LATEST NEWS
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది. టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. .
తాజాగా జూన్ 29 మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు.
అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది. అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇకపోతే బుధవారం (జూలై2) శ్రీవారిని మొత్తం 74 వేల 510 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 050 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 98 లక్షల రూపాయలు.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
28ఏళ్లుగా దేశ రక్షణలో విధులు నిర్వహించి, సుబేధర్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన సందర్బంగా బాజా భజంత్రీలు, శ్రీ శివరామ డోలు సన్నాయి కళాకారులు, శ్రీ ఆసిరిపోలమ్మ కోలాట బృందం, శ్రీ కళ్యాణవెంకటేశ్వర కోలాట బృందం, శ్రీ దుర్గా పాండు రంగ స్వామి కోలాట బృందం కళాకారులచే కోలాట ప్రదర్శన నిర్వహించి ఘన సన్మానసభ నిర్వహించారు.
ALSO ON TELUGUONE N E W S
విశ్వకథానాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)ఇండియన్ చిత్ర పరిశమ్ర గర్వించదగ్గ లెజండ్రీ డైరెక్టర్ 'మణిరత్నం'(Manirathnam)కాంబోలో జూన్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'థగ్ లైఫ్'(Thug Life). గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో శింబు(Simbu),త్రిష(Trisha)అభిరామి, నాజర్, తనికెళ్ళ భరణి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ 'ఏఆర్ రెహ్మాన్'(Ar Rehman)సంగీతాన్ని అందించడం జరిగింది.
థగ్ లైఫ్ రిలీజ్ కి ముందు జరిగిన ప్రమోషన్స్ లో కమల్ హాసన్ మాట్లాడుతు ఎనిమిది వారాల తర్వాత మాత్రమే థగ్ లైఫ్ 'ఓటిటి' లోకి వస్తుందని చెప్పాడు. కానీ ఎటువంటి ప్రకటన లేకుండా థగ్ లైఫ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'థగ్ లైఫ్' తెలుగు,తమిళంతో పాటు మలయాళం,కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. దీంతో ఓటిటి సినీ ప్రియులకి సరికొత్త సినీ వినోదం 'థగ్ లైఫ్ ద్వారా దొరికినట్లే. రంగరాయ శక్తివేల్ గా కమల్, అమర్ క్యారక్టర్ లో శింబు తమ క్యారెక్టర్స్ లో జీవించారు. మిగతా పాత్రల్లో చేసిన త్రిష, అభిరామి, నాజర్ తో సహా అందరు ఆయా క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించి మూవీకి నిండు తనాన్ని తెచ్చారు. మణిరత్నం కూడా తన టేకింగ్ తో మెప్పిస్తాడు. కానీ కథ, కథనాల్లోని లోపాలవల్ల సిల్వర్ స్క్రీన్ పై మెప్పించలేకపోవడంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మరి ఓటిటిలో ఏ మేర ఆదరణని పొందుతుందో చూడాలి.
ముఖ్యంగా థగ్ లైఫ్ రిలీజ్ కి ముందు చెన్నై(Chennai)వేదికగా జరిగిన ఆడియో ఫంక్షన్లో కమల్ మాట్లాడుతు కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో కన్నడ భాషా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో పాటు కన్నడ నాట థగ్ లైఫ్ ని బ్యాన్ చెయ్యడంతో రిలీజ్ ఆగిపోయింది. ఈ విషయంలో కమల్ బెంగుళూరు(Bengaluru)హైకోర్ట్ లో పిటిషన్ వేసినా రిలీజ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో సుప్రీం కోర్టుకి వెళ్లడంతో రెండు వారాల తర్వాత రిలీజ్ కి పర్మిషన్ ఇచ్చింది. అప్పటికే 'థగ్ లైఫ్' రిజల్ట్ తెలిసిపోవడంతో కన్నడ ప్రజలు మూవీని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కన్నడ నాట థగ్ లైఫ్ కి ఓటిటిలో ఏ మేర ఆదరణ లభిస్తుందనే ఆసక్తి ఏర్పడింది.
హిట్ సినిమాకి సీక్వెల్ చేయడం కామన్ అయిపోయింది. సీక్వెల్స్ చేసి హిట్స్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఫ్లాప్స్ ని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మరో హిట్ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన మొదటి చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. 2019 జూన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. నవీన్ నటన, కథాకథనాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హిట్ మూవీ ఏజెంట్ కి సీక్వెల్ రూపొందించే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.
ఏజెంట్ తర్వాత 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలతో వరుస విజయాలను అందుకొని యువతకు చేరువయ్యాడు నవీన్. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏజెంట్ సీక్వెల్ కన్ఫర్మ్ అయితే.. అనౌన్స్ మెంట్ తోనే మంచి అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.
Salman Khan's biggest blockbuster Bajrangi Bhaijaan gained cult status as his friendship with the child connects with everyone and thugs their heartstrings. The kid has grown up to become an actress now. Her name is Harshali Malhotra and the youngster is debuting in Telugu in Akhanda 2 Thaandavam.
It is said that she will be playing Janani and her character will have great interaction with Nandamuri Balakrishna, who will be seen as Aghora, Akhanda. The strong emotional connection that had been hinted at in the first one will continue in the sequel through this character, say makers.
Now, looking at her, we are unable to ignore her resemblance with an yesteryear beauty. Well, to got it right, she looks like Prema, who won over hearts of Telugu audiences with her beautiful smile and acting prowess in films like Dharma Chakram, Om, Omkaram, Devi, Rayalaseema Ramanna Chowdary, Chiru Navvutho, Dhee.
Being from Kannada homeland, she became extremely popular in Kannada language and acted in films like Om, Upendra, Chandramukhi Pranasakhi, Yajamana, Kanasugara, Apthamitra, Upendra Matte Baa and many others. Her relationship with Upendra also made headlines which she denied.
Well, Harshali almost looks her younger sister or even her daughter, doesn't she? We hope and wish for Harshali Malhotra also to have a very celebrated career like Prema did and let Akhanda 2, be her big start.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Global Star Ram Charan and director Shankar have come together for the first time for Game Changer. Dil Raju has produced the movie as their prestigious SVC50, their 50th production. The movie became an all-time disaster for Industry and hence, media has been questioning about it to producer in his Thammudu promotions.
For the first time, his brother co-producer and distributor Shirish also gave an interview and he made a statement that post Game Changer failure, actor and director did not call them. But this comment has hurt Ram Charan and Mega fans, has they have issued an ultimatum to Dil Raju and Shirish to never talk about Ram Charan, again.
Shirish issued a written statement stating that he did not meant any disrespect to Ram Charan. But fans trended #BoycottDilRaju, #BoycottSVC and hence, Shirish released a video statement where he praised Ram Charan's kind and big heart for allowing them to release Sankrantiki Vasthunnam along with his film.
He asked fans to not make it even bigger issue as Ram Charan agreed to be a part of another project for them. He apologised to fans while praising Ram Charan. Well, flops of such magnitude due end up people bitter and everyone should work together to a better project rather than blaming others. Hope this ends here as it benefits no one.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నాలుగున్నర దశాబ్దాల క్రితం నుంచే పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటుతు వస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి'(Mammotty). కెరీర్ లో ఎక్కువ శాతం విజయాల్ని నమోదు చేసిన మమ్ముట్టి, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 'బజూక' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'కాలం కావల్' అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
రీసెంట్ గా కేరళ(Kerala)కి చెందిన మహారాజా కళాశాల యాజమాన్యం బిఏ హిస్టరీలో మమ్ముట్టి కెరీర్ పై పాఠ్యాంశం అందించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిఏ ద్వితీయ సంవత్సరం చదివే స్టూడెంట్స్ కి 'హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా' పేరుతో ఒక చాప్టర్ ని కూడా తీసుకొచ్చింది. ఇందులో మమ్ముట్టి తన సినీ కెరీర్ లో ఎదుర్కున్న సవాళ్లు, అందుకున్న పురస్కారాల గురించి పొందుపరచడం జరిగింది. మమ్ముట్టి 'మహారాజ' కాలేజి పూర్వ విద్యార్థి కావడం విశేషం. మోహన్ లాల్(MOhanlal)జయన్, షీలా, ప్రేమ్ నాజిర్ వంటి వారి గురించి కూడా 'హిస్టరీ ఆఫ్ మలయాళం' చాప్టర్ లో చర్చిండం జరిగింది
1971 లో సినీ రంగ ప్రవేశం చేసిన మమ్ముట్టి ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి సుమారు 430 చిత్రాలకి పైగానే చేసాడు. వీటిల్లో ఎక్కువ భాగం విజయాల్ని నమోదు చేసినవే. ఇటీవల మమ్మూట్టి అనారోగ్యం భారిన పడినట్టుగా వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. కానీ అవన్నీ ఒట్టి వదంతులే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఈ టైంలో మమ్ముట్టి గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చడం అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. మమ్ముట్టి తనయుడు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఇంటిని స్టైలిష్గా, ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి, తరచుగా మెష్ చేసిన కిటికీలు , తలుపులను ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాటిలో చిక్కుకున్న మురికిని తొలగించడం చాలా కష్టం. మెష్ కారణంగా వెంటిలేషన్ సమస్య ఉండదు. కాబట్టి ఇంట్లో మెష్ కిటికీలు, తలుపులు ఉండటం చాలా బాగుంటుంది. కాన మెష్ ను క్లీన్ చేయడం గురించే అందరి భయం. అలా కాకుండా కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా మెష్ ను సులువుగా క్లీన్ చేయవచ్చు. అది కూడా ఇంట్లోనే ఉండే పదార్థాలతో మెష్ క్లీన్ చేసే ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
1 స్ప్రే బాటిల్, కొబ్బరి నూనె
1 కాటన్ వస్త్రం, 1 టూత్ బ్రష్
1 నుండి 2 టీస్పూన్లు టార్టార్ పౌడర్
2 నుండి 3 టీస్పూన్ల లిక్విడ్ సోప్
1/2 కప్పు టీ నీరు
తయారీ విధానం..
ఒక గిన్నెలో టార్టార్ పౌడర్, లిక్విడ్ సోప్, టీ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తే మెష్ క్లీన్ చేసే ద్రావణం సిద్దమైనట్టే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే.. పైన పేర్కొన్న పరిమాణం ప్రకారం అన్ని వస్తువులను జోడించాలి, అప్పుడు మాత్రమే శుభ్రపరచడం సులభం అవుతుంది. ఇలా ఇంట్లోనే క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి.
మెష్ న ఇలా శుభ్రం చేయాలి..
ఇంట్లో తయారుచేసిన క్లీనింగ్ లిక్విడ్ను తలుపు లేదా కిటికీ గ్రిల్పై పూర్తిగా స్ప్రే చేయాలి . ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. నిర్ణీత సమయం తర్వాత, టూత్ బ్రష్ తీసుకొని గ్రిల్ను పూర్తిగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు కాటన్ వస్త్రంతో కొద్దిగా తడిపి గ్రిల్ను పూర్తిగా తుడవాలి. చివరగా పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే మెష్ ప్రకాశవంతంగా మెరుస్తుంది.
ఇలా కూడా క్లీనర్ తయారు చేసుకోవచ్చు..
ఒక స్ప్రే బాటిల్లో సమాన మొత్తంలో నీరు, వైట్ వెనిగర్ కలపాలి. ఉదాహరణకు.. ఒక కప్పు నీరు తీసుకుంటుంటే, ఒక కప్పు వైట్ వెనిగర్ కూడా కలపాలి. వెనిగర్ మురికి, గ్రీజును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది . ఇప్పుడు ఈ ద్రావణాన్ని మెష్పై పూర్తిగా స్ప్రే చేయాలి. మెష్లోని ప్రతి భాగం తడిగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని కూడా కొంత సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇప్పుడు మెష్ను పై నుండి క్రిందికి మైక్రోఫైబర్ క్లాత్ లేదా పాత టవల్తో తుడవాలి. ఇది మురికిని తొలగిస్తుంది. మెష్లో చాలా మురికి చిక్కుకుంటే పాత టూత్ బ్రష్ను ఉపయోగించవచ్చు. సున్నితంగా రుద్దడం ద్వారా మురికి తొలగిపోతుంది. ఇప్పుడు శుభ్రమైన గుడ్డను సాధారణ నీటిలో తడిపి శుభ్రం చేయాలి. చివరకు పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మెష్ లో మురికి పూర్తీగా పోయి మెరుస్తుంది.
*రూపశ్రీ.
పెళ్లైన ప్రతి అమ్మాయి ఒక కొత్త ఇంటికి వెళుతుంది. అక్కడ భర్తతో పాటు ఆమె అత్తమామలు కూడా ఉంటారు. సాధారణంగా చాలా ఇళ్లలో భార్యాభర్తల కంటే అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి. అత్తాకోడళ్లు కలిసి ఒకే చోట ఉన్నా, లేకపోయినా.. అత్తాకోడళ్లు కొన్ని విషయాలు ఒకరితో మరొకరు చెప్పుకోకుండటం మంచిదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకూ ఒకరితో ఒకరు అనకూడని విషయాలేంటి? తెలుసకుంటే..
బంధువుల విషయాలు..
అత్తవైపు బంధువులు అయినా, కోడలి వైపు బంధువులు అయినా చెడుగా మాట్లాడకూడదు. ఎవరివైపు బంధువుల గురించి వారికి ప్రేమ, అభిమానం ఉంటాయి. అత్త కోడలివైపు వారి గురించి, కోడలు అత్తవైపు వారి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వస్తాయి.
డబ్బు,నగలు..
అత్తాకోడళ్ల మధ్య ఏవైనా చర్చలు జరిగినా, ఒకరితో ఒకరు ఏదైనా చెప్పుకున్నా అది ఇంటి పనుల గురించి, ఏదైనా సమస్య ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప డబ్బు, నగల గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరితో ఒకరు గొడవ పడటం చేయకూడదు.
ఫిర్యాదులు..
ఎంతైనా భర్త అనేవారు అత్త కొడుకు. అతను ఏదైనా తప్పు చేసినప్పుడు అతని గురించి అత్తకు ఫిర్యాదు చేయడం మంచిది కాదు. తప్పు చేసినా సరే.. కోడలి ముందు కొడుకును తక్కువ చేయాలసి అతడిని దండించాలని ఏ అత్త అనుకోదు. పైగా తిరిగి కోడలినే మందలించే అవకాశం ఉంటుంది. దీని వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తాయి.
కోడలి తల్లిదండ్రులు..
పెళ్లైన మాత్రాన ఆడపిల్లకు తల్లిదండ్రులంటే పరాయితనం రాదు. కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ఆమె ప్రేమ జీవితాంతం ఉంటుంది. అయితే కోడలు తన ఇంట్లో ఉంటోంది కదా అని అత్తగారు కోడలి తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం, వారిని నిందించడం చేయరాదు. ఇది చాలా గొడవలకు దారి తీస్తుంది.
పోలిక..
కోడలిని ఇతర కోడళ్లతో లేదా కూతురితో పోల్చడం, అత్తను ఇతర ఇంటిలోని అత్తతో పోల్చడం లాంటివి అత్తాకోడళ్లు చేయరాదు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం తెగిపోతుంది.
అలవాట్లు..
కోడలు అయినా, అత్త అయినా వారు పెరిగిన వాతావరణంకు తగ్గట్టు వారి అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల గురించి పదే పదే విమర్శలు చేయడం, హేళన చేయడం చేయరాదు. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
పిల్లల పెంపకం..
జనరేషన్ మార్పును బట్టి పిల్లల పెంపకంలో కూడా తేడాలు ఉంటాయి. ఒకప్పుడు పెద్ద వాళ్లు పెంచిన విధానం వేరు.. నేటితరం వారు పిల్లలను పెంచే విధానం వేరు ఉంటుంది. వీటి కారణంగా ఒకరిమీద మరొకరు వాదించుకోకూడదు.
*రూపశ్రీ.
వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ తేమ కారణంగా, ఇంటి ఫర్నిచర్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో చెక్క ఫర్నిచర్ త్వరగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తేమ కారణంగా చెక్క ఫర్నిచర్ రంగు మసకబారడం లేదా చెదపురుగుల దాడి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వర్షాకాలంలో కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా విలువైన ఫర్నిచర్ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, వర్షం వచ్చిన కొన్ని వారాలలోనే ఫర్నిచర్ దాని మెరుపును కోల్పోయే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో తేమ, చెదపురుగులు నుండి ఫర్నిచర్ను రక్షించుకోవడానికి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలేంటో తెలుసుకుంటే..
స్థల మార్పిడి.
వర్షాకాలంలో చెక్క ఫర్నిచర్ను కిటికీలు, బాల్కనీ లేదా బాత్రూమ్ తలుపుల దగ్గర ఉంచకూడదు. వర్షపు నీరు లేదా తేమతో కూడిన గాలులు ఈ ప్రదేశాలకు సులభంగా చేరుతాయి. దీనివల్ల ఫర్నిచర్ దెబ్బతింటుంది. వర్షాకాలంలో కిటికీలను మూసి ఉంచాలి. మందపాటి కర్టెన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కిటికీలు, తలుపుల దగ్గర చెక్క ఫర్నిచర్ ఉన్నట్టైతే వాటి స్థలాన్ని మార్చడం మంచిది.
నాప్తలీన్ బాల్..
నాఫ్తలీన్ బంతులు దుస్తులను సురక్షితంగా ఉంచడమే కాకుండా, ఫర్నిచర్ను చెదపురుగుల నుండి రక్షిస్తాయి. అల్మారా, డ్రాయర్లు, ఇతర ఫర్నిచర్ లోపల నాఫ్తలీన్ బంతులను ఉంచవచ్చు. ఇది తేమను నిరోధించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఫర్నిచర్ కొత్తగా ఉంటుంది.
కాలానుగుణంగా పాలిష్
చెక్క ఫర్నిచర్ కు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాటిని ఎప్పటికప్పుడు పాలిష్ చేయడం అవసరం. దీనివల్ల ఫర్నిచర్ చాలా కాలం పాటు కొత్తగా కనిపిస్తుంది. అదే సమయంలో వర్షాకాలంలో తేమ, చెదపురుగుల నుండి కూడా దీనిని రక్షించవచ్చు.
వేప ఆకులు..
ఎండిన వేప ఆకులను అల్మారా లేదా చెక్క క్యాబినెట్లో ఉంచవచ్చు . ఈ ఆకులు తేమను గ్రహించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, వాటిని ఫంగస్, కీటకాల నుండి కూడా రక్షించవచ్చు. కావాలంటే దానిలో కొన్ని కర్పూరం ముక్కలను కూడా వేయవచ్చు. ఇది దుర్వాసన రాకుండా చేస్తుంది.
చెదపురుగుల స్ప్రే ..
ఫర్నిచర్ పై యాంటీ-టెర్మైట్ స్ప్రేను కూడా పిచికారీ చేయవచ్చు. ఇది చెదపురుగుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫర్నిచర్ సురక్షితంగా ఉంటుంది. చెదపురుగులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో దీన్ని ఉపయోగించడం మంచిది.
*రూపశ్రీ.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది. టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. .
తాజాగా జూన్ 29 మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు.
అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది. అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇకపోతే బుధవారం (జూలై2) శ్రీవారిని మొత్తం 74 వేల 510 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 050 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 98 లక్షల రూపాయలు.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
28ఏళ్లుగా దేశ రక్షణలో విధులు నిర్వహించి, సుబేధర్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన సందర్బంగా బాజా భజంత్రీలు, శ్రీ శివరామ డోలు సన్నాయి కళాకారులు, శ్రీ ఆసిరిపోలమ్మ కోలాట బృందం, శ్రీ కళ్యాణవెంకటేశ్వర కోలాట బృందం, శ్రీ దుర్గా పాండు రంగ స్వామి కోలాట బృందం కళాకారులచే కోలాట ప్రదర్శన నిర్వహించి ఘన సన్మానసభ నిర్వహించారు.
డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. నేటికాలంలో దీని ప్రమాదం అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. జీవనశైలి, ఆహారపు సరిగా తీసుకోకపోవడం, మొదలైన తప్పుల వ్లల 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా డయాబెటిస్ రావడం జరుగుతోంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే లేదా సరిగ్గా చికిత్స చేయకపోతే, కాలక్రమేణా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉంటే, ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. మెరుగైన ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఇంటి నివారణలు, మందుల సహాయంతో, డయాబెటిస్ను నివారించడమే కాకుండా, దాని వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గించవచ్చు. అలాగే డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీని కోసం డయాబెటిస్ కిల్లర్ ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ డయాబెటిస్ కిల్లర్ ఆకులు ఏంటి? ఇవెలా పని చేస్తాయి? తెలుసుకుంటే..
పొడపత్రి..
డయాబెటిస్ ఉన్నవారికి వేప, తులసి, కరివేపాకు, మునగ వంటివి బాగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్య తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కానీ పొడపత్రి ఆకులు మాత్రం చాలా ప్రత్యేకం. ఇవి టైప్-2 డయాబెటిస్ ను మాత్రమే కాకుండా టైప్ -1 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందట. పొడపత్రికి ఆయుర్వేదంలో చాలా ఆదరణ ఉంది.
ఆయుర్వేదంలో పొడపత్రిని 2000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నట్టు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకు పొడి, సారం రెండూ డయాబెటిస్ చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది.
జిమ్నెమిక్ ఆమ్లం..
పొడపత్రి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలి అంటే.. ఆ ఆకులో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి. ఈ మొక్కలో ఉండే ప్రధాన క్రియాశీల సమ్మేళనాలలో జిమ్నెమిక్ ఆమ్లం ఒకటి. ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. తీపి పదార్థాలను తినే ముందు దీనిని తీసుకుంటే.. జిమ్నెమిక్ ఆమ్లం రుచి మొగ్గలపై చక్కెర గ్రాహకాలను అడ్డుకుంటుంది. ఇది తీపిని రుచి చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తీపి ఆహారాన్ని రుచిపరంగా తక్కువ ఆకర్షణీయంగా చేస్తుందట.
జిమ్నెమిక్ ఆమ్లం ప్రేగులలో ఈ గ్రాహకాలను కూడా నిరోధించగలదని, ఇది శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుందని కనుగొంది. దీని కారణంగా, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు లేదా పిల్లలు దీనిని ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యుడిని సంప్రదించకుండా దీనిని ఉపయోగించడం సరైనది కాదని అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు తీసుకుంటున్న వ్యక్తులు ఇలాంటి నివారణలు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని మీరే ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు మందులతో రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆవలింత అనేది మనమందరం అనుభవించే ఒక సాధారణ శారీరక ప్రక్రియ. తరచుగానిద్రపోవడం లేదా అధిక అలసటగా ఉన్నప్పుడు ఆవలింపులు వస్తుంటాయి. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆవలింపులు తగ్గిపోతాయని అనుకుంటాం. కానీ తరచుగా ఆవలింతలు వస్తుంటే మాత్రం అది నిద్రకు సంబంధించిన సమస్య కానే కాదు అంటున్నారు వైద్యులు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుందట. ఎవరైనా సాధారణం కంటే ఎక్కువగా ఆవలిస్తున్నారని అనిపిస్తే, తగినంత నిద్ర పోయిన తర్వాత కూడా పదే పదే ఆవలిస్తున్నారని భావిస్తే దానిని లైట్ గా తీసుకోకూడదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే..
మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం..
ఆవలింతకు ప్రధాన కారణం మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరకపోవడం. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు లేదా కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగినప్పుడు, మెదడు ఆవలింత ద్వారా ఉష్ణోగ్రతను, ఆక్సిజన్ మొత్తాన్ని నియంత్రిస్తుందట. ఈ పరిస్థితి వేడి, తేమతో కూడిన వాతావరణంలో లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం ద్వారా జరుగుతుందట. లోతైన శ్వాస తీసుకోవడం, స్వచ్ఛమైన గాలిలో నడవడం, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉండటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
శారీరక, మానసిక ఒత్తిడి..
ఒత్తిడి, ఆందోళన కూడా తరచుగా ఆవలించడానికి కారణమవుతాయి. మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శ్వాస ప్రక్రియ సక్రమంగా ఉండదు. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు, ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామం వంటి పద్దతుల సహాయం తీసుకోవచ్చు
మందుల దుష్ప్రభావాలు..
యాంటీ-డిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్లు లేదా నొప్పి నివారణ మందులు వంటి కొన్ని మందులు తరచుగా ఆవలింతకు కారణమవుతాయి. ఈ మందులు మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఇవి నిద్ర లేదా మగత అనుభూతికి దారితీస్తాయి. మందులు ఆవలింతను పెంచుతున్నాయని అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యులు మందుల మోతాదును సర్దుబాటు చేయవచ్చు లేదా ప్రత్యామ్నాయ చికిత్సలను సూచించవచ్చు.
ఆరోగ్య సమస్యలు..
తరచుగా ఆవలింతలు పడటం వల్ల స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లేదా థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. స్లీప్ అప్నియా అధిక నిద్రకు కారణమవుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా నిద్ర పూర్తిగా ఉండదు. మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీని కారణంగా ఆవలింత పగటిపూట పదేపదే రావచ్చు.
నార్కోలెప్సీ కూడా నిద్రకు సంబంధించిన సమస్య. ఇందులో, ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా అకస్మాత్తుగా నిద్రపోవచ్చు. ఈ వ్యాధిలో రోగి పగటిపూట చాలాసార్లు నిద్రపోతాడు. దీని కారణంగా ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు. అలసట, తలనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఆవలింతతో పాటు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మన ప్రేగులలో, మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే లెక్కలేనన్ని సూక్ష్మజీవులు మన శరీరంలో ఉంటాయి. 'గట్ మైక్రోబయోమ్' అని పిలువబడే చిన్న బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర సూక్ష్మజీవులు జీర్ణక్రియలో పాత్ర పోషిస్తాయి. ఇవి మన మానసిక స్థితి, రోగనిరోధక శక్తితో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి.
ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మరియు సమతుల్య గట్ మైక్రోబయోమ్ ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నాయి. కంటికి కనిపించని ఈ జీవులు మన శరీరంలో ముఖ్యమైన విధులను ఎలా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే..
గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి?
గట్ మైక్రోబయోమ్ అనేది మన ప్రేగులలో నివసించే ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవుల సమూహం. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి మరియు హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోని అనేక విధులను నియంత్రించే వ్యవస్థగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ మంచి మరియు చెడు బ్యాక్టీరియాల సమతుల్యతను కలిగి ఉంటుంది. ఈ గట్ మైక్రోబయోమ్ అసమతుల్యతగా ఉంటే.. జీర్ణ సమస్యలు, ఒత్తిడి లేదా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది..
గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థకు ఆధారం. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో 70% ని ఇదే నియంత్రిస్తుంది . మంచి బ్యాక్టీరియా హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటం ద్వారా ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే అది మలబద్ధకం, విరేచనాలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నిపుణులు పెరుగు, పులియబెట్టిన ఆహారం వంటి ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలను ఆహారంలో చేర్చాలని సూచిస్తుంటారు. ఎందుకంటే అవి గట్ మైక్రోబయోమ్ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మానసిక స్థితి మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధం..
గట్ మైక్రోబయోమ్ మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది గట్-మెదడు కు ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ద్వారా మెదడుకు అనుసంధానించబడి ఉంటుంది. పేగు బాక్టీరియా సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మానసిక స్థితిని నియంత్రిస్తాయి. మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశకు కారణమవుతుంది. ఫైబర్ మరియు ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
గట్ మైక్రోబయోమ్ను ఆరోగ్యంగా ఉంచే మార్గాలు..
గట్ మైక్రోబయోమ్ను ఆరోగ్యంగా ఉంచడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి . ప్రోబయోటిక్స్ (పెరుగు, మజ్జిగ), ప్రీబయోటిక్స్ (ఉల్లిపాయ, వెల్లుల్లి) మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, యాంటీబయాటిక్లను అధికంగా వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి మైక్రోబయోమ్కు హాని కలిగిస్తాయి. తగినంత నీరు, క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్ర కూడా పేగు ఆరోగ్యానికి చాలా అవసరం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...