రెబల్స్ కి షాక్...కాంగ్రెస్ సంచలన నిర్ణయం
ఎన్నికల వేళ పలు పార్టీల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలపై వేటు వేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా 24 మందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఏసీ, సీపీఐ మహాకూటమిగా ఎన్నికల బరికి సిద్ధమయ్యాయి. పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఆశావహులను సీట్లు దక్క లేదు. దీంతో ఆ పార్టీ కి చెందిన 19 మంది రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుని రెబల్ అభ్యర్థులను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటు పార్టీ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నారాయణపేట నియోజకవర్గానికి చెందిన మరో ఐదుగురిని కూడా 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన రెబల్స్:
రవి శ్రీనివాస్-సిర్పూర్, బోడ జనార్దన్-చెన్నూరు. హరినాయక్-ఖానాపూర్, అనిల్జాదవ్-బోథ్, నారాయణరావు పటేల్-ముథోల్, అరుణతార-జుక్కల్, రత్నాకర్-నిజామాబాద్ అర్బన్, శ్రీగణేష్-సికింద్రాబాద్, శివకుమార్రెడ్డి-నారాయణపేట్, ఇబ్రహీం-మహబూబ్నగర్, సురేందర్రెడ్డి-మహబూబ్నగర్, బిల్యానాయక్-దేవరకొండ, పాల్వాయి స్రవంతి-మునుగోడు, రవికుమార్-తుంగతుర్తి, నెహ్రూ నాయక్-డోర్నకల్, వూకె అబ్బయ్య-ఇల్లందు, బాలాజీనాయక్-ఇల్లందు, ఎడవల్లి కృష్ణ-కొత్తగూడెం, రాములు నాయక్-వైరా.