నిర్మలమ్మపై కేసు!

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు అయ్యింది. చట్ట సభ ప్రతినిథుల న్యాయస్థానం ఆదేశాల మేరకు బెంగళూరు తిలక్ నగన్ పోలీసులు నిర్మలా సీతారామన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.  ఎన్నికల బాండ్ల పేరుతో పారిశ్రామికవేత్తలను బెదిరించి వారి నుంచి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారంటూ జనాధికార సంఘర్ష పరిషత్ కు చెందిన ఆదర్శ్ అయ్యర్   పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  

మెగాస్టార్‌ కీర్తి కిరీటంలో మరో వజ్రం!

మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది.  సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి., చరిత్ర సృష్టించిన మెగాస్టార్ కు తాజాగా  ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్  ఇండియన్ సినిమా పురస్కారం దక్కింది. 2024 అబుదాబీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్  కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవిని వారు అభినందించారు. చిరంజీవి తన 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన రోజుల వ్యవధిలోనే మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం విశేషం.  

బెల్లం గణపతి నిమజ్జనం!

గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడి నిమజ్జనం శనివారం (సెప్టెంబర్ 28) జరగ నుంది. వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు భక్త జనం పూజలు అందుకున్న ఈ భారీ బెల్లం వినాయకుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.  లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో  18 టన్నుల బెల్లం కుందులను వినిగించి రూపొందించిన ఈ భారీ వినాయక  విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ముందుగా వినాయకుడి విగ్రహ తయారీ కోసం వినియోగించిన బెల్లాన్ని ప్రసాదంలా భక్తులకు పంచుదామని నిర్వాహకులు భావించినప్పటికీ.. ఆరోగ్య కారణాల దృష్ట్యా విగ్రహ తయారీకి వినియోగించిన బెల్లాన్ని నిమజ్జనం ద్వారా కరిగించేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.  

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదట!

వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌  ప్రైవేటీకరణ లేదని స్పష్టం చేసింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైతే  సెయిల్‌లో  విలీనం చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే ఆయనా ప్రకటనే చేసిన స్లల్ప వ్యవధిలోనే విశాఖ స్టీల్ ప్లంట్ యాజమాన్యం ఉద్యోగులపై వేటు వేసింది.  విశాఖ స్టీల్ తాజా నిర్ణయంతో దాదాపు నాలుగువేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. వీరంతా కాంట్రాక్ట్ కార్మికులు కావడం గమనార్హం. స్టీల్  సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు నాలుగువేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఐడీలను బయో మెట్రిక్ నుంచి  తొలగించారు. కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత  తప్పదని విశాఖ స్టీల్ యాజమాన్యం చెబుతోంది. మరో వైపు ఇప్పటికే పాతిక వందల మంది పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్   ఆఫర్‌ ఇచ్చారు. 

కల్తీ నెయ్యిపై ‘సిట్’ విచారణ ప్రారంభం!

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కల్తీ విషయంలో దర్యాప్తునకు సిట్ రంగంలోకి దిగింది. శనివారం (సెప్టెంబర్ 28)  సిట్ బృందం తిరుమల చేరుకుని దర్యాప్తు ప్రారంభించనుంది. సిట్ దర్యాప్తులో భాగంగా ఎవరెవరిని ప్రశ్నిస్తారు? కేసులు నమోదు చేస్తారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  తిరుమల శ్రీవారి .. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ  రాష్ట్రంనే కాకుండా దేశం నలుమూలల నుంచీ కూడా పద్ద ఎత్తున జనం డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రాంతాలలో తిరుమలలో లడ్డూ కల్తీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. 

జగన్‌ నుంచి ధర్మం తనను తాను రక్షించుకుంది!

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారు. గత ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత కూడా ఇసుమంతైనా మార్పు కనిపించని జగన్ ను చూసి ఇప్పుడు జనంఆయన రాజకీయాలలో కొనసాగడానికే అనర్హుడని తీర్మానించేసుకున్నట్లు కనిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం జరిగిందని వెల్లడి కాగానే.. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అఘాయిత్యాలు ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించడమే లక్ష్యంగా జగన్ హయాంలో తిరమల తిరుపతి దేవస్థానం పని చేసిందని విమర్శలు చేస్తున్నారు. తిరుమల దేవుడిని నల్ల రాతితో పోల్చిన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా జగన్ నిర్మించగానే అత్యధికులు అన్న మాట వినాశకాలే విపరీత బుద్ధే అన్నది. ఆ తరువాత భూమన చైర్మన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దేవుడి సొమ్ముకే ఎసరు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కుమారుడి ఎన్నికల ప్రచారం కోసం తిరుమల దేవుడి సొమ్మును వినియోగించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు.  తిరుమతి నుంచి వైసీపీ అభ్యర్థిగా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తారని ఖరారు కాగానే.. అప్పటికి టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి ఎన్నికల నిధుల కోసం తిరుమల వెంకన్న సొమ్మును అప్పనంగా వినియోగించేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. తిరుమల తిరుమతి దేవస్థానం వార్షిక ఆదాయం నుంచి ఒక శాతం నిధులను తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలంటూ టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం పెట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తిరుపతి అభివృద్ధికి ఇప్పటికే టీటీడీ  అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. తిరుపతిలోని ప్రముఖ విద్య, వైద్య సంస్థలను టీటీడీ నిర్వహిస్తోంది. తిరుపతిలోని ప్రధాన రహదారుల నిర్వహణ టీటీడీదే. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం 350 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంత చేస్తున్న టీటీడీ వార్షిక ఆదాయం నుంచి అదనంగా మళ్లీ ఒక శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న తీర్మానం ఎందుకంటే అప్పట్లోనే భూమన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు. వాస్తవానికి కుమారుడుని అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించుకోవడం కోసం భూమన దేవుడి నిధులను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండో.. జగన్ హయాంలో తిరమల తిరుపతి దేవస్థానాన్ని ఫక్తు వ్యాపార కేంద్రంగా, దోపిడీకి నిలయంగా మార్చేశారు. చివరాఖరికి తిరుమల గిరులను స్మగ్లింగ్ అడ్డాగా మార్చడానికి వణ్య ప్రాణుల భయాన్ని కూడా భక్తులలో కలిగించారు. అటవీ శాఖ వణ్య ప్రాణులను నడక మార్గంలో రాకుండా అదుపు చేయడం మాని, భక్తులకు కర్రలు ఇస్తాం మిమ్మల్ని మీరే  రక్షించుకోండి లేదా నడక మార్గంలో రావడం మానేయండి అన్నట్లు వ్యవహరించింది.   ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో  నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగు చూడటంతో ఇది కూడా జగన్ ప్రభుత్వ నిర్వాకమే అన్న నిర్ధారణకు వచ్చేశారు. జగన్ హయాంలోనే రివర్స్ టెండరింగ్ కారణంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కల్తీ చేసిన నెయ్యి పంపిణీ జరిగిందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో కూడా తనదైన అడ్డగోలు వ్యవహారంతో జగన్ తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెపం నెట్టేలా ఎదురుదాడికి ఉపక్రమించారు. ఆ క్రమంలోనే తిరుమల టూర్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.  తన తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటుందనీ, దాని వల్ల కావలసినంత పొలిటికల్ మైలేజ్ పొందవచ్చుననీ జగన్ భావించారు. ఆయన తిరుమల టూర్ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ జరిగిన పరిణామాలను గమనిస్తే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తధ్యమనే అంతా భావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తారనీ, ఆయన తిరుమలకు వెళ్లకుండా అలిపిరి వద్దనే అడ్డుకుంటారనీ, దీంతో ఉద్రిక్తతలు ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అయితే జగన్ పప్పులు ఉడకలేదు. తెలుగుదేశం కూటమి పార్టీలు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోబోమని విస్పష్టంగా ప్రకటించారు. అవే కాదు హిందూ సంస్థలు కూడా శాంతియుత నిరసనలకే పరిమితమౌతామని ప్రకటించాయి. ఆయన తిరుమల పర్యటనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జగన్ తిరుమల దేవస్థానం కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చే తిరుమల దేవుడిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది. ఇక్కడే జగన్ ఇబ్బంది పడ్డారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అధికార తెలుగుదేశం కూటమి సర్వశక్తులూ సన్నద్ధం చేసుకుని సిద్ధమౌతుందనీ, ఆ సందర్బంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనీ జగన్ భావించారు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన ఎటూ సిద్ధంగా లేరు. అది పక్కన పెడితే  తన తిరుమల పర్యటన సందర్భంగా వివాదం, విధ్వంసం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో మరో గత్యంతరం లేక తిరుమల టూర్ రద్దు చేసుకున్నారు. ఆ లోగానే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ద్వారా రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొనేలా ఇష్టారీతిగా మత విశ్వాసాలపై వ్యాఖ్యలు చేయించారు. అయితే జనం ఈ సారి  జగన్ ఉచ్చులో పడలేదు. భూమన వ్యాఖ్యలను పట్టించుకోలేదు.  అటు ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా జగన్ టూర్ కు కాన్వాయ్ ని సిద్ధం చేసింది. దీంతో జగన్ తన టూర్ రద్దు చేసుకున్నారు. అయితే  ప్రభుత్వం తనను తిరుమల దేవుడి దర్శనానికి వెళ్లకుండా అడ్డంకులు సృష్ఠిస్తోందంటూ ఆరోపణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు. అసందర్భంగా తననే దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటే ఇక దళితుల సంగతేంటంటూ కొత్త వివాదానికి తెరలేపడానికి ప్రయత్నించారు. అదీ ఫలించలేదు అది వేరే సంగతి.  కింద పడినా నాదే పై చేయి అనడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు చూసి వైసీపీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి. అసలు జగన్ తిరుమల పర్యటన వ్యవహారంలో దళితుల ప్రస్తావన ఎందుకన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తిరుమల పర్యటనకు ఎటువంటి అడ్డంకులూ లేకపోయినా, పోలీసులు పూర్తి ఏర్పాట్లూ చేసినా సొంత కారణాలతోనే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకనే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇందులో మరో సందేహానికి తావే లేదు. భూమన కరుణాకర్ రెడ్డి జగన్ డిక్లరేషన్ ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం లేదు. దర్శనానికి వెడతాం. ఎవరడ్డుకుంటారో చూస్తాం అంటూ చేసిన  రెచ్చగొట్టే వ్యాఖ్యలే జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి రెడీగా లేరనడానికి నిదర్శనం.  ఇక ఆయన దళితుల అంశాన్ని అసందర్భంగా లేవనెత్తడ కూడా ఆయన పరువును నిట్టనిలువుగా గొయ్యి తీసి పాతేసినట్లైంది. ఎందుకంటే తిరుమలలో ఇప్పటి వరకూ దళితుల దర్శనం ఒక  ఇష్యూ అయిన సందర్భం లేదు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలన్న నిబంధన ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. మాజీ రాష్ట్రపతి అబ్డుల్ కలాం వంటి వారు కూడా తిరుమల దేవుడిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమల దర్శనం విషయంలో ఆయన దళితుల అంశం లేవనెత్తడంతో ఆ వర్గాలలో కూడా జగన్ నవ్వుల పాలయ్యారు.  గత ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత కూడా 40 శాతం ఓటు బ్యాంకు అంటూ గప్పాలు కొట్టుకుంటున్న జగన్ కు ఇప్పుడు నాలుగు శాతం ఓటు బ్యాంకైనా మిగులుతుందో లేదో అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా తన తిరుమల పర్యటన పేరుతో రాజకీయం చేద్దామనుకున్న జగన్ వ్యూహం ఫలించలేదు సరికదా.. ప్రతికూల ఫలితం వైసీపీ మనుగడకే ఎసరు తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు 

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారి అయినట్టు తెలుస్తోంది. హర్ష సాయి తనపై   అత్యాచారం చేసినట్లు  ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పట్నుంచి పరారీలో ఉన్న హర్షసాయి ఫిర్యాదు చేసిన యువతి ఆడియోలను మీడియాకు విడుదల చేస్తూ వస్తున్నాడు. డబ్బు కోసం  బ్లాక్ మెయిల్ చేయడానికే  రేప్ కేసు పెట్టినట్లు హర్ష సాయి అడ్వకేట్ మీడియాకు వెల్లడించారు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆ యువతి వేధింపులు భరించలేకే తన క్లయింట్ అయిన హర్షసాయి  ఆ యువతితో చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నాడని న్యాయవాది వివరించారు.  హర్షసాయిపై రేప్ కేసు పెట్టడం వెనక కుట్ర కోణం ఉందని చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్దమేనని హర్షసాయి అడ్డకేట్ అంటున్నారు. ఈ నేపథ్యంలో  పోలీసులు హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారి చేసినట్లు తెలుస్తోంది. దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటానికే ఈ నోటీసులు జారీ అయ్యాయి. 

పొంగులేటి నివాసాలపై ముగిసిన ఈడీ సోదాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పొంగులేటికి చెందిన పలు కార్యాలయాలలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో చేసన ఈ సోదాలలో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి  క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్‌లు కొనగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు.   ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ అధికారులు 16 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్ లోని పొంగులేటి నివాసాలు, కార్యాలయాలలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు పొంగులేటి నివాసాలపై తనిఖీలు నిర్వహించడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు మళ్లీ సోదాలు నిర్వహించాయి. అయితే ఈడీ సోదాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ రాజకీయ వేధింపులలో భాగమే ఈ సోదాలు అని విమర్శలు గుప్పిస్తున్నది. కేంద్రంలోని మోడీ సర్కార్ తన రాజకీయ కక్ష సాధింపునకు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని విమర్శిస్తున్నది.   ఇలా ఉండగా మంత్రి పొంగులేని వినాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈడీ నిర్వహించిన సోదాలలో పెద్ద ఎత్తున సొమ్ము బయటపడినట్లు తెలుస్తోంది. అనధికారిక సమాచారం మేరకు పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ నిర్వహించిన సోదాలలో బయటపడిన సొత్తు లెక్కించేందుకు రెండు కౌంటింగ్ మిషన్లను ఈడీ అధికారులు వినియోగించినట్లు చెబుతున్నారు. పొంగులేటి నివాసాలు, కార్యాలయాలు, ఆయన బంధువుల నివాసాలు సహా మొత్తం 15 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం (సెప్టెంబర్ 27) ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకూ సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పొంగులేటి కీలక మంత్రి కావడంతో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రం నుంచి ఈడీ అధికారులు నేరుగా రంగ ప్రవేశం చేశారు. ఇక్కడి ఈడీ అధికారులకు ఈ దాడుల గురించి కనీస సమాచారం కూడా లేదని చెబుతున్నారు. 

బెడిసికొట్టిన జగన్ ప్లాన్!

తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు వెలుగులోకి రావ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల ల‌డ్డూలోనే ఇలా జ‌ర‌గ‌డం ప్ర‌తీఒక్క‌రిని ఆవేద‌నకు గురిచేస్తోంది. గ‌త ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమలలో ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యితోపాటు.. ఇత‌ర  విభాగాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించ‌డంతో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో ఘోరాల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హిందువులు, హిందూ సంఘాల ప్ర‌తినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న‌పై సిట్ విచార‌ణ‌కు ఆదేశించారు. మ‌రో వైపు తిరుమ‌ల‌లో లడ్డూ కల్తీపై అర్చ‌కులు సంప్రోక్షణ యాగం నిర్వ‌హించారు. ఇదిలాఉంటే వైఎస్ జ‌గ‌న్ స‌హా ఆపార్టీ నేత‌లు ల‌డ్డూలో క‌ల్తీనెయ్యి క‌లిసింద‌న్న‌విష‌యాన్ని ఒప్పుకోవ‌టం లేదు. కేంద్రం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టులు వ‌చ్చినా అవ‌న్నీ అబ‌ద్ద‌పు రిపోర్టులు, తెలుగుదేశం కార్యాల‌యం నుంచి వ‌చ్చిన రిపోర్టులంటూ  జగన్ సహా ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. జగన్ తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.    ల‌డ్డూ వివాదాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించాల‌ని చూసిన జ‌గ‌న్ ప్లాన్‌ బూమరాంగ్ అయ్యింది. ఆయన తిరుమల యాత్ర రద్దు చేసుకోవడం, తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే అని తేటతెల్లం అయిపోయింది.  ఇక విషయంలోకి వస్తే.. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌ని ల్యాబ్ రిపోర్టులు రావ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు వైసీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.  త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌దాడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం (సెప్టెంబర్ 28) రాష్ట్ర వ్యాప్తంగా ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి త‌మ నిర‌స‌న తెలియ‌జేయాల‌ని వైసీపీ అధిష్టానం పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని భావించారు. తిరుమ‌ల‌కు ఒక‌ రోజు ముందే వెళ్లేందుకు షెడ్యూల్‌ సైతం రెడీ చేసుకున్నారు. తిరుప‌తి వెళ్లే క్ర‌మంలో పోలీసులు జ‌గ‌న్‌ను అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధ‌మ‌య్యాయి. రాయ‌ల‌సీమ‌లోని ప‌లువురు ముఖ్య‌నేత‌లకు ఈ మేర‌కు స్వ‌యంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌ను తిరుమ‌ల వెళ్ల‌కుండా అడ్డుకుంటే తిరుపతి ప్రాంతం మొత్తం ఆందోళనలతో హోరెత్తేలా చేసి.. తద్వారా ఆ విష‌యాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ తన అనుచరులకు సూచనలు చేసినట్లు తెలిసింది. వైసీపీ కుట్ర‌ల‌ను ముందుగానే గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని పోలీస్ శాఖ‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక‌రోజు ముంద‌స్తుగానే పెద్ద ఎత్తున పోలీసులు తిరుమ‌ల, తిరుమ‌ల ప‌రిస‌ర ప్రాంతాల‌కు చేరుకొని బందోబ‌స్తులో నిమ‌గ్న‌మ‌య్యారు. అంతేకాక‌.. బ‌య‌ట‌కు రావొద్దంటూ ప‌లువురు వైసీపీ నేత‌ల‌కు నోటీసులు ఇచ్చారు. మ‌రోవైపు జ‌గ‌న్ తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి రావడాన్ని  హిందువులు, హిందు  సంఘాల నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారు. త‌న హ‌యాంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసిన జ‌గ‌న్.. తిరుమ‌ల‌కు ఎలా వ‌స్తారని నిలదీశారు. అయితే, జ‌గ‌న్ వ్యూహాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కూట‌మి నేతలు ఎవ‌రూ జ‌గ‌న్ ను అడ్డుకోవ‌ద్ద‌ని, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న సాగేలా చూడాల‌ని సూచించారు. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వందల మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేసింది. కాన్వాయ్ కూడా రెడీ చేసింది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం జ‌గ‌న్‌కు బిగ్ షాకిచ్చింది. త‌న‌ను అడ్డుకుంటే   ఆందోళ‌న‌లకు తెర‌తీయాల‌ని భావించిన జ‌గ‌న్‌కు కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యం మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్య‌మ‌త‌స్తులు డిక్ల‌రేష‌న్ ఇచ్చిన త‌రువాతే తిరుమ‌ల దేవుడిని దర్శించుకోవాలని అందుకు జగన్ కు ఎలాంటి మినహాయింపూ లేదని స్పష్టం చేసింది.  ఈ అంశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని జ‌గ‌న్ భావించారు. ఇందులో భాగంగా  టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్  రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్   డిక్ల‌రేష‌న్ పై సంత‌కం ఎందుకు పెట్టాలి.. జ‌గ‌న్ ఆ ప‌ని చేయ‌రు.. సంత‌కం చేయ‌కుండానే తిరుమ‌ల‌కు వెడతాం. శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటాం.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ అడ్డుకోలేరంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. భూమన వ్యాఖ్య‌ల‌కు   సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ.. తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తులు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధ‌నలు పాటించాలి. భ‌క్తుల మ‌నోభావాల‌ను ప‌రిర‌క్షించ‌డానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఉంది. అన్య‌మ‌తస్తులు ఆల‌యంలోకి రావాలంటే డిక్ల‌రేష‌న్ పై సంత‌కం చేయాల‌ని, అలాకాకుండా త‌మ ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తామంటే కుద‌ర‌ద‌ని తేల్చిచెప్పారు. ఇంతలోనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.  జ‌గ‌న్ ప్లాన్ అమ‌లుకాకుండా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డంతో వైసీపీ నేత‌లు కంగుతిన్నారు. ఇక ఆట‌లు సాగ‌వ‌ని భావించిన జ‌గ‌న్ తిరుల ప‌ర్య‌ట‌న‌ను రద్దు చేసుకున్నారు. రద్దు ప్రకటేన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రినైన తనకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక దళితుల పరిస్థితి ఏమిటని దళితులను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడారు.   వాస్తవానికి తిరుమల వెళ్లేందుకూ, తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకూ ఎవరికీ ఎటువంటి ఆంక్షలూ లేవు. అన్యమతస్థులు కూడా తిరుమలేశుని దర్శించుకోవడానికి అభ్యంతరాలేవీ లేవు.. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధననే ఇప్పుడు తిరుమల తిరపతి దేవస్థానం జగన్ కు గుర్తు చేసింది. దానికే జగన్ గుండెలు బాదేసుకుంటున్నారు.  దళితులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి జగన్ పర్యటన రద్దు వెనుక వేరే కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే పుట్టుకతో క్రైస్తవుడైన జగన్ తిరుమల కొండపైకి వెళ్లాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అలా   డిక్లరేషన్ ఇస్తే  క్రైస్తవ పెద్దల ఆగ్రహానికి గురి అవుతానని, అదే జరిగితే  క్రిస్టియన్ మిషనరీల నుంచి వచ్చే డబ్బు నిలిచిపోతుందని భయపడి జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.   బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే చెప్పారు. మొత్తానికి తిరుమలలో పర్యటిం చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా చేయాలని భావించిన జగన్ కు అపార రాజకీయ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు తనదైన వ్యూహంతో  చెక్ పెట్టి బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ తిరమల పర్యటన రద్దు చేసుకోవడంతో ఆయన హిందూ వ్యతిరేకి అనీ, ఆయనకు తిరుమల దేవుని పట్ల విశ్వాసం లేదనీ నిర్ద్వం ద్వంగా తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అన్యమతస్తులు సంప్రదాయాన్ని పాటించాల్సిందే.. చంద్రబాబు

వైసీపీ నాయకుడు జగన్‌ని తిరుమలకు వెళ్ళొద్దద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమకు నోటీసులు ఇచ్చారు, తమ తిరుమల పర్యటనను నిలిపేశారని ఆరోపిస్తున్నారు కదా... జగన్‌కి పోలీసులు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌ని వెళ్లొద్దని నోటీసులు అందినట్టయితే, వాటిని మీడియాకి చూపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తూ  ప్రజలను మభ్యపెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  “ఇటీవలి కాలంలో టీటీడీలో జరిగిన పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో తిరుపతిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వుంటాయి. తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆ ఆచారాలు, ఆ నియమాలు పాటించాల్సిందే. ఎవరైనా ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. స్వామివారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. సొంత మతాన్ని ఆచరించాలి... ఇతర మతాలను గౌరవించాలి’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘గతంలో జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్ళారు. చాలా మంది అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అన్య మతాలను గౌరవించడం అంటే.. ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే. బైబిల్‌ని నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలి? చర్చికి వెళ్లి కూడా బైబిల్ చదవొచ్చు. జగన్ చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదని అంటున్నారు. ఏఆర్ డెయిరీ ఎనిమిది ట్యాంకర్లు పంపింది.. అందులో నాలుగు ట్యాంకర్లు వాడారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్టీడీబీ.. మేము కాదు. ఈ నివేదిక దాస్తే మా ప్రభుత్వం తప్పు చేసినట్లే అవుతుంది. నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతున్నారు. గతంలో అడల్ట్రేషన్ పరీక్షకు తన ప్రభుత్వం ఎందుకు పంపలేదు? టెండర్లు పిలవటానికి నిబంధనలు ఎందుకు మార్చారో జగన్ చెప్పాలి. జగన్ హయాంలో నాసిరకం పదార్థాలతో స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రామతీర్థం, అంతర్వేది ఘటనల మీద  ఇప్పటి వరకు విచారణ జరపలేదు. జగన్ తాను క్రైస్తవుడిని అని ఒప్పుకున్న తర్వాత డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? జగన్ చెబుతున్న అబద్ధాలను ఖండికపోతే జనం అవే నిజాలు అనుకునే ప్రమాదం వుంది. తప్పు జరిగినప్పుడు బాధపడాలే తప్ప ఎదురుదాడి చేయకూడదు. స్వామి వారి విషయంలో చేసిన అపచారాలను నేను కప్పిపుచ్చాలా?’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘జగన్‌ వెళ్ళాలనుకుంటేనే తిరుమలకు వెళ్ళొచ్చు. లేకపోతే లేదు. అన్య మతస్థులు ఎవరు తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు జగన్‌కి ఎవరిచ్చారు? దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని జగన్‌కి ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రిగా వుండగా చట్టాలను ఉల్లంఘించానని జగన్ ఎలా చెబుతారు? ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తే మొదట చట్టాలను, సంప్రదాయాలను గౌరవించాలి. తిరుమల స్వామివారిని రాజకీయాలకు, వ్యాపారాలకు వాడుకోవడం జగన్ చేసిన పెద్ద తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నియామకంలో జగన్ చేసింది అధికార దుర్వినియోగం. నెయ్యి కల్తీ విషయంలో బాధ్యులు అందరి మీదా చర్యలు వుంటాయి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

137 ఏళ్ల రైల్వే బ్రిడ్జి స్తంభాల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించాలి

దొరవారి బావి రైల్వే బ్రిడ్జి స్తంభాల్ని కాపాడుకోవాలి  పురావస్తు పరిశోధకుడు డాక్టర్ఈమని శివనాగిరెడ్డి ప్రకాశం జిల్లా, గిద్దలూరు-నంద్యాల రైలు మార్గంలో దిగువమిట్టపల్లి- దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, ఆయన, ప్రముఖ చరిత్రకారుడు పరిశోధకుడు విద్వాన్ డాక్టర్ జ్యోతి చంద్రమౌళి, ఔత్సాహిక వారసత్వ కార్యకర్త పాములపాటి శ్రీనాథ్ రెడ్డితో కలిసి శుక్రవారం(సెప్టెంబర్ 27) ఆ బ్రిడ్జిని సందర్శించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  బ్రిటిష్ ప్రభుత్వం గోవా నుంచి మచిలీపట్నానికి సరుకుల రవాణా కోసం రెండు పట్నాల మధ్య మీటర్ గేజ్ నిర్మాణాన్ని తలపెట్టి 1842లో సర్వే చేసి, 1867 నాటికి గోవా-గుంతకల్ మార్గాన్ని పూర్తిచేసి, అదే సంవత్సరం నల్లమల అటవీ ప్రాంతం లో నంద్యాల-గిద్దలూరు మధ్య దిగువమిట్టపల్లి సమీపంలో చలమ-బొగడల మధ్య, 2600 అడుగుల సముద్రమట్టంపై, 800 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జిని నిర్మించటానికి బ్రిటన్ లోని బర్నింగ్ హామ్ స్టీల్ ప్లాంట్ నుంచి తెప్పించిన 420 టన్నుల ఇనుము వినియోగించి, స్థానిక కార్మికులతోనే బ్రిటిష్ ఇంజనీర్లు బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోవడంతో అభినందించదగ్గ విషయమని శివనాగిరెడ్డి అన్నారు.  లండన్ తో తయారైన బ్రిడ్జి విడిభాగాలు 1883లో మచిలీపట్నం రేవుకు రాగా, 1884లో న నిర్మాణం ప్రారంభమై, 1887లో పూర్తై దిగువమిట్టపల్లి-దొరవారిబావి మధ్య వంతెనను దాటి, రైలు మచిలీపట్నం నుంచి గోవాకు చేరుకుందని, ఆయన అన్నారు. అదే బ్రిడ్జి పైన 110 సంవత్సరాలు ల పాటు రైళ్లు నడిచాయని, 1992లో ఆ బ్రిడ్జిని ఊడ తీసి, రు.4.00 లక్షలకు పాత ఇనుమును అమ్మారని, 1992 నుంచి, ఈ రైలు మార్గం బ్రాడ్ గేజ్ గా మారిందని వివరించారు.  137 ఏళ్ల చరిత్ర గల 200 అడుగుల ఎత్తున దిగువమిట్టపల్లి వద్ద గల రాతితో కట్టిన రైలు బ్రిడ్జి స్తంభాలను, దొరవారిబావి వద్ద ఇప్పటికే చెక్కుచెదరని ఇటుక రాతి బ్రిడ్జి గోడల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరిచి, అలనాటి కష్టతరమైన నిర్మాణ నైపుణ్యాన్ని ఈతరానికి, నల్లమల లో ప్రకృతి అందాల నడుమ తిలకించేటట్లు చేయాలని తరానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, జ్యోతి చంద్రమౌళి, పాములపాటి శ్రీనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అనుకున్నదే అయ్యింది.. జగన్ తిరుమల టూర్ ఆగింది!

అనుకున్నట్లే జరిగింది. డిక్లరేషన్ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు కావడానికి కారణమైంది. జగన్ టీటీడీ కోరినట్లు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారని.. ఆయన గురించి తెలిసిన వారెవరూ అనుకోలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ అడుగులు పడ్డాయి. భూమన కరుణాకరరెడ్డి వంటి నాస్తికుడికి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మానికి వ్యతిరేకి అని చెప్పలేం కానీ ఆయన కచ్చితంగా హిందువు అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం తిరుమలలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఆయన హిందూ ధర్మానికి బద్ధ విరోధి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఈ మేరకు గత ఐదేళ్లలో హిందూ సమాజం మొత్తం తిరుమలలో జగన్ చేస్తున్న అరాచకాలపై గగ్గోలు పెట్టింది. తీరు మార్చుకోవాలని సూచించింది.  జగన్మోహన రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో చెప్పనలవి కాదు.  జగన్ హయాంలో  తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ రక్షణ కోసం కాదు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగీ తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దారుణగా దెబ్బతీశాయి. వారిని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి.   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న  నిర్ణయాలు సహా జరిగిన అపచారాలకు లెక్కేలేదు.     తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం  అధికారంలో ఉన్నంత కాలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేశారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన చెప్పిన దాని కల్లా తలూపుతూ టీటీడీ ఒక ధార్మిక సంస్థ అన్న విషయాన్నే మరిచి పోయింది.  ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దోపిడీయే. తిరుమల వెంకన్నకు భక్తులు నిలువుదోపిడీ ఇస్తారు. అయితే జగన్ హయాంలో భక్తులకు ఆ అవకాశం లేకుండా కొండపైకి వచ్చిన భక్తులను టీటీడీయే నిలువు దోపిడీ చేసేసిందంటే అతిశయోక్తి కాదు.   స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా  జరిగే ప్రసాద వితరణ ఆగిపోయింది. కనీసం జలప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది.    ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇలా  తిరుమల కొండపై జగన్  హయాంలో దేవునికి జరగని అపచారం లేదు.  ఉద్దేశ పూర్వకంగా తిరుమల దేవునికి జగన్ హయాంలో అపచారం జరిగింది. ఇప్పుడు అదే కొండపైకి ఎమ్మెల్యే హోదాలో జగన్ వెళ్లడానికి డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన పరిస్థితి ఇప్పడు జగన్ కు ఎదురైంది.  అయితే ఓట్ల కోసం తప్ప హిందూ దేవాలయాలక వెళ్లే ప్రసక్తే లేదని చెప్పే జగన్ ఎప్పుడో ఐదేళ్ల తరువాత జరిగే ఎన్నికలలో లబ్ధి కోసం ఇప్పుడు తిరుమల వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు. 

మహమ్మద్ ప్రవక్త  మేకలు  ఎందుకు పెంచుకున్నాడు?

జాఫర్ బాయ్ ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చాడు. జాఫర్ భాయ్: సలాం వాలేకూం  మౌలానా సాబ్  మౌలానా: వాలేకూం సలాం జాఫర్ భాయ్  జాఫర్ భాయ్: నా చిన్న కొడుకు సిరాజ్  సతాయిస్తున్నాడు. కుక్క కోసం  నాతో గొడవపడుతున్నాడు మౌలానాసాబ్  మౌలానా దివాన్ ఖానాలో  జాఫర్ భాయ్ ను కూర్చోబెట్టి  తన తక్రీర్ ప్రారంభించాడు.   మౌలానా:  అల్లా సందేశాన్ని మానవాళికి చేరవేసిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఇటీవలె ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. మహమ్మద్  ప్రవక్త దగ్గర అనేక రకాల  పెంపుడు జంతువులు ఉండేవి. . వీటిలో కుక్క లేదు. కుక్క విశ్వాసం గల జంతువు కాని పెంచుకునే జంతువు కాదు. కుక్క వల్ల మనిషికి అనర్థాలు కూడా ఎక్కువే. కుక్క మాంసాహారి. మాంసాహార జంతువుల్లో కోపం కూడా ఎక్కువ. కోపం ఎక్కువైతే యజమానినే కొరుక్కు తింటుంది. చాలాదేశాల్లో కుక్క వల్ల యజమాని చనిపోయిన వార్తలు పత్రికల్లో చూస్తున్నాం. కుక్క మల మూత్రాల వల్ల దాన్ని పెంచుకున్న యజమానులు అనారోగ్యపాలవుతారు. మహమ్మద్ ప్రవక్త మేకల మందను మేపే వాడు. మేకల వల్ల అనేక లాభాలున్నాయి. మేకలు పెంచుకోవడం వల్ల ఓపిక, సహనం పెరుగుతుంది. అల్లాతో ప్రేమ పెంచుకున్నవాళ్లమవుతాం. మేకలు పెంచుకోవడం వల్ల ఇంట్లో చెత్తా చెదారం మాయమవుతుంది. కిచెన్ వేస్ట్ తిని పెట్టి మేకలు మనకు మేలు చేస్తాయి. మేక వ్యర్థాల వల్ల అనారోగ్యం చెందే అవకాశం లేదు. మేకలు పెంచుకునే క్రమంలో సహనం పెంచుకునే అవకాశముంది. ప్రకృతికి ఎంత దూరం ఉంటే అనారోగ్యాలు అంత దగ్గర అవుతాయి. మేకలు ప్రకృతి ఇచ్చిన వరం. మేకలు అన్ని రకాల ఆకు కూరలు, గడ్డి తింటాయి. కాబట్టి అన్ని రకాల పోషకాలు మేకలకు అందుతాయి. పేద కుటుంబాలు అవసరం కొద్దీ అమ్ముకుంటే ఆర్థిక చేయూత నిస్తాయి. మేకలు ఉన్నాయంటే ఎటిఎమ్ కార్డు మన వద్ద ఉన్నట్టు భావించాలి. కోళ్లు పెంచుకోవడం కూడా ఇస్లాంలో హలాల్ అని చెప్పొచ్చు. వేకువ జామున కోడిపుంజు పెట్టే కూతకు మేలుకుంటాం. ఫజర్ నమాజు (ప్రాత: కాల నమాజు) చేసుకోవచ్చు. కోడిగుడ్ల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. పౌల్ట్రీ ఫాంలో లక్షలాది కోళ్లు చనిపోయినా మనిషి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు మేకలు, కోళ్లు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. షోకుల కోసం కుక్కలను పెంచుకుంటున్నారు. దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ.   ఇస్లాం కేవలం ఎనిమిది రకాల పెంపుడు జంతువులకు అనుమతించింది. అందులో కుక్క , పిల్లి వంటి జంతువులు లేవు.  మహమ్మద్ ప్రవక్త కూడా మేకలు పెంచుకున్నాడు.  కాబట్టి మహమ్మద్ ప్రవక్త బాటలో మనమూ వెళ్లాలి. ప్రతీ ముస్లిం ఐదుసార్లు నమాజు చేయాలి. అల్లాకు దగ్గరవ్వాలి. ఇస్లాం మే  హలాల్ జాన్వర్ కో పాలో, హరామ్ జాన్వర్ కో మత్ పాలో . బక్రీ అప్నీ కిద్మత్ కే లియే హై...   కుదాఫీస్ అంటూ మౌలానా తన తక్రీర్ ముగించాడు.                                                                                              బదనపల్లి శ్రీనివాసాచారి

పొత్తు ధర్మానికి పవన్ తూట్లు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పట్ల ఒంగోలు తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నాయి. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు బాలినేని అరాచకాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు అదే బాలినేనిని కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన గూటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులూ నేతలూ కూడా బాలినేని దాష్టీకాన్ని చవి చూసిన వారు. అయినా  తెలుగుదేశంతో కనీస మాత్ర చర్చ లేకుండా ఏకపక్షంగా బాలినేనికి జనసేన తీర్థం ఇచ్చేయడాన్ని తెలుగుదేశం తప్పుపడుతోంది. జనసేన గూటికి చేరడానికి ముందు బాలినేని తెలుగుదేశం తలుపు తట్టారు. అయితే పార్టీ కేడర్ మనోభావాలను గుర్తించి ందుకు అనుగుణంగా చంద్రబాబు బాలినేని ఎంట్రీకి నో చెప్పారు.  అయితే బాలినేని ఎంట్రీకి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆయనకేమీ రెడ్ కార్పెట్ పరచలేదు. జనసేన గూటికి చేరితే బాలినేని స్థానం ఏమిటి?  స్థాయి ఏమిటి అన్నది చేరికకు ముందే చెప్పారు. బాలినేని కోరినట్లు పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్లి భారీ బహిరంగ సభవేదికగా పార్టీ కండువా కప్పలేదు. పోనీ మంగళగిరి భారీ ర్యాలీగా వచ్చి చేరుతానని బాలినేని కోరినా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఒంటరిగా, ఎలాంటి హంగూ, ఆర్భాటం, హడావుడీ లేకుండా సింపుల్ గా వచ్చి జనసేన కండువా కప్పించుకుని సైలెంట్ అయిపోవాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇ ది కచ్చితంగా బాలినేనికి మింగుడుపడని అంశమే. ఎందుకంటే.. ఆయన జనసేనలో చేరిక ఖరారు అయిన  క్షణం నుంచీ ప్లెక్సీల విషయంలో  ఆయన వ్యవహరించిన తీరు తెలుగుదేశం  శ్రేణులను రెచ్చగొట్టేదిగానే ఉంది. అదే ఫ్లెక్సీల చించివేతకు కారణమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బాలినేనికి తన స్థానమేంటో చూపారు. అంత వరకూ బానే ఉన్నప్పటికీ, ఒంగోలు నియోజకవర్గంలో తెలుగేదేశం శ్రేణులు అసంతృప్తికి గురి కాకుండా వారిని ఒప్పించి బాలినేనిని చేర్చుకునే ప్రయత్నం చేసి ఉండాల్సిందని పరిశీలకులు అంటున్నారు. బాలినేని జగన్ తో విభేదించి బయటకు వచ్చినట్లు బయటకు చెబుతున్నా.. పబ్బం గడుపుకుని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ జగన్ పంచనే చేరుతారని బాలినేని అనుచరులే చెబుతున్నారు. జగన్ బాలినేనికి సమీప బంధువు కావడం, గతంలో ఎన్నిసార్లు జగన్ తో విభేదాలు తలెత్తినా, పార్టీలో కనీస గౌరవం దక్కకపోయినా బాలినేని వైసీపీని వీడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన జగన్ కోవర్ట్ గానే తెలుగుదేశం, జేనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించే వ్యూహంలో భాగంగానే  పార్టీ మారారని జనసేన శ్రేణులే చెబుతున్నాయి.  అంతే కాకుండా  వరుసగా జనసేన మాజీ ఎమ్మెల్యేలను పవన్ కల్యాణ్ పిలిచి మరీ జనసేన కండువా కప్పడాన్ని కూటమి పార్టీల శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి. చేరికల విషయంలో కూటమిలోని మూడు పార్టీల అధినేతలూ కూర్చుని మాట్లాడుకుని ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

జగన్ తిరుమల పర్యటన రద్దు!

జగన్ తిరుమల పర్యటన రద్దయింది. జగన్ శనివారం నాడు తిరుమల వెళ్ళనున్నారు.. స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. డిక్లరేషన్ మీద సంతకం చేయరు.. అని వైసీపీ నాయకులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయరు అని కొంతమంది అంటుంటే, సంతకం చేస్తారు అని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జగన్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. జగన్ తిరుమల పర్యటన వార్తలతో రెండు రోజులుగా టీకప్పులో తుఫాను రేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ మొత్తానికే తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. జగన్ తన తిరుమల పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయం తెలియాల్సి వుంది.  

పవన్ అండ్ ప్రకాష్... ట్వీట్ల యుద్ధం కంటిన్యూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మనకు కావలసింది ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమా, లేక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమా అంటూ ట్వీట్ చేశారు. లడ్డూ వివాదంలో ప్రకాశ్ రాజ్ స్పందనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. లడ్డూ వివాదంపై తమిళ నటుడు కార్తి చేసిన వ్యాఖ్యపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేయడం... కార్తి సారీ చెప్పడంపై కూడా పవన్ మొత్తానికి అడిగి సారీ చెప్పించుకున్నారుగా అంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద ప్రకాశ్ రాజ్ ట్వీట్లు జనసేనానికి, జనసైనికులకు అసహనం తెప్పిస్తున్నాయనడంలో సందేహం లేదు.