కరోనా పేషెంట్ల మెనులో చికెన్ బిర్యానీ, డ్రైఫ్రూట్స్!
posted on Apr 30, 2020 @ 12:25PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు కరోనా పేషెంట్ల మెను మారింది. తెలంగాణాలో కరోనా పేషంట్లకు ఇచ్చినట్లే పౌష్టికారం అందించాలని ఏపీలోను నిర్ణయించారు.
తాజా పండ్లు, డ్రైప్రూట్స్ తో పాటు చికెన్ బిర్యానీ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రంజాన్ మాసం కావడంతో ముస్లీం కరోనా పేషెంట్లకు నాన్ వెజ్తో పాటు బగారా రైస్, వెజిటెబుల్ కర్రీస్, డ్రైఫ్రూట్స్ కూడా అందిస్తున్నారు. ఏపీలో కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అలాగే వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది.
కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు కిమ్స్-సవీరా, బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్, సర్వజనాస్పత్రి తదితర ఆస్పత్రుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తోంది. అంతేకాదు క్వారంటైన్లో ఉన్న వారికి పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కరోనా పేషెంట్ల డైట్లో పౌష్టికాహారాన్ని అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ, మంగళవారం రైస్తో పాటు చికెన్ కర్రీ, శుక్రవారం రైస్తో పాటు చికెట్ కర్రీ ఇస్తున్నారు. దీంతో పాటు రెగ్యులర్గా మూడు పూటల భోజనంతో పాటు పాలు, గుడ్డు, చిక్కీ, స్నాక్స్, రాత్రి వేళల్లో డ్రైఫ్రూట్స్ ఇస్తున్నారు. అంతే కాదు క్వారంటైన్ ఉన్న పేషెంట్లకు పౌష్టికాహారం అందించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు ఏ మాత్రం ఆలోచించవద్దని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.