మరోసారి హరీశ్ రావుకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్..!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో కేసీఆర్ దే మొదటి స్థానం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కేసీఆర్ తరువాత స్థానం ఎవరిది.. కొడుకు కేటీఆర్ దా.. లేక మేనల్లుడు హరీశ్ రావుదా.. అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకప్పుడు కేసీఆర్ తరువాత అంతటి బలం ఉన్న నాయకుడు హరీశ్ రావే.. కేసీఆర్ తరువాత స్థానం హరీశ్ రావుదే అని చాలామందే అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.. కేసీఆర్ కూడా హరీశ్ రావుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చిన్నచిన్నగా తగ్గిస్తూ.. కొడుకు కేటీఆర్ ను పైకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. మొన్న జరిగిన వరంగల్ ఉపఎన్నికలో హరీశ్ వర్గానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వకుండా  పసునూరి దయాకర్ కి ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి రుజువు చేశారు కేసీఆర్.. తాజాగా తెలంగాణలో జరగబోయే 12 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హరీశ్ అనుచరులకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్… కేటీఆర్ వర్గానికి చెందిన శంభీపూర్ రాజుకు వ్యక్తికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ హరీశ్ రావును తొక్కేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కళ్లు తెరిచిన బీజేపీ.. టీడీపీ ని ఏమనొద్దు..!

బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజీపీ నాయకులకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవహరించే నేతలు ఇప్పుడు కాస్త నెమ్మదించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనక్కర్లేదు.. బీజేపీ.. టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా.. బీజేపీ నేతలే ఎక్కువ పెత్తనం చూపించేవారు. అంతేకాదు టీడీపీ నాయకులపై కూడా ఆలోచించకుండా విమర్శల బాణాలు వదిలేవారు. గతంలో ఈ విషయంలో రెండు పార్టీల మధ్య విబేధాలు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబు కలుగజేసుకొని నచ్చజెప్పడంతో టీడీపీ తమ్ముళ్లు కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. ఇప్పుడు మిత్రుల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే బీజేపీ నేతలకు అర్థమవుతుందట. అంతేకాదు ఇందుకు సంబంధించి నేతలకు.. బీజేపీ పెద్దలు కొన్ని సూచనలు కూడా చేశారట. ఏపీ అధికారపక్షంతో జాగ్రత్తగా ఉండాలని.. అనవసరమైన వ్యాఖ్యలు.. విమర్శలు అస్సలు చేయొద్దంటూ..బాబుతో ఏదైనా సమస్యలు ఉంటే తమకు చెప్పాలే కానీ.. ఎవరూ సొంతంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించారట. మొత్తానికి చాలా కాలం తరువాత బీజేపీ నేతలకు కళ్లు తెరుచుకున్నట్టు ఉంది. అందుకే నిన్న మొన్నటి వరకూ టీడీపీ నేతలపై విరుచుకుపడిన బీజీపే నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.

రాహుల్ జైలుకు వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నారా..?

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కొడుకు రాహుల్ గాంధీ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరవ్వాలని సోనియాను, రాహుల్ ను కోర్టు ఆదేశించగా వారు మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఈ నెల 19 వ తేదీన ఎలాగైనా కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఆదేశించింది.  అయితే ఈ కేసుకు సంబంధించి రాహుల్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే 19వ తేదీన కోర్టుకు హాజరైనప్పుడు రాహుల్ జైలుకు వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నారంట.. బెయిల్ కూడా తీసుకోరంట. అంతేకాదు.. ఈ నిర్ణయానికి సోనియా కూడా ఓకే చెప్పారంట.  తాము ఎలాంటి నేరం చేయనందున తమపై సానుభూతి వెళ్లి విరుస్తుందని ప్రధాని మోడీ తన ప్రత్యర్థులపై కక్ష ఎలా తీర్చుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట. అయితే ఈకేసులో కోర్టుకు హాజరవుతున్న సోనియా.. 86 ఏళ్ల మోతీలాల్ వోరా సహా మిగిలినవారు కూడా బెయిల్ దరఖాస్తు చేసుకుంటారు ఒక్క రాహుల్ తప్ప. మొత్తానికి రాహుల్ సానుభూతి కోసం బానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.

టీడీపీలోకి గాదె వెంకటరెడ్డి.. ?

ఏపీ టీడీపీలోకి వలసల పర్వం నడుస్తోంది. ఇప్పటికే చాలామంది నేతలు అధికార పార్టీలోకి చేరడానికి సముఖత చూపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కూడా టీడీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు గతంలో రాష్ట్రం ప్ర‌స్తుతం చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంద‌ని ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు అయితేనే ఏపీ అభివృద్ధి చెందుతుంద‌ని.. పట్టిసీమ వల్ల పోలవరానికి ఎలాంటి నష్టం లేదని కూడా గాదె చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. అయితే అప్పుడే గాదె టీడీపీ గూటికి చేరుతారని వార్తలు వచ్చాయి.. కానీ అందుకు సరైన సమయం రాలేదు. మరోవైపు చంద్రబాబు కూడా గాదె టీడీపీ ఎంట్రీకి సానుకూలంగా ఉన్నా.. ప్రస్తుతం ఆయన బిజీ వల్ల గాదె ఎంట్రీకి బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ గాదె టాపిక్ చంద్రబాబు దగ్గరకు వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు గాదె గురించి మరోసారి చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండు జిల్లాల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టున్న నేత కావ‌డం గాదె ఎంట్రీకి చంద్రబాబు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ ఒక్కొక్కరిగా వేరే పార్టీల్లోకి వెళుతుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ తరుపున ఆపార్టీలో ఎంతమంది ఉంటారో..

ఏపీ ఆర్ధిక మంత్రిగా ఆనం?.. మరి నారాయణ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్ ను మార్చాలని ఎప్పుటినుండో ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గం నుండి కొంత మంది మంత్రులను తప్పించి ఆస్థానంలో కొత్తవారిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఉన్న వారిలో నుండి ఎవరి తప్పించాలని చంద్రబాబు పార్టీ వర్గాలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆర్ధిక మంత్రి యమనల రామకృష్ణుడిని తప్పించి.. ఆస్థానంలో కొత్తగా పార్టీలో చేరిన ఆనం రాం నారాయణరెడ్డిని నియమించాలని చూస్తున్నారట. అంతేకాదు నారాయణను కూడా మంత్రి వర్గం నుండి తప్పించాలని చంద్రబాబు చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయాలలో అంతగా అనుభవం లేని నారాయణను తప్పించి ఆయనకు రాజధానికి నిర్మాణం బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారంట. ప్రస్తుతం.. రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన బాధ్యతలు నారాయణనే చూసుకుంటారు.. కనుక మంత్రి నుండి తప్పించి క్యాపీటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఎ) పూర్తి స్థాయి చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మరోవైపు నారాయణను మంత్రివర్గం నుంచి తొలగించడం అంత ఈజీ కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. 

సల్మాన్ నిర్ధోషి.. మరి తాగింది కారా?.. ట్వీట్లు

దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసుపై ఈ రోజు తుది తీర్పు వెలువడింది. సల్మాన్ ను దోషిగా నిర్దేశించలేమని.. సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తెలిపింది. కాగా 2002 లో హిట్ అండ్ రన్ కేసులో ఒకరి మృతికి కారణమయ్యారని సల్మాన్ ఖాన్ పై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ ద్వారా కూడా తమ అభినందనలు తెలుపుతున్నారు. ఇదంతా ఒకటైతే.. మరోవైపు సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని కోర్టు తీర్పు ఇవ్వడంపై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి తాగింది సల్మాన్ ఖాన్ కాదు.. తాగింది కారన్నమాట అని ఒకరంటే.. ఈరోజు చాలా బాధాకరమైన రోజు అని మరొకరు కామెంట్లు విసురుతున్నారు.

పోలవరంపై ఉమాభారతి.. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుంటేనే మంచిది..

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ ఒడిశా ఎంపీలు పార్లమెంట్ దగ్గర నిరససలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీవ్ర నష్టం కలుగుతుందని ఒడిశా ఎంపీలు ఆరోపించారు. దీనిపై ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా చేసిన అభ్యంతరాలను ఏపీ దృష్టిలో పెట్టుకోవాలని.. రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుంటేనే మంచిదని.. ముందే సమస్యలు పరిష్కారించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. పోలవరం గిరిజనుల జీవితాలతో ముడిపడిఉన్న సున్నితమైన అంశమని.. కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదిని అన్నారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం తప్పకుండా సహకరిస్తుందని అన్నారు.

ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన కొండా మురళీ.. టీఆర్ఎస్ బోణీ..

వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి గాను కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అని అన్నారు. కాగా జిల్లాలో మొత్తం 859 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓట్లు ఉన్నాయి. వీరిలో పార్టీల వారీగా బలాబలాలు చూస్తే తెరాసకు 509 కాంగ్రెస్ కు 215 టీడీపీ కూటమికి 201 ఇతరులకు 30 ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లన్ని కలిపినా కూడా అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. ఆ రకంగా చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీకే స్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోటీ జరుగుతుండగా ఎలాంటి ఎన్నికలు లేకుండా అప్పుడే టీఆర్ఎస్ బోణి కొట్టడం ఆపార్టీకి శుభపరిణామమే.

లోక్ సభ.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం

లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మళ్లీ నిన్నకరువుపై చర్చ సందర్భంగా జరిగిన రగడలో వీరేంద్ర సింగ్ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్లనే.. ప్రధాని పదవిలో కూర్చునేందుకు కాంగ్రెస్ ఎంపీలు అంగీకరిస్తారని విమర్శించారు. దీంతో వీరేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యాలపై ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ నేతలు ఆయనపై మండిపడ్టారు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టి పేపర్లు చింపి డిప్యూటీ స్పీకర్ పై వేస్తూ.. మోడీని హిట్లర్ అంటూ.. నియంత అంటూ కామెంట్లు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ మోడీని హిట్లర్ అని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

షరీఫ్‌, అజీజ్‌లతో సుష్మ భేటీ.. సుష్మా ఆ వ్యాఖ్యలు చేయలేదు..

విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బృందం పాక్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తోను, ఆయన విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌తోను భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు  భారత్‌-పాక్‌ దేశాల మధ్య సమగ్ర ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇరుదేశాల మధ్య విశ్వాస నిర్మాణ చర్యలు, శాంతి సామరస్యవాతావరణం, జమ్మూ కాశ్మీర్‌, సహా పలుఅంశాలపై చర్చించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను ఖరారు చేయాల్సిందిగా ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులను ఈ ప్రకటన కోరింది. ఇదిలా ఉండగా మోడీ పర్యటనపై పాక్ మీడియా అత్యుత్సాహం చూపినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్.. వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ..వస్తున్నారంటూ చెప్పినట్లుగా వార్తలు ప్రసారం చేశారు. దీంతో ఇప్పుడిది వివాదాస్పదమైంది. దీనికి స్పందించిన భారత బృందంలోని అధికారులు సుష్మా స్వరాజ్ అలాంటి వ్యాఖ్యలు ఏం చేయలేదని.. స్పష్టం చేసింది.

ఓయూ బీఫ్ ఫెస్టివల్.. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం..

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఓయూ విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో గోసంరక్షణ సమితి.. భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సుమారు  రెండువేల మంది గోసంరక్షణ కార్యకర్తలు ఓయూ ఎదుట భైటాయించారు. ఈ సందర్భంగా వారు యూనివర్శిటిలోకి ప్రవేశించాలని చూడగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. టీజీవీపీ నేత శ్రీహరి సహా 25 మంది ఏబీవీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఓయూ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. కాగా ఓయూ హాస్టళ్లల్లో పోలీసులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఫ్ ఫెస్టివల్.. పోర్కు ఫెస్టివల్ కు మద్దతివ్వమని గోషమహన్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన చేపట్టగా ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను షాహినాయత్ గంజ్ పీఎస్ కు తరలించారు. దీంతో రాజాసింగ్ ను వెంటనే విడిచిపెట్టాలని ఆయన కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.

కల్తీమందు పై జగన్ హామీ.. బొత్స రియాక్షన్ ఏంటి?

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వల్ల ఇప్పుడు ఆ పార్టీలోని ఒక వ్యక్తికి తలపట్టుకునే పరిస్థితి వచ్చిందట. అది ఏవరనుకుంటున్నారా..? ఇంకెవరూ బొత్స సత్యనారాయణ.. జగన్ హామీకి.. బొత్సకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అదేంటంటే.. విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్.. దొరికిందే ఛాన్స్ కదా అని ఏపీ ప్రభుత్వం పై నాలుగు విమర్శల బాణాలు వదిలి.. ఆవేశంతో తాను అధికారంలోకి వస్తే కనుక మద్యం నిషేదిస్తామని పెద్ద హామీనే ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీతో ఆపార్టీలోని బొత్సకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఎందుకంటే బొత్సకు లిక్కర్ బిజినెస్ ఉంది కాబట్టి. జగన్ తను ఇచ్చిన హామి ముందు నెరవేర్చాలంటే.. అంతకంటే ముందు బొత్స చేత తన లిక్కర్ బిజినెస్ ను మూయించాలి. అసలే బొత్సకు ఉత్తరాంధ్రలో లిక్కర్ డాన్ అనే పేరు కూడా ఉంది. ఈ విషయంపై గతంలో ఒకరు ప్రశ్న అడిగినా దానికి బొత్స ఏ మాత్రం భయపడకుండా ఏం.. మేము ఈ వ్యాపారం చేయొద్దా అని ఎదురు ప్రశ్నించాడు. మరి అలాంటి బొత్స ఇప్పుడు జగన్ ఇచ్చిన హామికి ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు జగన్ ఇచ్చిన హామిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ముందు తమ పార్టీలో ఉన్న నాయకులతో లిక్కర్ బిజినెస్ మూయించండి.. ఆతరువాత రాష్ట్రంలో నిషేదం చేయోచ్చు అని కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈవిషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. జగన్ ఇచ్చిన హామికి బొత్స ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రచ్చ..

ఓయూ విద్యార్ధులు ఈరోజున ఎలాగైన బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఓయూ దగ్గర తీవ్ర ఉద్రిగ్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అర్ధరాత్రే ఓయూ హాస్టళ్లలో సోదాలు జరిపి 16 మంది బీఫ్ ఫెస్టివల్ నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా తాము తప్పకుండా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ఫెస్టివల్  నిర్వాహకులు తేల్చి చెబుతుంటే.. ఎట్టి పరిస్థితిలో ఫెస్టివల్ జరగనివ్వమని గోసంరక్షణ సమితి చెబుతుంది. మరోవైపు బీఫ్, పోర్క్ ఫెస్టివల్ నిర్వహాణకు ఎలాంటి అనుమతి లేదని.. ఒకవేళ ఫెస్టివల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఓయూ విద్యార్ధులైతే అడ్మిషన్ను రద్దు చేస్తామని ఓయూ రిజిస్టార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్టు కూడా అనుమతివ్వలేదు. అయినా ఓయూ స్టూడెంట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మొహరించారు. ఓయూ అన్ని రహదారులను మూసివేశారు.

నేడు చింతపల్లిలో జగన్ బహిరంగ సభ

  విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ను తక్షణమే ఉపసంహరించుకోమని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ జిల్లాలోని చింతపల్లిలో ‘విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు’ పేరిట ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ నిరసన సభలో పాల్గొనేందుకు ఆయన ఈరోజు హైదరాబాద్ నుండి విశాఖకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నర్సీపట్నం మీదుగా రోడ్డు మార్గం ద్వారా చింతపల్లికి చేరుకొంటారు. మధ్యాహ్నం సుమారు 12గంటలకు చింతపల్లిలో సభ ప్రారంభం అవుతుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏర్పాట్లు చేస్తున్నారు.

సోనియా బర్త్ డే.. ఒకవైపు వేడుకలు.. మరోవైపు బ్లాక్ డే..

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు సందర్భంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమె పుట్టిన రోజు సందర్భంగా " ఆమె ఆరోగ్యంగా ఉండాలని.. దేవుడు ఆమెకు దీర్ఘాయుష్షును ఇవ్వాలని" ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు అయితే కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మాత్రం ఈరోజును బ్లాక్ డే గా పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించాలని సోనియా గాంధీ 2013 డిసెంబర్ 9 వ తేదీనే నిర్ణయించున్నారట. దీంతో ఏపీలో కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ వేడుకలు చేస్తుంటే మిగిలినవారు మాత్రం ఏపీ బ్లాక్ డే పాటిస్తున్నారు.