని వడ్డిస్తుంది. బాగుందంటూ రాజ్ తింటాడు. యామినికి కోపం వస్తుంది. మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. ఇన్ని వంటలు ఎందుకు చేసావని కావ్యని ప్రకాష్ అడుగగా.. చెయ్యాలనిపించి చేసానని కావ్య అంటుంది. రాజ్ కి క్యారేజ్ కట్టి పంపిందని రుద్రాణి అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అదేం లేదని కావ్య కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు. ఇద్దరు చాటింగ్ చేసుకుంటుంటే యామిని చూస్తుంది. ఇక నేను కూల్ గా డీల్ చేస్తే అవ్వడం లేదు.. ఇక నేనేంటో చూపిస్తానని యామిని అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన గౌతమ్.. దీపకి నిందలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -316 లో.....ఈ దీప నన్ను కొడుతున్నా అందరు సైలెంట్ గా ఉన్నారంటే ఈ వంట మనిషి చెప్పేది మీరు నమ్ముతున్నారా.. జ్యోత్స్న తన బావని ప్రేమించింది అయిన నాకు జ్యోత్స్న ఇష్టం కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నాను.. అక్కడ నిల్చున్న మీ అల్లుడిని ఎందుకు దూరం పెట్టారో నాకు తెలుసు.. అయినా సైలెంట్ గా ఉన్నా.. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇలా అవమానిస్తారనుకోలేదని గౌతమ్ ఎంగేజ్ మెంట్ రింగ్ విసిరేస్తాడు. ఈ నిశ్చితార్థం కదా పెళ్లి కూడా అవ్వదని గౌతమ్ కోపంగా వెళ్లిపోతాడు.‌ మీకు మీ సంబంధానికి ఒక దండం అంటూ గౌతమ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు. ఇక ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ అయినందుకు దీపపై కోప్పడతాడు శివన్నారాయణ. ఒకరకంగా జ్యోత్స్నకి మంచే జరిగింది. వాడు మంచి వాడు కాదు తాతయ్య అని శివన్నారాయణతో దీప చెప్తున్నా కూడ వినిపించుకోడు. నీకేం అన్యాయం చేసాను దీపా.. నా బావని నాకు కాకుండా చేసావ్.. అన్ని మర్చిపోయి గౌతమ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇలా చేసావని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. అందరు కలిసి నా పరువు తీసారని శివన్నారాయణ అంటాడు. దీపని మెడ పట్టుకొని పారిజాతం బయటకు గెంటేస్తుంది. జ్యోత్స్న ఏడుస్తుంటే సుమిత్ర కూడా బాధపడుతుంది. ఇక సుమిత్ర పట్టరాని కోపంతో దీప దగ్గరికి వస్తుంది. ఎందుకు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావంటూ అడుగుతుంది. అమ్మ నాకు అన్నం పెట్టిన ఇల్లు.. మీరు బాధపడేలా నేనేందుకు చేస్తాను.. నిజంగానే వాడు మంచి వాడు కాదని దీప అంటుంది. అందుకు సాక్ష్యం ఉందా అని సుమిత్ర అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : నీ పక్కన రమ్య ఉండటం ఇష్టం లేదు.. మా మిస్ నీకు సూట్ అవుతుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -363 లో.....రామ్ కి ఏదో చెప్పి నువ్వు పంపించేసావ్.. ఏం చెప్పావ్ రామ్ కి అంటూ శ్రీలత వాళ్ళు రామలక్ష్మిని నిలదీస్తుంటారు. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ ఎందుకు.. ముందు రామ్ ని వెతకాలి అంటూ ఒకవైపు రామలక్ష్మి, మరొక వైపు సీతాకాంత్ లు రామ్ ని వెతికే పనిలో పడతారు. రామలక్ష్మికి ఎవరో ఫోన్ చెయ్యగానే ఫణీంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్లేసరికి ఫణింద్ర వాళ్ళ దగ్గర రామ్ ఉంటాడు. రామ్ ని చూసి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ టెన్షన్ పడుతాడేమోనని రామలక్ష్మి తనకి ఫోన్ చేస్తుంది. రామ్ ఉన్నాడని చెప్పగానే సీతాకాంత్ కూల్ అవుతాడు. వెంటనే రామ్ దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ నాన్న ఎవరికి చెప్పకుండా అని రామ్ ని సీతాకాంత్ అడుగగా.. నీ పక్కన రమ్య ఉండడం నాకిష్టం లేదు.. అందుకే అని రామ్ అనగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రామ్ ని తీసుకొని సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ రా అంటూ రామ్ పై కోప్పడుతుంది శ్రీలత.నాన్నని ఏం అనకు అని శ్రీలతపై సీతాకాంత్ కోప్పడతాడు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళాడన్న కోపంతోనే శ్రీలత గారు అలా అన్నారు.. నేను కూడా బాబు విషయంలో తొందరపడ్డానని రమ్య అంటుంది. అసలు ఎందుకు వెళ్ళావని శ్రీవల్లి అడుగగా.. నాకు ఈ రమ్య ఇష్టం లేదు, అందుకే అని రామ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఇక్కడితో ఈ విషయం వదిలెయ్యండి అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అసలు ఎందుకు రమ్య ఇష్టం లేదని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. నీకు సూట్ అవ్వదని రామ్ చెప్తాడు. మరి ఎవరు సూట్ అవుతారని సీతాకాంత్ అడుగగా.. మా మిస్ అని రామ్ అంటాడు. ఎందుకని సీతాకాంత్ అనగా... సీతాకాంత్ ని తీసుకొని రామలక్ష్మి ఫోటో దగ్గరికి రామ్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : గుడిలో ఎంగేజ్ మెంట్ చేస్తున్న భాగ్యం.. కొడుకు రాలేదని వేదవతి బాధ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -117 లో.....రామరాజు తన కుటుంబంతో గుడికి వస్తాడు. భాగ్యంకి ఫోన్ చేసి ఫంక్షన్ హల్ ఎక్కడో చెప్పండి అని రామరాజు అడుగుతాడు. మీరు అయితే ముందు గుడి లోపలికి రండీ అంత చెప్తానని భాగ్యం అంటుంది. ఫంక్షన్ హల్ ఎక్కడో చెప్పమంటే లోపలికి రమ్మంటుంది ఏంటని రామరాజు అనుకుంటాడు. అందరు లోపలికి వస్తారు.. లోపలికి వెళ్ళగానే ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు. ఎంగేజ్ మెంట్ ఇక్కడే అని భాగ్యం అంటుంది. అదేంటీ ఫంక్షన్ హల్ లో గ్రాంఢ్ గా చేస్తామన్నారు కదా అని వేదవతి అంటుంది. చెయ్యడానికి మాకేం ప్రాబ్లమ్ లేదు కానీ వచ్చిన వాళ్లంతా మీకూ కాబోయే అల్లుడు మర్డర్ కేసులో స్టేషన్ కి వెళ్ళాడట కదా అంటుంటే బాగోదు కదా అందుకే మాకు పరువుతో సంబంధం లేదు ఎంగేజ్ మెంట్ గ్రాంఢ్ గా కావాలని అంటే ఇప్పుడే ఫంక్షన్ హల్ కి వెళదామని భాగ్యం అంటుంది. దాంతో ఇక్కడే జరిపించండి అని రామరాజు అంటాడు. ఎంగేజ్ మెంట్ కి ధీరజ్ లేడని వేదవతి పక్కకి వెళ్లి బాధపడుతుంది. రామరాజు ఏమైందని అడుగుతాడు. పెద్దోడి ఎంగేజ్ మెంట్ కి చిన్నోడు లేడు నా బాధకి కారణం మీరే అని రామరాజుపై వేదవతి కోప్పడుతుంది. నాకు మాత్రం బాధ ఉందా కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతుందని ఇలా రావద్దని చెప్పానని రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ రాలేదని బాధపడుతుంది. అప్పుడే నర్మద వచ్చి నువ్వు చాలా చేంజ్ అయ్యావ్.. ఈ మధ్య ధీరజ్ గురించి ఆలోచిస్తున్నావు అంటుంది. మరొకవైపు సాగర్, చందు, ఇద్దరు ధీరజ్ రాలేదని బాధపడతారు. ధీరజ్ చందు ఎంగేజ్ మెంట్ కి రాలేదని బాధపడతాడు. అప్పుడే  వాటర్ క్యాన్ లు గుడిలో వెయ్యమని ఓనర్ ధీరజ్ తో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యాదమ్మ రాజు - స్టెల్లా కాపురంలో సుప్రీతా చిచ్చు..షోకి వచ్చి గొడవ చేసిన స్టెల్లా

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఉగాది స్పెషల్ గా వచ్చిన ఈ షోలో మంచి కామెడీతో ఆడియన్స్ ని అలరించింది. ఐతే యాదమ్మ రాజు - స్టెల్లా మధ్యలో చిచ్చు పెట్టింది సుప్రీతా. దాంతో షోకి స్టెల్లా వచ్చి గొడవ పెట్టుకుంది. ఈ ఉగాది సందర్భంగా చెఫ్ జీవన్ ఐతే బూందీ లడ్డు అలాగే మామిడికాయ పులిహోర రెడీ చేయమని చెప్పాడు. దాంతో కంటెస్టెంట్స్ అంతా పోటీ పడ్డారు. ఇక సుమ ఐతే ఈ షోలో వడ్డాణం పెట్టుకుని కాసేపు అలరించింది. రాజీవ్ కనకాల తన భార్య సుమకి వడ్డాణం కొనిపెడితే దీపికా వచ్చి "సుమ గారు రాజా గారిని అడిగి నాకు ఒక నెక్లెస్ కొనమనండి" అని ముద్దుగా అడిగేసరికి "ఇంకా నయం ఒక మొగుడిని అడగలేదు" అంటూ సుమ కౌంటర్ వేసింది. వెంటనే జీవన్ కూడా సుమ గారు మీకు ఈ వడ్డాణం సూటయ్యింది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. దాంతో కుళ్లిపోయిన యాదమ్మ రాజు "దయచేసి ఆ వడ్డాణం తీసేయండి...నా పెళ్ళాం చూస్తే అది కావాలి అంటుంది" అన్నాడు సీరియస్ గా. "ఐనా అందరూ రాజీవ్ కనకాలలా ఉంటారా ఏమిటి ఐనా నువ్వు పది సార్లు స్టెల్లా నాకు షోకి వచ్చేస్తుందేమో"అన్నది సుమ. "అంత సీన్ లేదులే" అని యాదమ్మ రాజు అనే లోపు షోలోకి వచ్చేసింది స్టెల్లా. "ఆంటీ ఏమయ్యింది" అని భార్యను ఆంటీ అని పిలిచేసరికి ఆమెకు కోపం వచ్చేసింది. "సుప్రీతాతో పరిచయం అవగానే నేను ఆంటీని ఇపోయానా..ఇంట్లో నన్ను వదిలేసి వచ్చి ఇక్కడ మంచిగా వంట చేస్తున్నావా...నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సుమక్క ఏ రోజు నాకు వంట చేసి పెట్టలేదు..అడిగానని ఆ వంట మొత్తాన్ని నాశనం చేసేవాడు దాన్ని తీసుకెళ్లి చెత్తలో పారేసేదాన్ని" అని చెప్పింది. "ఐనా నేను నీతో కలిసి వంట చేయాలా...అది ఇల్లు ఇది షో" అని కౌంటర్ వేసాడు రాజు. "సుప్రీతా కోసం వడ్డాణం కూడా అడిగాడు" అంటూ సుమ కూడా చెప్పేసరికి "ఈ చైన్ కి లాకెట్ కొనమని చాల రోజుల నుంచి అడుగుతున్నా ..కొన్నివ్వట్లేదు" అని చెప్పింది "సంసారం మొత్తాన్ని షోలోకి తెచ్చావ్" అని తిట్టాడు రాజు. దీపికా ఐతే " ఆ స్టెల్లా ఒక డొల్ల..సుప్రీతా సూపర్" అంటూ యాదమ్మ రాజు మా దగ్గర చెప్తున్నాడు అంది. దాంతో ఆ గొడవ కాస్త పెర్సొనలైజ్ ఐపోతోంది తెలిసి సుమ వెళ్లి కలిసిపోండి ఇద్దరు అంది. అక్కా ఇది ప్రాంక్ అని చెప్పేసింది స్టెల్లా.  

Illu illalu pillalu : చందు, శ్రీవల్లిల ఎంగేజ్ మెంట్.. వాటర్ క్యాన్ లు మోస్తూ చూసిన ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -116 లో.....శ్రీవల్లి చందు గురించి మంచిగా చెప్తుంటే కోడలు అంటే నువ్వమ్మ.. నీలా ఉండాలి.. నాకు బాగా నచ్చావని శ్రీవల్లిని పొగుడుతుంది వేదవతి. అందరు మన బుట్టలో పడిపోయారు.. నా కూతురు అత్త కూడా నా కూతురు వైపు ఉంది. ఇంటికి వచ్చాక చక్రం తిప్పడమే అని భాగ్యం అంటుంది. అందరు చందు, శ్రీవల్లి ఇద్దరిని మధ్యలో పెట్టి డాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత నర్మద టీ తాగుతుంటే అప్పుడే వేదవతి వచ్చి.. నాకు ఒక టీ పెట్టు అంటుంది. నర్మద మాత్రం టీ పెట్టకుండా అటు ఇటు తిరుగుతుంది. ఏమైందని వేదవతి అడుగుతుంది. ఇంకా కోడలుగా మీ పెద్ద కోడలు ఇంట్లో అడుగే పెట్టలేదు అప్పుడే నా కోడలు బంగారం అంటూ ముద్దాడుతున్నారు.. ఇన్ని రోజులు అవుతుంది ఇంటికి వచ్చి ఎప్పుడైనా నాతో సరిగ్గా మాట్లాడారా అంటూ నర్మద అనగానే నర్మదని వేదవతి హగ్ చేసుకొని నా కోడలు బంగారం అని చెప్తుంది. ఇక చాలా అని వేదవతి అనగానే.. మీరు నాకు ముద్దు పెట్టాలని ఇలా చేసానని నర్మద అంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు అందరూ ఎంగేజ్ మెంట్ కి రెడీ అవుతారు. ధీరజ్ ని వద్దని రామరాజు చెప్తాడు. వీడి వల్ల ఏదో ఒక గొడవ అవుతుందని అంటాడు నా ఎంగేజ్ మెంట్ కన్నా నా తమ్ముళ్లు నాతో ఉండడం కావాలని చందు అంటాడు కానీ నాకు ఇష్టం లేదని రామరాజు అంటాడు. దాంతో ధీరజ్ లోపలికి వెళ్తాడు. అందరు వెళ్తుంటే ప్రేమ అక్కడే ఉంటుంది. రా అని ప్రేమని తీసుకొని వెళ్తాడు రామరాజు. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ గుడిలో ఏర్పాట్లు చేస్తుంది భాగ్యం. ఫంక్షన్ హల్ ఎక్కడ అని భాగ్యాన్ని రామరాజు అడుగుతాడు. మీరు గుడికి రండీ అని భాగ్యం వాళ్లతో చెప్తుంది. ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో చందు, శ్రీవల్లిల ఎంగేజ్మెంట్ గుడిలో జరుగుతుంది. అక్కడికి వాటర్ క్యాన్ లు మొయ్యడానికి ధీరజ్ వస్తాడు. వాళ్ళ ఎంగేజ్ మెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ క్యాన్ లు మోస్తూ భాగ్యం కి డాష్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : గౌతమ్ మోసగాడు అని చెప్పేసిన దీప.. అందరు నమ్ముతారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -315 లో.....దాస్ ని కాశీ బయటకు తీసుకోని వెళ్లి కూర్చోపెడతాడు. ఎవరు అతను అలా బెహేవ్ చేస్తున్నాడని గౌతమ్ పేరెంట్స్ శివన్నారాయణతో అంటారు. అతనికి గతం గుర్తు లేదు అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటాడని శివన్నారాయణ అంటాడు. అలాంటి వాడు ఫంక్షన్ లో ఎందుకు పంపించేయండి అని గౌతమ్ వాళ్ళ నాన్న అనగానే విన్నావ్ గా వెళ్లి పంపించమని పారిజాతం తో శివన్నారాయణ అంటాడు. పారిజాతం బయటకు వెళ్లి ఇప్పుడు ఎలా ఉన్నావ్ రా కాశీ నువ్వు దాస్ ని ఇంటికి తీసుకొని వెళ్ళమని పారిజాతం చెప్తుంది. దాస్ చేతిలో అక్షింతలు వేసి మళ్ళీ ఆవి తన చేతిలో వేసుకోని నువ్వు వేసినట్లు జ్యోత్స్నకి  అక్షింతలు వేస్తాను అని పారిజాతం అంటుంది. ఇవన్నీ అవసరమా అని కార్తీక్ అంటాడు. అందరు ఇక్కడే ఉంటే ఎలా లోపలికి పదండి అని పారిజాతం అంటుంది. కార్తీక్ బాబు మీరు ఇక్కడే ఉండండి.. నేను లోపల అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తానని దీప, స్వప్న ఇద్దరు లోపలికి వెళ్తారు. మరొక వైపు జ్యోత్స్న , గౌతమ్ ఇద్దరు రింగ్ లు మార్చుకోవడానికి రెడీ అవుతారు. అప్పుడే దీప గౌతమ్ ని చూసి షాక్ అవుతుంది. రింగ్ మార్చుకుంటుంటే ఆపండి అని దీప అంటుంది. వీడు మంచి వాడు కాదు.. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసాడని దీప చెప్తుంది. ఎవరు మీరు అని గౌతమ్ అంటాడు. ఎవరి గురించి అలా మాట్లాడుతున్నావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు ఏమైందని కార్తీక్ అడుగగా మొన్న ఒకతను ఒక అమ్మాయిని మోసం చేసాడని చెప్పాను కదా వాడు వీడే అని దీప అంటుంది. ఆ దీప గురించి గౌతమ్ తప్పు గా మాట్లాడుతుంటే గౌతమ్ చెంప చెల్లుమనిపిస్తుంది దీప. ఆవిడ నన్ను కొట్టిన మీరు అందరూ సైలెంట్ గా ఉన్నారంటే ఆవిడ చేప్పింది మీరు నమ్ముతున్నారా.. జ్యోత్స్న తన బావని ప్రేమించింది అయిన తనంటే ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నానని గౌతమ్ నటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీసీటీవీలో బయటపడ్డ నిజం.. రామ్ ఆచూకీ తెలిసేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో..... ముహూర్తం టైమ్ అయింది. ఇద్దరు రింగ్ తొడగండి అని పంతులు గారు చెప్తాడు. అదేంటి ఈ రామలక్ష్మి ఇంకా బయటపడడం లేదు కొంపదీసి నిజంగానే రామలక్ష్మినా ఏంటని సీతాకాంత్ అనుకుంటాడు. రమ్య రింగ్ తొడగబోతుంటే.. ఏంటీ ఏయ్ ఏం చేస్తున్నావని సీతాకాంత్ అంటాడు మనం ఎంగేజ్ మెంట్ చేసుకుంటేనే తను బయటపడుతుందని రమ్య అంటుంది. నేను ఎంగేజ్ మెంట్ ఆపితే నేనే రామలక్ష్మి అని కన్ఫమ్ చేసుకుంటారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వను ఎంగేజ్ మెంట్ ఎలా ఆపాలో నాకు తెలుసని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సెక్యూరిటీ వచ్చి రామ్ బాబు బయటకు వెళ్ళాడని చెప్తాడు. వెంటనే సీతాకాంత్ వెళ్ళబోతుంటే ఎక్కడికి రింగ్ చేంజ్ చేసుకొని. వెళ్ళండి అని రమ్య అంటుంది ఇప్పుడు ఇది అవసరమా.. అక్కడ బాబు అని సీతాకాంత్ అనగానే పోతే పోనివ్వండి మీ సొంత బాబు అయినట్టు అలా వెళ్లిపోతున్నారని రమ్య అనగానే.. ఇదేనా నువ్వు రామ్ ని తల్లి గా చూసుకుంటానని చెప్పింది అంటూ రమ్యపై సీతాకాంత్ కోప్పడతాడు.ఇక ఈ ఎంగేజ్ మెంట్ ఆపేస్తున్నానని సీతాకాంత్ చెప్తాడు. ఇక రామ్ డల్ గా ఉంటే తన దగ్గరికి రామలక్ష్మి వెళ్లి ఏమైందని అడుగుగా.. మా నాన్న ఈ ఎంగేజ్ మెంట్ చేసుకోవడం ఇష్టం లేదని రామ్ చెప్పగానే.. ఇక్కడ నుండి కాసేపు వెళ్ళమని రామ్ కి సలహా ఇస్తుంది రామలక్ష్మి. అదంతా రామలక్ష్మి గుర్తుచేసుకుంటుంది. రామలక్ష్మి ఏం తెలియనట్లు బాబు ఎక్కడ అని వెతుకుతుంది. నోరు అదుపులో ఉంచుకోలేవా అంటూ రమ్యపై శ్రీలత కోప్పడుతుంది. ఈ మైథిలి ప్లాన్ అయి ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళు సీసీటీవీ చూస్తారు అందులో రామలక్ష్మి రామ్ తో మాట్లాడినాక రామ్ వెళ్ళిపోతాడు. మా రామ్ తో ఏం చెప్పావ్.. ఎందుకు వెళ్ళిపోయాడంటూ శ్రీలత వాళ్ళు రామలక్ష్మిని నీలదీస్తారు. ఆ తర్వాత అందరు కలిసి రామ్ కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ కి తనని పరిచయం చేసుకున్న కళావతి.. క్యారేజ్ పంపించిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -679 లో..... కావ్య ఇలా బయటకు వెళ్తుంటే మన ఇంటి పరువు ఏం కావాలని రుద్రాణి అంటుంది.. అందుకు తనకి  స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది కావ్య. అదంతా గొడవ ఎందుకు అమ్మ నీకు ఏం కావాలో చెప్పు తీసుకొని వస్తామని సుభాష్ అనగానే.. అంటే మీరు కూడా ఆలా అంటున్నారా అని కావ్య ఫీల్ అవుతుంది. అదేం కాదమ్మా నీకు హెల్ప్ చేద్దామని అని సుభాష్ అంటాడు. ఎప్పుడు.. ఎవరు నన్ను నమ్మరు.. ఏదో ఒకటి సాధించాకే నన్ను నమ్ముతారు.. మొదటి నుండి ఇదే జరుగుతుంది. నన్ను ఎవరు నమ్మకపోయినా నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్తాను.. సాధించాల్సింది సాధిస్తానంటూ చెప్పేసి కావ్య వెళ్ళిపోతుంది. ఎవరేం మాట్లాడరా అంటూ రుద్రాణి అంటుంది. నా కోడలు ఆశ నిజం అయితే బాగుండు అని అనుకుంటున్నానని అపర్ణ అంటుంది. కావ్య నెల రోజలు టైమ్ అడిగింది కదా మళ్ళీ ఎందుకు అలా గొడవ చెయ్యాలని చూస్తావంటూ రుద్రాణిని ఇందిరాదేవి తిడుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. తనని చూసి రాజ్ షాక్ అవుతాడు. మీరా లోపలికి రండీ అంటూ పిలుస్తాడు. కావ్య లోపలికి వెళ్తుంది. హాస్పిటల్ లో మీ అడ్రెస్ కనుక్కొని వచ్చానని కావ్య చెప్తుంది. అప్పుడే యామిని వాళ్ళ అమ్మ కావ్య దగ్గరికి వస్తుంది. ఎవరు ఆ అమ్మాయి అని రాజ్ ని అడుగుతుంది. మొన్న సేవ్ చేసాను అని చెప్పాను కదా ఈ అమ్మాయే అని రాజ్ చెప్తాడు.. కాఫీ తీసుకొని రావాలా అంటూ వైదేహి బాగా మాట్లాడుతుంది. అప్పుడే యామిని వస్తుంది. కావ్యని చూసి షాక్ అవుతుంది. మీ పేరు ఏంటని  కావ్యని రాజ్ అడుగగా.. కావ్య కళావతి అని చెప్పగానే బాగుందని అంటాడు. కావ్య, రాజ్ లు మాట్లాడుకుంటుంటే యామినికి టెన్షన్ మొదలు అవుతుంది. కాసేపటికి కావ్య వెళ్ళిపోతుంటుంది. రాజ్ పై నుండి చూస్తాడు. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య క్యారెజ్ కడుతుంది. అది రుద్రాణి చూస్తుంది. ఆ తర్వాత రాజ్ కి ఒకతను క్యారేజ్ తీసుకొని వెళ్లి ఇస్తాడు. కళావతి మేడమ్ పంపిందని చెప్పగానే రాజ్ ఓపెన్ చేసి తింటాడు. చాలా బాగున్నాయంటూ రాజ్ తింటుంటే యామినికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

డాన్స్ ఐకాన్ షోకి "కోర్ట్" మూవీ టీమ్...

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఇది జడ్జిమెంట్ ఎపిసోడ్ . అందుకే యాంకర్ ఓంకార్ ఇద్దరు సెన్సేషనల్ గెస్టులని పిలిచారు. వాలేవారంటే రీసెంట్ గా రిలీజై హిట్ కొట్టిన "కోర్ట్" మూవీ హీరోహీరోయిన్స్ ఐన రోషన్, శ్రీదేవి. వాళ్ళను అలాగే వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చారు. రాగానే వాళ్ళతో ఆ మూవీలో సాంగ్ కి డాన్స్ చేయించారు. అలాగే శేఖర్ మాష్టర్, ఫారియా కూడా వెళ్లి స్టెప్పులేశారు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి సినిమాలో ఉన్న "మనసనే మెటీరియల్" డైలాగ్ ని రిక్రియేట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు.   ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ ప్రౌడ్ మూమెంట్ కి డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో పేరెంట్స్ మధ్యలో సెలెబ్రేట్ చేసుకోవాలి అని చెప్పాడు ఓంకార్. జడ్జ్మెంట్ ఎపిసోడ్ కాబట్టి రోషన్, శ్రీదేవికి కోర్ట్ లో జడ్జ్ వేసుకుని డ్రెస్ ని పైన హాట్ ని పెట్టి ఆహా తరపున ఒక సర్టిఫికెట్ ప్రెజెంట్ చేసాడు. ఇక కోర్ట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చ్ 14 న చిన్న మూవీగా పోక్సో చట్టం నేపథ్యంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరింది. శ్రీదేవి, రోషన్ జోడిగా నటించిన ఈ మూవీలో వీళ్ళ నటన శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శి డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్స్ అనే కాన్సెప్ట్ లేనే లేదు..కంటెంట్ మాత్రమే ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది.  

ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్...బొక్కా..వీళ్ళు హీరోలేంటి ?

  బుల్లితెర మీద ఉండే నటీనటులు కావొచ్చు ఆర్జెలు, విజేలు అందరూ కూడా ఒక పక్కన సీరియల్స్ లో నటిస్తూ, షోస్ చేస్తూ అలాగే మరో వైపు ఫుడ్ బిజినెస్ పెట్టి అందులో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా చేసిన ఆర్పి నెల్లూరు చేపల పులుసు పేరుతో బిజినెస్ తెరిచాడు.. అలాగే బిగ్ బాస్ కి వెళ్లిన ఆదిరెడ్డి సలోన్ బిజినెస్ లోకి వెళ్ళాడు, లోబో టాటూ బిజినెస్ లో ఉండగా.. రీసెంట్ గా సోహైల్ కూడా ఫుడ్ బిజినెస్ లోకి వచ్చాడు. ఇప్పుడు విజె సన్నీ కూడా ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణగారు లో "అమృతం" పేరుతో ఓపెన్ చేసాడు. "ఆకలితో రండి..సంతోషంగా వెళ్ళండి" అని టాగ్ లైన్ పెట్టాడు. ఈ బిజినెస్ ఓపెనింగ్ కి చాలామంది వచ్చారు. ఐతే ఈ టైంలో సన్నీ కొన్ని విషయాలు చెప్పి బాధపడ్డాడు. "బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలామంది కామెంట్స్ చేశారు. బొక్క వీళ్ళు హీరోలవుతారా ? అంటూ మాట్లాడారు. కానీ నేను హీరో కావడానికి ఇండస్ట్రీలోకి రాలేదు. ఆర్టిస్ట్ కావడానికి వచ్చాను. కానీ మాకు ఆ పెయిన్ ఉంది. బిగ్ బాస్ నుంచి వచ్చాము. కానీ మేము హీరోస్ అవ్వోద్దా ? ఏ మాకు ఆ అవకాశం లేదా ? బాధ ఉంటుంది ఒక్కోసారి..మీకు ఇంకా సక్సెస్ రాలేదు ఏంటి  అంటూ అడుగుతూ ఉంటారు కొంతమంది. సక్సెస్ అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు. సక్సెస్ కి ఒక డెస్టినీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది. సో సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయడమే..ఇప్పుడు మేము చేస్తున్నది కూడా అదే" అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. ఇక నెటిజన్స్ ఐతే సన్నీ మాటలు విని "మీరు ఎప్పుడూ సూపర్ హీరోనే..సక్సెస్ వస్తుంది వర్రీ కావొద్దు..." అని సపోర్ట్ చేస్తున్నారు. బుల్లితెర మీద "కల్యాణ వైభోగమే" సీరియల్ తో అందరినీ అలరించాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వారిలో చాలా కొద్దీ మందే సక్సెస్ అయ్యారు. ఇంకా కొంతమంది సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం వచ్చిన అవకాశాలని యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

తమన్నాతో పులిహోర కలిపిన ఇమ్ము

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 మంచి హాట్ ఫైటింగ్స్ తో సరదాసరదా టాస్కులతో ఎండ్ ఐపోయింది. ఇక ఇప్పుడు సీజన్ 2 వచ్చేసింది. ఈ షో 29 వ శనివారం నాడు లాంచ్ కాబోతోంది.  ఆ గ్రాండ్ లాంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో ఇక ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి ఇక జడ్జెస్ కం మెంటార్స్ గా శేఖర్ మాస్టర్, అనసూయ వచ్చారు. అలాగే కంటెస్టెంట్స్ గా రోహిణి, డెబ్జానీ, పృద్వి శెట్టి, శ్రీ సత్య, బ్రహ్మముడి మానస్, తేజస్విని మాదివాడ, ఇమ్మానుయేల్, నిఖిల్ విజయేంద్ర సింహ, బబ్లు ఇంకా కొంతమంది సీరియల్ నటీనటులు వచ్చారు. ఐతే ఈ లాంచ్ ఎపిసోడ్ కి మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చింది. ఇమ్ము ఏమంటూ ఈటీవీ నుంచి స్టార్ మాకి వచ్చాడో ఇక వచ్చే గెస్టులందరితో కూడా ఫన్ క్రియేట్ చేసే పని పెట్టుకున్నాడు. ఈ షోలో కూడా మిల్కీ బ్యూటీ తమన్నాతోనే పులిహార కలిపాడు. తమన్నా రావడంతోనే రెబెల్ మూవీ నుంచి "దందం నకనక" సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చింది. శ్రీముఖి ఐతే "మీరు కావాలయ్యా..మీరు రావాలయ్యా రా రా  " అంటూ పాట పాడింది. తర్వాత ఇమ్ము రెడ్ రోజ్ తీసుకుని మిల్కీ బ్యూటీ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని "ఎందుకంటే ప్రేమంట" మూవీలోని హిట్ సాంగ్  "నీ చూపులే నా ఊపిరి..ఓ సారిలా చూడే చెలి" అంటూ పాటను మాటలుగా చెప్పాడు. "పాట పాడేస్తున్నావా నువ్వు" అంది అనసూయ. తర్వాత ఇమ్ము లేచి "ఆ సినిమాలో లా చంపేస్తారేరా నన్ను" అనేసరికి తమన్నా "నేను అందులో దెయ్యాన్ని అని చెప్పింది" "కానీ మీరు నాకు దేవతలాగే కనిపిస్తున్నారు " అని కొంచెం పులిహోర కలిపాడు. ప్రోమో ఫైనల్ లో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అంటూ ఈ షో పేరు చెప్పేసింది తమన్నా.

సమీరా బూందీ  లడ్డూలా ఉంటది..క్యారవాన్ లోకి సుప్రీతా...

  సమీరా భరద్వాజ్ సింగర్ గా ఎంతో అద్భుతంగా పాడుతుంది. "నారాయణ" అంటూ రీసెంట్ గా ఆమె చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈమె ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోకి బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక జోడిగా వచ్చింది. ఈ వారం ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చెఫ్ జీవన్ ఉగాది సందర్భంగా లడ్డూ చేసే టాస్క్ ఇచ్చాడు. రీసెంట్ గా రిలీజైన ఈ షో ప్రోమో బాగా నవ్వు తెప్పిస్తోంది. ఇక అందరూ లడ్డూ చేస్తున్నారు. సమీరా బూందీ లడ్డూ ప్రిపరేషన్ లో ఉండగా చెఫ్ జీవన్, సుమ వాళ్ళ దగ్గరకు వచ్చారు దాంతో సమీరా "మా బూందీ తింటే బ్రాందీ తాగినంత కిక్కెక్కుతుంది" అనేసరికి దీపిక వావ్ అంది. "మాకు బూందీ చాలమ్మ బ్రాందీ వద్దు" అంటూ సుమ కౌంటర్ వేసింది. తర్వాత ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ అనే కాన్సెప్ట్ ని సుమ యాదమ్మ రాజు - సుప్రీతకు ఇచ్చింది. "ఒక విలన్ వస్తాడు..అతన్ని చూసి మీరు భయపడాలి" అంటూ యాదమ్మరాజు సుప్రీతకు చెప్పాడు. దానికి ఆమె "భయపడి ఎం చేయాలి క్యారవాన్ కి వెళ్లాలా" అని అడిగేసింది. "క్యారవాన్ కి ఎందుకు పోతారు మేడం" అని రివర్స్ లో అడిగాడు యాదమ్మ రాజు. దానికి అంబటి అర్జున్ - అమర్ దీప్ ఇద్దరూ తెగ నవ్వుకున్నారు. తర్వాత సుమా వచ్చి "సీన్ ఏంటో చెప్పు ముందు" అని యాదమ్మ రాజును అడిగింది. "సీన్ ఏమీ లేదు మేడం " అన్నాడు రాజు. దానికి సుమ "పదమ్మ మనం క్యారవాన్ కి పోదాం" అంది సుమా. దానికి రాజు ఫ్రస్ట్రేషన్ చెఫ్ జీవన్ ని పట్టుకుని "ఏ గుండు నువ్వు క్యారవాన్ తీసేయ్ " అన్నాడు అంటే జీవన్ ఒక్కసారిగా సీరియస్ గా చూసి షర్ట్ పట్టుకుని రాజుని పైకి లేపేసాడు. అలాగే సుమ అమర్ దీప్ - అంబటి అర్జున్ కి ఒక టాస్క్ ఇచ్చింది. మీరిద్దరూ లేడీస్, నైబర్స్ అంటూ కాన్సెప్ట్ చెప్పింది. దాంతో అర్జున్ బూందీ చేస్తూ "మన వీధి చివర సమీరా భరద్వాజ్ ఉంది చూసావా...పగలంతా పాడుతుంది నైట్ వాళ్ళాయన్ని ఒక ఆట ఆడుద్దని తెలుసా" అన్నాడు అర్జున్. తర్వాత అమర్ దీప్ "పొద్దున్నేమో దీపంలో వత్తి...రాత్రేమో కొవ్వొత్తి" అన్నాడు. "నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు లేదంటే చెప్పు తెగిపోద్ది" అంటూ అర్జున్ అమర్ దీప్ కి వార్నింగ్ ఇచ్చాడు.