వారి నమ్మకాన్ని వమ్ము చేయం..కేటీఆర్
గ్రేటర్ ఎన్నికల విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలుపుతో టీఆర్ఎస్ కొత్త చరిత్రను సృష్టించిందని.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని అన్నారు. ప్రజలు మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయమని అని వెల్లడించారు. అంతేకాదు మమ్మల్ని గెలిపించిన ప్రతిఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.. ఈ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. కాగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు.