బీహార్ ఓట్ల లెక్కింపు... ఎన్డీయే ఆధిక్యం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐదు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని మహా కూటమి కంటే ఆధిక్యంలో వుంది. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఎన్డీయే కూటమి 62 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. మహా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. పార్టీల వారీగా చూస్తే జేడీయు 20 స్థానాల్లో, ఆర్జేడీ 25, కాంగ్రెస్ 7, బీజేపీ 48, ఎల్జెపి 6, హెచ్ఏఎం 7, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు.