ఎన్నికల బరిలో ఆరుగురు హిజ్రాలు..
త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు, మహిళలతో పాటు హిజ్రాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయలలితపై దేవి అనే హిజ్రా పోటీకి బరిలో దిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో పోటీ చేసే హిజ్రాల సంఖ్య పెరిగింది. మొత్తం ఇప్పటికి ఆరుగురు హిజ్రాలు బరిలో దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా.. రత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ, హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతమంది హిజ్రాలకు పోటీ చేసే అవకాశం రావడం అనందించాల్సిన విషయమే. మరి ఇంతమందిలో ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపడుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన కూడా ఓ హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు, మహిళలతో పాటు హిజ్రాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయలలితపై దేవి అనే హిజ్రా పోటీకి బరిలో దిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో పోటీ చేసే హిజ్రాల సంఖ్య పెరిగింది. మొత్తం ఇప్పటికి ఆరుగురు హిజ్రాలు బరిలో దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా.. రత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ, హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతమంది హిజ్రాలకు పోటీ చేసే అవకాశం రావడం అనందించాల్సిన విషయమే. మరి ఇంతమందిలో ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపడుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన కూడా ఓ హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.