Karthika Deepam2 : కార్తీక్, దీపల ప్లాన్ ని ఊహించి‌న జ్యోత్స్న.. తల్లిని కోప్పడిన కూతురు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -380 లో.... శౌర్యని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది సుమిత్ర. ఇదిగో ఇవన్ని జ్యోత్స్న చిన్నప్పటి డ్రెస్ లు బొమ్మలు అని చూపిస్తుంది. అవి చూసి శౌర్యా మురిసిపోతుంది. జ్యోత్స్న ఫ్రాక్ శౌర్య వేసుకుంటుంది. నాకు బొమ్మలు కావాలంటూ సుమిత్రని అడిగి తీసుకుంటుంది శౌర్య. తీసుకోమని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ అమ్మకి చూపిస్తానని శౌర్య వెళ్ళిపోతుంది. పారిజాతం చెత్త ఏరుకొనే గెటప్ తో తమ ఇంటికి వచ్చినట్లు అనసూయ గుర్తుపడుతుంది. మరొకవైపు దీప గురించి జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. వీళ్ళు అందరు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. జ్యోత్స్న ఏదో మాట్లాడడానికి వస్తుంటే శౌర్య బొమ్మతో ఆడుతూ వస్తుంది. జ్యోత్స్నకి తగులుతుంది. ఏంటి ఆ బొమ్మలు.. అవి నావి ఈ డ్రెస్ కూడా నాదే ఎవరిచ్చారని జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి కాంచన వస్తుంది కానీ శివన్నారాయణ కాంచన బాధపడేలా మాట్లాడతాడు. నా బొమ్మలు డ్రెస్ ఎందుకు శౌర్యకి ఇచ్చావని  సుమిత్రతో జ్యోత్స్న గొడవ పడుతుంది. తప్పేముంది ఇప్పుడు అవేవి నీకు అవసరం లేదు కదా అని సుమిత్ర దశరథ్ లు అంటారు. అయితే నా జ్ఞాపకాలు మీ దగ్గర వద్దని జ్యోత్స్న బొమ్మలు విసిరేస్తుంటే.. అవి అత్త మావయ్యల జ్ఞాపకాలు అంటూ కార్తీక్ వాటిని తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆమెను పెళ్ళికి ఎందుకు పిలిచావ్.. యామినిపై వైదేహీ సీరియస్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -744 లో..... రాజ్ పెళ్లికి రెడీ అయిన విషయం కావ్యకి చెప్పడానికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి కావ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఏం పట్టనట్లు అలా ఎలా ఉంటున్నావేంటని ఇందిరాదేవి అంటుంది. కిచెన్ లో ఇంకొక ఐస్ క్రీమ్ ఉందంటూ కావ్య వెళ్తుంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి వైదేహి, యామిని వచ్చి డ్రెస్ చూపించి సెలక్ట్ చేసుకోమని చెప్తారు. కాసేపటికి కావ్యకి యామిని ఫోన్ చేసి‌.. ఎల్లుండి నాకు రాజ్ కి పెళ్లి అని చెప్తుంది. నాకు బయపడి చాటుగా పెళ్లి చేసుకుంటున్నావా అని కావ్య అనగానే నీకు భయపడడమేంటి అందరి ముందు గ్రాంఢ్ గా పెళ్లి చేసుకుంటానని యామిని అంటుంది. ఆ తర్వాత స్వప్న నగలన్ని ప్యాక్ చేస్తుంటే రాహుల్ వస్తాడు. ఇప్పుడు నగలు ఎందుకు ఇలా చేస్తున్నావని రాహుల్ అడుగగా బ్యాంకు లో పెట్టడానికి అని స్వప్న అంటుంది. ఇప్పుడు బ్యాంకులో పెడితే ఇవి గిల్టీ నగలు అని తెలిసి పోతుందని రాహుల్ అనుకుంటాడు. ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయ్ కదా ఎందుకు ఇప్పుడు బ్యాంకు లో అని రాహుల్ అనగానే అవును కదా అని స్వప్న అంటుంది. మరుసటిరోజు యామిని, వైదేహి వెడ్డింగ్ కార్డ్ పట్టుకొని కావ్య ఇంటికి వస్తారు. అందరూ పెళ్లికి రండీ అని యామిని అనగానే అందరం వస్తామని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు కావ్యని ఎందుకు పిలిచావని యామినిపై వైదేహీ కోప్పడుతుంది. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వెళ్ళబోతుంటే కావ్య వాల్లే పెళ్లి కి వస్తారు. వాళ్ళని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లికి తిట్లు.. నర్మద మాటలకి సిగ్గుపడ్డ ప్రేమ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -180 లో.....రామరాజు ఇంటికి వచ్చి సాగర్ నర్మద శోభనానికి ముహూర్తం పెట్టించాలని అంటాడు. అది విని శ్రీవల్లి నవ్వుతుంది. ఎందుకు అలా నవ్వుతున్నావని రామరాజు అడుగుతాడు. అంటే మావయ్య హైదరాబాద్ లోనే సాగర్ , నర్మదల శోభనం జరిగిందని శ్రీవల్లి చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అక్క నాకు చెప్పలేదని ప్రేమ అంటుంది. అంటే సందర్భం రాలేదని నర్మద అంటుంది. రామరాజు సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏ విషయం ఎవరితో ఎక్కడ చెప్పాలో తెలియదా అని శ్రీవల్లితో వేదవతి అంటుంది. శ్రీవల్లి పక్కకి వెళ్లి డాన్స్ చేస్తుంది. ప్రేమ, నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్లి ఇండైరెక్ట్ గా శ్రీవల్లి ని తిడుతుంటారు. ఆ తర్వాత వేదవతి దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. అసలు ఆ పిల్ల ఏంటే.‌ ఏం మాట్లాడాలో తెలియదు..అలా చెప్తారా ఎవరైనా అని వేదవతి అనగానే ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ముద్దులా కోడల్ని అంటూ ప్రేమ, నర్మద అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు.  ఆ తర్వాత ప్రేమ క్లాసికల్ డాన్స్ చేస్తుంటుంది. అప్పుడే ధీరజ్ వచ్చి బాగా చేస్తున్నావ్.. ఒకవేళ నీకు జాబ్ రాకపోతే పిల్లలకి డాన్స్ కూడా నేర్పించవచ్చని అంటాడు. మంచి ఐడియా ఇచ్చావని ప్రేమ అనుకుంటుంది. మరోవైపు చందుకి సేట్ ఫోన్ చేసి డబ్బు అడుగుతాడు. చందు టెన్షన్ పడతాడు. సాగర్, ధీరజ్, తిరుపతి వచ్చి ఏమైందని అడుగుతారు. చందు ఏం జరిగిందో చెప్తుంటాడు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఒక రూమ్ లో పడుకుంటారు. ఏది ఏమైనా మీరు భార్యభర్తలు.. కలిసి కాపురం చెయ్యాలిసిందేనని ప్రేమతో నర్మద అనగానే ప్రేమ సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్నకి కార్తీక్ గుణపాఠం.. ఇంట్లోకొచ్చిన శౌర్య!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -379 లో..... దశరథ్ పడిపోతుంటే నాన్న అంటూ దీప పట్టుకుంటుంది. మా డాడ్ ని నాన్న అని పిలుస్తావా అని దీపని జ్యోత్స్న కొట్టబోతుంటే కార్తీక్ అపుతాడు. నా భార్య చేసిన తప్పేంటి? ఎందుకు కొడతావని కార్తీక్ అడుగుతాడు. ఇంట్లో పెద్దవాళ్ళున్నారు.. వాళ్ళేం న్యాయం చేస్తారో చూస్తానని కార్తీక్ అంటాడు. దీప నాన్న అని పిలవడం తప్పే అయినా కానీ దీప చేసింది మంచి పని.. జ్యోత్స్న కొట్టాలి అనుకోవడం తప్పు అని శివన్నారాయణ అంటాడు. అయితే ఇప్పుడు నా భార్యకు  జ్యోత్స్న సారి చెప్పాలని కార్తీక్ అడుగుతాడు. దానికి శివన్ననారాయణ సరే అనడంతో దీపకి జ్యోత్స్న సారీ చెప్తుంది. అందరు లోపలికి వెళ్ళిపోతారు. సుమిత్ర మాత్రం దీప బాధపడేలా మాట్లాడుతుంది. మీ నాన్నని నాన్న అని పిలిచి కాపాడావ్.. ఇంకేంటి హ్యాపీనా అని దీపని కార్తీక్ అడుగుతాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి అనసూయ,కాంచన, శౌర్య వస్తారు. ఇప్పుడు వీళ్ళని తాత చుస్తే తిడుతాడని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. కానీ పిల్లల ముందు గొడవలెందుకని శౌర్యతో బాగా మాట్లాడుతాడు శివన్నారాయణ. సుమిత్ర కూడ శౌర్యతో నవ్వుతు మాట్లాడుతుంది. అందుకే వీళ్ళని రప్పించానని దీపతో కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శౌర్యని సుమిత్ర తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. నేను నాన్నతో మాట్లాడాలని శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది కాంచన. శౌర్యతో దశరథ్, సుమిత్ర కబుర్లు చెప్తుంటారు. ఈ బొమ్మ ఎక్కడిది బాగుందని శౌర్య అనగానే జ్యోత్స్న చిన్నప్పటిదని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలన్నీ సుమిత్ర చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని పెళ్ళికి పిలిచిన యామిని.. తన ప్లాన్ ఏంటంటే!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -743 లో.....రాజ్ ఇంటికి రాగానే.. ఏంటి ఈ హడావిడి అని అడుగుతాడు. ఏంటి ఆలా అడుగుతున్నావ్.. ఎల్లుండి మీ పెళ్లి కదా అని వైదేహి అంటుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని రాజ్ అనగానే.. అప్పుడే యామిని వస్తుంది. ఏంటి మమ్మీ బావకి ఇష్టం లేదట.. అలాంటప్పుడు ఎందుకు ఈ డెకరేషన్ అంటూ పూల డెకరేషన్ అన్ని తీసేస్తుంది. బావకి నేనంటే ఇష్టం లేనప్పుడు.. నేను ఎందుకు ఇక.. అంటూ కత్తితో చెయ్ ని కోసుకుంటుంది. వెంటనే రాజ్ ఆపి యామిని చెంప చెల్లుమనిపిస్తాడు. ఇక యామిని పేరెంట్స్ రాజ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాజ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. దాంతో యామిని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి రాజ్ కి ఫోన్ చేస్తుంటారు కానీ రాజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతుంది. చూసుకొని చేస్తాడులే అని సుభాష్ అంటాడు. ఇక వాడేందుకు చేస్తాడు యామినితో బిజీగా ఉండొచ్చు అని రుద్రాణి అనగానే.. ఇంట్లో అందరు తనకి చివాట్లు పెడతారు. ఆ తర్వాత మనం చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు.. కావ్య చేస్తే లిఫ్ట్ చేస్తాడేమో ఒకసారి చెయమందామని ఇందిదేవి, అపర్ణ కలిసి కావ్య దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్లేసరికి ఐస్ క్రీమ్ తింటుంది కావ్య. ఏంటి ఇది ఇలా తయారు అయిందని అనుకుంటారు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి యామిని వస్తుంది. రాజ్తో నా పెళ్లి మీరు తప్పకుండా రండి అని కావ్య దగ్గరికి వచ్చి పిలుస్తుంది యామిని. తప్పకుండా వస్తామని కావ్య చెప్తుంది. కావ్య అలా చెప్పిందంటే ఏదో ప్లాన్ లో ఉండే ఉంటుందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నాగుల చవితి కోసం ఆన్‌లైన్‌లో రక్తపింజరి ఆర్డర్...ఎంత ఆర్గానిక్ హృదయమో

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాఘవ స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రాఘవ అలాగే లేడీ గెటప్ మోహన్ కలిసి ఈ స్కిట్ వేశారు. ఐతే లేడీ గెటప్ మోహన్ ఆన్లైన్ లో ఒక పామును బుక్ చేసాడు. ఆ ఆర్డర్ ఇంటికి వచ్చింది. ఇక రాఘవ మాములుగా ఆ ప్యాక్ తీసుకుని "ఎం బుక్ చేసావే" అని అడిగాడు రాఘవ. "పాము బుక్ చేశా. ఆరు నెలల్లో నాగుల చవితి వస్తోంది కదా పాలు పోయాలని పామును బుక్ చేశా" అని చెప్పింది. దాంతో రాఘవ షాకయ్యాడు. "ఇంతకు ఎం పాము బుక్ చేసావ్ " అన్నాడు రాఘవ. "మన పక్కింటి రష్మీ కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్సట్రా ఉండాలని చెప్పి రక్త పింజరిని బుక్ చేశా." అనేసరికి ఇంట్లోకి వెళ్లి ఆ పామును తెచ్చిన ప్యాకింగ్ ని చూసి ఏంటి మూత తెరిచి ఉంది అని కంగారు పడ్డాడు. "గాలి ఆడాలని మూత ఓపెన్ చేసి పెట్టా" అని మోహన్ చెప్పాడు. దాంతో రాఘవ అదిరిపడ్డాడు. "ఎక్కడుందో అది" అని కంగారు పడ్డాడు రాఘవా. ఇక మోహన్ ఐతే అదేదో పెంపుడు పాము ఐనట్టు "రక్తమ్మా..రక్తమ్మా.." అని పిలిచేసరికి రాఘవకు కోపం తన్నుకొచ్చింది. "ఏ కన్నంలో ఉందో వెతుకు" అన్నాడు రాఘవ. ఇంతలో మరో ఆర్డర్ డెలివరీ వచ్చేసరికి "ఎం ఆర్డర్ తెచ్చావ్" అన్నాడు రాఘవ. "బర్రెను బుక్ చేశారండి" అన్నాడు డెలివరీ బాయ్. "ఈమె బర్రెను బుక్ చేశావా" అన్నాడు కోపంగా. "పాముకు పాలు పోయాలి కదా..పాముకు ప్యాకెట్ పాలు పడతాయో లేదో అని బర్రెను బుక్ చేశా" అని చెప్పింది. దాంతో రాఘవ "నీ ఆర్గానిక్ హృదయానికి దణ్ణమె బాబు" అన్నాడు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.  

Illu illalu pillalu : కొడుకు, కోడలి శోభనానికి ఏర్పాట్లు చేసిన రామరాజు.. టెన్షన్ లో వేదవతి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -179 లో... నర్మద తన శోభనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు జరిగిందని వేదవతితో చెప్పగానే వేదవతి షాక్ అవుతుంది. అదంతా శ్రీవల్లి విని.. అమ్మ చెప్పినట్టు నా కంటే ముందు నర్మద ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో వాళ్ళందరు తననే నెత్తిన పెట్టుకుంటారు. అలా జరగకూడదని శ్రీవల్లి అనుకుంటుంది. తల నొప్పిగా ఉంది అత్తయ్య అని నర్మద అంటుంటే.. దీనికి ఏం తక్కువ లేదంటూ వేదవతి తన వొళ్ళో నర్మదని పడుకోబెట్టుకొని మసాజ్ చేస్తుంది. అదంతా శ్రీవల్లి చూసి కుళ్ళుకుంటుంది.    ఆ తర్వాత ప్రేమ బస్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే ధీరజ్ సైకిల్ పై వస్తాడు. ధీరజ్ సైకిల్ పై రావడం ప్రేమ ఫ్రెండ్స్ చూసి ఎగతాళిగా మాట్లాడుతుంటే ప్రేమ వాళ్లపై కోప్పడుతుంది. ఆ తర్వాత ధీరజ్ కి ఎదురుగా వెళ్లి లిఫ్ట్ అడుగుతుంది. ఇది సైకిల్ అని ధీరజ్ అంటాడు. అంటే నీకు డబుల్స్ తో సైకిల్ తొక్కడం రాదా అని ప్రేమ అనగానే.. వచ్చు అని తనని సైకిల్ పై ఎక్కించుకుంటాడు ధీరజ్. దాంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.   ఆ తర్వాత రాత్రి ఇంట్లో అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు‌. మీనాక్షి సరుకుల కోసం ఇంటికి వస్తుంది. అప్పుడే రామరాజు వచ్చి పంతులిని రమ్మని చెప్పాను. రేపు సాగర్ , నర్మదలకి శోభనం అని రామరాజు అనగానే వేదవతి టెన్షన్ పడుతుంది. నర్మద మాత్రం.. ఏం అవుతుంది అత్తయ్యకు మాత్రమే మాకు శోభనం జరిగిందని తెలుసు కదా అని అనుకుంటుంది. అప్పుడే రామరాజు మాటలు విని శ్రీవల్లి నవ్వుతుంది.    తరువాయి భాగంలో ధీరజ్ వచ్చేసరికి ప్రేమ క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. ధీరజ్ వచ్చి.. నువ్వు పది మందికి డ్యాన్స్ నేర్పి బ్రతకొచ్చని అనగానే మంచి ఐడియా ఇచ్చాడని ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : దశరథ్ ని నాన్న అని పిలిచిన దీప.. జ్యోత్స్న కనిపెట్టేనా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -378 లో... జ్యోత్స్న గురించి దశరథ్ చెప్పగానే.. జ్యోత్స్న ఎలాంటిదో మావయ్యకి కూడా తెలిసిపోయింది అన్నమాట అని కార్తీక్ అనుకుంటాడు. అసలు దాస్ ని దీప ఎందుకు కొట్టింది.. ఆ విషయం తెలుసుకోవాలని దశరథ్ అంటాడు. దీప మీ కూతురని చెప్తాడేమోనని జ్యోత్స్న కొట్టింది.. కానీ ఆ విషయం ఇప్పుడు మీతో చెప్పలేనని కార్తీక్ అనుకుంటాడు. ఎలాగైనా దాస్ గురించి కనుక్కోమని దశరథ్ అనగానే నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. ఈ విషయం నీకెందుకు చెప్పానంటే నన్ను నీకంటే ఎవరు బాగా అర్ధం చేసుకోరని దశరథ్ అంటాడు.    మరొకవైపుఅమ్మకి కాల్ చెయ్ అని కాంచనని శౌర్య అడుగుతుంది. దీపకి కాంచన ఫోన్ చేస్తుంది. శౌర్యతో దీప మాట్లాడుతుండగా అప్పుడే జ్యోత్స్న వచ్చి ఫోన్ లాక్కుంటుంది. పని చేసేటప్పుడు ఫోన్ ఏంటని జ్యోత్స్న ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్ కి ఫోన్ చేస్తుంది శౌర్య. మీరు ఎక్కడున్నారు నేను వస్తానని శౌర్య అనగానే శివన్నారాయణ ముందు కావాలనే‌.. రండి శౌర్య అందరు కలిసి అని కార్తీక్ అంటాడు. ఇక నాన్న మనల్ని రమ్మని పిలిచాడని శౌర్య చెప్తుంది. కార్తీక్ బాబు రమ్మంటున్నాడు కదా వెళదామని కాంచనతో అనసూయ అంటుంది.    మరొకవైపు దశరథ్ కిందపడిపోతుంటే.. నాన్న అంటూ దీప పట్టుకుంటుంది. అది జ్యోత్స్న విని మా డాడ్ ని అలా పిలుస్తావా అంటూ దీపని కొట్టబోతుంటే కార్తీక్ వచ్చి ఆపుతాడు. దీప చేసిన దాంట్లో తప్పేంటి అంటూ జ్యోత్స్న పై కోప్పడతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : వాళ్ళని రౌడీల నుండి కాపాడిన అప్పు.. యామినితో పెళ్ళి వద్దన్న రాజ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -742 లో... కావ్య ఆకలిగా ఉందంటే రాజ్ ఏవో ఫ్రూట్ తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు. ఇద్దరు ఆ ఫ్రూట్ తిని మత్తుగా పడిపోతారు. అదే సమయంలో వాళ్ళని రౌడీలు చూసి.. కావ్య దగ్గరికి కత్తి పట్టుకొని వస్తారు. మరొకవైపు ఏంటి ఈ కావ్య ఫోన్ కలవట్లేదని ఇందిరాదేవి అనగానే.. ఇంట్లో వాళ్ళందరు వాళ్ళకి ఏమై ఉంటుందని టెన్షన్ పడతారు. అప్పు వెళ్ళింది కదా ఖచ్చితంగా తీసుకొని వస్తుందని అపర్ణ అంటుంది. అప్పు ఏమైనా  వీరానారీనా.. నిన్న మొన్న డ్యూటీ లో జాయిన్ అయిందని తన గురించి రుద్రాణి నెగెటివ్ గా మాట్లాడుతుంటే.. ఇంట్లో వాళ్ళందరు రుద్రాణిని తిడతారు.    మరోవైపు యామిని టెన్షన్ పడుతుంటే వైదేహి తన దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఆ కావ్యని చంపమని సుపారీ ఇచ్చాను.. ఆ రౌడీలు ఇంకా ఫోన్ చెయ్యలేదని యామిని అంటుంది. ఎందుకు ఇదంతా అని వైదేహి అడుగుతుంది. బావని నా సొంతం చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తానని యామిని అంటుంది. నా కూతురు రాను రాను ఇలా తయారవుతుంది ఏంటని వైదేహి టెన్షన్ పడుతుంది.    ఆ తర్వాత రాజ్ , కావ్య నిద్ర లేచేసరికి వాళ్ళ ముందు రౌడీలు ఉంటారు. రౌడీలు చెట్టుకి కట్టేసి ఉంటారు. వాళ్ళని చూసిన రాజ్‌‌.. కావ్య అలా చేసిందని తనకి రాజ్ కంగ్రాట్స్ చెప్తాడు. అది చేసింది నేను.. మా అక్క కాదని అప్పు అంటుంది. మీరిద్దరు స్పృహలేకుండా పడి ఉంటే రౌడీలు ఎటాక్ చేస్తుండగా.. మేమ్ వచ్చి వాళ్లని పట్టుకున్నామని అప్పు చెప్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పంపించారని రౌడీలని అడుగుతుంది అప్పు. వాళ్ళు సమాధానం చెప్పరు. కావ్యని తీసుకొని అప్పు ఇంటికి వెళ్తుంది. ఇద్దరు అక్కడ జరిగిందంతా ఇంట్లో వాళ్లకు చెప్తారు.    మరొకవైపు రాజ్ ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా డెకరేషన్ చేసి ఉంటుంది. ఏంటి స్పెషల్ అని రాజ్ అనగానే.. ఎల్లుండి మీ పెళ్లి కదా అని వైదేహి అంటుంది. రాజ్ షాక్ అవుతాడు. తరువాయి భాగం లో నాకు ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదని రాజ్ అనగానే అందరు కలిసి రాజ్ ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

విలన్ గా పెడితే శ్రీఆంజనేయం మూవీ ప్లాప్ అవుతుంది అన్నా...కృష్ణవంశి వినలేదు

టాలీవుడ్ నటుడు, ఫేమస్ కమెడియన్ కం క్యారక్టర్ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు.  రకరకాల డైలాగ్స్ తో ఇండస్ట్రీలో పాపులర్ ఐన వ్యక్తి. ఆయన ఒక చిట్ చాట్ షోలో ఇండస్ట్రీలోని కొంతమంది గురించి చెప్పుకొచ్చారు. "ఇక్కడ ఈవివి గారి గురించి చెప్పాలి. "ఆ ఒక్కటి అడక్కు" మూవీకి ఆడిషన్స్ టైములో ఆయన అద్దెకుండే ఇంటి దగ్గర మెట్లు ఉంటాయి. అక్కడ పెద్ద లైన్ ఉంది. ఫొటోస్ పట్టుకుని చాలా మంది వచ్చారు. నేను రేషన్ కార్డు టైపులో ఉండే ఫొటోస్ పట్టుకెళ్ళాను. అవి చూసి నన్ను ఏ ఊరూరా అని అడిగారు. తాడేపల్లి గూడెం అని చెప్పేసరికి ఐతే మా ఊరి పక్కనేనా అని సరే నువ్వు వెళ్లి ఏవిఎం దగ్గర ఉండు అన్నారు. ఏవిఎం అంటే ఎక్కడ సర్ అన్నా. నువ్వు అక్కడ కూర్చోరా..నేను స్నానం చేసి వస్తా. కార్ వస్తుంది వెళదాం అని నన్ను స్టూడియోకి తీసుకెళ్లారు. ఆయన ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి. రావు గోపాల్ రావు గారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేయగానే వీడు నా మేనల్లుడి క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు అనగానే ఆ రోల్ నాకు ఇచ్చారు. ఆయన క్యారెక్టర్స్ ఇవ్వడమే కాదు గొప్ప మానవతా వాడి, ఫామిలీ మ్యాన్ ఆయన. ఇక కృష్ణ వంశి గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఒక ఊత పదం ఉంటుంది. నువ్వెంట్రా ఇక్కడ అంటారు. ఆయన సినిమాకు ఆయన డేట్లు ఇస్తారు తర్వాత ఎక్కడైనా కనిపిస్తే నువ్వెంట్రా ఇక్కడ అంటారు. అప్పుడు సర్ మీ సినిమాలో నాకు డేట్ లు ఇచ్చారు అని చెప్తాను. అలా నేను సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం నాకు మంచి పేరు తెచ్చిన మూవీస్. ఆ తర్వాత శ్రీఆంజనేయం మూవీలో విలన్ రోల్ ఇచ్చారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న నన్ను శ్రీఆంజనేయం మూవీలో విలన్ గా పెడితే సినిమా ప్లాప్ అవుతుంది అన్నా కూడా ఆయన వినలేదు. వేరియేషన్ కావాలి అంటే నేనే కరెక్ట్ అని నాకు అవకాశం ఇచ్చారు. అలా శ్రీఆంజనేయం మూవీలో మాంత్రికుడి రోల్ ప్లే చేసాను." అని చెప్పారు పృద్వి.  

అమ్మ దానిమ్మ బత్తాయో...పవన్ కళ్యాణ్ ఈ స్టేట్ కి గొప్ప

పృద్వి రాజ్ అంటే ఇండస్ట్రీలో స్పెషల్ డైలాగ్స్ తో బాగా పాపులర్ ఐన నటుడు. ఖడ్గం మూవీలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ" డైలాగ్ తో అలాగే యమగోల.. అల్లరి నరేష్ మూవీలో "అమ్మ దానిమ్మ బత్తాయో" డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఆయన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.  "పాలిటిక్స్ లో తప్ప ఎందులోనూ నేను వేలు పెట్టను.  బోర్డర్ లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ యుద్ధం చేయడానికి అనుక్షణం రెడీగా ఉంటారు. ప్రతీక్షణం వాళ్ళు దేశానికీ కాపలా కాస్తుంటారు. బోర్డర్ లో ఉండే సైనికుడు ఎంత గొప్పో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్ కి అంత గొప్ప. పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాఫ్. ఇక మా  హిందూపూర్ బాలయ్య గారంటే ఎన్నికలు రాకముందే నేను చెప్పా. హ్యాట్రిక్ బాలయ్య. నిజంగా డౌన్ టు ఎర్త్. ఎవరి గురించి ఆయన డిస్కస్ చేయరు. వాళ్ళ నాన్న గారి చిత్రాలు, పాటలు వింటూ చూసుకుంటూ ఉంటారు తప్పితే వేరే క్రిటిసిజం అనేది ఆయన దగ్గర ఉండదు. అమ్మ దానిమ్మ బత్తాయో అనే డైలాగ్ బాగా ఎలా  హిట్ అయ్యిందంటే యమగోల మూవీలో అల్లరి నరేష్ యముడి కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్తాడు. కింద నుంచి కెమెరా రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ ఉంటే బాగుంటుందని అనేసరికి అది డబ్బింగ్ లో నేను అమ్మ దానిమ్మ బత్తాయో అని అన్నా. అంతే బాగా వైరల్ ఐపోయింది. నేను హీరోగా చేస్తే హీరోయిన్ గా తమన్నా ఐతే బాగుంటుంది అనుకున్నా. ఆవిడ మంచి ఆర్టిస్ట్. మహేష్ బాబుతో యాడ్ చేసింది. అందులో మహేష్ బాబు ఒళ్ళో పడేటప్పుడు, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి అమ్మ దానిమ్మ బత్తాయో ఇలాంటమ్మాయితో హీరోగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఖడ్గం మూవీ షూటింగ్ కోసం రామకృష్ణ స్టూడియోస్ కి వెళ్లాం. 30 ఏళ్ళ నాటకానుభవం ఉన్న పుస్తకం ఒకటి వచ్చింది పావలా శ్యామల గారిది. ఆ లైట్ ఏంటి అని అడిగేసరికి బటర్ పేపర్ ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ మాకు తెలీదా అన్నాను దాంతో లైట్ బాయ్స్ అంతా గొల్లుమని నవ్వుతున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు మొదలైన షూటింగ్. దాంతో ఈ డైలాగ్ బాగుంది కదా కంటిన్యూ ఐపో అన్నారు అలాగే ఆ డైలాగ్ వైరల్ అయ్యింది" అని చెప్పాడు పృద్వి రాజ్.  

నా వయసు 30... పూరి గారంటే నాకు పంచ ప్రాణాలు

  టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్న పృద్వి రాజ్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. "నాకు జీవితాన్ని ఇచ్చింది తల్లితండ్రులైతే సినీ జీవితాన్ని ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకుని వారితో బొట్టు పెట్టించుకున్నా. వారి గెటప్స్ తో ఉన్న పుస్తకం ఒకటి ఇచ్చి లాంగ్ లివ్ అన్నారు. ఇక రాజమౌళి గారి కోసం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాజమౌళి గారి మూవీలో ఒక ఫ్రేమ్ అన్నా నిలబడడం చాలు అనుకున్నప్పుడు బాహుబలి 2 లో ఒక మంత్రిగా చేయడం మంచి విషయం. నాకు ఇక్కడ ఎవరూ పోటీ కాదు. యంగ్ లో నాలాగే ఉన్నావ్ అంటూ కైకాల సత్యనారాయణ గారు అనేవారు. ఆయనే పోటీ. మా కామెడీ కులంలో కుల పెద్ద బ్రహ్మానందం గారు. మేమంతా చిలకలపూడి రోల్డ్ గోల్డ్ బంగారం ఐతే ఆయన ఒరిజినల్ బంగారం. 30 ఇండస్ట్రీ డైలాగ్ టైంలో నా వయసు 30 కూడా కాదు. పూరి జగన్నాధ్ కూడా మొదట నటుడే. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ దగ్గర గులాబీ మూవీ చేసే టైంలో వీళ్లంతా అక్కడే గోడల మీదా కూర్చునేవారు. నేను ఆయన ఫస్ట్ మూవీ బద్రిలో చేశా. అది ఎడిటింగ్ ప్రాబ్లమ్ వలన కట్ ఐపోయింది. ఆ మాట నా జీవితంలో ఆస్కార్ అవార్డు రావడం లాంటిది. సెంటిమెంట్ అనే విషయానికి వస్తే ముందు పూరి జగన్నాధ్ నన్ను పెట్టుకునే వారు. పోకిరిలో ఫస్ట్ షాట్ నాదే. పూరి గారంటే నాకు పంచ ప్రాణాలు" అని చెప్పుకొచ్చారు పృద్వి.  

Illu illalu pillalu : కోడలికి వాంతులు.. మురిసిపోయిన వేదవతి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -178 లో......ప్రేమ తన క్లాస్ మేట్ అబ్బాయితో మాట్లాడుతుంది.. ధీరజ్ జెలస్ గా ఫీల్ అవుతాడు. అక్కడే ఉంటాడు. ప్రేమ తన దగ్గరికి వచ్చి ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావని అడుగుతుంది. నువ్వేంటి వాడితో మాట్లాడుతున్నావ్.. అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కదా.. అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతున్నావ్.. ఇంకొకసారి మాట్లాడకని ధీరజ్ అనగానే ఏంటి జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని ప్రేమ అడుగుతుంది. అదేం లేదు.. నువ్వు మాట్లాడకు అంతే అని ధీరజ్ చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ప్రేమ మురిసిపోతుంది. ధీరజ్ ఫుడ్ డెలివరీ చేస్తుంటే తన ఫ్రెండ్ వచ్చి తన బైక్ తీసుకొని వెళ్లిపోతాడు. అదంతా విశ్వ చూస్తూ నీకు ఇలా ఎదురు దెబ్బ తగిలేలా చెయ్యడం కోసం నేనున్నానని అనుకుంటాడు. ఆ తర్వాత నర్మద త్వరగా ఇంటికి వస్తుంది‌. ఎందుకు ఇంత త్వరగా వచ్చావని వేదవతి అడుగగా.. నాకు వాంతులు అవుతున్నాయని నర్మద చెప్పగానే.. శుభవార్త అంటూ వేదవతి హడావిడి చేస్తుంది. శుభవార్త జరగడానికి మాకు మీరు శోభనం జరిపించారా అని నర్మద అడుగుతుంది. అయ్యో నేను మర్చిపోయాను.. ఈరోజే పంతులిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తానని వేదవతి అంటుంది. అవసరం లేదు మాకు ఆల్రెడీ శోభనం జరిగిందని నర్మద అనగానే వేదవతి షాక్ అవుతుంది. అదంతా దూరం నుండి చూస్తున్న శ్రీవల్లి కూడ షాక్ అవుతుంది. మరొకవైపు తిరుపతి దగ్గరికి ధీరజ్ వెళ్లి.. నాకూ ఏదైనా బండి కావాలని అడుగుతాడు. నా దగ్గర ఈ సైకిల్ ఉందని తిరుపతి ఇవ్వగానే ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో ధీరజ్ సైకిల్ పై వెళ్తుంటే లిఫ్ట్ అని ప్రేమ అడుగుతుంది దంతో ధీరజ్ తనని సైకిల్ పై ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ కి నిజం చెప్పేసిన దశరథ్..  జ్యోత్స్నకి మరో షాక్!

  స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -377 లో...... కార్తీక్, దీప ఇంటికి వెళ్తుంటారు. వెళ్ళొస్తానమ్మ అని సుమిత్రకి దీప చెప్పగానే నన్ను అలా పిలవద్దని దీపతో కఠినంగా మాట్లాడుతుంది సుమిత్ర. ఎన్నో తప్పులు చేసావ్.. అసలు నిన్ను ఇక్కడ ఉండనివ్వడం మా తప్పు అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ తన వల్లే ఆగిపోయిందని ఇప్పుడు సారీ చెప్పింది కదా.. ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది కదా అని సుమిత్రతో అంటాడు కార్తీక్. అయిన సుమిత్ర వినకుండా ఇష్టం వచ్చినట్లు దీపతో కఠినంగా మాట్లాడి బాధపెడుతుంది. అదంతా దూరం నుండి దశరథ్ వింటాడు. పాపం దీప ఎంత బాధపడుతుందోనని అనుకుంటాడు. దీప బయటకు వెళ్లి ఏడుస్తుంది. కార్తీక్ ఓదారుస్తాడు. మరుసటి రోజు ఉదయం శివన్నారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్. అప్పుడే బయట దశరథ్ తో పారిజాతం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందని కార్తీక్ దూరం నుండి వింటాడు. నా కొడుకు దాస్ కనిపించడం లేదని పారిజాతం చెప్పగానే. దశరథ్ షాక్ అవుతాడు మీకెలా తెలుసని పారిజాతాన్ని దశరథ్ అడుగుతాడు. నేను, జ్యోత్స్న ఇంటికి వెళ్ళామని పారిజాతం అనగానే.. జ్యోత్స్న ఎందుకు వచ్చిందని దశరథ్ కంగారుపడతాడు. మావయ్య ఎందుకు జ్యోత్స్న వెళ్ళిందంటే కంగారుపడుతున్నాడని కార్తీక్ అనుకుంటాడు.  ఆ తర్వాత నువ్వు ఎలాగైనా దాస్ ని వెతకమని దశరథ్ కి చెప్తుంది పారిజాతం. వెనకాల వైపు తిరిగేసరికి కార్తీక్ ఉంటాడు. నువ్వు అంతా విన్నావు కదా దాస్ ఎక్కడైనా కనిపిస్తాడేమో చూడమని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దశరథ్ దగ్గరికి కార్తీక్ వచ్చి.. ఏంటి మావయ్య టెన్షన్ పడుతున్నారని అడుగుతాడు. దాంతో కార్తీక్ ని దశరథ్ పక్కకి తీసుకొని వెళ్లి దాస్ ని కొట్టింది జ్యోత్స్ననే నేనే స్వయంగా చూసానని దశరథ్ చెప్తాడు. మావయ్య కి జ్యోత్స్న గురించి తెలుసు అన్నమాట అని కార్తీక్ అనుకుంటాడు. దాస్ ని ఎందుకు కొట్టిందో తెలిస్తే గాని నేను ఏం చెయ్యలేనని దశరథ్ అంటాడు. అసలు జ్యోత్స్న మీ కూతురు కాదని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్నిటికి సాక్షి దాస్ మావయ్య అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ప్రమాదంలో రాజ్, కావ్య.. ఆమెను రౌడీ చంపుతాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -741 లో..... రాజ్, కావ్య రౌడీల నుండి తప్పించుకోవాలని అడవిలోకి వెళ్ళిపోతారు. రౌడీలు కూడా కావ్య, రాజ్ ని పట్టుకోవడానికి అడవికి వెళ్తారు. మరొకవైపు అప్పు కాని స్టేబుల్స్ తో అడవి దగ్గరికి వస్తుంది. రాజ్, కావ్య అడవి అంత తిరుగుతారు. నాకు దాహంగా ఉందని కావ్య అనగానే రాజ్ అటువైపు గా వెళ్లి చిన్న ఆకులో వాటర్ తీసుకొని వస్తాడు. దాంతో కావ్య మురిసిపోతుంది. అప్పుడే రౌడీలు వాళ్ళని చూస్తారు. రాజ్, కావ్య వాళ్ళ నుండి తప్పించుకోవడనకి పరుగెత్తుతారు. ఇద్దరు ఒక దగ్గర దాక్కొని ఉంటారు రౌడీలకి యామిని ఫోన్ చేస్తుంది. వాళ్ళు అడవిలోకి వెళ్లిపోయారు.. మేం వాళ్ళని వెతుకుతున్నాం.. మాకు ఈ అడవి బాగా తెలుసు ఎటు వెళ్తే ఏం వస్తుందో నాకు బాగా తెలుసు కానీ వాళ్లకి తెలియదని యామినితో రౌడీ అంటాడు. కావ్య మాత్రం ఉండొద్దని యామిని రౌడీలకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత చీకటి అవుతుంది. నాకు భయంగా ఉందని కావ్య అంటుంది. ఇద్దరు ఫోన్ టార్చ్ ఆన్ చేసి ముందుకి వెళ్తారు ఆకలిగా ఉందని కావ్య అంటుంది. రాజ్ తన కోసం ఏమైనా తీసుకొని రావడానికి వెళ్తాడు.  రాజ్ కన్పించకపోయేసరికి కావ్య టెన్షన్ పడుతుంది. రాజ్ రాగానే ఎక్కడికి వెళ్ళావంటూ అడుగుతుంది. నీకు ఆకలి అన్నావ్ కదా.. ఇదిగో అంటూ ఫ్రూట్స్ ఇస్తాడు. ఇవి తినొచ్చా అని కావ్య అనగానే తినొచ్చని రాజ్ అంటాడు. కావ్య రాజ్ ఆ ఫ్రూట్ తిని మత్తుగా అయిపోతారు. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఇద్దరు మత్తులో కిందపడిపోతారు. అప్పుడే రౌడీలు వాళ్ళని చూసి దగ్గరికి వస్తారు. కత్తితో కావ్య దగ్గరికి రౌడీలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సార్ ఆ పబ్ అడ్రస్ ఇవ్వండి ఒకసారి...

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అమర్ దీప్ అమ్మాయిలు వేసుకునే చెప్పులు వేసుకొచ్చి సల్మాన్ ఖాన్ లా షర్ట్ తీసేసి దాన్ని అటు ఇటు తిప్పుతూ బెల్లి డాన్స్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో నిఖిల్ విజయేంద్ర సింహ మైక్ పట్టుకుని "ఎంత దిక్కుమాలిన దురదృష్టంలో ఉంటాడో ఈ మనిషి ఒకసారి జూబ్లీహిల్స్ లో ఒక పార్టీకి ఇలాగే షూటింగ్ జరుగుతోంది...ఇద్దరే ఉన్నారు అమరదీప్ ఇంకో అమ్మాయి." అంటూ ఏదో సీక్రెట్ రివీల్ చేయబోతుండగా అమరదీప్ కంగారు పడిపోయి "అమ్మో అది వర్క్ అది వర్క్" అని చెప్పి తప్పించుకోబోయాడు కానీ శ్రీముఖి ఊరుకోలేదు. "పెళ్ళికి ముందా. పెళ్లి తర్వాత" అని అడిగింది. "మొన్నమొన్న ఇది జరిగింది. కానీ అక్కడ ఉన్నది వీళ్ళ వైఫ్ కాదు " అని చెప్పాడు నిఖిల్. "బేసిక్ గా ఆ పిల్ల బిల్లు కట్టమంటే బెంచ్ కింద  బిల్ పడిపోయిందని చెప్తే వెతికి ఇచ్చాను" అని చెప్పాడు. దాంతో ఇమ్మానుయేల్  "ఆ బిడ్డకు కవర్ చేసుకోవడం కూడా రాదురా" అనేసరికి అందరూ నవ్వేశారు. తరువాత డెబ్జానీని శ్రీముఖి అడిగింది "అసలు పార్టీకి వెళ్లే ముఖమేనా మనది" అని అడిగింది. "హా వెళ్తాను. చాల మంది ఫ్రెండ్స్ ఉంటారు. 12 .30 వరకు మిడిల్ అంతవరకు ఒకే.. ఆ తర్వాత అందరికీ లవ్ యు అని చెప్తా 2 - 3 టైం గడిచాక నువ్వే నా సొంతం, నువ్వే నా జీవితం, నువ్వే అన్నీ అని చెప్తూ ఉంటా. నేను ఒక రకమైన ఫోజ్ పెదమనుకుంటా కానీ వాళ్ళు ఇంకో రకం ఫోజుల్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీస్తారు" అని కామెడీగా చెప్పుకొచ్చింది. దాంతో అమరదీప్ ఐతే "సర్ ఆ పబ్ అడ్రెస్స్ ఇవ్వండి ఒకసారి" అని అడిగాడు.  

ఎంగేజ్మెంట్ చేసుకున్న శుభశ్రీ రాయగురు...వరుడు ఎవరో తెలుసా..?

  శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ బ్యూటీ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ఇన్స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ పిక్స్ ని పెట్టుకుంది. శుభశ్రీ ఎంగేజ్మెంట్ చేసుకున్నది అజయ్ మైసూర్ తో. అతను ఎవరో కాదు మూవీ ప్రొడ్యూసర్ కం యాక్టర్. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్  వంటి మూవీస్ లో నటించాడు. అలాగే "హ్యాంగ్మాన్" అనే ఒక అప్ కమింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. వీళ్ళిద్దరూ కనాలి "మెజెస్టీ ఇన్ లవ్" అనే కవర్ సాంగ్ లో కలిసి నటించారు. ఇక శుభశ్రీ ఒడిశాకి చెందిన అమ్మాయి..బిగ్ బాస్ సీజ 7 కంటెస్టెంట్ గా బాగా పాపులర్ అయ్యింది. ఇక బుల్లితెర నటులంతా కూడా విషెస్ చెప్తున్నారు. ఇక శుభశ్రీ గురించి చెప్పాలి అంటే బిఎల్ చదివింది. లాయర్ గా కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత  మూవీస్ లో నటించడానికి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. అలాగే విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని సొంతం చేసుకుంది. అలాగే రుద్రవీణ, కథ వెనక కథ వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. యాంకర్ గా కొన్ని షోస్ నిర్వహించింది. కొన్ని మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. కళ్యాణ్ రామ్ నటించిన "అమిగోస్" మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. శుభశ్రీ మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఈమె కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. 2016 లో "అ" అనే మూవీతో పాటు "ఉట్రన్" అనే తమిళ్ మూవీలో కూడా నటించింది.

Illu illalu pillalu : డబ్బు గురించి అడిగిన చందు.. శ్రీవల్లి ఏం చేయనుంది!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -177 లో.....నువ్వు రాత్రంతా ధీరజ్ ని చూస్తూనే ఉన్నావ్ కదా.. నీ కళ్ళు చెప్తున్నాయని ప్రేమతో నర్మద అంటుంది. అక్క చూసినట్టు చెప్తుంది ఏంటని ప్రేమ మనసులో అనుకుంటుంది. నేనేం చూడలేదని ప్రేమ కవర్ చేస్తుంది. లేదు నువ్వు ధీరజ్ ని లవ్ చేస్తున్నావని నర్మద అంటుంది. అదేం లేదని ప్రేమ అంటుంటే ఇప్పుడు దీరజ్ బయటకు వస్తాడు కదా తన వంక చూడకపోతే నువ్వు లవ్ చెయ్యట్లేదు తన వంక చూస్తే చేస్తున్నట్లే అని నర్మద అనగానే సరే చూడనని ప్రేమ ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కాలేజీ కి వెళ్లాడనికి బయటకు వస్తాడు. ప్రేమ తనని చూడదు.. అటు వైపు తిరిగి ఉంటుంది. తనని చూడకుండా పక్క నుండి వెళ్ళాలని వెళ్తుంటుంది. వెంటనే ప్రేమ పడిపోతుంటే.. ధీరజ్ పట్టుకుంటాడు. ధీరజ్ ని ప్రేమ చూస్తుంది. దూరం నుండి నర్మద వాళ్ళని చూస్తుంది. నేనేం చూడలేదని ప్రేమ నర్మదకి సైగ చేస్తుంది. ఆ తర్వాత ప్రేమని కాలేజీకి తీసుకొని వెళ్తాడు ధీరజ్. మరొకవైపు శ్రీవల్లి దగ్గరికి చందు వచ్చి డబ్బు గురించి అడిగితే తను భయపడి పని ఉందంటూ వెళ్తుంది. అయిన చందు తన దగ్గరికి వెళ్లి మీ వాళ్లకు కాల్ చెయ్ డబ్బు కావాలని అడుగమని కోపంగా మాట్లాడుతాడు. భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి డబ్బు గురించి అడుగుతుంది. పక్కన చందు ఉన్నాడని భాగ్యానికి అర్థమయి రెండు రోజుల్లో డబ్బు ఇస్తానని చెప్తుంది. రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే నేను ఇంటికి రానని శ్రీవల్లితో చందు అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ధీరజ్ జెలస్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శివన్నారాయణ నోటి వెంట ఆ మాట.. కార్తీక్, దీపల ప్లాన్ సక్సెస్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -376 లో..... కార్తీక్ ప్లాన్ చేసి మరి గౌతమ్ పెళ్లి గురించి మాట్లాడడానికి రప్పిస్తాడు. గౌతమ్ శివన్నారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరికి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏదైనా చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ దీప వాడిని చుస్తే వాడిని మళ్ళీ కొడుతుంది.. నువ్వు వెళ్లి దీపని కాఫీ తీసుకొని రమ్మని చెప్పమని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. అదే విషయం కార్తీక్ కి చెప్తుంది పారిజాతం. అంతమందిలో దీప ఒక నింద మోపింది.. అది అబద్ధం అయిన కానీ మా మనసుల్లో కొంచెం డౌట్ ఉందని పారిజాతం అంటుంది. అంటే మీకు నాపై నమ్మకం లేదా అని గౌతమ్ అంటాడు. అప్పుడే దీప కాఫీ తీసుకొని వస్తుంది. దీప వస్తుంది ఏంటని గౌతమ్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఆ దీప చేతిలో వీడు అయిపోయాడని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అప్పుడే దీప వచ్చి గౌతమ్ వంక కోపంగా చూస్తుంది. కాఫీ పక్కన పెట్టి.. ముందు మీకు కాఫీ కాదు సారీ చెప్పాలని సారీ చెప్తుంది దీప. అనవసరంగా ఎవరో చెప్పింది విని మిమ్మల్ని అలా కొట్టాను.. క్షమించండి అని దీప అనగానే అందరు షాక్ అవుతారు. నువ్వు అలా అందరి ముందు కొట్టి ఇప్పుడు ఇలా సారీ చెప్తే ఎలా అని కార్తీక్ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే.. ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్ మెంట్ చెయ్యండి అందరి ముందు సారీ చెప్తానని దీప అనగానే.. మా తాత అందుకు ఒప్పుకోడు అని కార్తీక్ అంటాడు. నువ్వు చెప్పేదేంటి నేను ఒప్పుకుంటున్నాను.. వాళ్ళకి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని శివన్నారాయణ చెప్తాడు.  ఆ తర్వాత ఏంటి గ్రానీ ఆ దీప, బావ కలిసి ఇలా దెబ్బకొట్టారు.. ఇప్పుడు ఏం చెయ్యాలని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఏదో ఒకటి చేసి నువ్వే ఈ పెళ్లి ఆపాలని పారిజాతాన్ని జ్యోత్స్న రిక్వెస్ట్ చేయగా.. తను సరే అంటుంది. ఆ తర్వాత రాత్రి దీప కార్తీక్ ఇంటికి వెళ్తు.. వెళ్లొస్తానమ్మ అని సుమిత్రకి దీప చెప్పగానే నన్ను అలా పిలవొద్దని దీపపై కోప్పడుతుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.