Central Govt Whatsapp

ఆ నిర్ణయమే తీసుకుంటే వాట్సప్ తో నో పర్సనల్ చాటింగ్

  స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వాళ్లకి వాట్సప్ గురించి తెలిసే ఉంటుంది. ఒక్క ఛాటింగ్ మాత్రమే కాకుండా ఫోటోలు.. చిన్న చిన్న వీడియోలు సైతం ఈ వాట్సప్ ద్వారా పంపించుకునే సౌకర్యం ఉంది కాబట్టే ఈ యాప్ అంత పాపులర్ అయింది. ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ ఆఖరికి రాజకీయ వేత్తలు కూడా ఈ వాట్సప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం వాట్సప్ విషయంలో చట్టపరంగా తీసుకోబేయే ఒక నిర్ణయం ద్వారా వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే వాట్సప్ ఉపయోగించేవారు తాము ఛాటింగ్ చేసిన మెసేజ్ లను మూడు నెలల వరకూ డిలీట్ చేయకూడదని.. వాటిని మూడు నెలల పాటు అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఈ చట్టపరమైన నిర్ణయమే తీసుకొన్నట్లయితే వాట్సప్ వినియోగదారులు ఖచ్చితంగా మెసేజ్ లను మూడు నెలల పాటు డిలీట్ చేయకుండా ఉంచాల్సిందే. అప్పుడు వినియోగదారులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ఆచితూచి చాటింగ్ చేయాల్సిన పరిస్థితి వుంటుంది... దీనివల్ల అవసరమైతే వినియోగదారులు వాట్సప్ వినియోగించడం మానేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

T TdpPresident Post

టీ టీడీపీ పీఠం.. రేసులోకి దిగిన మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ ఆధిపత్యపోరుపై రోజుకో సమస్య తెలత్తుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆయనకు అగ్నిపరీక్షలా తయారైంది. పార్టీ అధికార పగ్గాలు ఎవరిచేతికి ఇవ్వాలా అన్న దానిపై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నా వాటివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అసలు ఇప్పటివరకూ పార్టీ పరిపాలనా కలాపాలు చూసిన ఎల్. రమణకే చంద్రబాబు మళ్లీ ఆబాధ్యతలు అప్పగించాలని చూశారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ నిర్ణయాన్నివిరమించుకోవాల్సి వచ్చింది. తరువాత  టీ టీడీపీలో యాక్టివ్ గా ఉండే రేవంత్ రెడ్డికి అధికార పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఈ విషయంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఏమాత్రం తమ మద్దతు ఇవ్వలేదు. అందునా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఎర్రబెల్లికి.. రేవంత్ రెడ్డికి అంతర్గతంగా మాత్రం వారి మధ్య వివాదాలు ఉన్నాయి.. ఈ సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిపై ఇరు నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి అందరి నాయకులను ఏకగ్రీవంగా ఒప్పింటి రేవంత్ రెడ్డిని పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనుకున్నారు. కానీ అది కాస్త బెడిసికొట్టింది. అదిగాక ఐవీఆర్ఎస్ పద్దతి ద్వారా కార్యకర్తల నుండి సేకరించిన అభిప్రాయాల గురించి తెలిపారు. అయితే కేవలం 200 మంది నుండే అభిప్రాయాన్ని సేకరించడంతో తెలంగాణలో 2 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారని.. కేవలం 200 మంది అభిప్రాయాలనే ఎలా సేకరిస్తారని అభ్యంతరం వ్యక్త పరిచారు. దీంతో సమస్య కాస్త ఇంకా జఠిలమైంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి.. ఎర్రబెల్లి రేసులో ఉండగా ఇద్దరిలో  ఎవరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలో తెలియక చస్తుంటే ఇప్పుడు మోత్కుపల్లి రూపంలో చంద్రబాబుకు మరో సమస్య వచ్చిపడింది. ఇప్పుడు ఈ రేసులో నేను కూడా ఉన్నాను అంటూ ముందుకొచ్చారు మోత్కుపల్లి. దళితకార్డును ముందుపెట్టి పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు టీ టీడీపీలో వేడి వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి తోనే సమస్య వచ్చిపడితే ఇప్పుడు మోత్కపల్లి కూడా యాడ్ అయ్యాడు. ఒకవేళ రేవంత్ రెడ్డికే అధ్యక్ష పదవి కట్టబెడదామా అనుకుంటే పార్టీలో నేతలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడేట్లు కనిపించడంలేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. మరి చంద్రబాబు ఈసమస్య ఎలా పరిష్కరిస్తారో.. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెడతారో చూడాలి.

Unconscious Drunk Man dead

అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారు

 కార్మికుల నిర్లక్ష్యంతో బతికున్న మనిషిపై రోడ్డు వేసి అతని ప్రాణాలను బలిగొన్నారు. ఈదారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లోని కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో జరిగింది. వివరాల ప్రకారం లటోరి బర్మాన్ అనే వక్తి తన భార్యతో పండుగ సందర్భంగా తన అత్తగారింటికి వెళ్లాడు. అయితే పండుగ అయిపోయిన తరువాత తన భార్యను అక్కడే వదిలి పెట్టి తన ఊరికి బయలుదేరాడు. అయితే బర్మాన్ కు మద్యం అలవాటు ఉండటంతో మధ్యలో ఆగి తాగి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పటికే ఎక్కవ తాగడంతో నడుస్తూనే మధ్యలో పడిపోయాడు. అయితే... ఆయన పడిన చోట పెద్ద గొయ్యి ఉంది. ఆ మరుసటి రోజు రోడ్డు పనులు చేసే కూలీలు ఆ గుంతలో అతనిని చూడకుండానే కంకర,మట్టి వేసి పూడ్చిపెట్టారు. అయితే వారు కంకర వేస్తున్న సమయంలో మెలకువ వచ్చిన బర్మాన్ బయటకు రావడానికి ప్రయత్నించిన క్రమంలో ఒక చేయి మాత్రమే బయటకు వచ్చింది కాని ఫలితం లేదు. ఊపిరిఆడక బర్మాన్ గుంతలోనే మరణించాడు. తరువాత రోడ్డుపై బర్మాన్ చేయి చూసిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించడంతో అసలు విషయం తెలిసింది. అయితే కూలీల నిర్లక్ష్యం వల్లే బర్మాన్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

venkaiah naidu

వాళ్లూ సూట్లు ధరించారు.. రాహుల్ పై వెంకయ్య ఫైర్

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీది సూటు బూటు పాలన అని ఎప్పటినుండో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. నరేంద్ర మోడీది సూటు-బూట్ పాలన అంటున్నారు.. మరి నెహ్రూ, రాజీవ్ గాంధీలు సూటు-బూటు వేసుకోలేదా అని ప్రశ్నించారు. వాళ్లూ అప్పుడు అవే ధరించారు.. ఆ సంగతి రాహుల్ మర్చిపోయినట్టున్నాడు..ఇప్పుడు సూటు-బూటు అంటూ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు మోడీ ధరించిన సూటును వేలం పెట్టిన సంగతిని రాహుల్ గుర్తుంచుకోవాలని వెంకయ్య తెలిపారు. రాహుల్ మాటలు చిన్నపిల్లాడు మాట్లాడినట్టుగా, మెచ్యూరిటీ లేనట్టుగా ఉన్నాయని.. అసలు రాహుల్ కు ఉపన్యాసాలు ఎవరు రాస్తున్నారో తెలియదుగానీ వారే సరిగా లేరని..పాపం రాహుల్ వారు రాసినవి తెచ్చుకొని చదువుతున్నారని ఎద్దేవ చేశారు.

akhil akkineni

అఖిల్ ఆడియో లాంచ్.. వేలు చూపిస్తూ హిరోయిన్ కు అఖిల్ వార్నింగ్

వి.వి వినాయక్ దర్శకుడిగా.. హీరో నితిన్ హీరోగా అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా "అఖిల్" ఆడియో ఫంక్షన్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రిన్స్ మహేశ్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియో ఆవిష్కరణ చేశారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ అంతా బాగానే ఉన్నా ఒక గమత్తైన అంశం ఒకటి చోటుచేసుకుంది. అందేంటంటే "అఖిల్" సినిమాలో అఖిల్ సరసన నటిస్తున్న హీరోయిన్ సాయేషాని మన హీరో కనుసైగతోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆడియో ఫంక్షన్ లో యాంకర్ సుమా హీరోయిన్ సాయేషాను డ్యాన్య్ చేయమని అడుగగా.. అందుకు హీరోయిన్ అఖిల్ ను కూడా స్టేజ్ పైకి రమ్మని పిలిచింది. అంతే అఖిల్ ఒక్కసారిగా వేలు చూపిస్తూ.. కనుసైగతోనే హీరోయిన్ ను వార్న్ చేసి ఆతరువాత స్మైల్ చేసి కవర్ చేసేశాడు. దీంతో పాపం అమ్మడు ఏం చేస్తుంది ఒక్కతే డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అఖిల్ హీరోయిన్ ను బాగానే కంట్రోల్ లో పెట్టాడని అనుకుంటున్నారు.

coal allocation scam

మన్మోహన్ సింగ్ పై దాసరి సంచలన వ్యాఖ్యలు

బొగ్గు కుంభకోణంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కాంలో తనకెలాంటి సంబంధం లేదన్న దాసరి, అంతా మన్మోహనే చేశారంటూ బాంబు పేల్చారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అన్నీ ఆయనకు తెలుసని, గనుల కేటాయింపు మన్మోహన్ సమక్షంలో జరిగిందని తెలిపారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ కోర్టుకు హాజరైన దాసరి, కోల్ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్మోహన్ సింగ్... దాసరి వ్యాఖ్యలతో మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది?

AP Power Generation Distribution

ఏపీని చూసి నేర్చుకోండి.. చంద్రబాబుకి మరో ఘనత

ఇప్పటికే పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఏపీకీ రెండో స్థానం దక్కి అరుధైన ఘనత సాధించింది. మళ్లీ ఇప్పుడు ఏపీకి.. చంద్రబాబు ఖాతాలోకి మరో ఘనత దక్కింది. అదేంటంటే కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ దేశంలోని రాష్ట్రాల్లో  విద్యుత్ రంగానికి చెందిన పంపిణీ సరఫరాలపై సమీక్షించింది. దీనిలో విద్యుత్ నష్టాల తగ్గింపులోనే ఏపీ ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా మారడం గొప్ప విషయం. ఈనేపథ్యంలోనే పంపిణీ నష్టాలను తగ్గించుకోవడమెలాగో ఏపీని చూసి నేర్చుకోవాలని.. దీనికి ఏపీ ఏం పద్దతులు పాటించిందో వాటిని అధ్యయనం చేయాలని కేంద్ర ఇంధనశాఖ మంత్రి  పీయూష్ గోయల్ సూచించారని ఏపీ ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ కె.విజయానంద్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయన తరువాత అసలే ఆర్ధిక లోటులో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో.. నష్టాల తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తూనే ఉన్నారని అన్నారు. దీనిలో భాగంగానే విభజన ముందు 2010-11 లో విద్యుత్ నష్టాలు 17.05 గా ఉంటే విభజన తరువాత చంద్రబాబు హయాంలో ఆ నష్టాల తగ్గింపు 10.54 కు వచ్చిందని.. దీనివల్ల రూ.1950 కోట్లు మేర పొదుపు చేయగలిగామని అన్నారు. అంతేకాదు ఈ నష్టాల తగ్గింపును సింగిల్ డిజిట్ కు తీసుకురావాలని చంద్రబాబు చూస్తున్నారని.. వచ్చే రెండు మూడేళ్లలో ఆదిశగా ప్రయత్నిస్తామని తెలిపారు. దీని కోసం రాబోయే కాలం లో దాదాపు రూ.27 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని..మొదటి భాగంగా రాష్ట్రానికి రూ.2400 కోట్ల ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచబ్యాంకు ముందుకు వచ్చిందని వివరించారు.

Maoist party warns trs

వరంగల్ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తప్పదు... కేసీఆర్ కు మావోయిస్టు పార్టీ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తీవ్రంగా స్పందించిన మావోయిస్టు పార్టీ... టీఆర్ఎస్ నేతల హెచ్చరిస్తూ ఓ లేఖను మీడియాకి పంపింది. ఖమ్మం-కరీంనగర్, వరంగల్ జిల్లాల మావోయిస్టు కార్యదర్శి దామోదర్ పేరుతో విడుదల చేసిన లేఖలో...టీఆర్ఎస్ నేతలను వదలబోమని హెచ్చరించారు. మంచినీళ్ల కోసం వచ్చిన శ్రుతిని, విద్యాసాగర్ రెడ్డిని పోలీసులు పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్ కౌంటర్ చేశారని, దీనికి ప్రతీకారం తప్పదని గులాబీ నేతలకు వార్నింగ్ పంపారు. వరంగల్ జిల్లా మంత్రులను, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులను వదలబోమని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల సిద్ధాంతమే...టీఆర్ఎస్ అజెండా, అధికారంలోకి వస్తే నక్సల్స్ అజెండాను అమలు చేస్తామన్న కేసీఆర్, ఇప్పుడు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యం పనిచేస్తూ, బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నాడని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఖమ్మం-కరీంనగర్, వరంగల్ జిల్లాల మావోయిస్టు కార్యదర్శి దామోదర్ హెచ్చరించారు.

t tdp leaders

టీఆర్ఎస్ పై టీడీపీ ప్లాన్

  తెలంగాణ టీడీపీ ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఢీకొనేందుకు వ్యూహత్మకంగా వ్యవహరించనుందా?.. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎలాంటి చర్యలు కార్యాచరణలో పెట్టాలి అనే విషయాలపై కసరత్తు చేస్తుందా? అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వపై పోరాడటానికి సిద్దమవుతోందా? అంటే అవుననే అనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లా కాకుండా ఈసారి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సమాయత్తమవుతోంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష బలం బానే ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఎవరూ నోరు మెదపకుండా ఉండటం.. టీఆర్ఎస్ కూడా ఇదే అదను చూసుకొని రెచ్చిపోవడం జరిగింది. టీడీపీ నుండి మాట్లాడగలిగే రేవంత్ రెడ్డిని కూడా అకారణంగా సభ నుండి వెలివేసి సమావేశాలు ముగిసే వరకూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అలా కాకుండా తామ ఒక్కపార్టీనే సింగిల్ కూడా పోరాటానికి వెళ్లకూడదని.. ఇతర పార్టీలను కూడా కలుపుకొని కలిసికట్టుగా వెళ్లాలని.. ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్న్టట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఆత్మహత్యలు - తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్సార్ సీపీ పార్టీల నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు నష్టపరిహారం వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే నిర్ణయాలపై ఏకాభిప్రాయం వస్తే కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ నెరవేరుస్తానన్న హమీలపై.. ముఖ్యంగా రైతుల కుటుంబాలకు నష్టపరిహారం.. మొదలగు అంశాలపై మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏడాది కాలంపాటు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకూడా ఇప్పుడు బాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎదురుదాడికి దిగింది. ఎదో విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దూకుడుగా ముందుకెళ్లాలని సూచించడంతో నేతలు ఎవరికి నచ్చిన తీరులో వారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తునే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ టీడీపీ తో చేతులు కలుపుతుందనే వార్తలే వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీలన్నీ కలిసి టీఆర్ఎస్ పై యుద్దానికి దిగుతున్న నేపథ్యంలో మరి టీఆర్ఎస్ ఎలా అడ్డుకోగలదో చూడాలి.

revanth reddy

రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి

  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి (60) మృతిచెందారు. తన స్వస్థలం అయిన మహబూబ్ నగర్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డి పల్లిలో ఈ రోజు ఉదయం గుండెనొప్పి కారణంగా మృతి చెందారు. వివరాల ప్రకారం.. రోజూలాగనే ఉదయాన్నే పనిమీద బయటికి వెళ్లిన కృష్ణారెడ్డి.. బయటికి వెళ్లిన కొంతసేపటికి ఛాతి నొప్పి కారణంగా ఇంటికి తిరిగివచ్చారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలను విడిచారు. తన సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి తీవ్ర   మనస్తాపానికి గురయ్యారు. కృష్ణారెడ్డి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ తో పాటు పలువురు తెదేపా నేతలు దిగ్ర్భాంతికి గురయ్యారు  . కృష్ణారెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అమలవుతున్న రిజర్వేషన్లు, ఇతర అంశాలపై అధ్యయనానికి ఒక కమిటీని వేయాలని ఆయన సూచించారు, రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? అనే అంశాలపై స్టడీ చేయాల్సిన అవసరముందన్నారు. పటేళ్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజరాత్ లో హార్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్న క్రమంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.బీజేపీకి సిద్ధాంతకర్తయైన ఆర్ఎస్ఎస్ చేసిన సూచనలను ఎన్డీఏ ప్రభుత్వం స్వీకరిస్తుందో లేక లైట్ సుకుంటుందో తెలియదు గానీ, ఒకవేళ మోహన్ భగవత్ సలహా మేరకు కమిటీ వేస్తే కనుక కొత్త సమస్యలు తప్పవంటున్నారు మేధావులు

సింగపూర్ లో సీఎం బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ తో విందు భేటీలో పాల్గొన్న బాబు బృందం...స్విస్ ఛాలెంజ్ విధానం, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై చర్చించారు. ఇవాళ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకోపన్యాసం చేయనున్న చంద్రబాబు...ఆ తర్వాత సింగపూర్ కన్సార్టియం ఇచ్చే విందులోనూ పాల్గొననున్నారు. అనంతరం అమరావతి నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులుచేర్పులు, భవనాల ఆర్కిటెక్చర్‌ పై సింగపూర్ ప్రతినిధులతో చర్చించనున్నారు. చివరిగా సింగపూర్ ప్రధాని లూంగ్ తో భేటీకానున్న బాబు... నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని అందించనున్నారు.

పవన్ కూడా జగన్ లా చేస్తున్నాడా?

  అధికారికంగా పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడటం కాని.. పదవి కోసం పాకులాడటం కాని చేయలేదు. కానీ బీజేపీ.. టీడీపీ లను మిత్రపక్షలుగా చేసుకొని ఆపార్టీస కోసం తనవంతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత ఆపార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా ఎలాంటి పదవి ఆశించలేదు. అంతేకాదు టీడీపీ మిత్రపక్షమైనప్పటికీ కూడా ప్రత్యేక హోదాపైన.. భూసేకరణపైన టీడీపీ నేతలకు చురకలు అంటించారు. భూసేకరణ విషయంలో తానే స్వయంగా నిరసనకు దిగి రైతుల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి భూసేకరణను ఆపేసింది. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తమిళనాడులో దీక్ష చేపడుతున్నారన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం నిర్భంధ తమిళ బాషా చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో తమిళనాడులో తెలుగు బాషను తొక్కివేస్తున్న తరుణంలో ఆయన ఈ దీక్షను చేస్తున్నారు. ఈ నెలఖరున జరగబోయే ఈ దీక్షకు పవన్ ప్యాన్స్ అప్పుడే ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అయితే అంతా బాగానే ఇప్పుడు ఈ పవన్ దీక్షపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కూడా జగన్ తరహాలో అన్నిటికీ దీక్షలు చేయడం ప్రారంభించారు అంటూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా రాష్ట్రంలో ఏమైనా చిన్నసమస్యలు వచ్చినప్పుడే ఇరు పక్షాలు కలిసి కూర్చొని వారికి పరిష్కారాన్ని ఆలోచిస్తాయి. అంతకీ సమస్యలు తేలకపోతే అప్పుడు దీక్షల మార్గాన్నిఅనుసరిస్తారు. మరి అలాంటిది పక్క రాష్ట్రంతో సమస్య అంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలో దీక్షల కుంటే కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటేనే రెండు రాష్ట్రాలకు కూడా మంచిది. మరి అలాంటిది పపన్ కళ్యాణ్ ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా దీక్ష అంటూ రంగంలోకి దిగుతున్నారు. పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి జయలలిత అపాయింట్ మెంట్ పవన్ కు దొరకదా అంటే.. దేశ ప్రధాని అయిన నరేంద్రమోదీనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు పవన్. మరి అలాంటిది జయలలితి అపాయింట్ మెంట్ దొరకడం పెద్ద విషయమేమి కాదు. అలా చేయకుండా అమ్మకి వ్యతిరేకంగా పవన్ తమిళనాడులో చేయబోతున్న దీక్ష కేవలం ప్రచారం కోసమే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఎంతోమంది దీక్షలకే తలవంచని జయలలిత మరి పవన్ కళ్యాణ్ దీక్షను ఎంతవరకూ పట్టించుకుంటుంది.. అసలు అవేమీ లేకుండా ఒకసారి జయలలితతో మాట్లాడి.. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు దీక్ష చేసినా బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వారికి కూడా తెలంగాణవారితో సమాన హక్కులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో కేరళ భవనాన్ని నిర్మిస్తానన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో కేరళ భవనాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని.. తెలంగాణకు.. కేరళకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని అన్నారు. ప్రతిఒక్కరితో కలిసిపోయే తత్వం మలయాళీల లక్షణంగా చెప్పిన కేసీఆర్.. కేరళవారిని తెగ పొగిడేశారు. అంతేకాదు తెలంగాణలో ఉన్న మలయాళీలంతా తెలంగాణ వారే అని.. తెలంగాణ వారితో సమానంగా మలయాళీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో 350 పేద మలయాళీల కుటుంబాలు ఉన్నాయని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.