కాంగ్రెస్ కు షాక్.. 9మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..!
ఇప్పటికే ఏపీ, తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. అయితే ఈసారి తెలుగు రాష్ట కాంగ్రెస్ నేతలు కాదు పొరుగు రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి షాకివనున్నట్టు తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అస్సాం బిజెపి అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య తెలిపారు. కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ ఇంతకుముందే కాంగ్రేస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జెండా ఎగరేశారు. కాగా ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సస్పెండే చేసింది. మిగిలిన ఐదుగురికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.
కాగా ఈ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరంటే.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా(జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్(బెహాలి), రాజెన్ బోర్ఠాకూర్ (తేజ్పూర్), పిజూష్ హజారికా(రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్గంజ్), బినంద సైకియా(సిపాఝర్), జయంత మల్లా బారువా(నల్బారి)లు.