సచివాలయం విభజన జీవోలు జారీ
సచివాలయం భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ 196,197 జీవోలు జారీ అయ్యాయి. తెలంగాణకు ఏ,బీ,సీ,డీ బ్లాక్లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్కు సౌత్ హెచ్, నార్త్హెచ్, ఎల్,కే, జే బ్లాక్లను కేటాయించారు. ఎల్ బ్లాక్ 8 వ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాంబర్, ఏడవ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఛాంబర్ ఉండనున్నాయి.
పాత అసెంబ్లీ భవనం, సమావేశం మందిరాన్ని ఏపీకి కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం, మంత్రుల గదులను తెలంగాణకు కేటాయించారు. అలాగే ప్రస్తుత శాసనమండలి భవనం ఏపీకి, తెలంగాణ శాసనమండలి కోసం జూబ్లీహల్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాంప్ ఆఫీస్గా లేక్వ్యూ గెస్ట్హౌస్, కుందన్బాగ్లో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్గా నిర్దారించారు. జూబ్లీహిల్సలోని మంత్రుల క్వాటర్స్లో 1 నుంచి 15 వరకు తెలంగాణ మంత్రులకు 16 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించారు.
ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 11 నుంచి 19 బ్లాక్లు, 20 నుంచి 23 డీలక్స్ బ్లాక్లు, హైదర్గూడలోని ఎంఎస్-1 బ్లాక్లను ఏపీ ఎమ్మెల్యేలకు కేటాయించారు. ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 1 నుంచి 10 బ్లాక్లు, 24వ బ్లాక్(మూడంతస్థుల డీలక్స్ బిల్డింగ్), డాక్టర్స్ క్వార్టర్స్(రెండస్థుల భవనం), హైదర్గూడలోని ఎంఎస్-2 బ్లాక్లను తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయించారు.