సూపర్ పోలీస్.. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్న ఎస్పీ

  ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట అక్షరాల వరకే పరిమితం అవ్వకుండా చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ కౌషల్. క్రైమ్ రేట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు అధికారిగా.. సంచలన కేసుల్లో మిస్టరీని చేధించి నేరస్తుల్ని కటకటాల బాటపట్టించారు. ఆదేశాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవల్లో దర్యాప్తు కొనసాగించగల గట్స్ ఉన్న ఎస్పీగా కూడా పేరొందారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయటమే కాకుండా అర్ధరాత్రి కూడా వెంటనే స్పందిస్తారు.ఇటీవల సంచలనం రేపిన తల్లీ కూతురు హత్య కేసులో గంటల వ్యవధి లోనే మిస్టరీ ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే.. భార్యాబిడ్డల్ని చంపిన కేసులో నిందితుడ్ని కటకటాల బాటపట్టించారు.ఇలా ఎన్నో కేసుల్ని ఛేదించిన పోలీస్ గా పేరొందారు కౌషల్. స్పందన కార్యక్రమంలో వెల్లువెత్తే ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు ఎప్పటికప్పుడు దర్యాప్తును ట్రాక్ చేయటమే కాక డిపార్ట్ మెంట్ లో తనదైన మార్కును చాటుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్. క్రైమ్ రేట్ కు కళ్లెం వేయడంతో పాటు పోలీసుల పని తీరు పై కూడా నిఘా పెంచారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్ లలో సరైన స్పందన ఉండడం లేదన్న ఆరోపణల క్రమంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఎస్పీ. ఒంగోలు ఠాణాలో ఫిర్యాదు దారులతో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకునేందుకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ను రంగంలోకి దింపారు. ఆయన మఫ్టీలో సామాన్య పౌరుడిలా ఒంగోలు తాలూకా పీఎస్ కు వెళ్లి తన మొబైల్ లో గుర్తు తెలియని వ్యక్తి లాక్కేల్లాడని కంప్లైంట్ తీసుకోవాలని కోరారు.కానీ సిబ్బంది స్పందించలేదు సిఐ లేరు ఆయన సాయంత్రం వస్తారు అప్పుడు దాని తిప్పి పంపారు. సాయంత్రం మళ్లీ స్టేషన్ కు వెళ్లారు జగదీష్. రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకున్నారు కానీ రసీదు ఇవ్వ మని అడిగితే మళ్లీ వెళ్ళవయ్యా వెళ్లు అని కాసురుకున్నారు. ఎందుకివ్వరు అని గట్టిగా అడిగితే అసలు ఫోన్ నీదే అని గ్యారెంటీ ఏంటి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా అని అవాక్కైన ట్రైనీ ఎస్పీ ఒంగోలు తాలూకా పీఎస్ లో తనకు ఎదురైన అనుభవాన్ని.. ప్రతి అంశాన్ని సిద్దార్థ్ కౌశల్ కు రిపోర్టు చేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి వేధించడమే కాకుండా అవమానపరచడం దురుసుగా మాట్లాడటం వంటి చర్యల్ని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తీవ్రంగా పరిగణించారు. ట్రైనీ ఐపీఎస్ జగదీష్ రిపోర్ట్ పై వెంటనే స్పందించారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు దారుని అవమానపరచిన స్టేషన్ రైటర్ సుధాకర్ ను వెంటనే సస్పెండ్ చేశారు.సీఐ లక్ష్మణ్, ఎస్ ఐ సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ రాజేష్, మహిళా కానిస్టేబుల్ రమ్య కిరణ్ లకు శిక్షగా చార్జ్ మెమోలు జారీ చేశారు ఎస్పీ. పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించటమే కాక ఫ్రెండ్లీ పోలీసింగ్ కు కట్టుబడి ఉండాలని పదేపదే సూచిస్తున్నారు.ప్రజల్లో పోలీసులంటే భరోసా.. గౌరవం ఉండాలన్నారు. ఆ దిశగా ప్రతి పోలీస్ బాధ్యతాయుతంగా ఉండేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నిజమయ్యేలా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ చేపడుతున్న చర్యలకు జే జే లు కొడుతున్నారు ప్రజలు.

రాజధాని మారడం బాబుకి ఇష్టం లేదు.. ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేస్తున్న చంద్రబాబు

మూడు రాజధానుల విషయంలో టిడిపి చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు బాబు లక్ష్యంగా పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. చంద్రబాబును నమ్మలేమని.. ఆయన పైకి ఒకటి చెబుతారు తెరవెనుక మరొకటి చేస్తారంటూ వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమన్యాయం పేరుతో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన కొందరి సాయంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విశాఖ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఆధారాలు లేకుండా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని.. ఢిల్లీ స్థాయిలో టిడిపి నేతలు ఎవరితో మాట్లాడారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతలు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు బాబు ఎలాంటి కుట్రలకు తెర తీశారనే ప్రశ్నలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ వేడి కొనసాగుతుండగానే ఇదే స్థాయిలో ఆరోపణలు గుప్పించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు కూడా చెప్పాల్సిన వారికే చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో విజయసాయి , అవంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

మాజీ ఎంపీ హర్ష కుమార్ పై అక్రమ కేసు.. ఎస్సై వీడియో లీక్!!

మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యలు. పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి చెప్పిన మాటలను, వీడియోను మీడీయాకు అందజేశారు హర్ష కుమార్ కుటుంబ సభ్యులు. తన పై ఒత్తడి తెచ్చి హర్ష కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని వీడియోలో పోలీస్ ఆఫీసర్ వివరిస్తున్నట్లుగా ఉంది. వైద్యులు వద్దంటున్న హర్ష కుమార్ ను బలవంతంగా జైలుకు తరలిస్తున్నారని ఆయన కుమారులు శ్రీరాజ్ సుందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కనీసం లేవలేని స్థితిలో ఉన్న హర్ష కుమార్ ను జైలుకి ఎలా తీసుకువెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపిస్తున్నా కూడా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని అంటున్నారు. సమాజం  సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  దీని పై స్పందించిన హర్ష కుమార్ కుమారుడు.. " మా నాన్నగారి పై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన  ఎస్సై ఆయన దగ్గరకు వచ్చి..రెండు చేతులు పట్టుకుని చాలా తప్పు జరిగిపోయిందని చెప్పారన్నారు. ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి, ఒక పేద బడుగు బలహీన చిన్నస్థాయి మనుషుల గురించి పోరాడుతుంటే మీ పై కక్షసాధింపు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. మిమ్మల్ని ఇబ్బంది గురిచేయడానికి ఇలా అక్రమ కేసులు పెట్టడం తప్పని  ఎస్సై చెప్పారు" అని వెల్లడించారు.  

జగన్‌పై సుబ్రమణ్యస్వామికి అంత ప్రేమెందుకు?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్ తీరు సరిగానే ఉందన్నారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారన్న ఆరోపణలను సుబ్రమణ్యస్వామి తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు. అలాగే, టీటీడీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం చేశారని, అది కూడా తప్పేనన్నారు. తమ దృష్టికి వచ్చిన అన్ని ఆరోపణలపైనా నిజనిర్ధారణ జరిపామని, అయితే అవన్నీ అవాస్తవాలుగా తేలాయన్నారు. ఒకవేళ నిజంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట రియాక్ట్ అయ్యేది తానేనన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మతపరమైన ఆరోపణలు చేసేవారిపై కేసులు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి సుబ్రమణ్యస్వామి సూచించారు. అయితే, దేవాలయాలను వచ్చిన డబ్బును హజ్ యాత్రలకు, జెరూషలేము టూర్స్‌కి ఎలా ఇస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిని ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వందేళ్లుగా వచ్చిన కానుకలపై కాగ్‌‌తో ఆడిట్ చేయించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఆడిట్ బాధ్యతలను పూర్తిగా కాగ్ కి అప్పగించాలన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండొద్దని... స్వర్ణ దేవాలయం మాదిరిగా స్వతంత్రంగా ఉండాలన్నారు సుబ్రమణ్యస్వామి. అయితే, జగన్ పై సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. జగన్ పరిపాలనపై విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తుంటే.... సుబ్రమణ్యస్వామి మాత్రం ప్రతిపక్షాలనే తప్పుబట్టడం.... అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ పై అంత ప్రేమెందుకో అంటూ మాట్లాడుకుంటున్నారు.

 జనవరి 3న రాజధానుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసిన బిసిజి కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు మరియు ఇతర అంశాల పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, మంత్రి పేర్ని నానితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం డీజీపీ గౌతం సభ సీసీఎల్ పురపాలక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అవసరమైతే ఈ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవచ్చని సూచించారు. కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను కూడా విశ్లేషిస్తుంది. మూడు వారాల లోపు సిఫారసులతో కూడిన నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలనీ జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. దీంతో అమరావతి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అనంతరం క్యాబినెట్ సమావేశంలో అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక రావాలని.. ఆ తరువాత రెండు నివేదికలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. జనవరి 3వ తేదీన బిసిజి నివేదిక అందించనుంది. హైపవర్ కమిటీ దీనిని జీఎన్ రావు కమిటీ నివేదికను పరిశీలించి సిఫార్సు చేస్తోంది. వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి చట్టబద్ధంగా రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అన్యాయం జరిగితే కోర్టుకెళ్లొచ్చు... అమరావతి రైతులపై బొత్స ఘాటు కామెంట్స్

                    హైదరాబాద్‌ను తలదన్నే నగరాన్ని నిర్మించాలంటే... ఒక్క విశాఖలోనే సాధ్యమని మంత్రి బొత్స అన్నారు. విశాఖకు కొంచెం తోడ్పాటునిస్తే... దేశంలోనే మహానగరంగా మారుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పది నగరాల్లో వైజాగ్ ఒకటన్న బొత్స... ఏపీ రాజధానికి సరైన ప్రాంతం విశాఖ మాత్రమే అన్నారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్‌ను తలదన్నేలా మార్చుకోవచ్చన్నారు. కేవలం పదివేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.... హైదరాబాద్‌ను మించిన నగరంగా విశాఖ తయారవుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సామానంగా అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా అంటూ బొత్స ప్రశ్నించారు. రాజధానిని మారిస్తే కేంద్రం, బీజేపీ ఊరుకోదని కొందరంటున్నారని... మోడీ ఏమైనా మీ చెవిలో చెప్పారా అంటూ నిలదీశారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల మాటలు.... చంద్రబాబు మాటలూ ఒకే విధంగా ఉంటున్నాయని... మీరసలు బీజేపీ లీడర్లా లేక బాబు తొత్తులా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మారిస్తే కేంద్రానికి సమాచారమిస్తామన్న బొత్స.... నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయినా, మూడు రాజధానులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకుండానే రాద్ధాంతం చేయడం తగదన్నారు. జీఎన్‌రావు అండ్ బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ వేశామని, 21రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని అన్నారు. ఆ తర్వాత సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. అమరావతి రైతులు చంద్రబాబు మాటల్ని నమ్మి మోసపోవద్దన్న బొత్స.... ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లొచ్చన్నారు.

 మున్సిపల్ ఎన్నికల కై ఓటర్ల సర్వే మొదలు పెట్టిన కేటీఆర్.......

మున్సిపల్ ఎన్నికలు దెగ్గరలోనే ఉండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఓటర్ల జాబితా పెట్టేందుకు ప్రయత్నిస్తొంది. ఓటర్ల అంతరంగాన్ని తెలుసుకునేందుకు మూడు సర్వేలు చేయిస్తున్నారు. ఒక సర్వే కోసం పార్టీ ముఖ్య నేతలను వినియోగించగా,మరొకటి పోలీస్ నిఘా విభాగం నుంచి తెప్పిస్తోంది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా మూడో సర్వే చేయిస్తోంది. సేకరించాల్సిన సమాచారం ఒకటే అయినప్పటికీ వేర్వేరు వ్యక్తులు సంస్థల ద్వారా జరుగుతున్నాయి ఈ మూడు సర్వే లు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈ ప్రక్రియను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూడు సర్వేల నివేదికలు అందాక క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన అంచనాకు రావాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్య మంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల పై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 7న నోటిఫికేషన్ వెలువడనుంది. 22న పోలింగ్ జరగనుంది. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో టిఆర్ఎస్ అధిష్టానం ఉంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక టీఆర్ఎస్ తొలి సన్నాహక సమావేశం ఈ నెల 27న జరిగింది. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ రాష్ట్ర కమిటీకి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రాథమిక అవగాహన కల్పించారు. మూడు నాలుగు నెలల కిందట లోక్ సభ నియోజక వర్గం యూనిట్ గా మునిసిపాలిటీల్లో సర్వే నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకత్వానికే మళ్లీ అక్కడ సర్వే చేసే బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఒకరిని ఇన్ చార్జిగా నియమించి ఇద్దరు ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులకు ఆ నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్ధులు మునిసిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలన్న అంశాన్ని ఈ సర్వేను ప్రామాణికంగా నిర్దేశించినట్లు సమాచారం. మునిసిపాలిటీల వారీగా పార్టీల బలాబలాలు సులభంగా గెలిచే స్థానాలే ఏవి, కష్టపడితే గెలుపొందే స్థానాలు ఏవి, పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఏం చేయాలి. కొత్త మునిసిపాలిటీల్లో పరిస్థితేమిటి. నేతల మధ్య సమన్వయం ఎట్లా అనే విషయాలు సర్వే అంశాలుగా ఉన్నట్టు సమాచారం వీటి ఆధారంగా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను తెలుసుకోవచ్చని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. వార్డులు, డివిజన్ల వారీగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది. టీఆర్ ఎస్ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో కూడా నివేదికలో పొందుపరచాలని కోరారు. వార్డులు డివిజన్లలో జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఎవరికి వస్తుందనేది అంచనా వేసి టిక్కెట్ ఎవరికివ్వాలో సూచించాలని ఆదేశించినట్టు సమాచారం. పాత,కొత్త సమాచారాన్ని పరిశీలించి ఈ నెల ముప్పై ఒకటి లోగా నివేదిక లు అందించా లని పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది. అప్పటిలోగా పోలీస్ నిఘా విభాగం స్వతంత్ర ఏజెన్సీ సర్వే నివేదికలు అందుతాయని భావిస్తున్నారు. వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన అంచనాకు రావాలని టీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించగా, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు మునిసిపల్ ఎన్నికల పై దిశా నిర్దేశం చేయనున్నారు.టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ జడ్పీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు ఇతర సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీ జనవరి 2న ఉండవచ్చని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.మొత్తం మీద అధికారంలో ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఈ మున్సిపల్ ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టారనే భావించవచ్చు.చూడాలి మరి వారి కృషి ఏ మేర సత్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

విశాఖలో మావోయిస్టుల కదలికలు... రాజధానిగా సేఫ్ కాదంటోన్న పోలీసులు..!

అమరావతి రైతుల ఆందోళనలు... విపక్షాల విమర్శలతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినా... జగన్ ప్రభుత్వం తాను అనుకున్న గడువులోపు మొత్తం తతంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే, రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయంపై అమరావతి రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పక్కా ప్లాన్ తో తాను అనుకున్న గడువులోపు రాజధాని తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోంది. అయితే, రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ అధికారులు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉన్నాయని, భద్రత దృష్ట్యా వైజాగ్ లో రాజధాని పెట్టడం మంచిది కాదంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను మావోయిస్టులు కాల్చిచంపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే, ఇటీవల డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉందని తేలిందని, అలాంటి ప్రాంతంలో రాజధాని పెట్టడమంటే... ప్రముఖులను రిస్క్ లోకి నెట్టడమేనంటున్నారు. అయితే, రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలోకి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కూడా తీసుకోవడంపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటును కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో.... పోలీస్ బాస్ తోనే... ఎస్ అనిపించుకోవడానికే గౌతమ్ సవాంగ్ ను  హైపవర్ కమిటీలోకి తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. రాజధానిగా విశాఖ అనువైన ప్రాంతమని పోలీస్ బాస్ చెబితే ఇంకెవరికీ అభ్యంతరాలు ఉండవనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తానికి అడ్డంకులేమీ లేకుండా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు.  

మున్సిపల్ బరిలో టీడీపీ... సందడిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్...

తెలంగాణ మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని... ఖమ్మం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న టీడీపీ.... తన ఉనికిని కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. మరోవైపు, తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.... మున్సిపోల్స్‌ వ్యూహంపై టీటీడీపీ నేతలతో చర్చించారు. పోగొట్టుకున్న చోటే తిరిగి సాధించుకోవాలన్న సిద్ధాంతాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు వ్యూహరచన చేశారు. ఇప్పటికీ తెలంగాణ అంతటా టీడీపీకి క్యాడర్ ఉందని... అలాగే ప్రజల్లో తెలుగుదేశానికి ఆదరణ ఉందన్న చంద్రబాబు... నేతలు గట్టిగా కష్టపడితే మున్సిపోల్స్ లో మంచి ఫలితాలు వస్తాయంటూ దిశానిర్దేశం చేశారు. ఇకపై కచ్చితంగా వారంలో ఒకరోజు టీటీడీపీకి కేటాయిస్తానని, అందరం కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామంటూ నేతల్లో ఉత్సాహం నింపారు. అయితే, పార్టీనే నమ్ముకుని ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతోన్న పలువురు నేతలు... మున్సిపల్ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు క్యూకడుతున్నారు. దాంతో, చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సందడిగా కనిపిస్తోంది.

బీజేపీకి అగ్నిపరీక్ష... సత్తా చాటకపోతే అంతే సంగతులు...

మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించనివిధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో... టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంటూ బీజేపీ చెప్పుకున్నా... మిగతా ఏ ఎన్నికల్లోనూ ఆ స్థాయి ఫలితాలు సాధించలేకపోతోంది. ఇక, ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో అయితే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే మున్సిపోల్స్ లో బీజేపీకి మంచి ఫలితాలు సాధించి పెడతాయని భావిస్తున్నారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ పై నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నా... హిందూవర్గాల్లో చాలా సానుకూలత ఉందని, అదే తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు.  మున్సిపోల్స్ లో ఒంటరి పోరుకు దిగుతోన్న బీజేపీ... గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీలపై దృష్టిపెట్టింది. మోస్తరు ఓట్లు సాధించిన మున్సిపాలిటీల్లో నేరుగా ప్రజలను కలవాలని నిర్ణయించింది. అలాగే, మున్సిపాలిటీల వారీగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి అంతోఇంతో పట్టుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై దృష్టిపెడుతున్నారు. అలాగే, ప్రజల్లో పేరున్న చోటామోటా నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక క్లస్టర్ గా తీసుకొని నలుగురిని ఇన్ ఛార్జులుగా నియమిస్తున్నారు. మొత్తానికి మున్సిపోల్స్ ను బీజేపీ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి... 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. అయితే, ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ ఇష్యూస్.... తెలంగాణ మున్సిపోల్స్ లో బీజేపీకి బలంగా మారతాయో లేక డిపాజిట్లు దక్కకుండా చేస్తాయో చూడాలి.

ఈసారి పన్నుల మోతే... బడ్జెట్ పై కేసీఆర్ డైరెక్షన్...

2020-21 బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జనవరి తొమ్మిదిలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలకు సూచించింది. ఆర్ధిక మాంద్యం ప్రభావం కారణంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపరేషన్ చేపడుతున్నారు. ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ తో గతేడాది బడ్జెట్‌లో అంచనాలు అవసరాల కంటే 35వేల కోట్లను ప్రభుత్వం తగ్గించుకుంది. అందుకే, ఈసారి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ధికశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అయితే, ఫిబ్రవరి మూడో వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశమున్నందున... జనవరి తొమ్మిదిలోపే ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయా విభాగాలను ఆర్ధికశాఖ కోరింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత బడ్జెట్‌పై ఆర్ధికశాఖ కసరత్తు చేయనుంది. అలాగే, మున్సిపోల్స్ ముగిసిన తర్వాత బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోయారు. అయితే, ఈ ఏడాది కూడా ఆర్ధిక మాంద్యం పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. దాంతో, ఆర్ధిక లోటును పూడ్చుకునేందుకు ఈసారి పన్నుల మోత మోగే అవకాశముందంటున్నారు.   

మూడు రాజధానులు... జగన్ పాలనపై... కేటీఆర్ ఏమన్నారంటే...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ అండ్ మున్సిపల్‌ మినిస్టర్ కేటీఆర్‌....  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే కేటీఆర్‌... అప్పుడు ఫాలోవర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉంటారు. అయితే, ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో చేపట్టిన ఇంటయాక్టివ్ ప్రోగ్రామ్ ...వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. పలు సమస్యలు, అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. అయితే, ఏపీ సీఎం జగన్ ఆర్నెళ్ల పాలన, అలాగే రాజధాని వివాదంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ డిఫరెంట్ గా స్పందించారు. మూడు రాజధానుల అంశంపై స్పందించాల్సింది కేవలం ఏపీ ప్రజలు మాత్రమేనంటూ తెలివిగా సమాధానిచ్చారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆర్నెళ్ల పాలన మాత్రం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.  రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో నాయకత్వ లేమి ఉందని ఆంధ్రా నాయకులు అనేవారని, కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌నే ఏపీలో పోటీ చేయాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథాన దూసుకుపోతోందని, అందుకే టీఆర్ఎస్‌ పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు.

పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ

  అసలే దొంగబుద్ది దానికి తోడు అమోఘమైన హస్తలాఘవం ఇక ఆగుతాడా అరవై నాలుగు విద్యలలో ఒకటైన చోరకళకి ప్రాణం పోసేలా.. సక్సెస్ ఫుల్ గా వందల చోరీలు చేసి పోలీసులకు సవాలు విసిరాడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఘరానా దొంగ. అతని పేరు దర్శి. మొదట్లో సింగిల్ గానే దొంగతనాలు చేసేవాడు, ఆ తరువాత గ్యాంగ్ ను తయారు చేసుకొని గ్యాంగ్ లీడర్ అయ్యాడు.2004 నుంచి 2009 వరకు ఏకంగా 400 చేశాడు. పూణేకు చెందిన యువతిని పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరపడ్డాడు. కొట్టుకొచ్చిన సొమ్ముతో ఇల్లాలికీ ప్లాట్లు , నగలు భారీగానే కొనిచ్చేవాడు. వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు వుంటుంది. భార్యకు నగలు నట్రా కొనిపెట్టంతో సరిపెట్టుకోకుండా పిల్లల్ని ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు.జాగ్రత్తగా దోచుకోవడం దోచుకున్న సొమ్మును అంతే జాగ్రత్తగా అమ్ముకోవడం ఇంటి పట్టునే ఉంటూ ఆ డబ్బు తో ఎంజాయ్ చేయటంతో పోలీసులకు చిక్కకుండా ఇంతకాలం తప్పించుకు తిరిగాడు.ఎంత జాగ్రత్త పడినా ఎదో ఒక రోజు తప్పు చెయ్యక తప్పదు.క్రికెట్ బెట్టింగ్ లో ఏకంగా 16 లక్షలు పోగొట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేక ఈజీగా పోలీసులకు దొరికిపోయాడు.ఈ సారి కూడా సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ ను వదిలేసి పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు మునుపటి రోజులు కావు కదా బైక్ కోసం మళ్లీ వచ్చి అక్కడే కాపు కాచుకొని ఉన్న పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ సారి పోలీసులు పక్కా సాక్ష్యాలతో కేసు ఫైల్ చేశారు. జైలుకెళ్లడం తప్పదు అయితే చోర కళలో ఆరితేరి పోయాడు. దీనికి తోడు దీర్చి లైఫ్ కు అలవాటు అయిపోయాడు. పైగా జైల్లో చిప్పకూడు కూడా తినేశాడు అన్ని రకాలుగా ముదిరిపోయాడు. మరి భవిష్యత్తులో బయటకు వచ్చిన తర్వాత కష్ట పడి చేస్తాడా లేక మళ్లీ పాత రోజుల్ని రిపీట్ చేస్తాడా అనేది మాత్రం వేచి చూడాలి.  

అధికారంలో ఉన్న జాగ్రత్తగా ఉండాలంటున్న కేటీఆర్...

మున్సిపల్ ఎన్నికల షడ్యూల్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ నేతల్లో జోరు పెరిగింది. అధికారంలో ఉన్నాం కదా అని మున్సిపల్ ఎన్నికల్ని లైట్ తీసుకోవద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపోల్స్ లో క్లీన్ స్వీప్ చేసేందుకు ఇన్ చార్జిలను కూడా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా మునిసిపాలిటీల్లో వారు పర్యటించి అక్కడ తాజా పరిస్థితి పై ఈ నెలాఖరు లోపు నివేదిక రూపంలో ఇవ్వా లని టీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆదేశించారు. ప్రతివార్డుకి ముగ్గురు ఆశావహుల పేర్లు ఇవ్వా లని కెటిఆర్ సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు ఉంటే ఆయన చేర్చుకోవాలన్నారు. అనుకోకుండా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తమకేదో బలం ఉందని ఊహించుకుంటోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు నడవబోతున్నారు. మతాల్ని రెచ్చగొట్టా లని అనుకుంటున్న బీజేపీని ప్రజలు సహించబోరని కేటీఆర్ తెలియజేశారు. ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని కొత్తగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ భవన్ లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది మంత్రులు పార్టీ ప్రధాన కార్య దర్శులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టిఆర్ ఎస్ కు పట్టం కట్టారని కెటిఆర్ గుర్తు చేశారు. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు గా ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు.తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. తాము నేల విడిచి సాము చేయడం లేదన్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎజెండాగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ఆరు లక్షల మందికి కేసీఆర్ కిట్ అందించామని, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.అంతే కాక కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ముస్లిం లను మినహాయిస్తే తాము బిల్లుకు వ్యతిరేకం కాదని చెప్పారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తమ పార్టీ రాజకీయ పార్టీ కాదని ప్రజలకు మేలు చేసే పార్టీ అని తెలియజేశారు. పార్లమెంట్లో పౌరసత్వ బిల్లును తాము వ్యతిరేకించడం పై స్పష్టతనిస్తూ తాము అన్నొ బిల్లులను సమర్ధించామని తాజగా పెట్టిన ఆర్టికల్ 370 బిల్లును కూడా సమ్ర్ధించినట్లు తెలియజేశారు.తాజా బిల్లులో ముస్లింలను మినహాయించి అని రూపొందించిన బిల్లును తాము సమ్మతించమని ఆ మాటలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.ముస్లింలను కూడా ఈ బిల్లులోచేరిస్తే తాము కూడా ఈ బిల్లుకు అనుకూలంగా సభలో అనుకూలంగా ఓట్లు వేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

మూడు రాజధానులపై ఒక్క అడుగు వెనక్కేసిన జగన్..!

  అమరావతిలో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కేసింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మూడు రాజధానులపై అధికారిక ప్రకటన ఉందంటూ ప్రచారం జరిగినా... రాజధాని రైతుల ఆందోళనలతో కొంచెం వెనక్కి తగ్గారు. ఇప్పటికిప్పుడు అధికారికంగా ప్రకటిస్తే అమరావతి గ్రామాల్లో పరిస్థితి చేయి దాటుతుందన్న సమాచారంతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే, అమరావతి రైతులు, ప్రజల ఆందోళనలను చల్లార్చడానికే హైపవర్ కమిటీ అంటూ వ్యూహం మార్చారనే మాట వినిపిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించినా.... ఇంకా బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ అందాల్సి ఉందంటూ ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతేకాదు, ఈ రెండు నివేదికపై మరింత విస్తృత అధ్యయనం కోసం హైపవర్ కమిటీని అపాయింట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే, మూడు రాజధానులపై అధికారిక ప్రకటన ఆలస్యమైనట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చాకే... రెండు రిపోర్టులపైనా హైపవర్ కమిటీ విస్తృత అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, జనవరిలోనే బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుంది. జీఎన్ రావు కమిటీ ఇవ్వకముందే, అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి బయటపెట్టడం.... ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ మాటలనే దాదాపు యథాతథంగా జీఎన్ రావు కమిటీ నివేదికగా ఇవ్వడంతో విమర్శలు చెలరేగాయి. జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని... అందుకే జీఎన్ రావు కమిటీతో తాము అనుకున్నది చెప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే చెడ్డ పేరు రాకూడదనే... మరింత విస్తృత అధ్యయనం కోసం సీఎం జగన్ హైపవర్ కమిటీని అపాయింట్ చేశారని అంటున్నారు.

ఆర్ఎస్ఎస్, ఎంఐఎంకు అనుమతి... కాంగ్రెస్ కు మాత్రం నిరాకరణ...

  పౌర బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ తలపెట్టిన ర్యాలీపై రగడ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా టీకాంగ్రెస్ తలపెట్టిన తిరంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన ప్రభుత్వం.... తమ శాంతియుత ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... ర్యాలీ నిర్వహించి తీరుతామని తెగేసి చెబుతున్నారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ర్యాలీపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్... ఇలా ఇటీవల మోడీ సర్కారు తెరపైకి తెచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో అయితే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. అలాగే భారీ బహిరంగ సభను సైతం ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఆందోళనలతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ కూడా వచ్చింది. దాంతో, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే, తెలంగాణలో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు టీకాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. సేవ్ డెమోక్రసీ-సేవ్ కానిస్టిట్యూషన్ పేరిట శాంతియుత ర్యాలీకి అనుమతి కోరినా డీజీపీ అండ్ హైదరాబాద్ సీపీ పర్మిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు.... తమ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారని ఫైరవుతున్నారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై టీకాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసును ... కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ గా మార్చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతిచ్చిన పోలీసులు... శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే తమకెందుకు పర్మిషన్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది లేని చోట సభ నిర్వహించుకుంటామన్నా వినిపించుకోవడం లేదని మండిపడుతున్నారు. అయితే, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ నిర్వహించి తీరుతామంటోన్న కాంగ్రెస్ నేతలు.... పెద్దఎత్తున హైదరాబాద్ తరలిరావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి, కాంగ్రెస్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీస్తుందో... లేక ప్రశాంతంగా సాగుతుందో చూడాలి.  

జగన్-బాబు ఇన్ సైడర్ ఫైట్... చివరికి గెలిచేదెవరు?

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... సీబీఐ విచారణ దిశగా అడుగులేస్తోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందు జరిగిన భూ కొనుగోళ్లపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వడంతో సీబీఐ విచారణ కోరాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి కొద్దిరోజులు ముందు 4వేలకు పైగా ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతి ప్రకటనకు ముందే తెలుగుదేశం లీడర్లు, బినామీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని తేల్చారు. ఎవరెవరు ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారో ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలనే నివేదికలో పొందుపర్చింది. అయితే, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మండిపడ్డ టీడీపీ.... దమ్ముంటే నిరూపించాలని వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరింది. చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు పదేపదే సీబీఐ విచారణ కోరడం, ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించాలని సవాలు విసురుతుండటంతో ఇక వెనక్కి తగ్గకూడదని జగన్ సర్కారు భావిస్తోంది. అయితే, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ పలువురి టీడీపీ నేతల పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికలో చేర్చింది. ముఖ్యంగా బాబు అండ్ లోకేష్ కి అత్యంత సన్నిహితుడైన వేమూరు రవికుమార్... పరిటాల సునీత... జీవీఎస్ ఆంజనేయులు... లింగమనేని రమేష్.... పయ్యావుల కేశవ్ పేర్లను ప్రస్తావించింది. అలాగే, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్, మాజీ మంత్రి నారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను చేర్చింది. సీఆర్డీఏ సరిహద్దులను మార్చడం ద్వారా టీడీపీ నేతలకు, కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటూ మరో లిస్టును రూపొందించారు. అలాగే, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంస్థలకు కేటాయించిన 850 ఎకరాల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది.

Right people for wrong reasons

Guntur has Tobacco board’s National Headquarters Data scientist Sekhar Dama suggests to Capital region farmers, to fight for exclusive Agri Products based SEZ, instead of voicing their protest against shifting the Capital from Velagapudi to Visakhapatnam As per the statistics of Ministry of Commerce and Industry, the 238  SEZs across the country have registered Rs.5,23,637 Crore value of exports, for the year 2016-17, Sekhar Dama said and added that even if the Velagapudi is transformed as a SEZ, it also will value addition to the States and Country’s economy Two million plus job are being generated by SEZs across the Country Farmers from Guntur, the present Capital region area, known for their industrious and intellectual farming skills are now fighting for the wrong reasons. Having high standards of entrepreneurship in agriculture sector, they have conveniently forgotten to demand rightful share, from the Chandrababu Naidu led TDP Government. In fact, the Amaravati Capital region farmers have given away 33,000 acres of land, for the purpose of constructing a world class Capital, and, however, have conveniently forgotten to seek a SEZ, related to agri products processing, or an Information Technology SEZ, within the Core Capital region, i.e. in and around Velagapudi Secretariat. Analyzing the same, senior data scientist Sekhar Dama, has suggested to look at the Madhya Pradesh and Kerala examples. “Madhya Pradesh has five operational SEZs, where in four SEZs are located in Indore. Though Bhopal is Capital, the State Government, in anticipation of decentralized development, opted Indore, and accordingly four SEZs are operational there now,” he elaborated and added that same kind of decentralization can be seen in Kerala. “Out of the 19 SEZs in operation in Kerala, 9 SEZs are located in Ernakulam district, which are away from the State Capital Thiruvanathapuram,” Sekhar Dama said and added that the same way Andhra Pradesh has total 27 notified SEZs, out of which 20 are operational SEZs, as per the information updated on 14th November, this year, according to sezindia.nic.in. Elaborating the same, Sekhar Dama said that Visakhapatnam has 7 operationalized SEZs, out of the 9 notified, similarly, East Godavari has three, Krishna, Prakasham and Srikakulam districts have one SEZ each, Nellore has 5, and Chittoor has 2 operationalized SEZs. “Kurnool and Guntur districts, have so far no single SEZ,” Sekhar Dama said and has suggested to the farming community to exert pressure over the Government, to allot a SEZ in Guntur district, that too, in the Core Capital region of Amaravati. Guntur district, the present Capital region of Andhra Pradesh, has 404 cold storages, and it may be noted that the 14 States, and 8 Union territories even didn’t cross this Guntur distrit’s figure in cold storages, Sekhar Dama said and urged the farmers of the Guntur district, to look at the strength of the district. “Why can’t you fight for a right cause like demanding for a food processing SEZ or an Information Technology SEZ,” he asked and advised them to showcase their strength in a right way. “ I urge the farmers of 29 villages to exert pressure over the State Government, to transform the lands given away to the Government, for Capital, into an unique SEZ meant for agri products processing, which in turn yield monetary benefits to the region, in both ways,” data scientist Sekhar Dama explained. “Leave the Capital demand for Amaravati. Instead, you can develop real estate as well claim employment opportunities in this region, even though Capital is shifted to Visakhapatnam,” Sekhar Dama suggested. “Give up blaming Naidu or Jagan. Stand up and fight for the right cause,” he has suggested to them and also urged the Government to consider his views in addressing the issue in an amicable way.

మునిసిపల్ ఎన్నికలకు సై అంటున్న యువత!!

సంగారెడ్డి జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నేతలు గెలుపుపై ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో యువత పోటీకి ఎక్కువగా ఉత్సాహం చూపుతోంది. అన్ని పార్టీల నేతలు కొత్త ముఖాలను బరిలోకి దించాలని యోచిస్తున్నాయి.  జిల్లాలో గతంలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట పురపాలక సంఘాలతో పాటు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పరిధిల విలీనం వార్డుల విభజన వంటి సమస్యలూ కోర్టు పరిధిలో ఉన్నందున జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. మిగిలిన ఏడు పురపాలకల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. కానీ అందరి దృష్టీ పటాన్ చెరువు నియోజక వర్గం పైనే పడింది ఇక్కడ మేజర్ పంచాయతీలు ఈసారి మునిసిపాలిటీలుగా మారాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు చాలా మంది ఔత్సాహికులు సయ్యంటూ సవాలు విసురుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు నియోజక వర్గం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వుంటుంది. ఈ ప్రాంతమంతా దాదాపుగా హైదరాబాద్ లో కలిసినట్టే ఉంటుంది. చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పటాన్ చెరువు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. భూములు కూడా కోట్లలో ధర పలుకుతాయి. ఈ ప్రాంతమంతా హైదరాబాద్ వాతావరణమే కనిపిస్తుంది. ఇక గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలగా మారి హోదా పెరిగింది. దీంతో అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. అదే సమయంలో గ్రామ స్థాయి నేతలంతా పట్టణ స్థాయి నేతలుగా ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు.  ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కనిపిస్తుంది. బిజెపి కూడా అన్ని చోట్లా పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీలను ఢీకొని క్యాడర్ మాత్రం కమలనాథులకు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన మహిపాల్, మూడు మునిసిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ కావడం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ లు పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికీ మునిసిపల్ ఎన్నికలు చలికాలంలో వేడి పుట్టిస్తున్నాయి.