Young Engineer Ramyasri Deadbody not found

ఇంకా కనిపించని రమ్య మృత దేహం?

  బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య ఆనవాళ్లు ఇంకా దొరకలేదు. బిడ్డ కడచూపు కోసం తల్లిదండ్రులు రోజుల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాల్లో రమ్యకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నన్నూరు గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్, భూలక్ష్మి దంపతులకు కుమార్తె రమ్య, కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పని చేస్తుండగా భార్య గృహిణి, కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది.  విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడ నుంచి పాపికొండల విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్ళింది. యాత్రలో భాగంగా వారు వెళ్లిన రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునగడంతో అంతా గల్లంతయ్యారు. రమ్యతో పాటు వెళ్లిన మరో సహచర ఉద్యోగి లక్ష్మణ్ మృతదేహం అదే రోజు లభించింది. ఇక అప్పట్నుంచీ ఇప్పటి వరకూ రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు. కుమార్తె జాడ కోసం తండ్రితో పాటు కుటుంబ సభ్యులు చాలా రోజుల పాటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గరే గడిపారు. బోటు ప్రమాదానికి సంబంధించిన ఏ మృతదేహం కనిపించినా తమ బిడ్డ దేమోనని ఆశపడ్డారు. మృతదేహం దొరక్క పోవడంతో రాజమండ్రి గోదావరి తీరాన గత నెల ఇరవై ఐదు న కర్మకాండలు నిర్వహించారు.  ఇటీవల బోటును వెలికితీయడంతో రమ్య తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు మళ్లీ రాజమండ్రికి వెళ్లారు. బోటులో లభ్యమైన మృతదేహాలలో రమ్య మృతదేహం కానరాలేదు. దీంతో సుదర్శన్ దంపతులు మరింత రోదిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహం దొరికితే చాలని ఎదురుచూస్తున్నారు. గోదారమ్మా కరుణించి తమ బిడ్డ పార్ధివదేహాన్ని తమకు ఇవ్వాలని నిత్యం గోదారమ్మను వేడుకుంటున్నారు. పడవలో మరికొన్ని మృతదేహాలు ఉన్నాయని వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రికి పంపిస్తామని అధికారులు చెప్పడంతో రమ్య కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అంతా రాజమండ్రి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. బిడ్డను కడసారి చూసుకోవాలన్న ఆవేదనతో గుండెలు బాదుకుని రోదిస్తున్నారు.

AP High Court Surprises On The Cost Of Dharma Porata Deeksha Held by Chandrababu

ఒక్కరోజు దీక్షకు పది కోట్లా.. చంద్రబాబు దీక్షల గుట్టు తేలిపోనుంది!!

  టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. కేంద్రప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ‘ధర్మపోరాట దీక్ష’లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి 'ధర్మపోరాట దీక్ష'లు కాదు, 'ధనవృథా దీక్షలని' అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 11న చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఒక్కరోజు ‘ధర్మపోరాట దీక్ష’కు రూ.10 కోట్లు వ్యయం చేయడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే ఈ విషయంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వం నుంచి రూ. పది కోట్లు ఖర్చు పెట్టారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే అంశంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. పార్టీ తరపున చేసిన కార్యక్రమానికి రూ. పది కోట్ల ప్రజాధనం వ్యయం చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ జీవోను జారీ చేసిన అధికారి ఎవరో చెప్పాలని, ఏ నిబంధనల మేరకు జీవో విడుదల చేశారో చెప్పాలని నిలదీసింది. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాకు ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. బీజేపీతో కటీఫ్ చెప్పిన తర్వాత టీడీపీ ప్రతీ జిల్లాలోనూ ధర్మపోరాట దీక్షలు చేసింది. దానిపై అప్పట్లోనే విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ దీక్షలు చేస్తున్నారని విరుచుకుపడ్డాయి. అయితే, టీడీపీ మాత్రం ఆ దీక్షలన్నీ.. పార్టీ పరంగా చేసుకుంటున్నవేనని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ ధర్మపోరాట దీక్ష కోసం చేసిన ఖర్చుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ ధర్మపోరాట దీక్ష ఖర్చుపై పూర్తి రికార్డులు ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. నిజంగానే ధర్మపోరాట దీక్షలకు ప్రభుత్వం తరపున ఖర్చు చేసి ఉంటే చంద్రబాబు చిక్కుల్లో పడిపోతారు. ఒకవేళ పార్టీ పరంగా నిర్వహించుకుని ఉంటే మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని తేలిపోతుంది. ఏదిఏమైనా కొద్దిరోజుల్లో నిజం తేలిపోనుంది.

CM KCR Sensational Comments On TSRTC

ఆర్టీసీ మూసివేతే ...సమ్మెకు ముగింపా? కార్మికులకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

  ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మె మొదలైన తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన కేసీఆర్... తిన్నది అరక్క చేస్తున్న పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూనియన్ ఎన్నికల్లో గెలుపు కోసమే ...చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ మూసివేతే.... సమ్మెకు ముగింపేమో అంటూ హెచ్చరించారు. 4ఏళ్లలో 67శాతం జీతాలు పెంచాక కూడా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని మండిపడ్డారు. ఆర్టీసీని ఎవరూ కాపాడలేరన్న కేసీఆర్... ఇక సంస్థ మునిగిపోయినట్లేనని అన్నారు. ఆర్టీసీ విలీనం ఓ పిచ్చి డిమాండ్ అన్న కేసీఆర్‌.....  ప్రైవేట్ ట్రావెల్స్‌కు, అద్దె బస్సులకు లాభాలు వస్తుంటే... ఆర్టీసీకి మాత్రం ఎందుకు నష్టాలు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ యూనియన్లవి అర్ధంపర్ధంలేని... అసంబద్ధమైన... దురంహకారపూరితమైన డిమాండ్లు అన్నారు కేసీఆర్. ఆర్టీసీపై తనకంటే ఎవరికీ ఎక్కువ అవగాహన లేదన్న కేసీఆర్‌.... 1997లో రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కష్టపడి సంస్థను లాభాల్లో తెచ్చానని గుర్తుచేశారు. ఇక, ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ కార్మికుల జీతాలను 67శాతం పెంచామన్న కేసీఆర్‌.... దేశంలో ఏ రాష్ట్రమైనా అలా చేసిందా అంటూ ప్రశ్నించారు. ఎవరు బడితే వాళ్లు రోడ్లపైకి వచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో కలపమంటే కలిపేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మొత్తం 57 కార్పొరేషన్లు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వంలో కలపమంటే కుదురుతుందా అన్నారు. అసలు విలీనమనేది తెలివి తక్కువ... అసంభవమైన నినాదమన్నారు. ఆర్టీసీ ఇక బతికి బట్టకట్టదని, సంస్థను ఎవరూ కాపాడలేరన్న కేసీఆర్‌... కార్మికుల జీవితాలతో యూనియన్లు ఆడుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే, వెయ్యికి వెయ్యి శాతం ఇప్పుడున్న ఆర్టీసీ ఉండే అవకాశమే లేదన్నారు. యూనియన్లు లేకపోతే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్న కేసీఆర్‌.... ఐదారు రోజుల్లో 7వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు చెప్పింది కాబట్టి... కార్మికులతో చర్చలుంటాయని స్పష్టతనిచ్చిన కేసీఆర్‌.... ముఖ‌్యమంత్రినే తిడుతూ డిమాండ్లు సాధించుకోలగరా? అంటూ యూనియన్ లీడర్లపై ఫైరయ్యారు. నిజంగా కార్మికులు అమాయకులైతే డిపోల్లో దరఖాస్తు చేసుకుని రీజాయిన్ కావాలంటూ కేసీఆర్‌ మరోసారి ఆఫర్ ఇచ్చారు.

CM YS Jagan appoints in charge ministers for 13 districts

జగన్ మంత్రుల్లో అప్పుడే మార్పులు...! ఒకర్ని మినహా అందర్నీ మార్చేశారు.!

కనీసం మూడ్నెళ్లు కూడా తిరక్కుండానే ఏపీలో ఇన్ ఛార్జ్ మంత్రులను మార్చేడం కలకలం రేపుతోంది. నిర్ణయం ఏదైనా అనుకున్న వెంటనే జెట్ స్పీడ్ తో డెసిషన్స్ తీసుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి... ఇన్ ఛార్జ్ మంత్రుల విషయంలోనూ అలాగే వ్యవహరించారని అంటున్నారు. ఒక్క మేకపాటి గౌతమ్ రెడ్డి మినహా మిగతా మంత్రులందరినీ మార్చేశారు. ఒక్క చిత్తూరు తప్పా... మిగతా అన్ని జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులను జంబ్లింగ్ చేశారు. జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించి మూడ్నెళ్లు కూడా తిరక్కుండానే ఎందుకు మార్చేయాల్సి వచ్చిందనేది అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. కొందరు మంత్రుల తీరుపై మొదట్నుంచీ అసంతృప్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి... వాళ్లపై నిఘా కొనసాగిస్తున్నారట. కొందరికి ఎంత చెబుతున్నా అవినీతి విషయంలో కఠినంగా ఉండటం లేదని, అలాగే కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని నియంత్రించడం లేదని జగన్ అసంతృప్తిగా ఉన్నారట. ఇక, జిల్లాల బాధ్యతల విషయంలోనూ కొందరు మాత్రలు అతిగా వ్యవహరిస్తున్నట్లు జగన్ దృష్టికి వచ్చిందట. జిల్లాలను తమకు రాసిచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారని, అలాగే గ్రూపు రాజకీయాలకు తెరలేపారన్న మాట జగన్ చెవిన పడటంతోనే... ఇన్ ఛార్జ్ మంత్రులను అటూఇటూ మార్చేశారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రుల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్... కొందరిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతోనే మార్పులు జరిగాయని అంటున్నారు. ఇక కొందరు మంత్రులు అప్పటికప్పుడు తలూపినా, ఆ తర్వాత తమ పని యథావిధిగా కానిచ్చేస్తున్నారట. దాంతో ఆయా మంత్రుల వల్ల భవిష్యత్ పార్టీకి చెడ్డపేరు తప్పదన్న భావనతోనే హెచ్చరికగా జిల్లాల ఇన్ ఛార్జ్ బాధ్యతల్లో భారీ మార్పులు చేశారని చెప్పుకుంటున్నారు. ఇక కొందరైతే ఆయా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నందుకే మార్చేశారని అంటున్నారు. మరోవైపు నలుగైదురు మంత్రులు జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతలను భారంగా భావించడంతో నారాయణస్వామి, పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్, ఆళ్ల నాని, అంజద్ బాషాను రిలీవ్ చేశారని చెబుతున్నారు. ఇక మేకతోటి సుచరితపై ఆరోపణలు రావడంతో ఆమెను జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మూడ్నెళ్లలోనే మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేపట్టడం ఏపీలో సంచలనంగా మారింది. అయితే, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రుల మార్పు వెనుక కచ్చితంగా బలమైన రీజనే ఉందన్న మాట వినిపిస్తోంది.

Huzurnagar bypoll result

కంచుకోటలో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? డబ్బా? ఉత్తమ్ పై వ్యతిరేకతా?

కంచుకోట హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై పార్టీ లీడర్లలో అంతర్మథనం మొదలైంది. ఉత్తమ్ కు మంచి పట్టున్న హుజూర్ నగర్ లో సైతం ఓడిపోవడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. తక్కువ మెజారిటీతోనైనా గెలవాల్సిన స్థానంలో ఎలా ఓడిపోయామంటూ చర్చించుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో టీఆర్ఎస్ కు అంత భారీ మెజారిటీ ఎలా వచ్చిందంటూ పోస్టుమార్టం మొదలుపెట్టారు. అయితే, అభ్యర్ధి ఎంపికపై చెలరేగిన రగడ ఒక కారణమైతే, పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, అలాగే వ్యూహరచనలో వ్యూహాత్మక తప్పిదాలే కారణమని భావిస్తున్నారు. ఇక, అధికార పార్టీ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకుని మొత్తం గులాబీ యంత్రాంగానే రంగంలోకి దించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తే... కాంగ్రెస్ నేతలు మాత్రం పోల్ మేనేజ్ మెంట్ లో ఘోరంగా విఫలమైందని అంటున్నారు. అలాగే, తక్కువ మెజారిటీతోనైనా విజయం లాంఛనమేనన్న అతి విశ్వాసం కూడా కాంగ్రెస్ కొంప ముంచిందంటున్నారు. ఇక, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీసీసీ అగ్రనేతలు విఫలమయ్యారని, కానీ చేసినవి చేయనవి చెప్పుకోవడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. మరోవైపు రేవంత్ టార్గెట్ గా సీనియర్లు చేసిన రచ్చ కూడా పార్టీకి మైనస్ గా మారిందని, ఓవరాల్ గా గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్ ను దెబ్బతీశాయని అంచనాకి వస్తున్నారు. ఇవన్నీ ఇలాగుంటే, టీఆర్ఎస్... ఓటుకి ఐదువేలు పంచిందని, అందుకే కంచుకోటలో కాంగ్రెస్ ఓడిపోవల్సి వచ్చిందని అంటున్నారు. ఏదిఏమైనా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సిట్టింగ్ స్థానాన్నే కోల్పోవడంపై టీకాంగ్రెస్ లో నైరాశ్యం అలుముకుంది.

maharashtra election result bjp vs congress

బీజేపీపై వ్యతిరేకతే హస్తానికి కలిసొచ్చిందా? కాంగ్రెస్‌కి అన్ని సీట్లు ఎలా వచ్చాయ్?

మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనా అందరి చూపూ ఇప్పుడు హస్తం పార్టీ వైపే తిరిగింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాంటి లెక్కలే చెప్పాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేదంటూ  తీసిపాడేశాయి. ఇక, సోనియా, రాహుల్ కూడా అలాగే అనుకున్నారో ఏమో తెలియదు గానీ, వాళ్లు కూడా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గోలేదు. ఎలాగూ ఓడిపోతామ్... అనవసరంగా ఎందుకు కంఠశోష అని భావించారో ఏమో... కానీ, సోనియా, రాహుల్ సైతం ఊహించనివిధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కు ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి దాదాపు 150 సీట్లు వస్తే... కాంగ్రెస్ మిత్రపక్షాలకు కలిపి 100 సీట్లొచ్చాయి. దాంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీరియస్ గా పనిచేసుంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చుండేవని అంటున్నారు. ఇక, హర్యానాలోనైతే ఎవ్వరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందని విధంగా సీట్లు సాధించింది. బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్టేనని సర్వే సంస్థలన్నీ లెక్కగడితే, ఏకంగా 30కి పైగా స్థానాలను గెలుచుకుని హస్తం పార్టీ సత్తా చాటింది. అయితే, ఖట్టర్ పరిపాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్ర వ్యతిరేకతను కాంగ్రెస్ పసిగట్టి ఉంటే ఇక్కడ కూడా ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఊహించనిదానికంటే మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, సోనియా, రాహుల్ లు ప్రచారానికి రానుందుకే మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కి కొంతలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఒకవేళ వాళ్లు వచ్చుంటే మాత్రం ఇన్ని సీట్లు వచ్చేవే కాదని సెటైర్లు పేలుతున్నాయి. మరి, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలను సోనియా, రాహుల్ లు పట్టించుకోకపోవడం పార్టీకి మైనస్ అయ్యిందో ప్లస్ అయ్యిందో తెలియదు కానీ, జాతీయ నాయకులు కష్టపడి ఉంటే... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ తరహాలో రిజల్ట్స్ వచ్చేవన్న చర్చ జరుగుతోంది.

tsrtc strike latest updates

ఆర్టీసీ విలీనం పై కేసీఆర్ ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు?

తెలంగాణలో 21 రోజులుగా  దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే ఆర్టీసీ సమ్మెనే .ప్రభుత్వం తగ్గట్లేదు కార్మిక సంఘాలు వెనుకడుగు వేయడం లేదు దీంతో ఆర్టీసీపై ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. ఇవాళ ఆర్టీసీ జేఏసీ సమావేశం జరగనుంది భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి కార్మిక సంఘాలు. సీఎం వ్యాఖ్యల తరువాత కార్మికులు అయోమయంలో పడ్డారు. దీంతో తమ పోరును ఎలా కొనసాగించాలా అన్న దానిపై సమావేశంలో చర్చించనున్నారు జేఏసీ నేతలు. ఇటు సమ్మె ఇరవై ఒకటివ రోజుకు చేరుకుంది ప్రభుత్వం కావాలనే చర్చలకు పిలవడం లేదని జేఏసీ నేతలు అంటున్నారు. ఆర్టీసీ విలీనం సహా ఇరవై ఆరు ప్రతిపాదనల్ని తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది యూనియన్లే ఆర్టీసీని ముంచే సైన్ స్పష్టం చేశారు. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని రాష్ట్రాల్లో ఆర్టీసీల గుత్తాధిపత్యం పోవాలిని కేంద్రం చట్టం తెచ్చింది అన్నారు.సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఎన్ని ప్రైవేటు బస్సుల కైనా అనుమతిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. కొద్ది రోజుల్లో రవాణా మంత్రితో కూర్చుని ప్రైవేటు బస్సు లకు పర్మిట్ లు ఇవ్వనున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ ల పై చేసిన వ్యాఖ్యలు చాలా వ్యతిరేకంగా అవమానపరిచేలా ఉన్నాయి. సీఎం వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను తీసేసి అధికారం ఎవరికీ లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎవరి జాగీరు కాదని సీఎం కేసీఆర్ మాటలకు కార్మికులు ఎవరూ భయపడొద్దని సూచించారు. ఆర్టీసీ ఎవరి సొత్తు కాదని, ఎన్నొ ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్టీసీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది అని ఆయన వెల్లడించారు.

Jagga Reddy Special Thanks To KCR Over Construction Of Sangareddy Medical College

జగ్గారెడ్డి అసలు వ్యూహం ఏమిటి?

  మాస్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి నేత జగ్గారెడ్డి. ఆయన ఒక పార్టీలో ఉంటారు మరోక పార్టీ నేతలను పొగుడుతారు. తెల్లారితే మళ్లీ ఆయన్నే తిడతారు. ఒక రాజకీయవేత్తలో ఇన్ని కోణాలు ఎందుకు చూపిస్తున్నారు అనేది అందరికి అంతు చిక్కని విషయంగా మారింది. జగ్గారెడ్డి స్టైల్ ఏ వేరు, పేరుకే సంగారెడ్డి మాస్ లీడర్ కానీ ఆయన వ్యవహారంపైనే గాంధీ భవన్ నుంచి సంగారెడ్డి వరకు చర్చ జరుగుతోంది. ఒక రోజు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తారు. వెంటనే మరో రోజు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకసారి హరీశ్ రావు పైన పంచులు విసురుతారు. మళ్లీ టైము దొరకగానే ఆయనకు సన్మానం చేస్తారు.  మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ప్రత్యక్షంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యారు. కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలని ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తే అందులో పాల్గొనడానికి ప్రగతి భవన్ దగ్గర వరకూ పోలీసుల కళ్ళుగప్పి ఆటోలో వెళ్లి అక్కడ అరెస్టయ్యారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నినదించారు. ఇలా చేసి ఇరవై నాలుగు గంటలు గడిచిందో లేదో మళ్లీ కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగ్గారెడ్డి.  సంగారెడ్డికి మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీంతో ఏకంగా కేటీఆర్ ఫొటో పక్కన తన ఫొటో వేసుకొని సంగారెడ్డిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఇవన్నీ చూస్తున్న సంగారెడ్డి జనానికి మాత్రం జగ్గారెడ్డి అంతరంగం అంతు పట్టడం లేదు. ఒక వైపు పోరాటం, కార్మికులకు సంఘీభావం, మరోవైపు కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తడం అసలు జగ్గారెడ్డి విషయం ఎవ్వరికి అంతు చిక్కట్లేదు ఇప్పుడు ఈ విషయం సంగారెడ్డిలో చర్చనీయాంశమైంది. ఇంతకు జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదంటే టీఆర్ఎస్ లో చేరబోతున్నారా ఇవేవీ ఎవరి ఊహకు అందడం లేదు. మొత్తానికి జగ్గారెడ్డి రోజుకో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నారని సెటైర్ లు విసురుతున్నారు జనం.

reason behind ex minister narayana silence

మాజీ మంత్రి నారాయణ మౌనం వెనుకు అసలు వ్యూహం ఏమిటి?

  మాజీ మంత్రి నారాయణ ఎక్కడ అన్నది అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజావేదిక కూల్చివేత సమయంలో, రాజధాని రచ్చ జరుగుతున్న సమయంలో బయటకు రాలేదు మంత్రి నారాయణ. అసలు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా నెల్లూరు జిల్లాతో సహా రాష్ట్ర రాజకీయాలకు నారాయణ దూరంగా ఉంటున్నారు. ఆయన తాజా ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచీ పొలిటికల్ గా సైలెంటయ్యారు. నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్ సభ వైసిపి గెలిచింది. దీంతో జిల్లాలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు నారాయణ వ్యవహరించారు. ఫలితాలు వచ్చిన తరువాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఏం చేస్తున్నారని హాట్ డిస్కషన్ నడుస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి నారాయణ పూర్తిగా టిడిపి నేతలను దూరం పెట్టారు. తన పక్కనే ఉంటూ తనకిందే గోతులు తీశారనే అనుమానం ఓ వైపు మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన భారం మరో వైపు నారాయణకు దిక్కు తోచకుండా చేశాయి. దీంతో ఆయన దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వచ్చినపుడు నారాయణ వచ్చారు. రెండ్రోజుల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ మళ్లీ మాయమైపోయారు. అమరావతిలో జరుగుతున్న పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాల్గొనలేదు. ఇటివల చంద్రబాబు కోటరీలో కీలక నేతలు బీజేపీలో చేరడంతో నారాయణ కూడా కమలం వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అధికార పార్టీలోకి జంప్ అవుతారని మరో వార్త వినిపించింది. కానీ నారాయణ మాత్రం సైలెంట్ గా తన విద్యాసంస్థల పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. అక్కడ కొత్త కొత్త టార్గెట్ లు పెట్టి విద్యాసంస్థల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకైతే నారాయణ తెర వెనక ఉండే మంత్రాంగం నడుపుతున్నారు. అసలు తను ఉనికి ఎక్కడుందో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

Prayutha Chandi Yagam is next on KCR agenda

కేసీఆర్ కి దైవ బలం తోడవుతోందా?

  చండీయాగం, ఆయుత చండీయాగం, రాజశ్యామల యాగం ఇలా దేశంలో ఎవరూ చేయనంత గొప్పగా కేసీఆర్ యాగాలు చేస్తూంటారు. పొలిటికల్ నిర్ణయాలకే  కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను కేసీఆర్ తన ప్రత్యేకతను చూపిస్తారు. తాజాగా గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇల్లు పూర్తి అవ్వగానే ప్రయుత చండీ యాగం నిర్వహించనున్నట్టుగా సమాచారం. గతంలో నిర్వహించిన అయుత చండీ యాగానికి రెట్టింపు ఏర్పాట్లూ ఈ యాగానికి అవసరం. తెలంగాణ సీఎం కేసీఆర్ కి దైవభక్తి చాలా ఎక్కువ. ఉద్యమకాలంలో అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీ యాగం నిర్వహించి దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాలపై చర్చ మొదలయ్యేలా చేశారు. అంత గొప్పగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిష్టతో నిర్వహిస్తారు కేసీఆర్. దైవదర్శనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ దాదాపు దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని నెలల్లోనే యాదాద్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా మహాసుదర్శన యగాన్ని జరుపుతానని గతంలోనే సీఎం ప్రకటించారు. దాదాపు పది లక్షల మందితో భారీ ఏర్పాట్లతో ఆ యాగం జరగనుంది.  అయితే అంత కంటే ముందే కేసీఆర్ వ్యక్తి గతంగా మరో యాగం చేయనున్నారు. గతంలో ఆయుత చండీ యాగం పూర్తయిన సందర్భంగా ప్రయుత చండీ యాగం నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ భారీ యాగాన్ని నిర్వహించనున్నారు. తన ఫామ్ హౌస్ లో కొత్తగా నిర్మించిన ఇంటి నిర్మాణం పూర్తి అవ్వగానే ఈ యాగం చేయనున్నట్లు సమాచారం. వెయ్యికి పైగా కుండలతో వేల మంది రుత్వికులు పురోహితులతో లక్షల సార్లు చండీమాత పారాయణం చేస్తారు. అత్యంత కఠిన నియమ నిబంధనలతో పరిశుద్ధమైన వాతావరణంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రయుత చండీ యాగాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేయాలి. దేశంలో ప్రయుత చండీ యాగాలు చాలా అరుదుగా జరిగాయి. ఈ జనరేషన్ లో దాదాపుగా ఇదే మొదటిది అని చెప్పొచ్చు. కేసీఆర్ ఈ యాగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.మరి ఈ యాగం ఎలా జరుపుతారు అన్నది వేచి చూడాలి.

shock to bjp in maharashtra

ఆ రెండు పార్టీలు శివసేనకు మద్దతిస్తే కమలనాథుల పని అంతే...

  పాక్ పై మెరుపు దాడులు పని చేయలేదా, దేశభక్తిని రగల్చడంలో బీజేపీ విఫలమైందా, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు బీజేపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చాయనే అంటున్నారు విశ్లేషకులు. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి, హర్యానాలో ఎక్కువ స్థానాల్లో బీజేపీ సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్ ల మద్దతు కోసం బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు, మహారాష్ట్రలో బీజేపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే బీజేపీ ఆధిక్యం తక్కువ సీట్లలో కనిపిస్తుంది, శివసేన బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కూడా ఎక్కువ సీట్లలో ఆధిక్యం కనబర్చింది. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు శివసేనకు మద్దతిస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరితే కమలనాథులు తలలు పట్టుకునే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే సీఎం పదవి తమకివ్వాలని, క్యాబినెట్ లో సగం పదవులు కావాలని శివసేన డిమాండ్ చేస్తోంది కానీ, బీజేపీ నేతలు మాత్రం అంతా సర్దుకుంటుందని శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. అమిత్ షా క్యాబినెట్ లోకి రావడం బీజేపీకి కలిసి రాలేదా, నడ్డా వ్యూహాలూ ఫలించలేదా, కమలం పార్టీలో అంతర్మథనం మొదలైంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో అమిత్ షా బిజీ కావడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. పార్టీని పటిష్టం చేయడానికి జేపీ నడ్డాకు పూర్తి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బెంగాల్ లో కూడా బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుంది, ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లాంటి నేతల మరణంతో అక్కడ బీజేపీ నాయకత్వం కొద్దిగా బలహీనమైంది. మహారాష్ట్ర విషయానకొస్తే నాగ్ పూర్ ఆరెస్సెస్ కు పుట్టినిల్లు, ఈ ఎన్నికలను సంఘ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఊహించిన ఫలితాలు అక్కడ రావడం లేదు, దేశభక్తి, ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ నేతలు బాగా ప్రచారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా పని చేసినప్పటికీ ఊహించిన ఫలితాలు రాలేదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రైతు సమస్యల కారణంగా రెండు రాష్ట్రాలలో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Shiv Sena eyes CM post 50 50 power sharing formula

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. తెరమీదకు 50-50 ఫార్ములా!!

  మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం దిశగా సాగుతోంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి కూడా బలపడింది. మొత్తం 288 సీట్లలో బీజేపీ శివసేన కూటమి నూట అరవై ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి తొంభై ఆరు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి, ఎంఐఎం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఇరవై ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.  మహారాష్ట్రలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్లంతా స్వీట్ లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అధికారం దిశగా బీజేపీ శివసేన అడుగులు వేస్తోంది, దాదాపు నూట అరవై ఐదు స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు కావడంతో అవసరమైన దానికన్నా ఇరవై సీట్లే ఎక్కువ వచ్చాయి కానీ, గతంలో ఈ కూటమి గెలిచిన సీట్లకన్నా ఇరవై సీట్లు తగ్గడంతో ఇప్పుడు కొత్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. బీజేపీ శివసేన కూటమి గెలిచినప్పటికీ వారికి మొత్తంగా గతంలో గెలిచిన సీట్ల కంటే ఈ సారి సీట్లు మాత్రం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రచారం చేయకుండా ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించని కాంగ్రెస్ గానీ, ఎన్సీపీ గానీ గతంలో కన్నా కొన్ని సీట్లు ఎక్కువగా సాధించారు. మరీ ముఖ్యంగా ఎన్సీపీ అయితే యాభై మార్కును దాటింది, గతంలో ఎన్సీపీ కేవలం నలభై రెండు, నలభై మూడుకు మాత్రమే పరిమితమైంది. గతంలో అరవై రెండు సీట్లు గెలిచిన శివసేన ఈ సారి డెబ్బై మార్కుకు దగ్గరగా వచ్చింది. ఈ ఎన్నికలలో సక్సెస్ రేట్ శివసేనది పెరిగింది, బిజెపిది తగ్గింది. ప్రభుత్వంలో తమ ప్రాబల్యాన్ని చూపించుకోవడానికి ఈ ఫలితాలు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. దీనిపై శివసేన ఎంపీ రావత్ మాట్లాడుతూ 50-50 ఫార్ములా ఎన్నికల ముందు అనుకున్నాం అని ఇప్పుడు ప్రభుత్వంలో అదే పాటిస్తామని అన్నారు. ఆయన నేరుగా చెప్పకపోయినా ముఖ్యమంత్రి పదవిని రెండున్నర సంవత్సరాలు ఒక పార్టీ తరువాత రెండున్నర సంవత్సరాలు ఇంకొక పార్టీ శివసేన, బిజెపి పంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. శివసేనకు సంబంధించిన వ్యక్తిని కూడా ఈసారి ముఖ్యమంత్రి చెయ్యాలనేది శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో అది జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ముఖ్యమైన నాయకులు ఎవరైతే మహారాష్ట్ర ఎన్నికల్లో నిల్చున్నారో వాళ్ళందరూ విజయం సాధించారు. వారిలో ప్రముఖంగా అజిత్ పవార్ గురించి చెప్పుకోవచ్చు, లక్ష మెజారిటీని ఆయన దాటారు. బారామతి నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ పోలైన ఓట్లలో ఎనభై ఐదు శాతం ఓట్లు ఆయన దక్కించుకున్నారు. వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు, దాదాపు అరవై వేల ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. సౌత్ నాగ్ పూర్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం మహారాష్ట్ర పైన తన ప్రభావాన్ని చూపింది. దాదాపు నలభై ఆరు నియోజక వర్గాల్లో ఎంఐఎం సాధించిన ఓట్లతో గెలుపు అవకాశాలు మారాయి. దీంతో బిజెపికి కొంత లాభం చేకూరింది. 

Producer Bandla Ganesh remanded for 14 days

బండ్ల గణేష్ కు 14 రోజుల రిమాండ్!!

  సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. 2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో 2013లో బండ్ల పై మహేష్ చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో బండ్ల పై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, కోర్టు విచారణకు బండ్ల హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో, బండ్ల ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

trs won in huzurnagar by elections

హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం.. రికార్డు మెజారిటీ!!

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తనకి తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కారు జోరుకి హస్తం కుదేలైంది. హుజూర్‌నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం మొదలుకుని చివరి రౌండ్ వరకూ కారు స్పీడ్‌ గా దూసుకెళ్లింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ హస్తం హవా కనిపించలేదు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీల సంగతి సరేసరి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమవ్వగా.. ఇండిపెండెంట్‌ అభ్యర్థి మూడో స్థానం దక్కించుకున్నారు.    పార్టీ                 ఓట్లు టీఆరెఎస్         112796 కాంగ్రెస్              69563 బీజేపీ                  2621 టీడీపీ                 1827

YSR Bala Sanjeevini pilot project in Tribal areas to provide nutritious food

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చనున్న సిఎం జగన్...

  ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు సిఎం వైఎస్ జగన్. మహిళల్లో, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు వైయస్సార్ బాల సంజీవనీ, వైయస్సార్ బాలామృతం పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టనున్నారు. అందుకు పైలట్ ప్రాజెక్టును రూపొందించారు. గర్భవతులకు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన పౌష్టిక ఆహారాన్ని అందించనున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరే ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా ప్రజారోగ్యానికి, మాతా శిశువుల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీని ఆరోగ్యాంధ్రాగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం పై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణపై చర్చించిన ఆయన మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన సబ్ ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మాతా శిశువులకు పౌష్టికాహారాన్ని అందించటానికి వైయస్సార్ బాల సంజీవని, వైయస్సార్ బాలామృతం పేరుతో వారిని ఆదుకోనున్నారు. అందుకు గాను 77 గిరిజన సబ్ ప్లాన్ మండలాలను ఎంపిక చేసిన అధికారులు డిసెంబర్ నుంచి ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును అనుసరించి గర్భవతులకు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన ఆహారం అందించనున్నారు. 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలతో పాటు 500 రూపాయల విలువ చేసే వైయస్సార్ బాల సంజీవని కిట్ అందించనున్నారు. వైయస్సార్ బాల సంజీవని కిట్లు మొదటి వారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశెనగలతో చేసిన చిక్కి, మూడో వారం అరకేజీ రాగి ఫ్లేవర్, అరకేజీ బెల్లం, నాలుగో వారం అరకేజీ నువ్వుల ఉండలు అందజేస్తారు. ఆరు నెలల నుంచి మూడేళ్ళ లోపు చిన్నారులకు నెలలో ప్రతిరోజు గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు వైయస్సార్ బాలామృతం కిట్ లో భాగంగా 600 రూపాయల విలువ చేసే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. అలాగే మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పౌష్టికాహారం అందించనున్నారు. నెలలో 25 రోజుల పాటు భోజనం,గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం అందజేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 36 గిరిజన మండలాలను ఎంపిక చేయగా శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఏడు, విశాఖపట్నం జిల్లాలో పదకొండు, తూర్పు గోదావరి జిల్లాలో పదకొండు, పశ్చిమగోదారి జిల్లాలో ఆరు ఉన్నాయి. సబ్ ప్లాన్ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పంతొమ్మిది, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, విశాఖపట్నం జిల్లాలో ఆరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో మూడు, కలిపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలపై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది అని చెప్పారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. అది చూసి ఓర్వలేకే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యం అందక ఏ ఒక్క పేదవాడు చనిపోకూడదన్న ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పారు, ఒంగోలు రిమ్స్ ను సందర్శించిన మంత్రి అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు, అనంతరం డీ.అర్.డి.ఎ ఆఫీస్ లో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆళ్ల నానితో పాటు మరో మంత్రి బాలినేని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 

ఉపఎన్నికలంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలు... బైపోల్స్ లో గులాబీ పార్టీకి ఎదురే లేదు

  నిజమే, ఉపఎన్నికలంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలు... ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపఎన్నికలను కేసీఆర్ అస్త్రంగా మార్చుకుని ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ ప్రజల నాడిని కేంద్రానికి తెలియజేసేందుకు ఉపఎన్నికలను కేసీఆర్ అస్త్రంగా వాడేవారు. పదేపదే రాజీనామాలు చేస్తూ ఉపఎన్నికలకు వెళ్లేవారు. ఉపఎన్నికలకు వెళ్లడమే కాదు... అదేస్థాయిలో ఘనవిజయం సాధించేవారు. దాంతో ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేకపోవడంతో... ఉపఎన్నికలంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటేనే ఉపఎన్నికలన్నంతా గులాబీ పార్టీ పేరు తెచ్చుకుంది. అయితే, ఒకే ఒక్కసారి టీఆర్ఎస్ కు చుక్కెదురైంది. వైఎస్ హయాంలో కేసీఆర్ స్ట్రాటజీకి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు ఊహించనివిధంగా ప్రజలు షాకిచ్చారు. ఆ ఒక్క సందర్భంగా మినహా మిగతా అన్ని ఉపఎన్నికల్లోనూ కేసీఆర్ వ్యూహం పక్కాగా వర్కవుట్ అయ్యాయి. ఇక, ఇఫ్పుడు కూడా హుజూర్ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఫలించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం.... కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పాతడం ద్వారా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురే లేదని రుజువైంది.

తమిళనాట స్టాలిన్ కు షాక్... అనూహ్యంగా పుంజుకున్న అన్నాడీఎంకే...

  మరో ఏడాదిన్నరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని కలలు కంటోన్న డీఎంకే అధినేత స్టాలిన్ కు తమిళ ప్రజలు షాకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఏకపక్ష ఫలితాలను సాధించి అన్నాడీఎంకేకు షాకిచ్చిన డీఎంకేకు కేవలం వందే వంద రోజుల్లో ప్రజలు రివర్స్ పంచ్ ఇచ్చారు. తమిళినాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఊహించనివిధంగా అన్నాడీఎంకే విజయం సాధించింది.  జయలలిత మరణం తర్వాత కుమ్ములాటలతో అన్నాడీఎంకే చతికిలపడటంతో... నాలుగు నెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 39 స్థానాలకు 22 సీట్లను డీఎంకే గెలుచుకుంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జోరు మీదున్న డీఎంకే దూకుడుకు ఉపఎన్నికల్లో బ్రేకులు పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఉపఎన్నికల్లోకూడా డీఎంకేనే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ... అనూహ్యంగా అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. మొత్తానికి జయలలిత మరణం తర్వాత అనేక ఒడిదుడులకు గురైన అన్నాడీఎంకేలో ఈ ఉపఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరి, 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ట్రెండ్ ఇలానే కొనసాగుతుందో? లేక డీఎంకేకి పట్టం కడతారో? ఈ రెండు పార్టీలను కాదని రజనీని అందలమెక్కిస్తారో చూడాలి.

రేవంత్ అనుమానాలే నిజమయ్యాయా? కంచుకోటలో ఉత్తమ్ ఎందుకు చతికిలపడ్డారు?

  హుజూర్ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఫలించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే గులాబీ జెండా పాతడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్న టీఆర్ఎస్ అధినేత స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది. తన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని ఉత్తమ్... ఇక తెలంగాణలో పార్టీని ఎలా నడిపించగలరన్న సంకేతాలను కేసీఆర్ ప్రజల్లోకి పంపారు. అయితే తన సొంత నియోజకవర్గంలో... పైగా తన కంచుకోటైన సిట్టింగ్ సీటును కోల్పోవడం ద్వారా సొంత పార్టీలో కూడా ఉత్తమ్ విమర్శలను ఎదుర్కోనున్నారు. పీసీసీ పదవి నుంచి వెంటనే వైదొలగాలన్న డిమాండ్ పెరగనుంది. సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకోలేని ఉత్తమ్ ఇక రాష్ట్రంలో పార్టీని ఎలా గెలిపించగలరనే విమర్శలు పెరగడం ఖాయం. దాంతో, పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే, హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై మొదట్లో రచ్చ జరిగింది. ఉత్తమ్ భార్య పద్మావతి ఎంపికను రేవంత్ తీవ్రంగా వ్యతిరేకించారు. పద్మావతికి ప్రత్యామ్నాయంగా రేవంత్ మరో అభ్యర్ధిని తెరపైకి తెచ్చారు. అయితే రేవంత్ పై సీనియర్లంతా ఏకమై మాటల దాడి చేయడంతో గాంధీభవన్ లో రచ్చ నడిచింది. చివరికి పద్మావతి పేరును సోనియా ఓకే చేయడంతో... అంతా కలిసి హుజూర్ నగర్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. రేవంత్ కూడా ఒక రోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటూ విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలంతా హుజూర్ నగర్ లో క్యాంపైన్ చేశారు. కానీ ఎవరూ ఊహించనివిధంగా భారీ తేడాతో పద్మావతి ఓడిపోవడంతో కాంగ్రెస్ లీడర్లు షాక్ కి గురవుతున్నారు. అయితే, టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపునకు ఉత్తమ్ ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత కూడా కారణమనే మాటలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడుసార్లు ఉత్తమ్ గెలిచి ఉండటంతో ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. అదే సమయంలో అధికారంలో టీఆర్ఎస్ ఉండటంతో ఇక్కడ కూడా అదే పార్టీని గెలిపిస్తే మంచిదనే అభిప్రాయమే సైదిరెడ్డి విజయానికి కారణమనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే, రేవంత్ చెప్పినట్లుగా ఉత్తమ్ ఫ్యామిలీ నుంచి కాకుండా మరో అభ్యర్ధిని రంగంలోకి దింపి ఉంటే... కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో.

హుజూర్ నగర్ లో ఊహించిందే జరిగింది... కానీ అన్ని రౌండ్లలో ఆధిక్యంపైనే డౌట్స్...

  హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. హుజూర్ నగర్ లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న సర్వే సంస్థల లెక్క తప్పలేదు. అంతేకాదు 18వేల నుంచి 25వేల వరకు మెజారిటీ కూడా రావొచ్చ అంచనా కూడా నిజమైంది. హుజూర్ నగర్ లో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏమాత్రం లేదని... కేసీఆర్ పరిపాలన, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ప్రభావమే ఓటర్లపై ఆధికంగా ఉందన్న  సర్వే సంస్థల మాటలు అక్షరాలా నిజమని రుజువైంది. అయితే, మొదట్నుంచీ ఊహించినట్లుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు నడిచినప్పటికీ.... ఏ రౌండ్ లోనూ సైదిరెడ్డికి పద్మావతి పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతి రౌండ్ లోనూ పద్మావతిపై సైదిరెడ్డి పైచేయి సాధించారు. దాంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ప్రతి రౌండులోనూ టీఆర్ఎస్ కు వేల ఓట్లు ఎలా ఆధిక్యం వస్తుందంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు.  ఇక, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీకి హుజూర్ నగర్ లో డిపాజిట్ కూడా దక్కలేదు. అలాగే, తెలుగుదేశం కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. హుజూర్ నగర్లో ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు అయ్యింది.