సీఎం జగన్‌ చెప్పింది వాస్తవమే: మేకపాటి గౌతమ్‌రెడ్డి

కరోనా బాధితులను ట్రాక్ చేసేందుకు పరికరాన్ని రూపొందిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎస్ మోడ్యూల్ ని తయారు చేస్తామని.. ఇప్పటికే కంపెనీలతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కరోనా పేషేంట్‌కి ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా నిరంతరం ట్రాక్‌ చేయొచ్చన్నారు. దేశంలో మొదటిసారి ఏపీలోనే చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ మోడ్యూల్ అవసరం చాలా ఉంటుందన్నారు. గ్రీన్ జోన్ లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనాపై చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం చెప్పింది వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు కరోనా వైరస్‌ ప్రపంచమంతా ఉంటుందన్నారు. దేశంలోనే అందరికంటే ఎక్కువ నియంత్రణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. కరోనా టెస్ట్‌లు చేయడంలో ఏపీ ప్రథమస్థానంలో ఉందని.. కిట్ల ఉత్పత్తి కూడా మనమే చేస్తున్నామని మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

మీడియాపై ఏపీ ప్ర‌భుత్వ జులుం!

తెలుగుఒన్ కార్యాల‌యంపై సిఐడి డాడులు! సోషల్ మీడియాలో వస్తున్ప పోస్టులపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం, అధికారపార్టీ నేతల జులుం మొదలైంది.  ఈ మధ్య తమపై సోషల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పోలీసుల స‌హాయంతో మీడియ‌కు వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్ర‌మ కేసులు పెట్టడానికి సోష‌ల్ మీడియా కార్యాల‌యాల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ప్రభుత్వంలోజరుగుతున్న అక్రమాలు, కొవిడ్‌-19, అధికారపార్టీ నేతల అవినీతిపై తెలుగుఒన్‌లో వార్త‌లు రాయ‌డం, ప్రశ్నించటమే పెద్ద నేర‌మైపోయింది. హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని తెలుగుఒన్ కార్యాల‌యంపై సిఐడి దాడులు నిర్వ‌హించారు. బుధ‌వారం రాత్రి 11 గంట‌ల నుంచి గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు తెలుగుఒన్ కార్యాల‌యంలో ఏపీ సిఐడి పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆరుగురు సిఐడి పోలీసులు ఈ సోదాలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా తెలుగుఒన్ కార్య‌క్ర‌మాలన్నీ ఉద్యోగులు ఇళ్ళ నుంచే చేస్తున్నారు. కార్యాల‌యంలో డ్రైవ‌ర్, వాచ్‌మెన్ త‌ప్ప మ‌రేవ‌రూ లేరు. బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఏపి సిఐడి పోలీసులు హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని తెలుగుఒన్ కార్యాల‌యంపై ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. తెలుగుఒన్‌ ఎం.డి. ర‌విశంక‌ర్ ఎక్క‌డ వుంటారు. ఆయ‌నకు సంబంధించిన వివ‌రాల్ని అడిగారు. ఎం.డి. గురించి త‌మ‌కేమీ తెలియ‌ద‌ని చెప్ప‌డంతో పోలీసులు వెళ్ళిపోయారు. మ‌ళ్ళీ గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు తెలుగుఒన్ కార్యాల‌యానికి ఏపీ సిఐడి పోలీసులు ఆక‌స్మికంగా వ‌చ్చారు. నెల చివ‌రి రోజు కావ‌డం. ఉద్యోగుల జీతాల‌కు సంబంధించి ప‌ని ఉండ‌టంతో అకౌంటెంట్ ప్ర‌సాద్ ఆ స‌మ‌యంలో తెలుగుఒన్ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఏపీ సిఐడి పోలీసులు ఆయ‌న్ని విచారించారు. ఎం.డి. ర‌విశంక‌ర్‌కు సంబంధించిన వివ‌రాలు అడిగారు. అయితే త‌న‌కు ఆయ‌న ఎక్క‌డ ఉండేది తెలియ‌దు. తాను కేవ‌లం అకౌంట్స్ మాత్ర‌మే చూస్తాన‌ని ప్ర‌సాద్ చెప్ప‌డంతో పోలీసులు ఎం.డి. డ్రైవ‌ర్ చిన్నా‌ను బెదిరించారు. ఎం.డి. రూం తాళాం తెరిపించి రూంలో ఉన్న సి.డి.లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.  తెలుగుఒన్ ఎం.డి. త‌ర‌ఫు అడ్వ‌కేట్ సిఐడి పోలీసుల‌తో మాట్లాడ‌డానికి ఫోన్‌లో మూడు సార్లు ప్ర‌య‌త్నించినా పోలీసులు అడ్వ‌కేట్‌తో మాట్లాడ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. పైగా సిఐడి పోలీసులు‌ గద్దించడంతో భయపడిన డ్రైవ‌ర్ చిన్నా పోలీసుల్ని ఎం.డి. ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎం.డి.గారు వేరే ప‌ని మీద బ‌య‌టికి వెళ్ళి వుండ‌టంతో మేడంతో మాట్లాడి సిఐడి పోలీసులు మ‌ళ్ళీ తెలుగుఒన్ కార్యాల‌యానికి వ‌చ్చారు. వాచ్‌మెన్ ద‌గ్గ‌ర తాళాలు తీసుకొని మెయిన్ స‌ర్వ‌ర్‌, హార్డ్‌డిస్క్‌, సిసిఫుటేజ్‌, సిసిటీవీ ఎక్విప్‌మెంట్, సి.డి.లు, పెన్‌డ్రైవ్‌లు అన్నీ సిఐడి పోలీసులు తీసుకొని వెళ్ళారు. కొవిడ్‌-19 కు సంబంధించి అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున ఏపి సిఐడి పోలీసులు తెలుగుఒన్ కార్యాల‌యంపై ఆక‌స్మిక దాడుల‌కు పాల్ప‌డ్డారు.

సర్వే సిబ్బందిపై భౌతిక దాడులపై ఏపీ సర్కార్ సీరియస్

కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్స్ సర్వే నిర్వర్తిస్తున్న సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే సమయంలో, రోగుల మృత దేహాల ఖననాల సందర్భముగా  దహన వాటికలలో ,  వైద్య సేవలు అందించే ఆసుపత్రులు/క్లినిక్ లు, క్వారంటైన్/ ఐసొలేషన్ కేంద్రాలు, మొబైల్ వైద్య సేవలందించే విభాగాలు, తదితర ప్రదేశాల్లో భౌతిక దాడులు జరుగు తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  కరోనా వైరస్ వ్యాప్తిపై లేని పోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కలిగించ రాదని,  కోవిడ్ వ్యాధిగ్రస్తుల యొక్క  కాంటాక్ట్ ల అన్వేషణ వంద శాతం పూర్తి  చేసి, సంబంధిత వ్యక్తులకు తగు పరీక్షలు చేయటం ద్వారానే ఈ వ్యాధి నివారణ త్వరిత గతిన సాధ్య మవుతుందని డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి  పేర్కొన్నారు.    కోవిడ్ వ్యాధిగ్రస్తుల పార్దివ దేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్  చేసి సీల్ చేయటం జరుగుతుంది. ఇటువంటి మృత దేహాలను   పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా  వ్యాప్తికి ఎటువంటి ఆస్కారం ఉండదు. కనుక ప్రజలందరూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా కోరటమైంది. సమాజ హితం కోసం పాటు పడే  వైద్య సిబ్బంది విధుల నిర్వహణకు సమాజంలోని ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  కేంద్ర ప్రభుత్వం 22 ఏప్రిల్ 2020 న తీసుకొని వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా విధి నిర్వహణలో ఉన్న   వైద్య/వైద్యేతర  సిబ్బంది పై జరిగే  దౌర్జన్యకర సంఘటనలన్నింటినీ శిక్షార్హమైన, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇటువంటి  దౌర్జన్యకర చర్యలకు పాల్పడే లేదా ప్రేరేపించే లేదా ప్రోత్సహించే వారికి 3 నెలల నుంచి 5 సంవత్సరాలు కారాగార వాస శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించ వచ్చు. అలాగే విధి నిర్వహణలో ఉన్న వైద్య, వైద్యేతర  సిబ్బందిని ప్రమాదకరంగా గాయపరిచే సంఘటనలకు పాల్పడే వారికి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించవచ్చు. దీనికి తోడు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారే బాధితులకు నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం అందించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం  కఠిన చర్యలు తీసుకోవల్సినదిగా జిల్లా కల్లెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చినట్టు డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

అమెరికాలో భారతీయ మహిళ హత్య, భర్త ఆత్మహత్య

ఐదు నెలల గర్భవతి అయిన 35 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైయ్యారు. ఆమె భర్త సమీపంలోని హడ్సన్‌ నదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 26న గరిమా కొఠారి తన నివాసంలో హత్యకు గురికాగా, ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. కొఠారి భర్త మన్‌మోహన్‌ మాల్‌ (37) మృతదేహాన్ని నది నుండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  వీరిద్దరూ 'నుక్కడ్‌' రెస్టారెంట్‌ను నడుపుతున్నారని, వారు మంచి జంట అని రెస్టారెంట్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. మాల్‌ కూడా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించేవారని అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) పూర్వ విద్యార్థి అయిన మాల్‌ కొలంబియా యూనివర్శిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లారు.  మాల్‌ మరణానికి గల కారణాలు తెలియలేదని అన్నారు. న్యూజెర్సీ సిటీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహాయంతో ప్రత్యేకాధికారులు ఈ కేసును విచారిస్తున్నాయని తెలిపారు.  

కర్నూలు ఘటనపై సీఎం జగన్ సీరియస్

అమరావతి : కర్నూలు జిల్లాలో కరోనా మరణించిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కరోనాపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఘటన ప్రస్తావనకు వచ్చింది. ఇది నిజంగా చాలా అమానవీయమని సీఎం పేర్కొన్నారు. కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చని.. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చని చెప్పుకొచ్చారు. డీజీపీకి సూచన : ‘ కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం కరెక్టుకాదు. అలాంటి పరిస్థితుల్లో వారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్ట్ కాదు. అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు. మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో..? అలాగే స్పందించాలి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలి’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీఎం జగన్ సూచించారు.   వారిపై కేసులు కూడా పెట్టొచ్చు : ‘కరోనా వస్తే మందులు తీసుకుంటే అది పోతుంది. కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడటం సరికాదు. తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టొచ్చు. కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరానితనంగా చూడ్డం సరికాదు. కరోనా అన్నది సోకితే , మందులు తీసుకుంటే పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?.. నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?. తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు. దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?. అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది’ అని సమీక్షలో అధికారులతో సీఎం జగన్ వివరించారు.

పులివెందుల వంటి ప్రాంతానికి కూడా నీటిని అందించాం: చంద్రబాబు

ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలుగుగంగ మొదలు.. పోలవరం వరకు తెలుగు దేశం చేసిన భగీరథ ప్రయత్నాలకు నిదర్శనాలే జలం ఉన్న చోటే సంస్కృతి. నాగరికత జనిస్తాయి జల సంరక్షణ, ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ కృషి చెసింది జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు భగీరథ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుని స్పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణ, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ నిరంతరం కృషి చేసిందని ఆయన ట్వీట్ చేశారు. పులివెందుల వంటి ప్రాంతాలకు కూడా నీటిని అందించామని చెప్పారు. తెలుగుగంగ మొదలు.. నిన్నటి పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం వరకు తమ పార్టీ చేసిన ప్రయత్నాలకు నిదర్శనాలే అని అన్నారు. ‘దేశం ఈరోజు భగీరథ జయంతిని జరుపుకుంటోంది. జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయి. అందుకే మన భారత సంప్రదాయంలో గంగను భూమ్మీదకు తెచ్చి ప్రజలకు వరంగా అందించిన భగీరథుడంటే అంతటి పూజ్యభావం. భగీరథుని స్ఫూర్తిగా జల సంరక్షణకు, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సదా కృషి చేసింది తెలుగుదేశం. ఎన్టీఆర్ నాటి తెలుగుగంగ మొదలు నిన్నటి పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం వరకు తెలుగుదేశం చేసిన భగీరథ ప్రయత్నాలకు నిదర్శనాలే. పులివెందుల వంటి ప్రాంతానికి కూడా నీటిని అందించాం. నీరు-ప్రగతి కార్యక్రమంతో నీటి వనరులను పెంపొందించాం. ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు’అని చంద్రబాబు వరుస ట్వీట్స్‌ చేశ్వారు.

కోవిడ్‌ -19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి కర్నూలు జీజీహెచ్‌ ఆస్పత్రిలో సౌకర్యాలపై పరిశీలన చేయాలని సీఎం ఆదేశం వెంటనే వాటిని మెరుగుపరచడానికి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి:  సీఎం క్వారంటైన్లలో వసతి, సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిపెట్టాలి: పారిశుద్ధ్యం, మంచి భోజనం అందించడానికి దృష్టిపెట్టాలి: ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షల సంఖ్య 94,558  ప్రతి పదిలక్షల జనాభాకు 1,771 పరీక్షలు పాజిటివిటీ కేసుల శాతం 1.48 శాతం, దేశవ్యాప్తంగా 4 శాతం  మరణాల రేటు 2.21 శాతం, దేశవ్యాప్తంగా 3.26 శాతం ఇవికాక 68వేలకుపైగా ర్యాపిడ్‌ టెస్టులు చేశామన్న అధికారులు గడచిన మూడు–నాలుగు రోజుల్లో మరణాలు లేవన్న అధికారులు రానున్న రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి సంఖ్య బాగా పెరుగుతుందన్న అధికారులు ప్రస్తుతం కేసుల వారీగా రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్స్‌ – 80, యాక్టివ్‌ క్లస్టర్స్‌–64, డార్మంట్‌ క్టస్టర్స్‌– 66, 28 రోజుల నుంచి కేసుల్లేని క్లస్టర్స్‌ 20 కేసులు అధికంగా వస్తున్న కర్నూలు, విజయవాడ, గుంటూరుల్లోని ప్రాంతాల్లో పటిష్ట ఆరోగ్య వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు ఇక్కడ పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని వెల్లడి హైరిస్క్‌  ఉన్నవారిని ముందుగానే గుర్తించి, వారికి విస్తృతంగా పరీక్షలు చేసి ముందస్తుగానే వైద్య సేవలు అదించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టామన్న అధికారులు దీనివల్ల మరణాలు లేకుండా చూడ్డానికి వీలవుతుందన్న అధికారులు టెలిమెడిసిన్‌పైనా సీఎం సమీక్ష ప్రిస్కిప్షన్లు, వీటితోపాటు మందులు అందేలా మూడు రోజుల్లోగా సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చ ఇది చాలా అమానవీయమని పేర్కొన్న సమావేశం కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చు: సీఎం అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు : సీఎం అంటరాని వాళ్లగా చూడ్డం కరెక్టుకాదు :సీఎం అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్టుకాదు: సీఎం అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదు: అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు: మనవాళ్లకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి: ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీని  ఆదేశించిన సీఎం కరోనా వస్తే.. మందులు తీసుకుంటే.. పోతుంది: కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడ్డం సరికాదు: తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసు∙కుంటాం, కేసులుకూడా పెడతామన్న అధికారులు: కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరాని తనంగా చూడ్డం సరికాదు: రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?: నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?: తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నంచేయొద్దు : సీఎం దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?: అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది: వ్యవసాయం– అనుబంధ రంగాలు : రైతుల ఇబ్బందులపై ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా దాన్ని పాజటివ్‌గా తీసుకుని ౖవాటి తొలగించడంపై దృష్టిపెట్టండి: వీలైంత త్వరగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌  ద్వారా సమాచారాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి: అలాగే 1902 నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలి: కష్టం ఉందని ఎక్కడనుంచి రైతులు ఫోన్‌చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలి: సీఎం కూపన్లు జారీచేసి పంటలు కొనుగోలు చేసిన విధానంపట్ల రైతుల్లో మంచి సానుకూలత ఉందన్న అధికారులు అన్ని పంటలకూ ఇదే విధానాన్ని వర్తింపుచేయాలన్న సీఎం రోజుకు 60వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు వీలైనంతమేర సేకరించాలని సీఎం ఆదేశం అలాగే మొక్కజొన్న రోజుకు 8వేల టన్నులు సేకరిస్తున్నామని వెల్లడించిన అధికారులు.

టీడీపీ శాశ్వ‌తంగా క్వారంటైన్‌లోనే

తాడేప‌ల్లి: క‌రోనా కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సింది పోయి చంద్ర‌బాబు పారిపోయార‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అన్నారు. హైద‌రాబాద్‌లో కూర్చొని చంద్ర‌బాబు ఇచ్చే దిక్కుమాలిన స‌ల‌హాలు ఎవ‌రికీ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. రాష్ర్టంలో ప్ర‌తిప‌క్షం ప‌నికిరాని ప‌క్షంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో టీడీపీ నేత‌లు ఎక్క‌డున్నారు అని ప్ర‌శ్నించారు. కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికే ఆద‌ర్శంగా నిలిచిందన్నారు. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంద‌ని పేర్కొన్నారు. వాలంటీర్ వ్య‌వ‌స్థ క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తూ క‌రోనా రోగుల‌ను నిర్థారించడంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న క‌రోనా బాధితుల‌కు మంచి పౌష్ఠికాహారం అందిస్తూ, త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ అధికారంలో ఉంటే క‌రోనాను కూడా కాసుల పంటగా మార్చుకునేవార‌ని దుయ్య‌బ‌ట్టారు. హుద్‌హుద్ తుఫాను స‌మ‌యంలో చేసిన చేసింద‌దే క‌దా అని గుర్తుచేశారు.  బ‌ల‌హీన వ‌ర్గాలును ఓటుబ్యాంకు కోసం టీడీపీ నేత‌లు  వాడుకొని వ‌దిలేశార‌ని, వైఎస్సార్‌సీపీ  ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వాళ్ల‌ను ఆదుకున్నామ‌ని పేర్కొన్నారు. జీవో.49  ద్వారా గీత కార్మికుల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోమ‌న్‌రెడ్డి లక్ష 20 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు.  బడుగు బలహీన వర్గాలకు సీఎం జ‌గ‌న్  అభినవ పూలే గా నిలిచారని కొనియాడారు. గుజరాత్ రాష్ట్రంలో వేటకు వెళ్లి ఇరుక్కుపోయిన 4500 మంది మ‌త్స్య‌కారుల‌ను కేంద్రంతో మాట్లాడి, వెనక్కి తీసుకువ‌చ్చారుని వెల్ల‌డించారు.

ఇజ్రాయెల్ లో క‌రోనాపై పోరాటం.. అర‌బ్ డాక్ట‌ర్ కీల‌క‌ పాత్ర!

ఫిబ్రవరి నుండి ప్రతి ఉదయం, ఇజ్రాయెల్ అరబ్ వైద్యురాలు ఖితం హుస్సేన్ తెల్లవారుజామునే  మేల్కొని  కరోనా వైరస్ పై ఇజ్రాయిల్ చేస్తున్న పోరాటంలో పాల్గొనటానికి ఉద్యోగానికి వెళ్తారు. 44 ఏళ్ల హుస్సేన్ ఇజ్రాయెల్ లోని ప్రముఖ  అరబ్ డాక్టర్.. ఈమె  కరోన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ తరఫున ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద ఆసుపత్రి అయిన హైఫా సమీపంలోని రాంబం ఆసుపత్రిలో కరోన కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వైద్య బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుంది మరియు నెలల తరబడి రోజుకు కనీసం 12 గంటల పని చేస్తుంది. ఇజ్రాయెల్ లో ఇజ్రాయెల్ అరబ్బులు పాలస్తీనియన్ల వారసులు,  వారు జనాభాలో 20 శాతం ఉన్నారు మరియు వైద్య వృత్తిలో ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డాక్టర్ హుస్సేన్ ప్రధాన వృత్తి రోగి అరబ్ లేదా యూదు అయినా వ్యక్తుల ప్రాణాలను కాపాడటం-. ఆమె ఈశాన్య పట్టణం రమేహ్‌లో జన్మించింది, కానీ ఇప్పుడు గెలీలీలోని కార్మిల్ నగరంలో నివసిస్తోంది.  కరోనావైరస్ సంక్షోభం లో వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో దాదాపు రెండు నెలలుగా ఆమె తన వృద్ధాప్య తల్లిని సందర్శించలేదు. ఆమె భర్త, న్యాయవాది, వారికి  ఇద్దరు కుమార్తెలు, ఎనిమిది మరియు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఆమె సహోద్యోగులలో కొందరు కరోనా తమ కుటుంబ సభ్యులకు సోకుతుందనే భయంతో ఇంటికి వెళ్ళరు. "నేను నా తల్లిదండ్రులను చూడకుండా ఆపివేసాను, కాని నా కుమార్తెలను చూడటం ఆపలేను" అని హుస్సేన్ అన్నారు. ఇజ్రాయెల్ లో డాక్టర్ ఖితం హుస్సేన్ కృషి కొనియాడబడినది. ఆమె చేస్తున్న పనికి  సర్వత్రా ప్రసంసలు లబించినవి. ఇజ్రాయెల్ సమాజంలో అరబ్ డాక్టర్లు  ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందిగా కొనియాడబడినారు.. ప్రఖ్యాత ఇజ్రాయెల్ కళాకారులు రాంబం ఆసుపత్రికి ఆన్‌లైన్ నిధుల సేకరణను నిర్వహించారు, అరబ్బులు మరియు యూదుల మధ్య సహజీవనం యొక్క చిహ్నంగా దీనిని గుర్తించారు..

ఏపీలో 1400 దాటిన కరోనా కేసులు!

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1400 దాటేసింది.. గత 24 గంటల్లో 71 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ స్టేట్ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ నంబర్ 140లో  పేర్కొంది. తాజాగా నమోదైన 71 కేసులతో కలిపి.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1403కు చేరింది. ఇక, 321 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1051 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో మొత్తం 6,497 సాంపిల్స్ పరీక్షించగా 71 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.  గత 24 గంటల్లో నమోదైన కేసులు పరిశీలిస్తే అత్యధికంగా కర్నూలులో 43 నమోదు కాగా.. కృష్ణా జిల్లాల్లో 10 కేసులు, గుంటూరు, కడపలో నాలుగు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరులో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక, 386 పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గుంటూరులో 287, కృష్ణా  జిల్లాల్లో 246, నెల్లూరులో 84, చిత్తూరులో 80 కేసులు నమోదయ్యాయి.

రిషి కపూర్‌ టాలెంట్‌కు పవర్ హౌస్‌ లాంటి వారు: ప్రధాని మోదీ

రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి స్ఫూర్తివంతమైన, చురుకైన వ్యక్తి ఆయనను కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను ఆయన మృతితో కలత చెందాను బాలీవుడ్ నటుడు రిషి కపూర్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన మృతితో కలత చెందానని ట్వీట్ చేశారు.  'రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్ఫూర్తివంతమైన మనిషి, చురుకైన వ్యక్తి. ఆయన టాలెంట్‌కు పవర్ హౌస్‌ లాంటి వారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనతో చేసిన చర్చ, ఆయనను స్వయంగా కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను' అని మోదీ ట్వీట్ చేశారు. 'ఆయనకు సినిమాలు, భారత అభివృద్ధి కార్యక్రమాలు అంటే మక్కువ ఎక్కువ. ఆయన మృతితో కలత చెందాను. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి' అని మోదీ ట్వీట్ చేశారు.

కరోనా పేషెంట్ల మెనులో చికెన్ బిర్యానీ, డ్రైఫ్రూట్స్!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచనల మేర‌కు క‌రోనా పేషెంట్ల మెను మారింది. తెలంగాణాలో క‌రోనా పేషంట్ల‌కు ఇచ్చిన‌ట్లే పౌష్టికారం అందించాల‌ని ఏపీలోను నిర్ణ‌యించారు.  తాజా పండ్లు, డ్రైప్రూట్స్ తో పాటు చికెన్ బిర్యానీ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ మాసం కావడంతో ముస్లీం కరోనా పేషెంట్లకు నాన్ వెజ్‌తో పాటు బగారా రైస్‌, వెజిటెబుల్ కర్రీస్, డ్రైఫ్రూట్స్ కూడా అందిస్తున్నారు. ఏపీలో కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.  ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అలాగే వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది.  కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు కిమ్స్‌-సవీరా, బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్, సర్వజనాస్పత్రి తదితర ఆస్పత్రుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తోంది. అంతేకాదు క్వారంటైన్‌లో ఉన్న వారికి పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  క‌రోనా పేషెంట్ల డైట్‌లో పౌష్టికాహారాన్ని అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ, మంగళవారం రైస్‌తో పాటు చికెన్‌ కర్రీ, శుక్రవారం రైస్‌తో పాటు చికెట్‌ కర్రీ ఇస్తున్నారు. దీంతో పాటు రెగ్యులర్‌గా మూడు పూటల భోజనంతో పాటు పాలు, గుడ్డు, చిక్కీ, స్నాక్స్, రాత్రి వేళల్లో డ్రైఫ్రూట్స్  ఇస్తున్నారు.  అంతే కాదు  క్వారంటైన్‌ ఉన్న పేషెంట్లకు పౌష్టికాహారం అందించాలని ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు ఏ మాత్రం ఆలోచించవద్దని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

అన్నంపెట్టే రైతు మీద లేని ప్రేమ రుణఎగ‌వేత‌దారుల‌పై ఎందుకు?

రిజర్వు బ్యాంకు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఋణాలు ఎగవేత దారులకు ఊరట కలిగిస్తూ రూ 68 వేల 607 కోట్ల ఋణాలు రద్దుచేసింది. ఈ చర్యతో లాభపడినవారంతా ఒళ్ళు బ‌లిసిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలే. అన్నం పెట్టే రైతు క‌న్నీరు పెడుతుంటే వ్యవసాయ ఋణాల్ని ఎందుకు రద్దు చేయరు? తమ ఋణాలపై నెలవారి కిస్తీ చెల్లించని వేతన జీవులు, రైతులు, రైతు కూలీల ఆస్తులు జప్తు చేసే బ్యాంకులు ఈ బడా పారిశ్రామిక వేత్తలకు, అందునా ఉద్దేశపూర్వకంగా ఋణాల ఎగవేత దారులను ఎందుకు కరుణించాయో చెప్పాలి. ఆరుకాలం కష్టపడితే రైతుకు వ‌చ్చే ఆదాయం ఎంత‌? ఒకవేళ ప్రకృతి కన్నెర్ర చేస్తే? గాలి దుమారం, వడగండ్ల వాన లేదా అగ్గితెగులు, మెడవిరుపు, వగైరా లాంటి రోగాలు వస్తే ఏంటి రైతు పరిస్థితి? అస‌లు రైతు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు. ఎంత ఆదాయం పొందుతున్నాడు. 1. నారుమడి, మరియు పొలం దున్నడం : ₹ 5500=00 2. చదును చేయడం వేయడం : ₹ 1500=00 3. గట్టు చెక్కడం పెట్టడం  : ₹ 1000 =00 4. వరి నాటు : ₹ 4000=00 5. వరి విత్తనాలు హైబ్రిడ్20 కిలోలు : ₹ 1800=00 6.  కలుపు మందు కలుపు తీయడం : ₹ 1800=00                                       7.DAP 2 బస్తాలు : ₹ 2500=00 8. జింక్ 10 కిలోలు  : ₹   600=00 9.గుళికలు: ₹  1000=00 10.యూరియా2బస్తాలు : ₹  700=00 11. పొటాష్1బస్తా : ₹ 950=00 12.మందుల పిచికారీ : ₹ 1000=00 13. వరి కోత మిషన్  : ₹ 2000=00 14. మిషన్ కు ట్రాక్టర్ : ₹ 1000=00 15. ధాన్యం ఆరబెట్టడం : ₹ 500=00  16. హమాలి ఛార్జ్  : ₹ 1000=00                                                 ___      రైతు పెట్టుబడి మొత్తము. : ₹  26,850=00     ____    ధాన్యం దిగుబడి బస్తాలు = 70              1 బస్తాకి కిలోలు    = 40                      70×40         = 28 క్వింటాళ్లు క్వింటాలుకు...ధర * ₹ 1810×28= 50,680=00* రైతు పెట్టుబడి=    ₹ 26,850=00                                          రైతుకు మిగిలింది= ₹ 23830=00 రైతు 6నెలల కష్టార్జితం *రైతుకు 1నెల కష్టార్జితం = ₹ 3971=00    అంటే  రైతుకు ఒక్క రోజుకు పడే కూలి ₹ 132=00     మనకు అన్నం పెట్టే రైతు ప‌రిస్థితి ఇంత దారుణంగా వుంది.  6 నెలలు కష్టపడితే కానీ రైతు పండించే ధాన్యం గింజ మన కంచంలో అన్నం గా మనం తింటాము. రైతు ఆదాయం కనీసం ఇంకొక 50% నుంచి 75% పెరగడమే ఎకైక పరిష్కారం, దానికి ప్రభుత్వం మార్గాలు అనుసరించాలి, రైతు ఉత్పత్తులను విలువ జోడిస్తే చాలా వరకు మేలు చేకూరుతుంది ఉద్దేశపూర్వక ఋణాలు ఎగ్గొట్టిన‌ ‌వారి పట్ల బ్యాంకులకు ఇంత ప్రేమ ఎందుకో తెలియదు. అయినా ఈ వెసులుబాటు వ్యవసాయ ఋణాలకు ఎందుకు ఉండదు? ఉన్నా ఈ స్థాయిలో ఎందుకు ఉండదు? కంటితుడుపు ఋణమాఫీలు మాత్రమే ఎందుకుంటున్నాయి? అది కూడా ప్రభుత్వాలు మాత్రమే అమలు చేస్తున్నాయి కానీ బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదు? దేశంలోని ఏ బ్యాంకు ఆదాయం చూసినా అది ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో వచ్చినదే. ప్రజలనుండి సేకరించిన సొమ్ము ప్రజలకు చెందకుండా ఇలా "ఉద్దేశపూర్వక ఋణ ఎగవేతదారులకు" లబ్ది చేకూర్చడం ఏ ఆర్థికశాస్త్రమో పాలకులే చెప్పాలి. అస‌లు సీక్రెట్ ఇక్క‌డే వుంది. రైతులు రాజ‌కీయ‌నాయ‌కుల‌కు పార్టీ ఫండ్‌గా ఎన్నిక‌ల స‌మ‌యంలో విరాళాలు ఇవ్వ‌రు. పైగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కులే ఓటుకు 500 రూపాయ‌లు చొప్పున ప‌డేస్తారు. ఈ డ‌బ్బంతా నేత‌లు చందాల రూపంలో ఇలా ఉద్దేశపూర్వక ఋణాలు ఎగ్గొట్టిన వారి నుంచి తీసుకుంటారు.  ఈ బ‌డా వ్యాపార‌స్థులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నుంచి 20 శాతం వ‌ర‌కు పార్టీ ఫండ్‌గా రాజ‌కీయ నేత‌ల‌కు విరాళాలుగా అందిస్తారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పాల‌కులు బ్యాంక్ నుంచి తీసుకున్న పూర్తి రుణాన్ని మాఫీ చేస్తూ పాల‌సీ నిర్ణ‌యం తీసుకుంటారు. అది లెక్క‌. అంతే.

ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్ పదవీ విరమణ

ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ ఏప్రిల్ 30- గురువారం నాడు పదవీ విరమణ చేశారు. నవంబర్ 6వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి మానవ వనరుల అభివృద్ధికి బదిలీ అయిన దగ్గర నుండి ఆరు నెలల పాటు సెలవుపై ఉన్నారు. పదవీ విరమణ చేయాల్సిన దృష్ట్యా ఎల్.వి. సుబ్రహ్మణ్యం నిన్న జిఎడి కి రిపోర్ట్ చేసి గురువారం నాడు రిటైర్ అయ్యారు. 1983 బ్యాచ్ కి చెందిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం అఖిల భారత సర్వీసులో మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంకు సాధించారు. నల్గొండ జిల్లాకు శిక్షణకు వెళ్లిన మొదటి అధికారి సుబ్రహ్మణ్యం. 1986లో వరంగల్ జిల్లా ములుగు సబ్-కలెక్టర్ గా పని చేసిన సందర్భంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా భక్తుల మన్ననలు పొందారు. పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఎల్.వి.సుబ్రహ్మణ్యం మూడేళ్ల పాటు పని చేసి గిరిజనుల మౌలిక అంశాలపై దృష్టి పెట్టి సృజనాత్మకమైన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. గిరిజన భూములకు సాగునీటి సౌకర్యాలు, పోడు భూములను ఉద్యానవనాలుగా మార్చి అందరి ప్రశంసలు పొందారు. గిరిజన విద్యాభివృద్ధికి సృజనాత్మకమైన పథకాలను అమలు చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొద్ది రోజులు పనిచేసాక, 1990లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ అయ్యారు. ఈ సందర్బంగా గ్రామీణ, గిరిజన అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.మధ్యలో ఒక సంవత్సరం పాటు బ్రిటన్ లో ఎకనామిక్స్ లో ఎం.ఎస్.సి డిగ్రీ కోసం యూనివర్సిటీ అఫ్ బ్రాడ్ఫోర్డ్ లో చేరారు. మళ్ళీ భారత్ కి వచ్చాక రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండిగా పని చేసిన సమయంలో భారీ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తూ తక్కువ ఖర్చుతో కూడుకున్న సాంకేతికతను అమలు చేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. 1987లో హైదరాబాద్ వాటర్ వర్క్స్ వైస్ చైర్మన్, ఎండి గా కంప్యూటరీకరణ ద్వారా వినియోగదారులకు మరింత చేరువలో సేవలు ఉండేలా సంస్కరణలు తీసుకొచ్చారు. చుట్టూ ఉన్న ఏడు మున్సిపాలిటీలలో (ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిథిలో ఉన్నాయి) నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచిన తీరు ప్రజలు, నాయకుల ప్రసంసలు అందుకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా ఎల్.వి.సుబ్రహ్మణ్యం హయాంలోనే చేపట్టారు. జాతీయ క్రీడల నిర్వహణలో ప్రధాన భూమిక: 2002 లో హైదరాబాద్ లో జరిగిన 32 వ జాతీయ క్రీడలు ప్రతిష్టాత్మకమైనవి. అవి విజయవంతంగా పూర్తి కావడంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాత్ర కీలకం అయింది. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణం ఏర్పాటు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నమూనా గా నిలిచింది. తన కనుసన్నల్లోనే రూపుదిద్దుకున్న క్రీడా మౌలిక సౌకర్యాల అభివృద్ధి వల్ల అంతర్జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదిక అయింది. పదోన్నతిలో భాగంగా వైద్య శాఖ, ఆర్ధిక శాఖ లో ముఖ్య కార్యదర్శిగా పని చేసారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం. 2006లో స్వైన్ ఫ్లూ ప్రబలినపుడు దానిని ఎదురుకోడానికి ఆయన చూపిన నాయకత్వ పటిమను ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. మౌలిక రంగ అభివృద్ధిలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం. 2007 లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అఫ్ ఏపి (ఇన్కాప్) ఎల్.వి. సుబ్రహ్మణ్యం హయాంలోనే స్థాపన జరిగింది. విమానాశ్రయాల వికేంద్రీకరణ, ఏపి లో గ్యాస్ పైప్ లైన్ల నెట్ వర్క్, ప్రతిష్ఠాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ప్రణాలికల రూపకల్పన చేసి మౌలిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. ఈ 8 లైన్ల రోడ్ నెట్వర్క్ అత్యంత ఉన్నత ప్రమాణాలు కలిగిన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక అయింది. ఆయన చేపట్టిన ఓఆర్ఆర్ ప్రతిపాదనలే నేడు హైదరాబాద్ కు మణిహారం అయ్యాయి. టీటీడీలో పలు కీలక సంస్కరణలు: తిరుమల తిరుపతి దేవస్థానాలు కి ఎగ్జిక్యూటివ్ అధికారిగా విధులు నిర్వహించారు ఎల్.వి.సుబ్రహ్మణ్యం. తిరుమలేశుని సన్నిధిలో ఒక ఉన్నతాధికారిగా ఆయన అందించిన సేవలు దేవస్థానం అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. ధర్మ ప్రచార కార్యక్రమాలను రూపొందించి విస్తృతంగా అమలు చేశారు. ఢిల్లీ, కురుక్షేత్ర, కన్యాకుమారి లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించడానికి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చొరవ తీసుకున్నారు. టీటీడీ పాలనా వ్యవహారాల్లో తనదైన శైలిలో మార్పులు తెచ్చారు. 2019 ఏప్రిల్ 7 వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు మేరకు ఎల్.వి.సుబ్రహ్మణ్యం రాష్ట్ర పాలనలో అత్యున్నతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. సాధారణ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందారు. 2019 నవంబర్ 7వ తేదీన బదిలీ అయ్యాక సెలవుపై వెళ్లారు. 2020 ఏప్రిల్ 30వ తేదీ నాడు రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే ఎల్.వి.సుబ్రహ్మణ్యం తన సేవలకు గుర్తింపుగా అనేక సంస్థల సత్కార సన్మానాలను అందుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు: తన 36 సంవత్సరాల 8 నెలల 3 రోజుల ఉద్యోగ కాలంలో తోటి అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలని ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ సందర్బంగా అన్నారు. ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ తనకు ఎంతో మంది ప్రేరణగా నిలిచారని చెప్పారు. కాల ప్రవాహం, వేగంతో సాగిందని ఇప్పుడు అనిపిస్తోందని, ఎంతో మంది శ్రేయోభిలాషులు తన ప్రస్థానంలో చేదోడు వాదోడుగా, తన వెంట ఉన్నారని, వారందరికీ రుణపడి ఉంటానని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక అద్భుత ఆశయాన్ని నమ్ముకొని, కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు సాగుతున్న తనను తన బాగు కోరిన ఎందరో ముందుకు నడిపించారని, తన అనుభవం కూడా ఎంతో నేర్పిందని అయన చెప్పారు. కర్మణ్యే వాదికా రస్తే ... వంటి గీతా సారాలు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తు తన పయనంలో మరింత నైతిక స్థైర్యాన్ని అందించాయని ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రభుత్వంలో తనకు సహకరించిన నేతలు, అధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

మోడీ ట్విటర్ ఖాతాపై వైట్‌హౌజ్‌కు మోజు తీరింది!

భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల కారణాలేంటో వెల్లడించలేదు. మూడు వారాల క్రితం వైట్‌హౌజ్‌ అనుసరిస్తున్న ఏకైక ప్రపంచ నేతగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. వైట్‌హౌజ్‌ అమెరికా అధ్యక్షుడి నివాసభవనం. ప్రస్తుతం వైట్‌హౌజ్‌ ట్విటర్‌ ఖాతాను దాదాపు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు.ఏప్రిల్‌ 10 నుంచి వైట్‌హౌజ్‌ మోదీని అనుసరించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మోదీ మధ్య స్నేహం, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఇలా చేసింది. ఆ తర్వాత ట్రంప్‌ కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై ఆంక్షలను మోదీ సడలించిన సంగతి తెలిసిందే.

టీడీపీ వాళ్లు చేస్తే కరోనా రాదా?

కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? : సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద మానవ సంక్షోభమే సంభవించిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ట్వీట్టర్‌ వేదికగా కరోనా విభృంజిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆ పని చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు, కరోనా లాంటి కష్టకాలంలో ఇలాంటి ఆరోపణలు తగవని హితవు పలికారు. కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

వైసీపీ గుండాలు శిలాఫలకాల్ని ధ్వంసం చేస్తున్నారు!

కరోనా మహమ్మారి తో ప్రజలు విలవిలాడుతుంటే అధికార వైసీపీ గుండాలు అభివృద్ధి శిలాఫలకాలును ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు  పాల్పడుతున్నారని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలా ఫలకాల ధ్వంసంతో తాను చేసిన అభివృద్ధిని ప్రజల హృదయాల్లో నుంచి చెరపలేరన్నారు. మార్టూరు మండలం డేగరముడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్లాది రూపాయలతో వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు అప్పటి మంత్రులు పరిటాల సునీత, సిద్ధ రాఘవరావు లు శంకుస్థాపన చేశారని ,ఆ శిలా ఫలకాలను మంగళవారం రాత్రి వైసిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు.  ఈ ఘటనపై పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక పక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిది పోయి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి శిలాఫలకాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు.  శిలా పలకాలని ధ్వంసం చేస్తే తాను చేసిన అభివృద్ధిని ప్రజల హృదయాల్లో నుంచి చెరప లేరని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎవరి హయాంలో జరిగాయో ప్రజలందరికీ తెలుసునన్నారు. నియోజకవర్గ సర్వతోముఖా  అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానన్నారు. అలాగని అభివృద్ధిని ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన ప్రతి అడుగు ప్రజల కోసం ప్రగతి కోసం అని స్పష్టం చేశారు. అరాచకాలతో అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. అరాచకాలకు పాల్పడటం హేయమైన చర్య.  తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచానన్నారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

వలస కార్మికులను రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు!

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరోనా పై ఏర్పాటు చేయబడిన మంత్రులు బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం(GOM) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును మంత్రుల బృందం సమీక్షించింది.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఓపి సేవలు అందించడం లేదని సమావేశం దృష్టికి తేగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపి సేవలు అందించాలని దీనీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రుల బృందం అధికారులకు స్పష్టం చేసింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల కు చెందిన వలస కూలీలు వారు రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారా లేక వారి రాష్ట్రాలకు వెళ్ళాలని అకుంటున్నారో తెల్సుకుని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిఓయం అధికారులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే వలస కూలీలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా ఈ మంత్రుల బృందం సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించి అధికారులకు తగిన మార్గనిర్దేశం చేసింది.