నరసారావు పేట చిన్నదే.. మనసు పెద్దది.. వెంకయ్య
నరసారావు పేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు రెండో రోజు వైభజంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ కోడెల, ఎంపీ రాయపాటి, మంత్రి కామినేని. ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు.. రైల్వే అండర్ బ్రిడ్జ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. వెంకయ్య మాట్లాడుతూ పల్నాటి పౌరుషానికి నరసారావుపేట ప్రతీక అని.. స్వాతంత్రోద్యమంలో నరసారావుది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. నరసారావు పేట చిన్నదే.. కాని మనసు పెద్దదని.. గొప్ప సంస్కృతి.. సంప్రదాయాలు ఉన్న నగరం నరసారావు పేట అని కొనియాడారు.