ఏపీ లో మొత్తం 1,097 పాజిటివ్ కేసులు
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6,768 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్గా తేలాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్–19 కేసుల సంఖ్య 1,097 కు చేరింది. కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 214, కృష్ణా జిల్లాలో 177, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 72, వైయస్సార్ కడప జిల్లాలో 58, ప్రకాశం జిల్లాలో 56, అనంతపురం జిల్లాలో 53, పశ్చిమ గోదావరి జిల్లాలో 51, తూర్పు గోదావరి జిల్లాలో 39, విశాఖపట్నం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా వైరస్కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 31 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో 29 మంది చొప్పున, వైయస్సార్ కడప జిల్లాలలో 28 మంది, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 23 మంది చొప్పున, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, అనంతపురం జిల్లాలలో 14 మంది, చిత్తూరు జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది.. మొత్తం 231 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.