న్యాయవాదుల హత్యపై.. క్రొకోడైల్ కన్నీళ్లు..
వామన రావు దంపతుల హత్య పై ఎట్టకేలకు అధికార తెరాస పార్టీ స్పందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామ రావు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ భవన్’లో నిర్వహించిన లాయర్ల సమావేశంలో, ఓ నిట్టూర్పు విడిచారు. వామన రావు దంపతుల హత్య వార్త విని బాధ తానూ చాలా చాలా బాధ పడ్డానని అన్నారు. అంతే కాదు, కొంత పరోక్షంగానే అయినా, వామనరావు దంపతులను హత్య చేసింది తెరాస పార్టీ వారే, అని అందరిలో వ్యక్తమవుతున్న అనుమానాన్ని అయన కూడా దృవీకరించారు. ఈ దారుణ హత్యకు కొందరు తెరాస నాయకులు బాధ్యులని తెలిసిన వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పుకొచ్చారు. జంట హత్యలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీపడబోరన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని అన్నారు.
అయితే, వామన రావు దంపతుల దారుణ హత్య జరిగి ఇన్ని రోజులు అయినా, హత్యలకు కారకులు కారు పార్టీ వారని లోకం కోడై కూస్తున్నా, పార్టీ నాయకత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? ఆనం సార్వజనీన ప్రశ్న సమాధానం చెప్పలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం రాజీ పడదని అంటున్న, కేటీఅర్, న్యాయవాదుల దారుణ హత్యకు సంబదించి ఇంతవరకు పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటో కూడా చెప్పి ఉంటే బాగుండేదని, న్యాయవాదులు అంటున్నారు. అదేమీ లేకుండా రాష్ట్రంలో ఏ వర్గంలోనూ ఎలాంటి అసంతృప్తి లేదని, విద్యార్ధులు హ్యాపీ, యువకులు నిరుద్యోగులు డబుల్ హ్యాపీ .. ఇక ఉద్యోగులు అంతతా వారు మరీ మరీ హ్యాపీ అనంట్లుగా శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, ఆత్మవంచన చేసుకోవడం అంత మంచిది కాదని, కేటీఅర్ ప్రసంగాన్ని పూర్తిగా విన్న న్యాయవాదులు అంటున్నారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం కార్చే క్రొకోడైల్ కనీళ్ళు ఎవరినీ శాంతింప చేయవు సరికదా, ఆవేదన, ఆగ్రహాన్ని మరింతగా పెంచుతాయి. అంతే కాదు, న్యాయవాదులకే రక్షణ లేని రాష్ట్రంలో , న్యాయానికి, ధర్మానికి చోటెక్కడ అనే ప్రశ్న తెలుత్తుతుంది. అందుకే, ఇప్పడు కావలసింది నిట్టూర్పులు, మొసలి కన్నీళ్ళు కాదు, న్యాయం. భరోసా .. కానీ, కేటీఆర్ మాటల్లో అది లేదనే అంటున్నారు, న్యాయవాదులు. అలాగే, వామనరావు దంపతుల జంట హత్యల ప్రభావం, ఇటు వృత్తిపరంగా, అటు సామాజికంగా కూడా ఓటర్లను ప్రభావితం చేస్తుందని అంతటా వినవస్తోం