ఏపీ రెడ్ జోన్లను కేంద్రం నమ్మలేదా? హాట్ స్పాట్ల ప్రకటన వెనుక కథేంటి?

ఏపీలో కరోనా వైరస్ ప్రభావాన్నితక్కువ చేసి చూపేందుకు ముందునుంచీ ప్రయత్నిస్తున్న సీఎం జగన్.. రెడ్ జోన్ల ఎంపిక కూడా అదే తరహాలో చేశారనే వాదనలు ఉన్నాయి. ఇందుకు తగినట్లుగానే రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలన్న ఆలోచన కూడా జరిగిందనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్యనే తక్కువ చేసి చూపుతున్నారని విపక్ష టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రెడ్ జోన్ల ఎంపిక ద్వారా లాక్ డౌన్ ప్రభావాన్ని తగ్గించాలని జగన్ సర్కార్ భావించింది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు తాజాగా కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటనతో అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా హాట్ స్పాట్ లను ప్రకటించిన కేంద్రం.. ఈ నెల 20 తర్వాత వాటిలో మినహా మిగిలిన చోట్ల సడలింపులు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఇందులో భాగంగా ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉంటే ఏకంగా 11 జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఏపీలో అంతకుముందే కరోనా వైరస్ పాటిజివ్ కేసులు నమోదైన 133 ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించి చేతులు దులుపుకుందామని భావించిన జగన్ సర్కారుకు కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటన మింగుడు పడటం లేదనే చెప్పవచ్చు. రెడ్ జోన్లలో లాక్ డౌన్ ఉంచి మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ 14 తర్వాత సడలించాలని భావించిన జగన్ సర్కారు.. ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతోందని అర్ధమవుతోంది. అలాగని కేంద్రంతో ఘర్షణకు దిగే పరిస్ధితి లేదు. కాబట్టి ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్లుగా గుర్తించిన 11 జిల్లాలు మినహాయించి కేవలం శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాల్లోనే లాక్ డౌన్ ను సడలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అలాగని అక్కడా పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ సడలించే పరిస్ధితి లేదు. కేవలం పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు, మైనింగ్ వంటి వాటికే అనుమతులు ఇవ్వడం ద్వారా తనకు అనుకూలమైన పరిస్ధితిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

700కు పెరిగిన పాజిటివ్ కేసులు! ఈనెల 20న గచ్చిబౌలి కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం!

తెలంగాణలో ఈరోజు కొత్త‌గా మ‌రో 50 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి చేరిందని వైద్య, ఆరోగ్యం శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 68 మందిని ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్ల మంత్రి తెలిపారు. ఈనెల 20న గచ్చిబౌలిలో కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభిస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.  ఢిల్లీ మర్కజ్ ప్ర‌కంప‌న‌లు తెలంగాణాలో క‌ల‌క‌లం రేపుతూనే వున్నాయి. ఇప్ప‌ట్టి వ‌ర‌కు తెలంగాణాలో వ‌చ్చిన 700 పాజిటివ్ కేసుల్లో 500కు పైగా మ‌ర్క‌జ్ మూలాల‌కు సంబంధించిన‌వేన‌ని మంత్రి ఈట‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతూనే వున్నాయి. అయితే వీటిలో 90 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదౌతున్నాయి. క‌రోనా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తుండగా.. ఒక్క రోజే ఇన్ని కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే గురువారం ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణాలో 496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులపై కేబినెట్‌ భేటీ తర్వాతే స్పష్టత వస్తుంద‌ని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో మరో రెండు ల్యాబ్‌లకు అనుమతి వచ్చిందని, దీంతో రోజుకు 5వేల టెస్ట్‌లు చేసే సామర్ధ్యం వస్తుంద‌ని మంత్రి ఈటెల తెలిపారు. వైద్య సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందికీ రక్షణ పరికరాలు ఇస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.

పేదల కష్టాలు తీర్చండి! టిడిపి నేత కోటంరెడ్డి!

ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయ‌లు, మూడు నెలలు ఉచితంగా కరెంట్ సరఫరా, అలాగే 3 నెలల పాటు ఉచితం గా వంట గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి నేత కోటంరెడ్డి డిమాండ్ చేశారు. మీరేమో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, పేదోళ్లకు మాత్రం రూ.5 వేలు ఇవ్వలేరా అంటూ ముఖ్య‌మంత్రి జగన్ ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఒక‌ రోజు దీక్షను చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తరుణంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.  లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఐదు వేల రూపాయలు అందివ్వాలని , రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణీ చేయాలని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే బిల్లులను రద్దు చేయాలని, ఉచితంగా గ్యాస్ అందించాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి డిమాండ్ చేశారు.  ఒక్క రోజు దీక్ష చేపట్టిన కోటంరెడ్డికి సంఘీభావంగా పలువురు టిడిపి నేతలు వారి నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. భౌతిక దూరం పాటించి దీక్షలో పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై పరోక్ష సేవలకు శ్రీకారం చుట్టిన కనకదుర్గమ్మ దేవస్థానం

భక్తుల సౌకర్యార్ధం, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో జరిగే రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలను పరోక్షముగా భక్తుల గోత్ర నామాలతో జరిపించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దేవ స్థానంలో అమ్మవారికి, స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నీ కూడా ఏకాంత సేవలుగా యధాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తారని ఆలయ  కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానం లో జరిగే,  నిత్య ఆర్జిత సేవలలో, భక్తులు ప్రత్యక్షం గా  పాల్గొనే  అవకాశము లేనందువల్ల,  అన్ని సేవలు ఆలయ అర్చకులుచే  ఏకాంత  సేవలుగా  నిర్వహిస్తున్నట్టు అయన చెప్పారు.  ఈ పరోక్ష  చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలను పరోక్షంగా   జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు  www.kanakadurgamma.org– website ద్వారా పొందవచ్చునని  ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో విజయవాడ నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న రోడ్లపై నివసిస్తున్న యాచకులు, పేద వారు, ఇతరులకు ఆహారం అందించాలన్నఉద్దేశ్యంతో, దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగం ద్వారా ప్రతి రోజు కదంబం, దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లను వీ ఎం సి సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు.   దేవస్థానం జరిపే అన్నదాన కార్యక్రమమునకు విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org  ద్వారా ,  లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి పేర్కొన్నారు.

కడప జిల్లాలో ఆ 30 మంది మాటేమిటి?

కడప జిల్లా వ్యాప్తంగా 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో కరోనా వైరస్ నుండి పూర్తిగా 13 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. కానీ, ఒక కల్యాణ మండపం లో దాచిపెట్టిన ఆ 30 మంది గురించి మాత్రం వారు  నోరు మెదపటం లేదు.  గత 17 రోజులుగా కోవిద్ హాస్పిటల్ లో చికిత్స పొందిన 13 మంది కి వైద్యులు పలు మార్లు పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ రావడంతో కోవిద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాఋ. డిశ్చార్ అయిన13 మందికి  డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పౌష్టిక ఆహార సామగ్రిని పంపిణీ చేశారు. 13 మందికి నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. దీంతో36 నుండి 23 కు  పాజిటివ్ కేసులు తగ్గినట్టయింది.

లాక్‌డౌన్‌ శాశ్వత పరిష్కారం కాదు! రాహుల్ ఆవేదన

ప్రస్తుతం దేశంలో  చాలా తక్కువ మందికి మాత్ర‌మే పరీక్షలు చేస్తున్నారు. దీని సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాలి. కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు. కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచ‌డ‌మే మనముందున్న ఏకైక‌ మార్గం. ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి.. ఒకటి హాట్‌స్పాట్‌, మరొకటి నాన్‌ హాట్‌స్పాట్‌ జోన్. ఆ తర్వాత ఆయా జోనుల్లో పలు చర్యలు తీసుకోవాలి" అని రాహోల్ గాంధీ సూచించారు. లాక్‌డౌన్ తో దినసరి కూలీలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రణాళికలు రచించాలి. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యేలా చేయకూడదు" అని రాహుల్ అన్నారు. లాక్‌డౌన్ తో వైరస్ ను తాత్కాలికంగా వ్యాప్తి చెందకుండా క‌ట్ట‌డి చేయ‌డానికి ఉప‌యోగించే తాత్కాలిక పద్ధతి. ఇప్ప‌ట్టికైనా ప్ర‌భుత్వం విస్తృత‌స్థాయిలో టెస్ట్‌ల‌ను నిర్వ‌హించాల‌ని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.

తిరుమల వీధుల్లో ఎలుగుబంట్లు

తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాన రోడ్లకు అడ్డంగా ఎలుగు బంట్ల సంచరిస్తుండడం గమనించిన కొందరు ఈ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తిరుమలలో గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో భక్తుల దర్శనాలు నిరవధికంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. తొలుత వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేసి, ఓన్లీ స్వామి వారి కైంకర్యాలను మాత్రమే నిర్వహించిన టీటీడీ ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ పొడిగించినప్పుడల్లా భక్తుల దర్శనాల రద్దును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా ఈ దర్శనాల రద్దు మే 3వ తేదీ వరకు కొనసాగుతుందని టీటీడీ ప్రకటించింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల రోడ్లన్నీ ఇపుడు నిర్మానుష్యంగా మారాయి. కొండమీద నివాసముండే వారికి సైతం లాక్ డౌన్ ఆంక్షలు వుండడంతో రోడ్లమీద జన సంచారం లేకుండా పోయింది. ఈక్రమంలో సమీపంలోని చిట్టడవుల నుంచి కొన్ని జంతువులు తిరుమల వీథులకు యధేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆనందనిలయం ముందుకు పందులు రాగా.. తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు సంచారం చేశాయి.

స్వరూపానంద చొరవ.. వారణాసి నుంచి స్వస్ధలాలకు 44 మంది తెలుగు వారు..

తెలుగు రాష్ట్రాల నుంచి తీర్ధ యాత్రల కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ వెళ్లిన 44 మంది తెలుగు యాత్రికులు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వీరి పరిస్ధితిని గమనించిన వారణాసిలోని శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం నిర్వాహకులు వీరీకి ఆశ్రయం కల్పించారు. అంతటితో ఆగకుండా వీరిని స్వస్ధలాలకు పంపేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర లతో మాట్లాడిన ఆశ్రమ నిర్వాహకులు సుందరశాస్త్రి.. వారి సాయం కోరారు. అసలే లాక్ డౌన్, వలస కూలీలను సైతం అనుమతించలేని పరిస్ధితి. అయినా వెనక్కి తగ్గలేదు.  వారణాసిలోని ఆంధ్ర ఆశ్రమంతో పాటు శారదాపీఠం వారణాసి శాఖ సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మూడు వారాల ఇబ్బందుల తర్వాత వారిని స్వస్ధలాలకు పంపేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే దారి పొడవునా ఇబ్బందులు, ఆహారం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆశ్రయ నిర్వాహకులే వీరికి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను తయారు చేసి యాత్రికులకు అందించారు. యూపీ ప్రభుత్వం తరఫున పోలీసులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. దీంతో వీరు అక్కడి నుంచి స్వస్ధలాలకు బయలుదేరారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను స్వస్ధలాలకు చేర్చేందుకు శారదాపీఠాధిపతులు చూపిన చొరవపై ఇప్పుడు ప్రసంశల జల్లు కురుస్తోంది.

ట్రంప్ టీమ్‌లో తెలుగోళ్లు! కరోనాపై పోరుకు యాక్ష‌న్‌ప్లాన్‌!

కరోనా దెబ్బ‌తో అతలాకుతలమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. 200 మందికి పైగా అగ్రశ్రేణి లీడర్లు, 12 మందికి పైగా ఇతర నిపుణులతో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరంతా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై సూచ‌న‌ల‌ను అందించనున్నారు.  వీరిలో భారత సంతతికి చెందిన ఐటి, కార్పొరేట్ దిగ్గజాలు చోటు ద‌క్కింది. ఈ టీంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను ట్రంప్ ఎంపిక చేశారు. ఈ నిపుణులు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారని ట్రంప్ ప్రకటించారు. సుందర్ పిచాయ్, నాదెళ్లతో పాటు ఐబిఎం సిఇఒ అరవింద్ కృష్ణ, మైక్రాన్ సిఇఒ సంజయ్ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్నసమస్యలపై పరిష్కారాపై పనిచేస్తారు.  ఉత్పత్తి రంగం పునరుత్తేజ సూచనలిచ్చే బృందానికి పెర్నాడ్ రికార్డ్ బివరేజ్ కంపెనీ సిఇఒ ఆన్ ముఖర్జీని ఎంపిక చేశారు. మాస్టర్ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు.  వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్, టెలికమ్యూనికేషన్, రవాణా, క్రీడలు ఇలా వివిధ టీంలను ట్రంప్ ఏర్పాటు చేశారు. సంబంధిత రంగాలకు సంబంధించి ఈ బృందం సలహాలను అందివ్వనుంది. ఆపిల్ సిఇఒ టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ , టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్ మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కు చెందిన బిల్ ఫోర్డ్, జనరల్ మేరీ బార్రా లాంటి దిగ్గజాలు కూడా ట్రంప్ సలహా బృందం లో ఉన్నారు.  ఆరోగ్యం, సంపద సృష్టి తో పాటు అమెరికన్ ఆర్థిక వ్యవస్థను  పునరుద్ధరించ‌డానికి ఈ నిపుణుల బృందం త‌మ సూచ‌న‌ల‌తో కూడిన నివేదిక ఇస్తుంద‌ని వైట్ హౌస్ తెలిపింది.

మోదీజీ ఇప్పటికైనా ప్రజారోగ్య వ్యవస్థను ప‌ట్టించుకోండి!

కోవిడ్‌-19 నివారణ, చికిత్సలకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏమిటి? లాకౌడౌన్‌ కొనసాగింపు మినహా కేంద్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయటానికి అమలు చేస్తున్న నిర్దిష్ట వ్యూహం, చర్యలు ఏమీ లేవు! కరోనాపై సాగే పోరాటం కేవలం ప్రజలే బాధ్యతతో చేయాల్సిన పోరాటంగా పరిమితం చేయాలన్నది ప్రధానమంత్రి వ్యూహంగా కనిపిస్తోంది. కేవలం లాక్‌డౌన్‌ ద్వారా మాత్రమే భారతదేశంలో కరోనా నియంత్రణ సాధించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది. లాక్‌డౌన్‌ తాత్కాలిక వ్యూహంగా మాత్రమే ఉండాలని, ప్రధాన నియంత్రణ వ్యూహాలుగా ట్రెసింగ్‌, టెస్టింగ్‌ అండ్‌ ట్రీట్మెంట్‌ అంటే గుర్తించటం, రోగ నిర్ధారణ పరీక్షలు చేయటం, నిర్ధారణ అయిన వారిని క్వారంటాయిన్‌లో ఉంచి చికిత్స అందించడం ద్వారా మాత్రమే కోవిడ్‌-19ను పూర్తి స్థాయిలో అదుపు చేయగలుగుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. దీనిగురించి ఎక్క‌డా ప‌ట్టించుకున్న ద‌ఖ‌లాలు లేవు.  ప‌దే ప‌దే ప్ర‌ధాని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రజలదే అంటూ నొక్కివక్కాణించారు తప్ప ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి కరోనాను కట్టడి చేయటానికి అనుసరించబోతున్న వ్యూహం, దాని అమలుకు కావలసిన విధానాలు, నిధులు గురించిన ప్రస్తావన ప్రధానమంత్రి ఎక్క‌డా చేయలేదు. 200 లాబోరేటరీలు కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగంలో చెప్పారు. అయితే ఇందులో ప్రయివేటు లాబోరేటరీలు ఎన్ని, వాటిలో పరీక్షలకు అయ్యే ఫీజు పరిస్థితి ఏమిటన్న విషయంపై వివరణ ఇవ్వ‌లేదు. ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు చేయాలని సూచించిన సుప్రీంకోర్టు మ‌ళ్లీ మనసు మార్చుకొని పేదలకు మాత్రమే అందించాలని ప్రయివేట్‌ లేబరేటరీలు తాము నిర్ధారించుకున్న ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. వాస్త‌వానికి భారతదేశంలో మొదటి కోవిడ్‌-19 కేసు జనవరి 30న నమోదైంది. 13 మంది కోవిడ్‌-19 రోగ గ్రస్తులైన ఇటలీ పర్యాటకులు రాజస్థాన్‌లో పర్యటించారు. వారితో పాటు ప్రయాణం చేసిన డ్రైవర్‌కు కూడా కోవిడ్‌-19 సోకినట్టు నిర్ధారణ అయిందని ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మార్చి 4న పార్లమెంట్‌లో చెప్పారు.  అప్పటి నుంచి కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతలు చెక్‌ చేసారే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణాల మేరకు పరీక్షలు చేయ‌లేదు. ప్రపంచ స్థాయిలో కమ్ముకొస్తున్న కరోనా ముప్పు నియంత్రణ బాధ్యత కూడా ప్రజలదే అని మోదీ ప్ర‌భుత్వం బుకాయిస్తోంది.  కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వివిధ సుంకాలపై వసూలు చేసిన సెస్‌ రెండున్నర లక్షల కోట్లు ఖర్చు కాకుండా మిగిలి ఉంది.  మరో 20లక్షల కోట్లు ఈ ఆరున్నరేండ్లలో పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులున్నాయి.  కాంగ్రెస్‌ హయాంలో జరిగిన 2జీ స్పెక్త్రం కుంభకోణాన్ని సరి చేయటం ద్వారా కేంద్రానికి రెండు లక్షల కోట్లు ఆదా చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు తనఖా పెట్టి గత ఒక్క ఏడాదిలోనే 35వేల కోట్లు నిధులు సమకూర్చుకుంది కేంద్రం.  అదనంగా ఆర్‌బీఐ బాండ్లు విదేశీ మార్కెట్‌లో జారీచేసి రెండు లక్షల కోట్లు సమీకరించేందుకు పథకం సిద్ధమైంది.   ఇన్ని నిధులున్నా క‌రోనా ర‌కాసి నుండి 130కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిధులు ఎందుకు సిద్ధం చేయలేక పోతోంది మోదీ ప్ర‌భుత్వం.

కువైట్ ప్ర‌క‌టించిన క్షమాబిక్షను ఉప‌యోగించుకోండి! భార‌త రాయ‌బార‌కార్యాల‌య ప్ర‌క‌ట‌న‌

గ‌ల్ఫ్ దేశాల్లో అక్క‌డి నిబంధ‌న‌లను ఉల్లంఘించి అక్ర‌మంగా నివాస‌ముంటున్న వారికి ఆమ్మెస్టీ (క్ష‌మాభిక్ష‌) వ‌రం లాంటిదే. ఎందుకంటే అక్క‌డి రూల్స్ క‌ఠినంగా వుంటాయి. వివిధ కార‌ణాల వ‌ల్ల భార‌తీయులు అక్ర‌మంగా వుండాల్సిన దుస్థితి వుంటుంది. దొరికితే జైలు ఖాయం. అయితే ఆ జైల్లో ఎప్ప‌ట్టి వ‌ర‌కు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి. అక్ర‌మంగా వుంటున్న వారి వ‌ద్ద క‌నీసం డాక్యుమెంట్లు కూడా వుండ‌వు. పాస్‌పోర్ట్ కూడా య‌జ‌మాని, లేదా ఏజెంట్ తీసుకుని వుంటాడు. అలాంటి వారికి ఈ క్ష‌మాభిక్ష తో స్వ‌దేశానికి వెళ్ళ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది. అందుకే కువైట్‌లో వున్న భార‌త రాయ‌బార కార్యాల‌యం ఆమ్మెస్టీని ఉప‌యోగించుకోమ‌ని అక్క‌డ వున్న అక్ర‌మ వ‌ల‌స‌దారుల్ని విజ్ఞ‌ప్తి చేసింది. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ను ఉపయోగించుకోవలసింది గా భారత రాయ బార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16 వ తేది(గురువారం) నుండి 20 వ తేది(సోమవారం) వరకు ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు ఫర్వానియ గవర్నరేట్ లోని ముత్తన్న ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 122 లో మగ వారు నమోదు చేసుకోవాలి. మహిళలు ఫర్వానియ గవర్నరేట్ లోని ఫర్వానియ ప్రైమారి స్కూల్ ఫర్ గర్ల్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 76 లో నమోదు చేసుకోవాలి. అలాగే జేలీబ్ అల్ షువైక్ లో నయీం బిన్ మసౌద్ స్కూల్ బాయ్స్ బ్లాక్ 4 స్ట్రీట్ 250 లో మగ వారికి, రుఫిడా అల్-అస్లమియా ప్రైమరీ స్కూల్ బ్లాక్ 4 స్ట్రీట్ 200 లో మహిళలకు కేటాయించారు. ట్రావెల్ పత్రాలు అంటే పాస్ పోర్ట్ ఉన్నవారందరూ కుడా పైన పేర్కొన్న సెంటర్లకు వెళ్ళాలి. వీరందరూ వారికి సంభందించిన లగేజ్ మొత్తం సర్దుకొని వెంట తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వారి నమోదు పక్రియ కాగానే వారిని షెల్తర్లకు తరలిస్తారు. అక్కడ నుండి నేరు గా వారిని భారత దేశానికి తరలిస్తారు. ఎప్పుడు వారి ప్రయాణం ఉంటుందో ఇరు దేశాల ద్వైపాక్షిక సంభందాల మిధ ఆధార పడి ఉంటుంది.

ఆర్జిత సేవల టికెట్లకు డబ్బు వాపసు: టీటీడీ

మార్చి 13 నుండి మే 31వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బు రీఫండ్‌ చేయాలనీ తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు నిర్ణయించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం  కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో మే 3వ తేదీ వ‌ర‌కు భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా, ఆల‌యంలో అన్నిర‌కాల ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు ఆర్జిత సేవ‌లను గానీ, ద‌ర్శ‌న టికెట్ల‌ను గానీ బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను  helpdesk@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. ఐటి విభాగం ఆధ్వ‌ర్యంలో ఈ వివ‌రాల కచ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు.

క్వారెంటైన్‌కు తరలించ‌డానికి అడ్డుకుంటున్న ఎంఐఎం!

ఎంఐఎం నేత‌ల ఓవర్ యాక్షన్ పోలీసుల‌కు త‌ల‌నొప్పిగా మారుతోంది. కరోనా అనుమానితులను క్వారెంటైన్‌కు తరలిస్తున్న పోలీసులను ఎంఐఎం పార్టీకి చెందిన మునిసిపల్ డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారు. పైగా పోలీసులతో వాదులాటకు దిగ‌డంతో ఏమీ చేయలేక పోలీసులు వెళ్ళిపోయారు. తెలంగాణాలో రెడ్ జోన్లు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు అవగాహన లేని రాజకీయ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నగరంలోని ఆటోనగర్‌లో కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్నాడు డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్. వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన ఎం.ఐ.ఎం. నేత, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్‌తో పాటు ఓ కార్పొరేటర్ భర్త సహా 10 మందిపై ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పరిస్థితిని, తమకున్న ప్రభుత్వ ఆదేశాలను వివరిస్తున్నా కూడా డిప్యూటీ మేయర్ పరుష పదజాలంతో పోలీసులను దుర్భాషలాడాడు రోడ్డుపై హంగామా సృష్టించిన ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ రోజు భారతీయ రైల్వే 165 వ పుట్టిన రోజు

1853 ఏప్రిల్ 16, సమయం: మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలు. బాంబే (ప్రస్తుతం ముంబై) లోని బోరి బందర్ నుంచి మొట్టమొదటి రైలు 34 కిలోమీటర్ల దూరం లోని థానే కు బయల్దేరింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించటానికి వందలమంది జనం, బోరి బందర్ రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద వందల మంది జనం గుమికూడారు. ఇది నేటికి 165 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ప్రజా వేడుక. భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి.1947(స్వతంత్రం వచ్చే) నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది. రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది.  భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు. 1. ఉత్తర రైల్వే------- ఢిల్లీ 2. ఈశాన్య రైల్వే------ గోరఖ్‌పూర్ 3. ఈశాన్య సరిహద్దు రైల్వే-----గౌహతి 4. తూర్పు రైల్వే----- కోల్కతా 5.ఆగ్నేయ రైల్వే ------ కోల్కతా 6. దక్షిణ మధ్య రైల్వే ------- సికింద్రాబాదు 7. దక్షిణ రైల్వే------- చెన్నై 8 . మధ్య రైల్వే-------- ముంబై 9. పశ్చిమ రైల్వే ----- ముంబై ముంబై సెంట్రల్ 10. నైఋతి రైల్వే------ హుబ్లీ 11. వాయువ్య రైల్వే--------- జైపూరు 12. పశ్చిమ మధ్య రైల్వే------- జబల్ పూర్ 13. ఉత్తర మధ్య రైల్వే------- అలహాబాదు 14. ఆగ్నేయ మధ్య రైల్వే ------- బిలాస్‌పూర్ 15. తూర్పు తీర రైల్వే------ భువనేశ్వర్ 16. తూర్పు మధ్య రైల్వే----- హాజీపూర్ 17. కలకత్తా మెట్రో రైల్వే ------- కలకత్తా

గుంటూరు వెళ్ళి క‌రోనా అంటించుకున్నాడు!

తక్షణమే అవసరంలేని శస్త్ర చికిత్స కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడి పిల్లోడు. ఇంట్లోని పెద్ద వాళ్ళు క‌నీసం స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా ఉచితంగా గుంటూరులో చెవి ఆప‌రేష‌న్లు చేస్తున్నార‌ని తెలిసి చికిత్స చేయించ‌డానికి తీసుకువెళ్ళి ఆప‌రేష‌న్ చేయించారు. ఆ త‌రువాత ఇంటికి వెళ్ళారు. అయితే ద‌గ్గు, జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఈ పిల్లోడిని ప‌రీక్షిస్తే పాజిటివ్ తేలింది. ఉచిత చికిత్స స‌రే మ‌రి క‌రోనా అంటిందిగా! తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్టు ఆర్డీవో నరేందర్, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న గుంటూరు నుంచి బాలుడు వచ్చాడన్న స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. చిన్నారికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో స్పష్టమైంది.   బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతడి కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలుడు, అతడి కుటుంబాన్ని ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.  వైద్యాధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చైనాకు రష్యా రిటర్న్ గిఫ్ట్!

* ఇతర దేశాలకు అంటించిన వైరస్, తిరిగి పుట్టింటికి చేరిన వైనం  * అంటించిన వారి వివరాలు వెల్లడిస్తే, నగదు బహుమతి ఇస్తామంటూ ఆశ చూపిన చైనా  *మహా భారతం అరణ్యపర్వం లో 'ఈ బాపతు అడ్డగోలు జాతి' గురించి ముందే హెచ్చరించిన భీష్మ పితామహుడు  * ఇతరులకు మనం చేసేది మనకు గ్యారంటీ గా వాపస్ వస్తుందని చైనా గుర్తిస్తే మేలు  ఒరులేయని యొనరించిన  నరవర! యప్రియము దన మనంబున కగు దా  నొరులకు నవి సేయకునికి  పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.  మహాభారతం లోని అరణ్యపర్వం లోని పంచమాశ్వాసం లో ---ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ రాసిన ఈ పద్యం పూర్వ రంగం ఏమిటంటే- పాండవ ప్రథముడైన ధర్మరాజు, ఉత్తమమైన ధర్మం ఏది అని తన సందేహం తీర్చుకోవడానికి భీష్మ పితామహుడి వద్దకు వెళ్లిన సందర్భంలో, ఆ మహానుభావుడు -ధర్మరాజు కు చెప్పిన ధర్మ సూత్రమే ఇది. దీని భావమేమిటంటే, ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. అదే ధర్మం. కానీ, చైనా వాళ్ళు మహా భారతం చదివి ఉండరు కదా.. అందుకని వాళ్లకు, ఈ ధర్మం సంగతి తెలియక, తాము చేయగలిగినంత అపకారాన్ని -కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలకూ చేసేశారు. అయితే, ప్రకృతి చాలా గొప్పది కదా... భీష్ముడు చెప్పిన ఫార్ములా ను తూచా తప్పకుండా పాటిస్తూ, చైనా కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం మొదలెట్టేసింది. అది కూడా ఎలాగంటే, రష్యా నుంచి వస్తున్న వారితో చైనా లో మళ్లీ కేసులు మొదలు కావటం ద్వారా.. అంతే కాదు, వివిధ దేశాల నుంచి చైనాలోకి చొరబాట్లు జరిగిన కారణంగా తేలిన లెక్కలేమిటంటే, రష్యా నుంచి వచ్చిన వారిలో 79 మందికి కరోనా ఉందని తేలటం.  ఆచూకీ చెబితే 5 వేల యువాన్ల నజరానా ఇస్తామనే దౌర్భాగ్య స్థితికి చైనా చేరుకున్నదంటే, చైనా చేసిన దురాగతం ఎలా కొత్త రూపం తీసుకుని ఆ దేశాన్నే కబళించటానికి వెనక్కు రావటం. వివిధ దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారి కారణంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వారి వివరాలు అందిస్తే నజరానా అందిస్తామని ప్రకటించింది. దేశంలోని  ఈశాన్య ప్రాంతమైన హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదుతో ఉలిక్కిపడిన అధికారులు వాటికి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు వద్ద నిఘా పెంచారు. అయినప్పటికీ చొరబాట్లు ఆగకపోవడంతో అటువంటి వారి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికీ 5 వేల యువాన్లు (రూ.54 వేలు) చొప్పున ఇస్తామని అధికారులు ప్రకటించారు. దేశంలోకి ప్రవేశించే వారిని పట్టుకుని పరీక్షలు చేస్తే పరిస్థితి మళ్లీ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కనీసం, ఇప్పటికైనా మహా భారతం చదివి, అందులో భీష్ముడు చెప్పిన ధర్మ సూత్రాలు ప్రాక్టీస్ చేస్తే, భవిష్యత్తులోనైనా కాస్త మానసిక సంస్కరణ జరిగే అవకాశముంది.

లాస్ట్ బ్రదర్ ఆఫ్ చైనా కు 50 వేల పీపీఈ కిట్స్

*హెల్త్ ఎమెర్జెన్సీ లోనూ డ్రాగన్ కుట్ర రాజకీయాలు  *మరో సారి భారత్ లో విద్వేష జ్వాలలు రేపేందుకు పన్నాగం  చైనా చేసే ప్రతి పని వెనుక ఒక రీజన్, ఒక లాజిక్ ఉంటాయి. కేవలం 32 కేసులున్న అసోంకు 50 వేల పీపీఈ కిట్స్ పంపించటం ద్వారా చైనా, మరో సారి కొత్త కుట్ర కు తెర తీసింది.  ఈ కిట్స్ ను చైనా నుంచి పొందిన తొలి రాష్ట్రంగా అసోం నిలవటానికి కారణం, చైనాకు అసోం కి మధ్య ఉన్న బంధుత్వం. ఈ రోజుకీ అసోం లో చాలా మంది , తమను తాము లాస్ట్ బ్రదర్స్ ఆఫ్ చైనా గా అభివర్ణించుకుంటుంటారు. అందుకనే చైనాకు, అసోం మీద ప్రత్యేకమైన అభిమానం. త్వరలోనే అసోంలోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు ఈ కిట్లను పంపిణీ చేస్తారని తెలిసింది.  దేశమంతటికీ కరోనా భయం పట్టుకున్న వేళ, చైనా నుంచి మొట్టమొదటిగా, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్స్ ను దిగుమతి చేసుకున్న రాష్ట్రంగా అసోం నిలిచింది. చైనాలోని గాంగ్జౌ నుంచి టేకాఫ్ అయి, బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బ్లూ డార్ట్ విమానం, 50 వేల పీపీఈ కిట్స్ ను తీసుకుని వచ్చింది. ఎన్నో ప్రపంచ దేశాలు పీపీఈ కిట్స్ కోసం చైనా వైపు చూస్తున్న వేళ, చైనా అసోంకు వీటిని పెద్ద ఎత్తున పంపించడం గమనార్హం. ప్రస్తుతం అసోంలో కేవలం 32 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాల సగటుతో పోల్చినా, కేసుల సంఖ్య పరంగా చూసినా, ఇది చాలా తక్కువే. ఇక విమానాశ్రయంలో పీపీఈ కిట్స్ ను రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ స్వీకరించారు. "భారత ప్రభుత్వంతో పాటు చాలా దేశాలు చైనా నుంచి పీపీఈ కిట్స్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కూడా పీపీఈల కోసం చైనా వైపే చూస్తోంది. వీటిని చైనా నుంచి డైరెక్ట్ గా దిగుమతి చేసుకున్న తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది" అని ఆయన అన్నారు. మొత్తం 2 లక్షల కిట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని తాము భావిస్తున్నామన్నారు.  వాస్తవానికి పీపీఈ కిట్స్ ను డైరెక్ట్ గా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ఓ రాష్ట్రానికి అంత సులువేమీ కాదు. ఎన్నో పెద్ద రాష్ట్రాలు, మరిన్ని వనరులుండి కూడా కిట్స్ ను ఇంపోర్ట్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నాయి.

ఏ క్షణంలోనైనా మౌలానా సాద్‌ అరెస్టయ్యే అవకాశం

భౌతిక దూరం నిబంధన గాలికి వదిలేసి సదస్సు నిర్వహించారని, పలువురి మరణాలకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను గాలికి వదిలేసి మతపరమైన సదస్సు నిర్వహించిన ఆయనపై ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సదస్సు నిర్వహించిన తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు, సదస్సుకు హాజరైన వారిలో చాలామంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సాద్‌పై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపైనా వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.