పేద‌ల్ని ఆదుకోవ‌డానికి సీఎం కు మనసు రావట్లేదా?

'ప్రభుత్వ భవనాలకురంగుల కోసం రూ.2600 కోట్లు ఖర్చు పెట్టారు కానీ పేదవారికి సాయం చేయడానికి జగన్‌కు మనసు రావడం లేదు. వాలంటీర్లతో నిత్యావసరాలను డోర్‌ డెలివరీ ఎందుకు చేయడం లేదు?. పేదల ఆకలి కంటే అవినీతికే ప్రాధాన్యత ఇస్తూ జగన్‌ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేల సాయం చేయాలి' అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని అని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాలు కరోనాను నియంత్రిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోనూ అవినీతి మయం...

జగన్ రెడ్డి అవినీతి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు  రెండు చక్రాలు లాంటి వార‌ని శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న విమ‌ర్శించారు.  జగన్ చేత‌గాని అసమర్ధత పాలన ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది.  భవిష్యత్ లో కరోనా మరింత ఉదృతం కాబోతుందని ఆయనే చెప్పారు.  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కరోనా జ్వరం లాంటిది, వస్తుంది, పోతుందని చిన్నపిల్లవాడిలా జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని ఆయ‌న విమ‌ర్శించారు.  కరోనాతో సహజీవనం చేయాలని ఆయన వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  కరోనా మహామ్మారి ఎక్కువగా ఉందని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా అంటే ఏమీ లేదని జగన్ చెప్పడం సిగ్గుచేటు.  చంద్రబాబు నాయుడు అనేక విపత్తు సమయంలో ఏపీని ఆదుకున్నారు. ఈ సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరమ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగితుంటే జగన్ మాత్రం సిల్లీగా ఉంటున్నారు.  ప్రపంచ మేథావులు ఏం మాట్లాడుతున్నారు. అందుకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంద‌న్నారు.   తెలంగాణలో కేసులు  తగ్గుతుంటే ఏపీలో కేసులు పెరుగుతున్నాయి.  ప్రజలకు కరోనా రావాలని జగన్ కోరుకుంటున్నారా? కరోనా పుట్టిన చైనాలోను తగ్గుముఖం పడితే ఏపీలో మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  అభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ను ఎందుకు ఆదర్శంగాతీసుకోవడం లేదు?  ప్రాతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తామన్నారు. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు?  డాక్టర్లకు మాస్కులు లేవని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేశారు. శానిటైజేషన్ లేదని చెప్పిన నగిరి మున్సిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేశారు.  5 కోట్లకు 3 మాస్కులు కావాలంటే 15 కోట్ల మాస్కులు కావాలి. ఇప్పటి వరకు ఎవరికి, ఎక్కడ ఇచ్చారు.  కరోనాను అడ్డం పెట్టుకొని మాస్కుల రూపంలో స్కాం చేద్దామని చూస్తున్నారు.  మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం దేశంలో ముఖ్యమంత్రులందరూ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానికి సూచనలిస్తే జగన్ మాత్రం లాక్ డౌన్ ను తొలగించాలని చెప్పడం సిగ్గుచేటని ఆయ‌న విమ‌ర్శించారు. తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతల మందు కంపెనీలను తెరిచి అమ్ముకొని ప్రజలను దోచుకునేందుకు మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తారా?  అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిప‌డ్డారు.  రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల మధ్య సరిహద్దులు ఏ మాత్రం ఉన్నాయి? కరోనాను అంటించేందుకు మద్యం షాపులు తెరుస్తున్నారా?  ప్రజలకు రూ.5వేలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు?  మూడు మాస్కులకు అయ్యే డబ్బులు ప్రజలకు ఇస్తే వాళ్లే మాస్కులు కొనుక్కుంటారు కదా?   విజయసాయిరెడ్డి  వైసీపీ మందిని రోడ్ల వెంటా తిప్పుతూ ఆర్బాటంగా తిరుగుతున్నారు.  కరోనా ఈ మాత్రం అదుపులో ఉందటానికి పోలీసులే కారణం. వారికి నా సెల్యూట్ చేస్తున్నాం. కాని అధికారపక్షం నాయకులు ఇష్టానుసారంగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయసాయిరెడ్డి లెక్కలేని తనంగా తిరుగుతున్నారు. పరిపాలన అవగాహన లోపంలో భాగంగా ఇవ్వన్ని జరుతున్నాయి. లాక్ డౌన్ తగ్గుముఖం పట్టాల్సింది ఎందుకు పెరుగుతున్నాయి. కరోనా తగ్గించలేకపోతే వైసీపీ నేతలనైనా కంట్రోల్ లో పెట్టాలని ఎమ్మెల్సీ సూచించారు. వైసీపీ నేతలు బ‌యట తిరుగుతున్నారు. ప్రజలు పాలనతో విసుగెత్తిపోయారు. ఆరోగ్య సర్వే జగన్ ఎక్కడ, ఎప్పుడు చేయించారు.  ఇదంతా అవాస్తవం. ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? జగన్ ఇప్పటికైనా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి.  ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సొంత జిల్లా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఇటలీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆయన దాని గురించి మాట్లాడరు. ఇష్టానుసారంగా మాట్లాడే అనీల్ కుమార్ యాదవ్ కు కూడా నెల్లూరు లో కరోనా కేసులు కంట్రోల్ చేయడం చేతగాక చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డి, బుగ్గన ఇద్దరూ జగన్ అవినీతి బండికి రెండు చక్రాలు. ఎప్పటికైనా రెండు టైర్లు పంచర్ అవ్వడం ఖాయం.  వైన్ షాపులు ప్రభుత్వం తెరవటం విరమించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు.  చంద్రబాబు నాయుడు పాలన చూశాం కాబట్టి జగన్ పాలన ఒక సారి చూద్దామని ప్రజలు భావించారు. పరిపాలన ఇచ్చారని ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజలు విప్లవం ద్వారా గద్దె దింపుతారని బుద్ధా వెంకన్న అన్నారు.

వైసీపీ నేతలు 'జాంతోప్సియా' వ్యాధితో బాధపడుతున్నారు: గోరంట్ల

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలు తెల్ల కనుగుడ్డు పచ్చబడడం అనే సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాధిని 'జాంతోప్సియా' అంటారని కూడా వివరించారు. "ఒకవేళ దీనికి కూడా పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటారేమో.  పచ్చకామెర మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో వెంటిలేటర్లు కూడా లేవు, పనిచేయని టెస్టింగ్ కిట్లు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బాగా అలవాటైన పని ఒకటి చేయండి. తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి. అప్పటికీ అటువైపు కూడా పచ్చగా ఉందంటే అది మీ దురదృష్టం" అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మేరకు గోరంట్ల ట్వీట్ చేశారు.

మద్యం షాపులు ఏమైనా మెడికల్‌ షాపులా?

మద్యం డిస్టరీలు ఓపెన్‌ చేసి మద్యం తయారు చేయించే బదులు.. అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవు పలికారు. ఆధునిక యుగంలో కూడా రాష్ట్రంలో పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారంటే వైకాపా నేతలు సిగ్గుపడాలన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.  ప్రపంచమంతా కరోనా నివారణకు ఔషధం తయారు చేసే పనిలోఉంటే ..జగన్‌ మాత్రం కమీషన్ల కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకీ కరోనాకేసులు పెరిగి నిత్యావసర సరకుల దుకాణాలే మూసివేసే పరిస్థితి ఉంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.  మద్యం షాపులు ఏమైనా మెడికల్‌ షాపులా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందన్నారు.

ఏపీలో 25 శాతం పెరిగిన మద్యం ధరలు...

ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో మద్యం దొరక్క అల్లాడుతున్న వారికి ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సడలింపుల్లో భాగంగా మద్యం దొరుకుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియులకు 25 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన మింగుడు పడటం లేదు. మద్యం విక్రయాలను నిరుత్సాహ పరిచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ సమీక్షలో నిర్ణయించారు. దీంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మద్య నియంత్రణలో భారంగా ఇప్పటికే తొలి ఏడాది 20 శాతం దుకాణాలను మూసేసిన ప్రభుత్వం... అదనపు పన్నులను సైతం వడ్డించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు కరోనా లాక్ డౌన్ నేఫథ్యంలో నష్టపోయిన మొత్తాన్ని కూడా వీరి నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్లు అర్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరుస్తుండగా.. రేట్లను పెంచడం మాత్రం తథ్యమని చెబుతోంది. అలాగే మద్యం దుకాణాల వల్ల సామాజిక దూరం పాటించడంతో పాటు ఇతర ఆంక్షలను కూడా విధిస్తోంది. దీంతో మద్యం దుకాణాలకు రావాలంటేనే మందుబాబులు బెంబేలెత్తుతున్నారు.

నెలరోజుల్లోనే కరోనాకు వ్యాక్సిన్?

ప్రయోగాలు చేయిస్తున్న సీఎస్ఐఆర్... కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ ను భారతీయ శాస్త్రవేత్తలు నెల రోజుల్లోనే తయారు చేయడమే కాక మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇండియాలోనే అత్యున్నతమైన పరిశోధన, అభివృద్ది సంస్థ సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్) ప్రస్తుతం కరోనా వైరస్‌ను నివారించే డ్రగ్‌ మీద ప్రయోగాలు చేస్తోంది. మరింత విస్తృతమైన ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కోరింది. అన్నీ కుదిరితే నెలరోజుల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ పరిశోధన గురించి అవగాహన ఉన్న సైంటిస్టులు తెలిపినట్టు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. కాడిలా ఫార్మాసిటికల్స్‌కు చెందిన Sepsivac‌ మీద ఈ పరిశోధనలు చేస్తున్నారు. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఒప్పందం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా సీఐఎస్ఆర్ పరిశోధనలు చేస్తోంది. ఇమ్యునోథెరపీ ట్రీట్‌మెంట్‌‌కు ప్రాథమికంగా డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌, భోపాల్ ఎయిమ్స్, మరోచోట 50 మంది పేషెంట్ల మీద పరిశోధించారు. 30 నుంచి 45 రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు త్వరగా వస్తాయని అంచనా వేస్తున్నారు. మూడో దశలో 1100 మంది మీద పరిశోధనలు చేయనున్నారు. అప్పటి వరకు లాక్ డౌన్ గడువును కూడా దశల వారీగా పెంచుకుంటూ పోవాలని శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.

కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా? కళా వెంకట్రావు

విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముంది ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగోలేవని విమర్శించారు. ప్రపంచమంతా కరోనా నివారణ కోసం మందు తయారు చేసే పనిలో ఉందని, ఏపీ సీఎం జగన్‌ మాత్రం తన కమిషన్‌ కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా? అని కళా వెంకట్రావు మండిపడ్డారు. విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు వున్న ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేయట్లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. మద్యం దుకాణాలకు బదులు అన్న క్యాంటీన్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకు? అని ఆయన నిలదీశారు. వెంటనే రాష్ట్రంలోని పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

దొంగ కేసులకు భయపడను.. టీడీపీ ఎంపీ కేశినేని

సామాజిక దూరం పాటిస్తూనే  పంపిణీ చేశాం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పేదల కోసం పని చేస్తా ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై నాని స్పందిస్తూ, సామాజిక దూరం పాటిస్తూనే తాను నిత్యావసరాలు పంపిణీ చేశానని, గుమిగూడినట్టు మార్ఫింగ్ ఫొటోలు పెట్టి తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీపై మండిపడ్డారు. తనపై పెట్టిన దొంగ కేసులకు భయపడి పేదలకు, ఆపదలో ఉన్న వారికి సేవ చేయడం మానేస్తానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని, ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు నిత్యావసరాల పంపిణీ సమయంలో గుమిగూడిన విషయమై తాము ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు. కేవలం, ప్రతిపక్ష పార్టీల నాయకులపైనే కేసులు నమోదు చేస్తారా? అంటూ విమర్శలు గుప్పించారు.

జన్‌ధన్‌ ఖాతాల్లో రెండో విడత నగదు జమ

ఈ నెల 4 నుంచి ఉపసంహరణకు అవకాశం న్యూదిల్లీ: రెండో విడతగా మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో మే నెలకు సంబంధించి రూ.500 చొప్పున ఆర్థిక సాయం జమ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుంచి నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ‘అకౌంట్‌ నంబర్ల చివరి అంకె ఆధారంగా ఖాతాదారులకు నిర్ణీత రోజు నగదు తీసుకునేందుకు అవకాశం ఇస్తాం. తద్వారా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గి.. భౌతిక దూరం పాటించేందుకు వీలు కలుగుతుంది. 11వ తేదీ అనంతరం ఏ రోజైనా తీసుకోవచ్చు’అని ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్‌ పాండా శనివారం తెలిపారు. వీలైనంత వరకు ఏటీఎం కార్డులు, బ్యాంకు మిత్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు రూ.500 చొప్పున జమ చేస్తామని కేంద్రం ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో 20.05 కోట్ల ఖాతాల్లో రూ.10,025 కోట్లు జమ చేసింది.

వైద్యులకు వందనం.. ఆస్పత్రులపై పూలవర్షం

కరోనా యుద్ధవీరులకు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి యావత్‌ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది.  నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ  వైద్యులే భేష్‌ అంటూ కితాబిస్తున్నాయి.  కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా  త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి. విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. రక్షణ దళాల అధికారులు ఈ సందర్భంగా వైద్యులను సంత్కరించారు. దిల్లీలోని పోలీస్‌ యుద్ధస్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. పోలీసుల గౌరవార్థం వైమానిక అధికారులు యుద్ధ స్మారకానికి దండలు వేశారు. విశాఖ, ముంబయి, చెన్నై, కొచ్చిలోని నౌకలకు ఈరోజు రాత్రి 7.30గంటల నుంచి 11.59 వరకు దీపాలంకరణ చేయనున్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిపై.. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలకు కృతజ్ఞతగా గాంధీ ఆసుపత్రిపై భారత వాయుసేన ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వద్ద హకీంపేట నుంచి వచ్చిన హెలికాప్టర్‌ గులాబీ పూల వర్షం కురిపించింది. వైద్య సిబ్బంది అంకితభావానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వద్ద పలువురు నేతలు వైద్యులకు సంఘీభావం తెలుపుతూ జాతీయజెండాలను ప్రదర్శించారు.

తేడా రెడ్డి దొంగ ఏడుపులు.. బుద్దా ట్వీట్

విజయవాడ: టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ బుద్దా చేసిన ట్వీట్ నెట్టింట టీడీపీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ‘‘తేడా రెడ్డికి ఆప్షన్ అంటే ఏంటో తెలియదు పాపం. విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆప్షన్ ఇవ్వండని అడిగితే ఇంగ్లీష్ వద్దంటారా అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుని చంపేస్తారా అంటూ బ్లూ మీడియా హడావిడి చేసింది. వైకాపా నాయకులు తెలుగు పరిరక్షణ కోసం పుట్టిన వీరుల్లా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు అవేవీ ఎరగనట్టు, ఈ రోజే జైలు నుంచి విడుదలైనట్టు, ఇంగ్లీష్ మీడియం కనిపెట్టినట్టు గన్నేరుపప్పు, తేడా రెడ్డి కట్టింగ్ ఇస్తున్నారు’’ అంటూ బుద్దా ట్వీట్ చేశారు.

రోజుకి 100 టెస్టులు చేస్తే ఎలా రాజేంద్రా?

రోజుకీ 100 టెస్టులు చేస్తే అమెరికా,రష్యా కూడా కరోనా ఫ్రీ అవుద్ది రాజేంద్ర. సెకండరీ కాంటాక్ట్ కేసులకి ...ఢిల్లీ వెళ్ళని వాళ్ళకి...విదేశాల నుండి రాని వాళ్ళకి తెలంగాణలో కరోనా టెస్టులు చేయరంట.(ఇది తెలంగాణ ప్రభుత్వం ఆఫీసియల్ గా ప్రకటించింది) గుంటూరు సిటీలో 140 కేసుల్లో 110 కేసులు సెకండరీ కాంటాక్ట్ కేసులే...కానీ తెలంగాణా రాష్ట్రంలో సెకండరీ కాంటాక్ట్స్ కి కరోనా పరీక్షలు చేయరు( వాళ్ళకి కరోనా లక్షణాలు ఉన్నా చేయట్లేదు ). తెలంగాణ రాష్ట్రంలో కరోనా లక్షణాలు లేని వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోరు అంట (ఈ లెక్కన మన దేశంలో 100 లో 80 మందికి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.) ఓక పక్కన సరిగ్గా టెస్టులు చేయకుండా...కరోనా వచ్చినా వ్యాధి తీవ్రత లేదని హాస్పిటల్ లో చేర్చుకోకుండా అబద్దాలు చెప్పుకుంటూ సక్సెస్ఫుల్ గా మీడియాని మ్యానేజీ చేస్తున్నారు ...మీ రాష్ట్రం మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కాదనం. ఇంత‌కీ 7 రోజులుగా కేంద్ర బృందాలు తెలంగాణ లో ఎందుకు పర్యటిస్తున్నాయో చెప్తావా?? తెలంగాణలో చివరిగా మరణించిన 3 మరణాల్లో ...ఒకరు హాస్పిటల్ లో చేరిన 6 గంటల్లో... మరొకరు 12 గంటల్లో ...మూడో వాళ్ళు 24 గంటల్లో ఎందుకు చనిపోయారో చెప్తావా ?? ముందే వాళ్ళని గుర్తించి హాస్పిటల్ లో చేర్పిస్తే బ్రతికేవాళ్ళు కదా !! ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజుల్లో ఒక్క కరోనా మరణం కూడా లేదు. ఈ విష‌యమే ప్ర‌శ్నిస్తే మీ ముఖ్య‌మంత్రి ఏమో ప్ర‌శ్నించిన‌వాడికే క‌రోనా రావాలంటూ శాప‌నార్ధాలు పెడ‌తారు!

కరోనా కట్టడి కంటే దోపిడీ గురించే సీఎం ఆలోచనంతా: బుచ్చయ్య చౌదరి

ముఖ్యమంత్రి కరోనా కట్టడి కంటే దోపిడీ ఎలా చేయవచ్చుననే ఆలోచన ఎక్కువగా చేస్తున్నారన్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పేదల ఇళ్ల కోసం సేకరించే భూముల కొనుగోళ్లలో కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుంభకోణం జరుగుతోందని గోరంట్ల విమర్శించారు. కాకినాడలో మడ అడవులు, కోరుకొండలో బురద కాలువలకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములను సేకరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని విమర్శించారు. ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా మడ అడవులు, భూములను నరికివేశారన్నారు. భూ సేకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని, పంపకాలు తెగక రోడ్డు ఎక్కుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రజోపయోగకరమైన భూముల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.

తిరుమలలో ఒకేసారి వేలు, లక్షల మంది దర్శనాలు ఇక ఉండవు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

*లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాతే తిరిగి దర్శనాలు  * కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంది  * క్యూలైన్లలో పలు మార్పులు *మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు కల్పిస్తాం లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై ఆ దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే, గతంలోలా వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవని సుబ్బారెడ్డి తెలిపారు. కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఉంటాయని చెప్పారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

సంఘటిత ఆచరణతో కరోనాపై పోరు సాగిద్దాం!

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 4 నుంచి మరో 2 వారాల పాటు 3వ విడత లాక్ డౌన్ (3.O) ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించడం కోవిడ్ -19తో సాగుతున్న సమిష్టిపోరాటంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ నిర్ణయం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా వ్యాపారుల సహకారంతో వైరస్ వ్యతిరేక పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రజల జీవితాల పై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించి చాలా వరకూ విజయం సాధించింది. ఈ ప్రయత్నం అందించిన సానుకూల ఫలితాలను సమాజం హర్షిస్తోంది. లాక్ డౌన్ 3.O విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు భరోసాను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు మరియు జీననోపాధిని ఏక కాలంలో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం మొదలు కానుంది. గ్రీన్ జోన్స్ లో చాలా భాగం, ఆరెంజ్ జోన్స్ లో కొంత భాగం ఆవసరమైన ఆర్థిక పునరుజ్జీవనానికి పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత మార్గంలో అడుగు ముందుకు వేయాలి. ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమౌతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ఇలాంటి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. మొదటి, రెండవ లాక్ డౌన్ సమయాల్లో తీసుకువచ్చిన గొప్ప మార్పులు, రాబోయే కాలంలో వైరస్ పూర్తిగా అంతమొందే వరకూ అన్ని చోట్ల కొనసాగుతూనే ఉండాలి. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, సమావేశాలు నిర్వహించకపోవడం లాంటి వాటి ద్వారా ఇప్పటి వరకూ ఎంతో లబ్ధి పొందాం. ఇక మీదట కూడా ఇదే మార్గంలో పయనించాలి. ఎందు కంటే కనిపించని ఈ శత్రువు మనం ఆలసత్వం వహిస్తే మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకపోరాటంలో భారతదేశంలో ముందంజలో ఉంది. దీన్ని నేను కోవిడ్ – కామనాలిటి ఆఫ్ విజన్, ఇంటెంట్ అండ్ డిటర్మినేషన్ (‘COVID’ – Commonality of Vision, Intent and Determination) గా భావిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో విభిన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నివసిస్తున్న 130 కోట్ల మంది భారతీయులు అనుసరించిన ఇలాంటి సాధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వంటి ముందు వరుస యోధులతో పాటు రైతులు, ప్రజలు కూడా ప్రశంసలకు అర్హులే. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు, సాధించాల్సిన విజయం చాలా ఉంది. కోవిడ్ వైరస్ అన్ని వర్గాలతో కలిసి ఎక్కువ కాలం జీవించగలదని అంచనా వేసిన నేపథ్యంలో, మనం ఈ మహమ్మారి నిజాన్ని అంగీకరిస్తూనే దూరం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి. లాక్ డౌన్ 3.Oలో మనమంతా ప్రవర్తించే విధానం మీద ఆధారపడే కరోనా తర్వాత సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఉద్దేశించిన తదుపరి చర్యలు ఉంటాయి. రెండు వారాల పరిమితి, భవిష్యత్ కార్యాచరణ కాలపరిమితిని నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక పరీక్ష. ఒక దేశంగా, మనమంతా ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణులం కావడం అత్యం కీలకం. ఇందులో మనం ఏ విధంగానూ విఫలం కామని నా గట్టి నమ్మకం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు తదుపరి పొడిగింపు, సడలింపు, ముగింపు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. ఈ దిశలో పౌరులందరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానంటూ త‌న ప్ర‌సంగం ముగించారు.

హైకోర్టులో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు

*ప్రమాణస్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి *నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు హైకోర్టులోని ఒకటవ నెంబర్ హాల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జితేంద్ర కుమార్ మహేశ్వరి నూతనంగా నియమితులైన న్యాయమూర్తులచే శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత హైకోర్టు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్‌ జనరల్‌ బి. రాజశేఖర్ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత దస్త్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా: చంద్రబాబు ట్వీట్

మీడియాపై వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సొంతమీడియాలో ఎవరి మీదైనా, ఎంత అసత్య ప్రచారమైనా చేస్తుంటారని, వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలల్లి కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు. కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్ళైనా నిజాన్ని చెబితే వైసీపీ వాళ్ళు కుతకుతలాడిపోతుంటారన్నారు. ఆ మీడియా ప్రతినిధులపై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారని విమర్శించారు. మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం, వారి బంధువులు, మీడియాతో ఏమాత్రం సంబంధం లేని వెంకట కృష్ణ, విద్యార్ధి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయించడమేంటని ప్రశ్నించారు. ‘‘ఏమిటీ అరాచకం? దీన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలి. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతుంది. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తాం. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని ఘాటుగా ట్వీట్ చేశారు.

ఏపీలో వలసకూలీల అనుమతికి మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రిలీఫ్‌ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని అనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే వారిని బస్సులో 50 శాతం మించకుండా తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్‌, అనంతరం మరో 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే ఆ గ్రూప్‌ మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చిన వారికి స్క్రీనింగ్‌ సహా పూల్‌ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెడ్‌జోన్‌, కంటైన్‌మెట్‌ జోన్‌ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్‌కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

లాక్ డౌన్ సమయంలో జరిమానాలా? హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!

ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన అంశంపై కోర్టు మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులకు దాదాపు రూ. 2,500 కోట్ల అపరాధ రుసుము విధిస్తూ గనులు, భూగర్భశాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు ఇంతకు ముందే కొట్టేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో, క్వారీ యజమానులు బెంబేలెత్తిపోయారు. ఓ క్వారీ యజమాని మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే ఒక తీర్పును వెలువరించామని... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడే ప్రభుత్వ నోటీసులకు క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది.