heroine Swathi

‘త్రిపుర’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

తారాగణం: స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్. సంగీతం : కుమరన్, దర్శకత్వం : రాజ్ కిరణ్, నిర్మాతలు : ఎ చినబాబు, ఎమ్ రాజశేఖర్. ‘త్రిపుర’ ఒక హారర్ కామెడీ థ్రిల్లర్. కథ విషయానికి వస్తే, పల్లెటూరిలో ఎంతో అందమైన జీవితాన్ని గడిపే త్రిపుర (స్వాతి) అనే అమ్మాయిని డాక్టర్ నవీన్ చంద్ర ఎంతో ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు. ఆ తర్వాత ఈ జంట నగరంలో కాపురం పెడుతుంది. వీరు అద్దెకు వుంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లో దయ్యం వుందని తెలుస్తుంది. ఆ దయ్యం వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, దాని బారి నుంచి వారు ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో స్వాతి చక్కని నటనతో ఆకట్టుకుంది. హీరో నవీన్ చంద్ర తన పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్ తన మార్క్ చూపించాడు. ఈ హారర్ కామెడీని దర్శకుడు రాజ్ కిరణ్ ప్రతిభావంతంగానే డీల్ చేశాడు.

chhota rajan

దావూద్ గ్యాంగ్ గుట్టు విప్పుతా.. చోటా రాజన్

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను భారత్ తీసుకొచ్చారు. ఇండోనేషియాలో బాలి జైల్లో ఉన్న చోటా రాజన్ ను ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించారు. అయితే ఎయిర్ పోర్ట్ లో దిగగానే చోటా రాజన్ భూమిని ముద్దాడారు. కాగా ఎయిర్ పోర్ట్ నుండి చోటా రాజన్ ను జైలుకు తరలించేందుకు డమ్మీ కాన్మాయ్ ను వాడింది. అయితే చోటా రాజన్ తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పిన కారణంగా అతని కేసులపై విచారణను బాధ్యతను సీబీఐకి అప్పగించారు. దీంతో చోటారాజన్ పై ఉన్న అన్ని కేసులు సీబీఐకి బదీలీ చేశారు. చోటా రాజన్ పై మొత్తం ముంబైలో 75, ఢిల్లీలో 10 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో చోటా రాజన్ విచారణ జరపనున్నారు.. అంతేకాదు దావూద్ గ్యాంగ్ గుట్టు విప్పుతానని చోటా రాజన్ చెప్పాడు.

karnataka minister wife

మంత్రి... ఆయన భార్య కంత్రీ

  కర్ణాటక రాష్ట్ర మంత్రి ఆంజనేయ లంచం కేసులో చిక్కుకున్నారు. ఆయన స్వయానా లంచం తీసుకుంటే అన్ని జాగ్రత్తలూ తీసుకునేవారే. కానీ ఆయన భార్యగారు లంచం తీసుకోవడంలో అజాగ్రత్తగా వుండటం వల్ల మీడియాకి దొరికిపోయారు. ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఒక టెండర్ని మంత్రిగారికి చెప్పి తనకే దక్కేలా చూడాలని కోరుతూ ఒక వ్యక్తి మంత్రి గారి భార్యను ఆశ్రయించారు. మంత్రిగారిని మించిన కంత్రీగారు అయిన ఆ భార్యామణి సరేనని అతనికి అభయం ఇచ్చింది. దాంతో ఆ వ్యక్తి ఆమెకు ఏడు లక్షల రూపాయల లంచం ఇచ్చాడు. టోటల్‌గా ఏంటంటే, ఇదంతా స్టింగ్ ఆపరేషన్లో రికార్డు అయింది. సదరు వ్యక్తి మంత్రిగారి కంత్రీకి ఇచ్చిన డబ్బు కూడా అసలు కాదు.. పక్కా నకిలీవి. ఈ ఉదంతం అంతా కర్ణాటక టీవీ ఛానళ్ళలో ప్రసారం అయింది. దీంతో ప్రతిపక్షాలు మంత్రిగారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఆంజనేయ మాత్రం తన భార్యకి ఏ పాపమూ తెలియదని, తమ మీద ఏదో కుట్ర జరిగిందని వాపోతున్నాడు.

pawan kalyan

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టనైతే పెట్టారు కానీ ఇప్పటి వరకూ ఆయన ఎన్నికల్లో నిలిచింది లేదు. అయితే ఇప్పుడు త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో తన పార్టీ నుండి అభ్యర్ధులను బరిలోకి దించేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల గుర్తింపు వచ్చాక పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ పోటీ చేస్తే స్వతంత్రంగా పోటీ చేస్తారా లేక.. బీజేపీ-టీడీపీ కూటమితో బరిలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందకుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ-టీడీపీ తో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారట. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించారట. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

IYR Krishna Rao

మెతగ్గా ఉంటే బదిలీ అయినట్టే..!

  ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాది జూన్ 2 నాటికి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులంతా విజయవాడకి రావాలని అంటున్నారు. కానీ ఉద్యోగుల వ్యవహారం చూస్తుంటే మాత్రం ఇప్పుడప్పుడే హైదరాబాద్ ను విడిచి వచ్చేలా కనిపించడంలేదని తెలుస్తోంది. దీంతో అసలు ఉద్యోగుల తరలింపు సాధ్యమయ్యేనా అని ఇప్పుడు సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు చెప్పనైతే చెప్పారు కానీ మరీ గట్టిగా చెప్పకుండా ఏదో ఉద్యోగులు బాధపడతారు అన్న సంకోచంలో చెప్పడం.. అందులోనూ ఆఫ్షన్లు ఇచ్చిమరీ మీరెప్పుడు వస్తారు అని అడగటంతో ఉద్యోగులు కూడా అప్పుడే వెళ్లడానికి ఆసక్తి చూపించడంలేదు. దీనిపై గతంలో సచివాలయ ఉద్యోగులు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో కూడా మాట్లాడారు. ఇలా ఆఫ్షన్లు ఇస్తే పనులు జరగవని.. ఉద్యోగులను అలా విడతల వారిగా కాకుండా.. ఒక్కొక్క శాఖను పూర్తిస్థాయిలో తరలిస్తే బావుంటుందని చెప్పారు. అంతేకాదు ఈ విషయంపై ఉన్నతాధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖకు కొందరిని తరలించుకుంటూ పోదాం అనుకుంటే.. ఎప్పటికీ పూర్తి కాదని.. ప్రభుత్వం అడుగుతున్నంత సేపు ఉద్యోగులు ఎన్ని రకాలుగా అయిన మాట్లాడుతుంటారని.. ప్రభుత్వం మెతగ్గా వ్యవహరించకుండా కాస్త గట్టిగా ఉంటేనే ఈ తరలింపు సాధ్యమవుతుందని.. చంద్రబాబునాయుడు కూడా మెతగ్గా వ్యవహరించరాదని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

congress rajaiah

రాజయ్యకు 14 రోజుల రిమాండ్.. పోలీసుల అదుపులో అనిల్ రెండో భార్య

  కాంగ్రస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్యను, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారి ముగ్గురికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.  మామునూరు పోలీసులు వారికి వైద్య పరీక్షల నిమిత్తం గురువారం రాత్రి ఎంజిఎం ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుండి అనంతరం హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టు ఇంఛార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టారు. అక్కడ వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు అతి దారుణంగా మృతి చెందిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా సారిక మృతి కేసులో అనిల్ రెండో భార్య సనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతిపై సనా పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి సారిక బేగంపేట పీఎస్ లో సనాపై, సారిక ఫిర్యాదు చేసింది. దీంతో సారిక అనుమానాస్పద మృతిపై సనా పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Chhota Rajan

డిల్లీకి చేరుకొన్న ఛోటా రాజన్

  సిబీఐ మరియు ఉన్నతాధికారులు మాఫియా గ్యాంగ్ లీడర్ ఛోటా రాజన్ని ఇండోనేషియా నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు డిల్లీకి తీసుకువచ్చేరు. ఈరోజు తెల్లవారుజామున 5.30-6.00 గంటల మధ్య వారి ప్రత్యేక విమానం డిల్లీలో ల్యాండ్ అవగానే స్పెషల్ కమెండోల సహాయంతో కట్టుదిట్టమయిన భద్రత నడుమ అతనిని డిల్లీలో సిబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సిబీఐ ప్రధాన కార్యాలయం వైపు ఉన్న అన్ని మార్గాలను మూసి వేసేసారు. సిబీఐ భవనం చుట్టూ ఆ సంస్థ రక్షణ సిబ్బంది కాకుండా అధనంగా కేంద్ర పారిశ్రామిక రక్షణ సిబ్బందిని కూడా మొహరించారు.   మరికొద్ది సేపటిలో సిబీఐ అధికారులు ఛోటా రాజన్ కి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు. అతనిని ప్రశ్నించడానికి జ్యూడిషియల్ కస్టడీ కోసం కోర్టు అనుమతి పొందిన తరువాత మళ్ళీ సిబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రశ్నించడం మొదలుపెడతారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అతనిపై సుమారు 70పైకి పైగా కేసులు నమోదు చేసారు. అవి కాక డిల్లీ పోలీసులు మరో పది కేసులు నమోదు చేసారు. వాటన్నిటినీ సిబీఐకి బదిలీ చేసారు. కనుక సిబీఐ అధికారులే ఛోటా రాజన్ని అన్ని కేసులలో ప్రశ్నించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ముంబై పోలీసుల నుండి తనకు ప్రాణ హాని ఉందని ఛోటా రాజన్ చెప్పడం వలననే బహుశః అన్ని కేసులను సిబీఐకి బదిలీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   సుమారు రెండున్నర దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఛోటా రాజన్ గత నెల 26వ తేదీన ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాలో బాలి వస్తుండగా ఇండోనేషియా పోలీసులు అతనిని విమానశ్రయంలో అరెస్ట్ చేసారు. అనేక హత్యలు, అక్రమ ఆయుధాల సరఫరా, ముంబై లోకల్ రైళ్ళలో వరుస బాంబు ప్రేలుళ్ళు వంటి అనేక తీవ్రమయిన నేరాలలో అతని ప్రమేయం ఉంది.

Nanded

నాందేడ్‌, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైళ్ళలో దొంగలు పడ్డారు

  ప్రజలు ఇళ్ళకు తాళాలు వేసుకొని ఊళ్లకు వెళితే ఇంట్లో దొంగలు పడుతుంటారు. కానీ పోలీసులు ఏమీ చేయలేరు. పోనీ రైల్లో అయినా భద్రత ఉంటుందా అంటే దారిలో దోపిడీ దొంగలు ఉన్నదంతా దోచుకొని పోతుంటారు. కానీ రైల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఏమీ చేయలేరు.   నిన్న అర్ధరాత్రి ఒకేసారి నాందేడ్‌, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో దొంగలు పడ్డారు. అనంతపురం జిల్లాలో గుత్తి రైల్వే స్టేషన్ శివార్లలో నాందేడ్‌, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్ళు సిగ్నల్ కోసం ఆగి ఉన్నప్పుడు, దొంగలు రైల్లో ప్రయాణికులను దోచుకొన్నారు. రైల్వే పోలీసులు ఉన్నప్పటికీ దొంగలు తెలివిగా వారి దృష్టిని మరోవైపు మళ్ళించి తమ పని కానిచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికుల వంతు వచ్చింది. కానీ వారి అదృష్టం కొద్దీ గ్రీన్ సిగ్నల్ పడటంతో బ్రతికిపోయారు. మొదట దోపిడీకి గురయిన నాందేడ్‌ ఎక్స్ ప్రెస్ గుత్తి రైల్వే స్టేషన్ చేరుకొన్న వెంటనే అందులో ప్రయాణికులు రైల్వే పోలీసులకు పిర్యాదు చేసారు. కనీసం అప్పుడయినా రైల్వే పోలీసులు మేల్కొని ఉండి ఉంటే తరువాత వచ్చిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు దొంగల బారిన పడేవారు కాదు. కానీ దేనినయినా ‘లైట్’ తీసుకోవడం రైల్వే పోలీసులకు అలవాటుగా మారిపోయింది కనుక ఇటువంటి సంఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉంటాయి..వాటి గురించి ఇలాగ వార్తలు వస్తూనే ఉంటాయి.

bjp assam congress mlas

కాంగ్రెస్ కు షాక్.. 9మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..!

ఇప్పటికే ఏపీ, తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. అయితే ఈసారి తెలుగు రాష్ట కాంగ్రెస్ నేతలు కాదు పొరుగు రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి షాకివనున్నట్టు తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అస్సాం బిజెపి అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య తెలిపారు. కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ ఇంతకుముందే కాంగ్రేస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జెండా ఎగరేశారు. కాగా ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సస్పెండే చేసింది. మిగిలిన ఐదుగురికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. కాగా ఈ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరంటే.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా(జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్(బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా(రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా(సిపాఝర్), జయంత మల్లా బారువా(నల్‌బారి)లు.

ap capital amaravathi

అయితే 24 గంటల్లో అందజేయండి.. గ్రీన్ ట్రిబ్యునల్

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతిచ్చిందని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ రాజధాని విషయంలో షాకిచ్చింది. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలను, నిబంధనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. అయితే దీనికి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పందించి ఏపీ రాజధాని నిర్మణానికి కేంద్ర పర్యావరణ శాఖ నుండి అనుమతి పొందామని.. అక్టోబర్ 9 నాటికే అనుమతులు వచ్చాయని చెప్పారు. దీనికి గ్రీన్ ట్రిబ్యునల్.. అయితే దానికి సంబంధించిన పత్రాలను 24 గంటల్లో అందజేయాలని సూచించింది.

samanta

సమంత అవయవ దానం

  అవయవదానాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా వుంది. మనిషి మరణించిన తర్వాత శరీర అవయవాలను అవసరం వున్న వ్యక్తులకు అమర్చడం ద్వారా కొన్ని జీవితాలను నిలబెట్టడమే కాదు... మరణించిన వ్యక్తి వారి రూపంలో మరోసారి జీవించే అవకాశం వుంది. ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందేమో... హీరోయిన్ సమంత తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆమె సమాజ సేవ కోసం ప్రత్యూష ఫౌండేషన్ అనే సేవా సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ పేద బాలలకు వైద్య సహాయం అందిస్తోంది. నవంబర్ నెలలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహించే ఒక కార్యక్రమంలో సమంత తన అవయవాలను దానం చేయనున్నట్టు ప్రకటించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

Dokka Manikya Vara Prasad

విమర్శించడం ఆపి సలహాలు ఇస్తే మంచిది.. డొక్కా కౌంటర్

ఏపీలో టీడీపీపై, చంద్రబాబునాయుడిపై పలువురు బీజేపీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ వారికి ధీటుగా సమాధానం చెప్పారు. హరిరామ జోగయ్య తన 60 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే పుస్తకంలో చంద్రబాబు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై వివారణ ఇవ్వాలని మాజీ మంత్రి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాదు టీడీపీకి ఆదరణ తగ్గుతుందని కావూరి వ్యాఖ్యనించాడు. దీనిపై డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ-బీజేపీ మిత్రపక్షమన్న సంగతి బీజేపీ నేతలు మరిచిపోయినట్టున్నారు.. మిత్రధర్మాన్ని మరచి వారు విరుద్దంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబును విమర్శించడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మంచిదని సూచించారు. రాజకీయంగా ఉనికి లేనప్పుడే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజకీయ నేతలా కాకుండా కాగ్ ప్రతినిధిగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

అక్కడే ఎక్కువగా ఉంటున్న కేసీఆర్..!

  కేసీఆర్ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు తలెత్తుతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు కొత్తగా ఫాంహౌస్ వ్యవహారం చూస్తే ఆయనపై విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉంది. మామూలుగానే కేసీఆర్ కు తన ఫాం హౌస్ అంటే మక్కువ ఎక్కువ అని అందరికి తెలిసిందే. ఖాళీ దొరికినప్పుడల్లా అక్కడికి వెళుతుంటారు. కానీ ఈమధ్య కేసీఆర్ ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. అందులోనూ తను డిసెంబర్ లో చేయనున్న చండీయాగం కార్యక్రమం ఇక్కడే కావడంతో ఆదివారం ఫాం హౌస్ కు వచ్చిన ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. అంతేకాదు ఇంకా రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉంటారట. మరి ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేయకుండా ఉంటారా. ఇప్పటికే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదని పలువురు పలురకాలుగా అనుకుంటున్నారు. వాస్తు విషయంలో నిక్కచ్చిగా ఉండే కేసీఆర్.. సచివాలయం వాస్తు సరిగా లేకపోవడంతో అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. క్యాంపు కార్య్లలయంలోనే అన్ని పనులు చూస్తున్నారు. ఎటూ కేసీఆర్ రావడం లేదు కదా అని మరమత్తులు చేసే వారు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు అసలు సచివాలయానికే రావడానికి ఇష్టపడని కేసీఆర్.. రోజులకు రోజులు ఫాంహౌస్ లోనే ఉంటుంటే ఆయనపై విమర్శలకు తానే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని పలువురు ఆభిప్రాయపడుతున్నారు.

వీర్రాజుకు వెంకన్న కౌంటర్.. చంద్రబాబును అంటే సహించం

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ పై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ, టీడీపీ మిత్రపక్షం కాబట్టి వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలకు ఒకింత కోపం వచ్చినా వినివిననట్టు వదిలేశారు. అయితే ఇప్పుడు అలా కాకుండా వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. వీర్రాజు చేసిన విమర్శలకు గాను వెంకన్నస్పందిస్తూ చంద్రబాబు భిక్ష వల్లే వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారని ఆ విషయం ఆయన మర్చిపోయారేమో అని కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవి కోసమే వీర్రాజు టీడీపీని విమర్శిస్తున్నారని.. ఇలాంటి వారిపై బీజేపీ పెద్దలు దృష్టిసారించాలని సూచించారు. అంతేకాదు తమ అధినేత చంద్రబాబుకు మచ్చతెచ్చేలా మట్లాడితే సహించేది లేదని బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

రాజయ్య గురించి మాట్లాడొద్దు.. పీసీసీ హుకుం

రాజయ్య కోడలు సారిక అతని ముగ్గురు మనవలు అతిదారుణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పుడు రాజయ్య ఎఫెక్ట్ పార్టీ పై ఎక్కడ పడుతుందా అని కాంగ్రెస్ పార్టీ తెగ భయపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అధిష్టానం ఓ హుకుం జారీ చేసిందట. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో రాజయ్య గురించి కాని.. రాజయ్య కుటుంబలో జరిగిన ఘటన గురించి ప్రస్తావించకూడదని.. ఒకవేళ ఎక్కడైనా అనుకోకుండా అటువంటి సందర్బం వచ్చినప్పుడు రాజయ్యమీద సానుభూతి వ్యక్తమయ్యేలా మాట్లాడొద్దని ఆదేశించారట. అంతేకాదు రాజయ్య మీద సానుభూతి చూపేలా ఒక్క మాట మాట్లాడినా అది వంద ఓట్లకు చేటు తెస్తుందని సూచించారట. కాగా ఇప్పటికే సారిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా సారికని హత్య చేశారనే అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా రాజయ్య కుటుంబంపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రాజయ్య గురించి మాట్లాడితే.. అసలే అంతంత గుర్తింపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే కోట్లు కూడా రావని భయంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఓట్లను పునరుద్దరించాకే ఎన్నికలు నిర్వహించాలి.. ఎమ్మెల్యేల ధర్నా

జీహెచ్ఎంసీ ఎదుట టీ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా ఓట్లు తొలగించారని, డివిజన్ల విభజన అస్తవ్యస్తంగా చేశారని ఆరోపించారు. ప్రభుత్వంతో అధికారులు కుమ్మక్కయి 25 లక్షల పరిధిలో ఓట్లను తొలగించారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ప్రభత్వం ఇలాంటి కుట్రలు పన్నింది.. కానీ తొలగించిన ఓట్లను పునరుద్దరించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ధర్నా చేపట్టిన ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొంత మంది నేతలు కిందపడియారు. కాగా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.