CM KCR to meet PM Modi in Delhi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ భేటీలో కీలక అంశాలపై చర్చ...

ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టులకు నిధుల సాధన అంశాలకు మోదీ వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంత్రం నాలుగున్నర గంటలకు సమావేశం మొదలైంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలను కృష్ణాకు తరలించాలనే ఉద్దేశంతో ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, కె.సి.ఆర్ మద్య రెండు సార్లు చర్చలు జరిగాయి. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి డ్యాం సేఫ్టీ బిల్, నదీ జలాల యాజమాన్యం బిల్లులు రెండూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశముంది. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లయితే మొత్తం నదీ జలాలతో పాటు దేశంలో ఉన్నటువంటి ఆనకట్టలన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకే మోదీ సహకారంతో ఈ కృష్ణా, గోదావరి జలాల అనుసంధానానికి నిర్ణయం తీసుకోవాల్సుంటుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అరవై, డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశముంది కాబట్టి కేంద్రం కొంత సహకరిస్తే మేలు జరుగుతుందని మోదీకి కేసీఆర్ వివరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కూడా కొన్ని ప్రస్తావనకు తీసుకురాబోతున్నారు. ఇటీవల తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, వాటిపై రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వాటి ప్రస్థావన కుడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశముంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను  కుదించడం జరిగింది, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొంత ఆర్థిక సహాయం చేయాలి అన్న అభిప్రాయాన్ని మోదీ ముందు ఉంచబోతున్నారు.

Brahmotsavam at Tirupati 2019

అంగరంగ వైభవంగా శ్రీ వారి ఐదవ రోజు బ్రహ్మోత్సవాలు...

  తిరుమల పేరు తలిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయి. కోనేటి రాయుడిని దర్శిస్తే చాలు సర్వ కష్టాలు తొలగిపోతాయి. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సేవలు అతి ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైంది గరుడ సేవ. గరుడ వాహనం పై శ్రీ మహావిష్ణువుని తిలకిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. అనేక విధాలుగా ఆ శ్రీమన్నారాయణుని సేవించే వైనతేయడు ఇవాళ వాహనంగా మారి శ్రీవారిని తన భుజస్కంధాల మీద ఎక్కించుకుని నాలుగు మాడవీధుల్లో విహరించబోతున్నాడు. ఈ ఉదయం మోహినీ అవతారం రూపంలో మాధవుడ్ని తిలకించి పులకించిపోయిన భక్తుల రాత్రికి గరుడవాహన సేవను వీక్షించేందుకు తిరుమలకు బారులు కడుతున్నారు. మహోత్కృష్టమైన గరుడ సేవలో పాల్గొనేందుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.ముక్తిని ప్రసాదించే శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలులో పాల్గొని తరిస్తున్న భక్తులు గరుడవాహనసేవను తిలకించేందుకు వేచి చూస్తున్నారు. లక్షగొంతుకల ఒక్కటే జపిస్తున్న గోవింద నామాలతో గిరులు తరులు తరించిపోతున్నాయి. ఆ వేంకటనాథుడు కూడా తన వైభవాన్ని చూసి తానే పులకించి పోతాడు అన్నట్టుగా ఉంది. మేళాలు తాళాలు చెక్క భజనలు దేవతా మూర్తుల రూపాలు, ఒకటేమిటి సమస్త సంస్కృతి తిరుమాఢ వీధుల్లో కన్పిస్తోంది. గరుత్మంతుడు వేదస్వరూపుడు ప్రతి రోజూ ఉభయ దేవేరులతో కలిసి మాడవీధులకు విచ్చేసే శ్రీనివాసుడు ఒంటరిగా వైనదేయుడుని అధిరోహించి అనుగ్రహించనున్నారు. గరుడ సేవ సందర్భంగా తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన తులసి మాలలు పుష్పమాలికాలను గరుడ వాహనం పై విహరించి శ్రీవారికి అలంకరించటం పరిపాటి. అలాగే నిత్యం మూలమూర్తికి అలంకరించే మకర కంఠి, సహస్రనామ మాల, లక్ష్మీహారాలని కూడా స్వామి వారికి అలంకరించబోతున్నారు. గజ మాలలతో గోపికా వల్లభుడు తిరువీధుల్లో భక్తుల్ని కనువిందు చేయనున్నాడు. కో అని పిలిస్తే చాలు వరాలిచ్చే దేవుడు ఆ కోనేటి రాయుడు అభయముద్రతో అనుగ్రహిస్తాడు శరణు వేడితే చాలు దరిచేరి అండగా ఉంటాడు ఆపదల్లో ఉన్నవారు ఆర్తితో పిలిస్తే చాలు శంఖ చక్ర ధారియై భక్తుల చెంతకు వస్తాడు. గరుడసేవలో పరమార్థం ఇదే ఇందుకు ఉదాహరణగా గజేంద్ర మోక్షాన్ని ఉదహరిస్తారు. అలాంటి భక్తసులభుడునికి గరుడ సేవ అంటే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇప్పటికే వీధులన్నీ భక్తులతో రద్దీగా మారాయి. భద్రతా ఏర్పాట్ల కోసం ఐదు వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. రేపు ఎల్లుండి సెలవు రోజులు కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు మూడు కిలో మీటర్ల మేర క్యూలలో భక్తులు వేచి ఉన్నారు. దీనికి తోడు ఆగి ఆగి వర్షం కూడా పడుతుండడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం దాదాపు ముప్పై గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి.బ్రహ్మోత్సవాల్లో పాల్గోనే భక్తుల సంఖ్య ఈ రెండు రోజుల్లో ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

Chenetha Bathukamma Sambaralu

విదేశాలల్లోనూ అంగరంగ వైభవంగా బంగారు బతుకమ్మ వేడుకలు.....

  దసరా వచ్చిందంటే చాలు ముందుగా మనకు గుర్తోచ్చేది బతుకమ్మ.తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకుంటూ పెద్ద వేడుకగా చేసుకుంటారు.తెలంగాణ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలోనూ లండన్ లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత హైకమిషన్ ప్రతినిధి రాహుల్, స్థానిక హౌన్సలో మేయర్ టోని లౌకీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నేపధ్యంలో అదే స్ఫూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూత నిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలనూ చేనేత బతుకమ్మ మరియు దసరాగా జరుపుకున్నామని సంస్థ వ్యవస్ధాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఇక తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని మరియు స్ఫూర్తిని ఇచ్చిందని వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్స్ ఇన్ చార్జ్ రత్నాకర్ కుడుదుల తెలిపారు. కల్చరల్ ఇన్ చార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమంలో చేనేత శాలువాలను ఒకరికొకరు పరస్పరం వేసుకొని జమ్మీన్ ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకుని చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి అలాయి బలాయిలా తెలంగాణ స్నేహ మాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా మహిళలందరు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో కోలాటాల నృత్యాలతో చప్పట్లు కలుపుతూ రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులందరి ప్రశంసలందుకుంది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేలా వినూత్నంగా ఇలా ఏదో ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని గత ఏడాది చార్మినార్ ఏర్పాటు చేసామని కార్యదర్శి మల్లారెడ్డి తెలిపారు. విదేశాల్లో స్థిరపడ్డ కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటలలో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, జోగినపల్లి గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రజలంతా పాల్గొనాలనే, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ గారు చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించటమే కాకుండా తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజలలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిధులు మరియు ప్రవాసులంతా ఐ ప్లజ్ టూ సపోర్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్  అనే సెల్ఫీ స్టాండ్ తో ఫోటోలు దిగి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత హై కమిషనర్ ప్రతినిధి రాహుల్ తో పాటు ప్రవాస సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం వినూత్నంగా ఉందని వీరి ప్రయత్నం ఫలించి చేనేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశ ప్రజలు విదేశాలల్లో మన పండుగలను పూర్తిగా జరుపుకోలేకపోతున్నారనే అసంతృప్తిని వైదోలగించి ఇలాంటివాటిని ప్రోత్సహించడం వల్ల భారతీయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Gollapadu Channel in Khammam

దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఖమ్మంలోని గొల్లపాడు ఛానల్ సమస్య...

ఖమ్మంలో దాదాపు పన్నెండు డివిజన్ లను పట్టి పీడిస్తున్న సమస్య గొల్లపాడు ఛానల్. దశాబ్దాలుగా గొల్లపాడు ఛానల్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో పద్నాలుగు కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దశాబ్దాలు తరబడి ఈ గొల్లపాడు చానల్ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగులుతుంది. తీవ్ర దుర్గంధం గొల్లపాడు ఛానల్ లో పేరుకు పోయిన చెత్త, వ్యర్థాల వల్ల వెలువడుతుంది. పది డివిజన్ ల పరిధిలో ఈ గొల్లపాడు చానల్ పధ్నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ గొల్లపాడు చానల్ ద్వారా పది డివిజన్ లలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంట్లో వ్యర్ధాలు పేరుకుపోవడం, మురుగు నీరు పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. నిరంతరం తీవ్ర దుర్గంధం వెలువడుతున్న కలుషిత జలాల మధ్యనే ప్రజలు నివసించాల్సిన పరిస్థితి ఖమ్మం నగరంలోని పది డివిజన్ లలో ఉంది. సీజనల్ వ్యాధులతో అనేక రకాలుగా ఈ గొల్లపాడు ఛానల్ ద్వారా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక పక్క తీవ్రమైన దుర్గంధం, దుర్వాసన మరో పక్క విష జంతువులు, దోమలతో సహవాసం చేయాల్సిన దుస్థితి గొల్లపాడు చానల్ పక్క నివాసముండేవారికి ఉంది. చిన్న చిన్న కాలువలైతే మేమే శుభ్రం చేసుకునే వాళ్ళమని, అది చాలా పెద్దది కావడం వల్ల వీలు కావట్లేదని, తమ దగ్గరకొచ్చి ఓట్లు ఎలా అయితే వేయించుకుంటున్నారో అలానే ఆ ఛానల్ ను శుభ్రం చేయించమని ప్రభుత్వాన్ని ఆ ప్రాంత ప్రజలు కోరారు.

ISRO Scientist Suresh murder case solved

ఇస్రో శాస్త్రవేత్త సురేష్ ను హత్య చేసింది తన కొలీగ్ శ్రీనివాస్: పొలీసులు 

  హైదరాబాద్ లో ఇస్రో సైంటిస్ట్ హత్య కలకలం సృష్టించింది. ఎస్.ఆర్ నగర్ లో అన్నపూర్ణ అపార్ట్ మెంట్ రెండవ ఫ్లోర్ లో నివాసముంటున్న ఇస్రో శాస్త్రవేత్త హత్యకు గురయ్యాడు. క్లూస్ టీమ్ తో హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. వెస్ట్ జోన్ ఇన్ చార్జి డీసీపీ సుమతి, ఏసిపి తిరుపతన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు, సురేష్ తలపై బలమైన గాయం ఉన్నట్టు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావించారు. శాస్త్రవేత్తే సురేష్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మరియు ఇస్రో లో పనిచేస్తున్నారు. మృతుడు కేరళవాసి, వృత్తిరీత్యా గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ లో ఉన్నారు. సురేష్ భార్య బ్యాంకు ఉద్యోగి, చెన్నైలో నివాసముంటోంది, ఉద్యోగ రీత్యా కుమారుడు అమెరికాలో, కుమార్తె ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్నారు. అయితే శాస్త్రవేత్త సురేష్ ను తన తోటి ఉద్యోగి అయిన శ్రీనివాస్ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సుమారుగా మూడు నెలల నుంచి వీరిద్దరికీ పరిచయమున్నట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరూ స్వలింగ సంపర్కం చేసుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని గ్రహించి, తన దగ్గర డబ్బులు తీసుకోవచ్చని శ్రీనివాస్ అనుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి సురేష్ నిరాకరించడంతో.. హత్యకు దారితీసింది. సురేష్ ను తలపై కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందుతుడు శ్రీనివాస్ ను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

TSRTC JAC Leader Ashwathama Says RTC Workers Ready To Strike In Telangana

టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ తో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం...

  టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ తో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. త్రిసభ్య కమిటీ రెండు రోజులుగా చెప్పిందే మళ్లీ చెప్పింది కానీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి అన్నారు. సమ్మెను వాయిదా వేసుకోమని, త్వరలోనే రిపోర్ట్ ఇస్తామని కమిటీలో అన్నారని ఆయన అన్నారు. అయితే ఏ విధమైన రిపోర్ట్ ఇస్తారు, అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారా లేక ప్రతికూలంగా ఇస్తారా అన్న దానిపై రాత పూర్వక హామీ ఇవ్వమని అడిగితే అవన్నీ చెప్పడం కుదరదని మీరు వాయిదా వేసుకోమని కమిటీ చెప్పడం జరిగిందని అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ బతుకు కోసం చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె లో ఆర్టీసీ కార్మికులంతా భయం లేకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. సమ్మె నుంచి సెక్యూరిటీ, పారా మెడికల్ విభాగాలను మినహాయించాలన్నారు. సర్కారు, ఆర్టీసీ సంఘాల మధ్య చర్చలు విఫలమయ్యాయి దీంతో పండుగ ముందు ప్రజలకు ఆందోళన మొదలైంది. సొంతూళ్లకు వెళ్ళి పండుగ జరుపుకుందామని అనుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే సమ్మె జరిపేటప్పుడు దానికి కావలిసిన బందోబస్తు అంతా కూడా కమిటీ ఏర్పాటు చేసింది. మనం ప్రజలకు సేవ చేస్తున్నామని వారికి ఇబ్బంది కలిగించకుండా సమ్మె నిర్వహించాలని కమిటీ ఆదేశించింది. ముందు పండుగ వస్తుందనీ పండుగ జరుపుకునే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమ్మెలు జరుపుకోవాలని కమిటీ ఆర్టీసీ సంఘాలను కోరింది.

Telangana RTC strike

దసరాలో బస్ లు ఆపితే డిస్మిస్ తప్పదు..

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ మధ్య గురువారం జరిగిన చర్చలలో‌ దసరా ముందు బస్సు లను ఆపుతామంటే డిస్మిస్ చేయక తప్పదని అధికారులు హెచ్చరించారు. ఎస్మా అస్త్రాన్ని సందిస్తామని కూడా చెప్పారు. దీనిపై కార్మిక నేతలు స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు గతంలోనూ ఎదురయ్యాయని అన్నారు. డిస్మిస్ చేసినా, ఎస్మాను ప్రయోగించినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇరువర్గాలూ పెట్టి వీడకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. కార్మిక నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఐదవ తేదీ నుంచి తల పెట్టిన సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఒక పక్క తమను చర్చలకు ఆహ్వానించి, మరోపక్క బస్సులను నడపడానికి కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్మా ప్రయోగించినా, డిస్మిస్ లు చేసినా భయపడకుండా సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం నాటి చర్చలు విఫలమైన నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య మళ్లీ చర్చలు జరగయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వైద్య, ఆరోగ్య ఉద్యోగులు మద్దతు పలికారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షు యాదానాయక్ తదితరులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని త్రిసభ్య కమిటీ సభ్యుడు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హెచ్చరించారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తామన్నారు. అవసరమైతే ఎస్మాను ప్రయోగిస్తామని హెచ్చరించారు. జేఏసీ నేతలు చెప్పిన ఇరవై ఆరు డిమాండ్ లను సానుకూలం గా పరిష్కరిస్తామని చెప్పిన కార్మిక నేతలు వినడం లేదని సోమేష్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో దసరా పండుగ చాలా ప్రధానమైనదని ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం సమంజసం కాదని చెప్పామన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పామని కె రామకృష్ణా రావు తెలిపారు. మరోసారి కార్మిక జేఏసీతో చర్చలు జరుపుతామని అన్నారు. కార్మికుల సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయంగా ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టింది. జిల్లాల్లో అందుబాటులో ఉన్న క్యాజువల్ కాంట్రాక్టు సిబ్బంది రిటైర్డు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని డిపోల మేనేజర్లు ఈవీఎంలకు అంతర్గత ఉత్తర్వులిచ్చింది. సంస్థల్లో ఉన్న అన్ని అద్దె బస్సులు నడిచేలా చూడాలని చెప్పింది. మరో పక్క ప్రైవేటు బస్సులను స్టేజీ క్యారేజీలుగా నడిపించాలని రవాణా శాఖ ఆర్టీసీ నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం ఎర్రమంజిల్ కార్యాలయంలో రవాణా శాఖాధికారులు ఆర్టీసీ అధికారులతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ పేరుపేరుగా సమీక్షలు నిర్వహించారు. ఆర్టీసీలో ప్రస్తుతమున్న రెండు వేల మూడు వందల పైగా అద్దె బస్సులన్ని నడిచేలా చూడాలని ఆదేశించారు. వీటికి అదనంగా ప్రైవేటు బస్సులు, స్కూలు బస్సులను కూడా నడపాలని సూచించారు. మరో పక్క హైదరాబాద్ లో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల ట్రిప్పులను పెంచాలంటూ రైల్వే అధికారులను కోరాలని సూచించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ మధ్య గురువారం జరిగిన చర్చలలో‌ దసరా ముందు బస్సు లను ఆపుతామంటే డిస్మిస్ చేయక తప్పదని అధికారులు హెచ్చరించారు. ఎస్మా అస్త్రాన్ని సందిస్తామని కూడా చెప్పారు. దీనిపై కార్మిక నేతలు స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు గతంలోనూ ఎదురయ్యాయని అన్నారు. డిస్మిస్ చేసినా, ఎస్మాను ప్రయోగించినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇరువర్గాలూ పెట్టి వీడకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. కార్మిక నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఐదవ తేదీ నుంచి తల పెట్టిన సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఒక పక్క తమను చర్చలకు ఆహ్వానించి, మరోపక్క బస్సులను నడపడానికి కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్మా ప్రయోగించినా, డిస్మిస్ లు చేసినా భయపడకుండా సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Anti National case filed against Mani Ratnam

మోదీకి లేఖలు రాసిన సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు...

  ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసిన సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు నమోదైంది. రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్నా సేన్ సహా యాభై మంది ప్రముఖులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. మూకుమ్మడి దాడులు హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వీరు కొద్ది రోజుల క్రితం బహిరంగ లేఖ రాశారు. అసహనం పై ప్రధానికి రాసిన లేఖతో సెలెబ్రిటీలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. కోర్టు ఆదేశంతో బీహార్ లో కేసు నమోదు అయింది. ప్రముఖులు బహిరంగ లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారి ఆదేశాల మేరకు ఈ ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. దేశ ప్రతిష్ఠను మంటగలిపే విధంగా ఉందన్న న్యాయవాది పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. దేశంలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసని, ఇదంత రహస్యమేమీ కాదన్నారు వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్యలపై ప్రధాని మోదీని ప్రశ్నించినా లేదంటే కేంద్రాన్ని ప్రశ్నించినా వారందరినీ జైల్లో పెడతారని రాహుల్ అన్నారు. ఈ విధంగా సినీ నటులపై చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ పై ఎంపి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారని, అంతా బహిర్గతంగానే ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

Nominated Posts heats up Politics in Telangana

నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీకై తెలంగాణ నేతల ఎదురు చూపులు... ఇంకెంత కాలం?

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలల్లో గెలిచి ఇన్ని సంవత్సరాలు కావొస్తున్న ఇప్పటికి నేతలకు పూర్తి స్థాయిలో వారి పోస్ట్లు భర్తీ కాలేదు .రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. కొంతమందికి మాత్రమే ఆ పదవులిచ్చారు. మిగతా ఆశవాదులు ఆ పదవుల కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్నయి. నామినేటెడ్ పదవుల భర్తీ దసరాలోపు ఉండొచ్చనే చర్చ టీఆర్ ఎస్ పార్టీలో జరుగుతోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ లోనే ఆశావహులంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి పదవులు దక్కక నిరుత్సాహానికి లోనైన ఎమ్మెల్యేలు కూడా కీలకమైన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు సైతం హోదా కోసం ఏదో ఒక పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక మొదటి నుంచి టిఆర్ఎస్ జెండా మోసే నాయకులూ తమకెప్పుడు అవకాశం దక్కుతుందని నిరీక్షిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో చాలా మంది నేతలు కేటీఆర్ చాంబర్ కు క్యూ కట్టారు. త్వరలోనే అన్ని పదవులు భర్తీ చేస్తామని అప్పట్లో ఆయన హామీ ఇవ్వడంతో తమకు పదవులు దక్కుతాయని ఆశల పల్లకిలో వారిప్పుడు ఊరేగుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన శాసన సభ ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పార్టీ టికెట్ దక్కని నేతలుకు తగిన పదవిచ్చి గౌరవిస్తామని టీఆర్ఎస్ హైకమాండ్ హామీ ఇచ్చింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కని సీతారాం నాయక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జూపల్లి క్రిష్ణరావు, తుమ్మల నాగేశ్వర్ రావు తో సహా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితర నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. వీరేగాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రతాపరెడ్డి లాంటి నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రయారిటీ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లుగా ఉన్న నేతల్లో కొందరు పదవీ కాలం ముగియగా మరి కొందరిది త్వరలోనే పూర్తి కానుంది. దీంతో రెన్యువల్ కోసం సదరు నేతలంతా కేటీఆర్ ను కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఒకవేళ పోస్టుల భర్తీ చేస్తే పదవులు దక్కని నేతలు అసంతృప్తికి లోనవుతారనే భయం టీఆర్ఎస్ లో నెలకొనదని చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే నామినేటెడ్ పదవులకు భర్తీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నిక, మరోవైపు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ తప్పకుంటుందని గులాబి వర్గాలంటున్నాయి. మరి ఈ  నామినేటెడ్ పోస్టులు ఎప్పటికి దక్కుతాయి అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.

internal clashes between trs leaders in warangal district

ఓరుగల్లు జిల్లాలో చక్రం తిప్పబోయేది ఎవరు...

  పూర్వం బలమున్నవాడిదే రాజ్యం అన్న మాట మనం విన్నం కానీ ఇప్పుడు రాచరికాలు పోయినా మాటల్లోని విషయాన్ని మాత్రం మనం కళ్లారా చూస్తున్నం. దీనికి ఉదాహరణ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాని తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బలపరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజగా ఏర్పడిన వర్గపోరు మోతాదు మించిందని చెప్పాలి. కొందరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువులో కి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన నేతలే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. పైకి ఇద్దరు కలిసున్నట్టే అనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరి వర్గం వారిదే గతంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగేవి ఒక దశలో ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత మంత్రి వర్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి వీరిద్దరూ ఒక్కటయ్యారని అంత అనుకున్నారు. కానీ గతంలో వారి మధ్య ఉన్న విబేధాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైకి కనిపించినంతగా వారి మధ్య సఖ్యత లేదని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.  మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న కీలక నేతలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కడియం శ్రీహరి వర్గమైతే, మరికొందరు ఎర్రబెల్లి వర్గం కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతలు నేరుగా అధినాయకత్వంతోనే వారు చేరువులో ఉంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఒక నేత పాల్గొంటే ఆయనకు అనుకూలంగా ఉండే ఇతర నేతలే వాటిని ముందుండి నడుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ముప్పై రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలోనూ ఈ గ్రూపు రాజకీయం స్పష్టంగా కనిపించింది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఈ గ్రూపు విభేధాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీరంతా మంత్రి పదవి ఆశించిన వారే. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ లిస్ట్ లో నుంచి కడియం శ్రీహరి పేరు మాయమైంది. అయితే కడియంకు మంత్రి పదవి రాక పోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావునే కారణమని కడియం అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఊహించుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అయితే ఆశించిన వారికి మంత్రి పదవులు దక్కక పోవడంతో ఒకరి పై ఒకరు అనుచరులు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం కాస్త మొండి చేయి చూపారని చెప్పాలి. గత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మొదటి రాజయ్యను తీసుకున్నారు. తర్వాత ఆయన తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చందూలాల్ కు మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి ఓరుగల్లుకే రెండు మంత్రి పదవులు చీఫ్ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. మొన్నటి వరకు ఒకే ఒక మంత్రి గా ఎర్రబెల్లి దయాకరావు కొనసాగారు, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకంటే ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రెడ్యా నాయక్ కొంత అలక వహించినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించిన వారికి అవి దక్కలేదు. అందువల్ల నామినేటెడ్ పోస్టులపై ఇప్పుడు వారి కన్ను పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సీఎంకు దగ్గరగా ఉండే వ్యక్తులతో పైరవీలు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లో ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొందరు కడియం శ్రీహరిని, మరికొందరు ఎర్రబెల్లి దయాకర్ రావుని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఒరుగల్లుల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారో చూడాలి.

Minister KTR Signature Forgery In Nalgonda

మంత్రి కేటీఆర్ సంతకం కూడా ఫోర్జరీకీ లోనైయ్యింది...

మనకు సాధారణంగా సంతకాల ఫోర్జరీ సంగతి తెలిసిందే.కానీ మన మంత్రి కేటీఆర్ సంతకం కూడా ఫోర్జరీకీ లోనైయ్యిందంట వివరాళ్లో కి వెళ్తే మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెడ్ మాస్టర్ మంగళ పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. నల్లగొండ జిల్లా రావులపెంట లోని బాలికల ఉన్నత పాఠశాలలో పని చేస్తోంది మంగళ. అది కూడా హెడ్ మాస్టర్ గా, అంతేకాదు జిల్లా లోని ఓపెన్ స్కూల్స్ ఇన్ చార్జిగా కూడా విధులు వెలగబెడుతుంది. రెండు వారాల క్రితం ఆమెను కో ఆర్డినేటర్ హోదా నుంచి తప్పించాలని ఆదేశాలొచ్చాయి. ఆ స్థానంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని సూచించింది. అయితే తను మాత్రం ఆ పదవిలోనే ఉంటాను అని తనని కొనసాగించాలి అని డీఈఓని కోరింది. కొంత గడువు ఇస్తే అందుకు ఆదేశాలు తెచ్చుకుంటానని డీఈఓకు చెప్పింది. అందుకు డీఈవో కూడా సరే అన్నారు. నాలుగు రోజులకు మంత్రి కేటీఆర్ ఇచ్చినట్టుగా ఓ సిఫార్సు లేఖలు అందించింది మంగళ. ఆ లెటర్ తో జిల్లా ఓపెన్ స్కూల్స్ ఇన్ చార్జిగా కొనసాగుతూ వుంది. విద్యావ్యవస్థకే మచ్చ తెచ్చిన మంగళ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. జిల్లా కో ఆర్డినేటర్ పోస్టింగ్ కోసం మంత్రి సంతకాన్ని లెటర్ ని తయారు చేసి ఫోర్జరీ చేయడం పట్ల జిల్లాలో కలకలం రేగింది. ఇప్పటికే ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్నారు.ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు అని టిఎస్సిటి అధ్యక్షుడు తెలిపారు.

RBI Monetary Policy

సంతోషాన్ని నింపుతున్న ఆర్బిఐ కొత్త నిర్ణయం...

  ఆర్బిఐ గత కొంత కాలంగా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది.ఇప్పుడు ఆ సంతోషాన్ని పెంచటానికై ఆర్బిఐ మరోసారి  మరింత వడ్డీరేట్లను తగ్గించింది. ఈ సారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఐదు పాయింట్ ఒకటి ఐదు శాతానికి పరిమితం చేసింది. రివర్స్ రెపో రేటును నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గించింది. ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి దాకా వరుసగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటును కూడా ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఆరు పాయింట్ ఒక శాతానికి తగ్గించింది ఆర్బిఐ. గత నెలలో ఆర్థిక వృద్ధి రేటు ఐదు శాతానికి పరిమితం కావడం ఆశించిన మేరకు అంచనాల్ని అందుకోలేని పరిస్థితులు ఏర్పడటంతో వృద్దిరేటును అంచనాల్ని ఆర్బీఐ తగ్గించింది. అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరానికి మాత్రం జిడిపి అంచనాలను ఏడు పాయింట్ రెండు శాతానికి సవరించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బిఐ నిర్దేశిత పరిధి కన్నా దిగువనే ఉండడం ఆర్థిక రంగానికి మరింత ఉద్దీపనాలు అందించాల్సిన అవసరం ఉన్నందున రెపో రేటును మరోసారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించారు. ప్రభుత్వం నుంచి మరోసారి ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం చాలా తక్కువగా ఉన్నందువల్ల ద్రవ్య పరిమితి విధానం విషయంలో ఆర్బిఐ సానుకూల ధోరణితో వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ వార్త విన్న ప్రజలు వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడంతో  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

CM to launch Vahana Mitra scheme for self owned auto drivers

ఆటో, కార్ డ్రైవర్ లకు ఎపి ప్రభుత్వం శుభవార్త...

ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆటో, కార్ డ్రైవర్ లకు ఏడాదికి పది వేల రూపాయలు సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అంతకుముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, సొంత ఆటోలు నడుపుకుంటూ సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న అన్నదమ్ముల కష్టాలను చూశానని ఆ రోజు ఆయన ఎప్పటికీ మరచిపోలేని రోజు అని, ఆయన దగ్గరకొచ్చి ఆటో తోలుకుంటూ ఉంటున్నామని రోజుకి మూడు వందల రూపాయలు, ఐదు వందల రూపాయల మించి ఏ రోజు రాదని, వాటితోటి బతకడమే కష్టం అనుకుంటే అదికాక ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజూ యాభై రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండని చెప్పిన మాటలను మర్చిపోలేను అన్నారు. చెప్పిన మాట ప్రకారం అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు తిరగక మునుపే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన అందరి బ్యాంకు అకౌంట్లల్లో బటన్ నొక్కిన వెంటనే కేవలం రెండు గంటల్లోనే డబ్బులొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెప్పారాయన. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని, ప్రతి సంవత్సరం పది వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు ఆటోతో, ట్యాక్సీతో బ్రతుకు బండిని లాగుతున్న ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తామని మాటిచ్చారాయన. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికీ మంచి చేయాలనే తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుందన్నారు.

ACB raids on Telangana Lecturers JAC President Madhusudan house

తెలంగాణా ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ ఇంట్లో ఎసిబి సోదాలు...

  తెలంగాణా ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ ను ఏసీబీ చుట్టుముట్టింది. ఇంటర్ బోర్డులో అక్రమాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్ కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏక కాలంలో ఎటాక్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఈ రోజు ఉదయం నుంచి ఎసిబి ఆయన ఇంటితో పాటు ఆయన బావమరిది అయిన చెల్లెలు మొత్తం ఐదు చోట్ల ఏసీబి సోదాలు కొనసాగిస్తుంది. ఏసిబి చెప్పిన సమాచారం ప్రకారం మధుసూదన్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తేలింది. రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కి సంబంధించి ఇంటర్ పేపర్ లీకేజీ అయ్యింది, ఆ లీకేజ్ లో మధుసూధన్ రెడ్డి పాత్ర ఉందని, దాంతోపాటుగా ఇటీవలే విడుదలయిన ఇంటర్ మార్కుల వ్యవహారంలో చాలా మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది లెక్చరర్స్ పేపర్ లు దిద్దే క్రమంలో కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఈ లెక్చరర్స్ వ్యవహారంలో కూడా మధుసూధన్ కు సంబంధం ఉన్నట్టు ఎసిబి అనుమానిస్తుంది. అంతేకాకుండా జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్ పేరిట చాలా మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసినట్టు మధుసూధన్ పై ఆరోపణలున్నాయని ఎసిబి చెప్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్సుఖ్నగర్ లోని మధుసూధన్ ఇంటిపై ఎసిబి సోదాలు నిర్వహిస్తుంది. మరికాసేపట్లో మధుసూధన్ ను అర్రెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

ganta srinivasa rao ready to join ysrcp

గంటా నిజంగానే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారా?

  ఆగస్ట్ ఫీవర్ అంటూ నిన్న మొన్నటి దాకా బాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు వైసీపీ బాట పట్టబోతున్నారనే వాదనలు తెగ హడావిడి సృష్టించాయి. విశాఖ టిడిపి నేతల వారి వైఖరీ మార్చుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీ చెంతన చేరనున్నరట. విశాఖ రూరల్ లో బలమైన నేత ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనందకుమార్, కుమార్తె రమాకుమారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో టిడిపి పాలిట పిడుగు లాంటి మరో వార్త విస్తృతంగా చక్కర్ లు కొడుతోంది. విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. గతంలో ఇలాంటి వార్తలు హల్ చల్ చేసి చల్లబడ్డాయి. అదే ప్రచారం మళ్లీ జోరందుకుంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమంటూ తాజాగా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో గంటా సంప్రదింపులు జరిపారని ఈ నెల మొదటి వారంలో ఫ్యాన్ పార్టీలో చేరబోతున్నారని చెప్పుకుంటున్నారు. వైఎస్ కుటుంబ సన్నిహితులతో గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని గంటా శ్రీనివాసరావు పావులు కదిపారని చెప్పుకుంటున్నారు. కడప జిల్లా ఇన్ చార్జి మంత్రిగా గతంలో పని చేసిన గంట శ్రీనివాసరావు అప్పట్లో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలతో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయాలను ఇప్పుడు వాడుకుంటున్నారని సమాచారం.  మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంట శ్రీనివాసరావు తన ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కె రాజు పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. అందుకు గంట కూడా ఓకే అన్నారని సమాచారం. ఈ తరుణంలో రాజీనామా చేస్తాను మరి నాకేంటి అని గంటా ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి వదులుకుంటున్నందున ఎమ్మెల్సీ పదవి కావాలని గంట కోరారు. గంటా రాజకీయ అనుభవం ఆయనకు ఉన్న ప్రజాదరణ వంటి అన్ని అంశాలను పరిశీలించిన మీదట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఓకే అన్నట్టుగా వార్తలు షికార్ లు చేస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు గనుక పార్టీ మారితే ఆయన వర్గానికి చెందిన చాలా మంది టిడిపి నేతలు కూడా ఆయన వెంట నడుస్తారన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారం అంతా ఊహాగానం అంటూ గంట వర్గీల్ కొట్టిపారేస్తున్నారు. గంటా పార్టీ మారరని టిడిపిలోనే కొనసాగుతారని వారు వాదిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా వస్తున్నారనే ప్రచారాన్ని విశాఖలో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఖండిస్తున్నారు. అటువంటి సమాచారమేదీ తమకు అందలేదని వారు స్పష్టం చేస్తున్నారు. నిజంగా గంటా వ్యూహం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

మాజీ ఎంపీ హర్ష కుమార్ మెడకు చుట్టుకుంటున్న నెంబర్ 93...

  మాజీ ఎంపీ హర్ష కుమార్ నెంబర్ 93 తో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిన బోటులో ఉన్నది డెబ్బై మూడు మంది అని అధికారులు చెప్పారు కాని, కాదు తొంభై మూడు మంది ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితం హర్ష కుమార్ విమర్శించారు. మృతుల సంఖ్య ఎక్కువ లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారని, నిజాలు చెప్పాలంటూ గట్టిగా మాట్లాడారు. అంతేకాకుండా బోటుకు పర్మిషన్ వెనుక కొందరి హస్తం ఉందని ఆరోపించారు. అప్పుడు ఆయన చెప్పిన మాటల్లో 93 నెంబర్ ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేసింది. తొంభై మూడు మంది బోటు ఎక్కారా, ఆధారాలు ఉన్నాయా, ఉంటే చూపించండి అంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో హర్షకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.  మరోవైపు రాజమండ్రిలో తొమ్మిది వందల ఇరవై గజాల స్థలాన్ని న్యాయశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, అయితే ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తూ ఉండగా హర్షకుమార్ అడ్డుకున్నారు. దీంతో కోర్టు ఏవో సీతారామరాజు ఫిర్యాదు మేరకు హర్ష కుమార్ పై సెక్షన్ 353,354,506,34 ఐపీసీ కింద కేసు నమోదైంది. ఈ కేసులో హర్ష కుమార్ ను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని సీఐ శేఖర్ బాబును ఉన్నతాధికారులు వేటు వేశారు. సీఐపై వేటు వేయడాన్ని నిరసిస్తూ గోకవరం బస్టాండ్ దగ్గర దళిత నేతలు అందేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించనున్నారు. 

తెలంగాణ చట్టంలో మార్పులకు శ్రీకారం...

  తెలంగాణలో తీసుకొచ్చిన చట్టాలలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి మనందరికి తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రానికి గతంలో కంటే కూడా ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే పదకొండు వేలకు పైగా అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇందులో ఎనిమిది వేల నాలుగు వందలకు పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని చెప్పారు. సుమారు పన్నెండు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని వివరించారు. సుమారు పన్నెండు లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. రెండుసార్లూ తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్ర స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాలతో కలిసి ఒక ఎకనామిక్ విషన్ కోసం పని చేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. మరో కొత్త ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ లు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంతో దూసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపిలో జపాన్ సహా ఇండియన్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నాయని గౌతంరెడ్డి వెల్లడించారు.

నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ విచారణ...

  ఈఎస్ఐ స్కామ్ విషయంపై రోజు రోజుకు చర్చలు కొనసాగుతున్నాయి.నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోరింది. మరోవైపు బెయిల్ ను మంజూరు చేయాలని నిందితుల సైతం పిటిషన్ వేశారు. రెండు పిటిషన్ ల పై ఏసీబీ కోర్టు విచారించనుంది.  అదే విధంగా ఈ కేసులో మరికొంతమందిని కూడా అధికారులు విచారించనున్నట్లు తెలుస్తున్నది. స్కామ్ లో తీగ లాగితే డొంక కదులుతున్నట్లు  డైరక్టర్ దేవికారాణి అరెస్ట్ చేసి స్కామ్ వెనుక ఉన్న పాత్రథారులు ఒక్కరు ఒక్కరుగా తెరమీదకు వస్తున్నారు. ఈఎస్ఐ విభాగం లోని సిబ్బందితో అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై భారీగా దోచుకుంటున్నట్లు ఏసీబీ నిర్థారించింది. గడచిన నాలుగేళ్లలో ఏడాదికి రూ.రెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున వెయ్యి కోట్ల రూపాయల మెడిసిన్ కొనుగోలు చేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై డిస్పెన్సరీల వివరాలు సేకరించిన అధికారులు కుంభకోణం పాత్రధారులను శరవేగంగా గుర్తిస్తోంది. విచారణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో అథికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.  ఎక్కడెక్కడికి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న ఉద్యోగి నాగరాజు ఇంట్లో నలభై ఆరు కోట్ల విలువైన నకిలీ ఇండెట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురు ఈఎస్ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు.  ఇప్పటికే దేవికారాణి తోపాటు ఏడుగురిని అరెస్ట్ చేసిన అధికారులు మరో రెండ్రోజుల్లో స్కామ్ కు సంబంధం ఉన్న మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కుంభకోణంలో డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ తరవాత శివనాగరాజునే కీలక నిందితుడిగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ కు మధ్యవర్తిగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను శివనాగరాజు స్వీకరించినట్లు తెలుస్తోంది. అతన్ని విచారిస్తే ఇండెంట్లు పర్చేజ్ ఆర్డర్ల సమాధానం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఇవాళ ఏమవుతుందో చూడాలి ఎందుకంటే ఇటు నిందితులు కూడా బెయిల్ కోసం పిటిషన్ లు వేస్తున్నారు. అటు ఏసీబీ కూడా రిమాండ్ కస్టడీ కోసం తమ వాదనలు వినిపించనుంది. కోర్ట్ ఏం నిర్ణయిస్తుందని  ఏసీబీ కోర్టులో మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కన్పిస్తోంది. ఎనిమిది మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు. మరికొంతమందిని ఇవాళ ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరున్నారనే విషయాల మీద ప్రస్తుతం అధికారులు కూపీలాగుతున్నట్లుగా సమాచారం.  

ప్రభుత్వ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తీవ్ర విమర్శలు...

  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది.