Top Stories

బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం?

ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే  ధన్ ఖడ్  నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు. దన్ ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ మక్తసరి స్పందన, అలాగే రాజీనామా ఉపసంహరణకు ఎలాంటి బుజ్జగింపులు లేకుండా తక్షణ ఆమోదమే ఇందుకు తార్కాణగా చెబుతున్నారు. ఆయన ధిక్కార వైఖరి పట్ల  ఆగ్రహంతో ఉన్న బీజేపీ పెద్దలు ఆయనపై అభిశంసన పెట్టాలని కూడా ఒక దశలో ఆలోచన చేశారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆయనకు గౌరవ విడ్కోలు పలుకుదామన్న కాంగ్రెస్ ప్రతిపాదన ను కూడా ప్రభుత్వం తిరస్కరించడం కమలనాథులకు ఆయన పట్ల ఉన్న ఆగ్రహ స్థయిని తెలియజేస్తున్నదని చెప్పాల్సి ఉంటుంది. ప్రొటోకాల్ విషయంలో ధన్ ఖడ్ కు కేంద్రానికి  విభేదాలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పర్యటనలో ఈ విషయం ప్రస్ఫుటంగా బయటపడింది. జేడీవాన్స్ తనను కలవకపోవడం వెనుక కేంద్రం పాత్ర ఉందని ధన్ ఖడ్ ఆ సమయంలో బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాహనాల విషయంలో, మంత్రుల కార్యాలయాల్లో ఫోటోల విషయంలో  కూడా ధన్ ఖడ్, కేంద్రం మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వి రైతుల గిట్టుబాటు ధర విషయంలో  ధన్ ఖడ్ కేంద్రమంత్రిని నిలదీయడం వంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ వ్యవహారం కూడా ధన్ ఖడ్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది.  ఇక చివరిగా రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు  అధికారపక్ష నేత నడ్డా కంటే ఎక్కువ సమయాన్ని ధన్ ఖడ్ కేటాయించడం ఈ విభేదాలకు పరాకాష్టగా మారింది.  ఇక న్యాయమూర్తి వర్మ అభిశంసన వ్యవహారంలో  న్యాయవ్యవస్థను కూడా బాధ్యత వహించేలా చేయాలంటూ కేంద్రం ఆశలపై ధన్ ఖడ్ నీళ్లు చల్లడంతో  బీజేపీ పెద్దల ఆగ్రహం పీక్స్ కు చేరిందని పరిశీలకులు అంటున్నారు.  ఎన్డీయే ఎంపీల సంతకాలు లేకుండా ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆమోదించవద్దని మూడు సార్లు ప్రభుత్వ పెద్దలు   ధన్ ఖడ్ కు సూచించినా ఆయన పట్టించుకోలేదు. ఇలా కేంద్రంతో ఆయన కు పొసగలేదనీ, దీంతో అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. హమ్మయ్య అనుకుని కేంద్రం వెంటనే ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నదానిపై కసరత్తులలో మునిగిపోయింది.  
బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం? Publish Date: Jul 25, 2025 2:27PM

గోవాకు అశోకగజపతి రాజు.. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం (జులై 26) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు విజయనగరం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గోవాకు చేరుకుంటున్నారు.  గోవా గవర్నర్ గా నియమితులైన తరువాత అశోకగజపతి రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన అశోకగజపతి రాజు పార్టీతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ  తెలుగుదేశంతోనే ఉన్న అశోకగజపతి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం లోక్ సభ సస్థానం నుంచి ఒక సారి ఎంపీగా విజయం సాధించిన అశోకగజపతి రాజు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.  
గోవాకు అశోకగజపతి రాజు.. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే? Publish Date: Jul 25, 2025 2:05PM

మోదీ మరో మెట్టు పైకి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ  విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ.. భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ  కాదన లేరు. నిజానికి.. స్వతంత్ర భారత రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా  ఆరు వరస విజయాలను సొంతచేసుకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. వరసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యంత్రిగా విజయం సాధించిన మోదీ..  భారత ప్రధానిగా వరసగా 2014, 2019, 2024లో  హ్యాట్రిక్ సాధించి  డబుల్’ హ్యాట్రిక్’ సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచి పోయారు.  ఇక ఇప్పుడు మోదీ మరో రికార్డు ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానిగా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉన్న రికార్డును మోదీ సొంత చేసుకున్నారు. ఇందిరాగాంధీ.. 1966 జనవరి  నుంచి 1977 మార్చి  వరకు 4 వేల 77 రోజులు ప్రధాని పదవిలో కొనసాగారు.  కాగా.. 2014 మే 26 న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ  శుక్ర వారం (జూలై 25, 2025)తో 4,078 రోజులు పూర్తిచేసుకుని ఇందిరాగాంధీ రికార్డు ను అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. కాగా.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగారు.  అనుకోకుండా ఎమ్మెల్యే అయినా కాకుండానే..  2001లో నేరుగా ముఖ్యమంత్రిగా గుజరాత్ శాసనసభలో కాలు పెట్టిన మోదీ 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా పార్లమెంట్ లో తొలి అడుగు పెట్టారు. మోదీ నాయకత్వంలో   బీజేపీ  2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది.  2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది  ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది.  2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ..  ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లో 30 ఏళ్లుగా సాగుతున్న సంకీర్ణ రాజకీయాలకు చుక్కపెట్టిన నేతగా.. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్సేతర  ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.
మోదీ మరో మెట్టు పైకి! Publish Date: Jul 25, 2025 12:25PM

తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం (జులై 25) జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలియజేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మంత్రులు  పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈ కేబినెట్ భేటీ సోమవారం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉందని అధికా రవర్గాల సమాచారం.
తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా Publish Date: Jul 25, 2025 12:04PM

భార‌తీయుల‌కు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక‌

హ‌లో ట్రంప్ ఎక్స్ క్యూజ్  మీ.. మీ దేశంలో మా వాళ్ల ప‌నితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాట‌లో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్క‌సారి ఈ వివ‌రాల‌ను చూడండి. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా  పని చేస్తున్నారు సత్య నాదేళ్ల. హైదరాబాద్ లో జన్మించిన ఆయన మైక్రో సాఫ్ట్ ను క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లీడర్ గా తీర్చి దిద్దారు. ఒకప్పుడు 300 బిలియన్ డాలర్లు గల ఈ సంస్థను 3 ట్రిలియన్ డాల్లకు పైగా పెంచారు. మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్శిటీ నుంచి ఎంఎస్, చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తన శక్తి సామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించి సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ని ఒక మహా వృక్షంగా విస్తరింప చేసిన పేరు సాధించారు. గుగుల్ సీఈవోగా మోస్ట్ పాపులర్ అయిన సుందర్ పిచాయ్.. 2015 నుంచీ ఈ సంస్థ కోసం పని చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. అంతకు ముందు గుగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ కి నాయకత్వం వహించారు. ఐఐటీ ఖరగ్ పూర్, స్టాన్ ఫోర్డ్, వార్టన్ నుంచి పట్టభద్రులైన సుందర్ పిచాయ్.. సారథ్యం వహిస్తున్న సంస్థ ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ మ్యాప్స్ ని చూస్తూ వాహనాలను నడుపుతున్నాం అంటే అదంతా సుందర్ పిచాయ్ ఐడియానే.   ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ మిషీన్స్.. షార్ట్ ఫామ్ లో చెబితే.. ఐబీఎం కార్పొరేషన్ సీఈవో అరవింద్ కృష్ణ.. ఇల్లినాయిస్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఈ ఐఐటీ కాన్పూర్ విద్యార్ధి సారథ్యంలో నడుస్తోన్న ఐబీఎం ప్రస్తుత టర్నోవర్ 244 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులోని రెడ్ హ్యాట్ టర్నోవర్ 34 బిలియన్లు. ఇందుకు సారథ్యం వహించింది కూడా అరవిద్ కృష్ణే. అంతే కాదు హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ పైనా దృష్టి సారించి ఈ దిశగా కంపెనీ ముందుకు వెళ్లేందుకు నాయకత్వం వహిస్తున్నారు అరవింద్ కృష్ణ.   అడోబ్ సీఈవో శంతను నారాయణ్. 2007 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ 2024 నాటికి 250 బిలియన్ డాలర్లు. హైదరాబాద్ లో జన్మించిన నారాయణ్ అడోబ్ ని సబ్ స్క్రిప్షన్ ఆధారిత మోడ్ లోకి మార్చారు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలిచిందంటే ఇదంతా శంతను ఆలోచనల వల్ల మాత్రమే సాధ్యమైందని అంటారు. ఉస్మానియా, బౌలింగ్ గ్రీన్ స్టేట్, బర్కిలీ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందిన ఈయన తన సంస్థ  అంచెలంచలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.   మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మల్హోత్రా.. 2017 నుంచి సంజయ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తున్నారు.  ఈ సంస్థ ఆదాయం 21 బిలియన్ డాలర్లు. బిట్సి పిలానీ, యూసీ బర్కిలీ గ్రాడ్యుయేట్. శాన డిస్క్ సహస్థాపకులైన సంజయ్.. సెమికండక్టర్ మెమరీలో మైక్రాన్ ని ముందుండి నడిపిస్తున్నారు.   పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. 2018 నుంచి ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా ఉంది.  ఐఐటీ వారణాశి, బోస్టన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన అరోరా.. గతంలో గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ లో సీనియర్ పొజిషన్లో వర్క్ చేశారు. పాలో ఆల్టో సైబర్ సెక్యూరిటీ పోర్ట్ ఫోలియోని మరింత బలోపేతం చేశారు.  ప్రస్తుతం ఆల్ఫాబెట్ యాజమాన్యంలో ఉన్న యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 2023 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. సుమారు 182 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఈ సంస్థకు నీల్ మోహన్ సారథ్యం ఎంతో ప్రయోజనకరంగా మారింది. గతంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గానూ పని చేశారీ ఇండో అమెరికన్. ఈ ప్లాట్ ఫామ్ ని కమర్షియల్ గా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు నాయకత్వ బాధ్యతలను అప్పగించిందీ సంస్థ. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ రేష్మా కేవల్ రామణి 2020 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ బయో టెక్నాలజీ సంస్థ 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.  ముంబైలో జన్మించిన రేష్మా బోస్టన్ లో వైద్య శాస్త్రంలో డిగ్రీ తీస్కున్నారు. జన్యు, కణ చికిత్సలను డెవలప్ చేస్తున్న యూఎస్ బేస్డ్ బయోటెక్ సంస్థకు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా రికార్డు సృష్టించారు రేష్మా కేవల్. ఇక కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్.. 2023 నుంచి ఈ సంస్థ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 19 బిలియన్ డాలర్ల ఆదాయం గల ఈ సంస్థను ఇండో- అమెరికన్ అయిన రవి పరుగులు పెట్టిస్తున్నారు. ట్రాన్స్ యూనియన్ లో ఇండివిడ్యువల్ డైరెక్టర్ గానూ వర్క్ చేస్తున్నారు. అరిస్టా నెట్ వర్క్స్ సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్  2008 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 90 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ సంస్థకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు జయశ్రీ. ఈమె భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ అమెరికన్ కావడం విశేషం. అరిస్టాను క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలుపుతున్నారీమె. వేఫర్ సీఈఓ నీరాజ్ షా.. 2002లో స్థాపించిన ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులు కూడా. ఈ కామర్స్ లో ఫర్నిచర్, గృహోపకరణాల్లో 12 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ సంస్థ సొంతం. ఇండో అమెరికన్ అయిన షా, వేఫర్ ను గృహోపకరణాల విభాగంలో ప్రముఖ ఆన్ లైన్ రీటైలర్ గా నిర్మించారు. ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం 2022 నుంచి ఈ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్ లో ఈ సంస్థ 90 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన రాజ్ ఫెడ్ ఎక్స్- ప్రపంచ వ్యాప్త విస్తరణపై తనదైన ముద్ర వేశారు. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ 2019 నుంచి ఈ సంస్థ సారధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం, లాంకాస్టర్ వర్శిటీ నుంచి డిగ్రీలను పొందిన భూటాని వెబ్ హోస్టింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్ లో గోడాడి విస్తరణకు నాయకత్వం వహిస్తున్నారు. అమన్ నాయకత్వంలోని ఈ సంస్థ 4 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది.    వీళ్లే కాక ఇక మీ స్సేస్, సాఫ్ట్ వేర్, మెడిక‌ల్, లా, త‌దిత‌ర రంగాల్లో గ‌ల భార‌తీయుల ప్ర‌తిభిపాట‌వాల విలువ అమెరికాకు ల‌క్ష  కోట్ల మేర ఉంటుంది. అంతేనా భార‌తీయులు అమెరికాకు ప‌న్ను క‌ట్టే వారి ప‌ర్సంటేజీలో 1. 5 శాతం వ‌ర‌కూ ఉన్నారు. ఇక్క‌డున్న కుల‌-మ‌త‌-వ‌ర్గ- వైష‌మ్యాల‌నే బాధ‌లు ప‌డ‌లేక అక్క‌డికి వ‌ల‌స వ‌చ్చిన మావాళ్లు.. మీ దేశాభివృద్ధిలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. వాళ్లే లేకుంటే మీ సంస్థ‌ల‌ ఆర్ధిక ప‌టుత్వం  నేల చూపులు చూసే అవ‌కాశ‌ముంది. ఐడియా ఎవ‌రైనా ఇస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయ‌డంలోనే ఉంటుంది అస‌లు స‌త్తా. ఆ స‌త్తాగ‌ల భార‌తీయులు లేకుంటే మీ గ‌తి అధోగ‌ తే అన్న‌ది ప‌లువురు అంత‌ర్జాతీయ వాణిజ్య నిపుణులు అంటోన్న మాట‌.
భార‌తీయుల‌కు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక‌ Publish Date: Jul 25, 2025 11:21AM

కోర్టులో మళ్లీ చుక్కెదురు.. మరి కొన్ని రోజులు జైల్లోనే జూనియర్ పెద్దిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరి కొన్ని రోజులు జైలువాసం తప్పేటట్లు కనిపించడం లేదు. తనను ఏ4 నిందితుడిగా చేర్చిన నాటి నుంచి బెయిల్ కోసం గజనీ మహ్మద్‌లా విఫల యత్నాలు చేసుతున్న రాజంపేట ఎంపీ జూనియర్ పెద్దిరెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను  కోర్టు ఈ నెల 29కి  వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోఉండక తప్పదు.  కా  మద్యం కుంభకోణం కేసులో   అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి  ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.  జైలులో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవనీ, కోర్టు ఆదేశాల్లో ఉన్న మార్గదర్శకాలను పునః పరిశీలించాలని ఆయన ఆ రివ్యూ పిటిషన్ లో కోరారు.   జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నా, లేదా తీవ్రమైన అనారోగ్యానికి లోనైతే తప్ప ప్రత్యేక సహాయకుడిని నియమించే అవకాశం లేదని, అటువంటి పరిస్థితుల్లో జైలులో ఉన్న  సహాయ సిబ్బందిని ఉపయోగిస్తామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ముందుగా కోర్టు ఇచ్చిన అనుమతులతో ఎంపీకి జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై ఇప్పటికే కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ నెల 29న జరిగే విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. 
 కోర్టులో మళ్లీ చుక్కెదురు..  మరి కొన్ని రోజులు జైల్లోనే జూనియర్ పెద్దిరెడ్డి Publish Date: Jul 25, 2025 11:08AM

ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణికి రిమాండ్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జాకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషన్ మేజిస్టేట్ కోర్టు ఈ ఉత్తర్వలు జారీ చేసింది. ఇప్పటికే మరో కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఫోర్జరీ చేసులో వర్చువల్ గా గురువారం (జులై 24) నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు.  ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండానే కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణిని 14 రోజుల పాటు అంటే ఆగస్టు 7 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ కు ఆదేశించింది. ఇళఆ ఉండగా కాకాణికి బెయిలు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.  
ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణికి  రిమాండ్ Publish Date: Jul 25, 2025 10:53AM

సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా?

సజ్జలపై కేసు సంగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ ను నిలదీసింది. అమరావతి మహిళలపై సజ్జల చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తున్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సజ్జల దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఆ లోగా సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా తెలపాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.  సజ్జల అమరావతి ప్రాంత ప్రజలు, మహిళలను ఉద్దేశించి సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న భయంతో సజ్జల ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ గురువారం జరిగింది. సజ్జల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు.  ఆయన తన వాదనలో అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సజ్జలపై ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సజ్జల తరఫున వాదించిన పొన్నవోలు అరెస్టు చేస్తారన్న అనుమానం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఆధారంగా సజ్జలపై కేసు నమోదు చేస్తారా? చేయరా? అన్న విషయం తెలపాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశిస్తూ.. సజ్జలపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకూ పొడిగిస్తూ కేసు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.  
సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా? Publish Date: Jul 25, 2025 10:40AM

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

కల్లోలంగా ఉన్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హింసాకాండ, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి విదితమే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వం వైదొలగడంతో ఆక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.  తాజాగా అక్కడి పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చే వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగించాని కేంద్రం నిర్ణయించింది. దీంతో   కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అందుకు ఆమోదం తెలిపింది. వెంటనే తీర్మానాన్ని రాష్ట్రపది ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో  తీ మణిపుర్ మరో ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2026 వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.  
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు Publish Date: Jul 25, 2025 10:19AM

పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి

రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన ఝలావర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం (జులై 25) ఉదయం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అంతలోనే మృత్యువాత పడటంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది. ఝలావర్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు ఈ ఉదయం పది గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు గాయపడగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులు, పోలీసులు, అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.  
పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి Publish Date: Jul 25, 2025 10:07AM

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బెజవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాతో అధికారులు దుర్మమ్మ కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, భక్తులు సహకరించాలనీ అధికారులు కోరారు. వర్షాలు తెరిపి ఇచ్చి వాతావరణం కుదు టపడిన తరువాత మళ్లీ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.  
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత Publish Date: Jul 25, 2025 9:56AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. మూమూలు రోజులలోనే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటిది శ్రావణమాసం అంటే ఇక చెప్పనే అవసరం లేదు. శుక్రవారం (జులై 25) నుంచి శ్రావణ మాసం ఆరంభం కావడం, అందులోనూ తొలి రోజే శుక్రవారం కావడం, వారాంతం సమీపిస్తుండటంతో    శుక్రవారం (జులై 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (జులై 24) శ్రీవారిని మొత్తం  68,800 మంది   దర్శించుకున్నారు. వారిలో 22,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  నాలుగు కోట్ల 49 లక్షల రూపాయలు  వచ్చింది.  
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే? Publish Date: Jul 25, 2025 9:31AM

ప్రతిరోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..!

  భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు.  రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే  ఒకటి,  రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి..  హైడ్రేషన్.. లెమన్ టీ  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి,  శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం. లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,  ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం,  మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, బరువు.. ఎక్కువగా  జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్  టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.  కడుపు నిండిన  ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల  అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు. చర్మం.. లెమన్  టీ  అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం,  ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు..  మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది.   ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన,  వేడిగా ఉండే లెమన్  టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్,  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి,  చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
ప్రతిరోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..! Publish Date: Jul 25, 2025 9:30AM

గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వరదలో మునిగారు!

గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ముందుకు వెడితే గంగలో మునగక తప్పదని మరో సారి రుజువైంది. ఇటీవలి కాలంలో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెడుతున్న వాహనదారులు దారి తప్పిన సంఘటనలూ, ప్రమాదాల బారిన పడిన ఘటనలూ తరచుగా జరుగుతున్నాయి. ఇటీవలే గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్లి సగం నిర్మించిన బ్రిడ్జిపై నుంచి కారు కిందపడి మరణం సంభవించిన సంఘటన మరిచిపోకముందే దాదాపు అలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది.  కేరళకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొట్టాయం ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో కొట్టాయంలోని కడుతురుత్తి రోడ్డుపై కారులో తన భార్యతో కలిసి వెడుతున్నారు.  వారు గమ్యస్థానం చేరడానికి పూర్తిగా  గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడ్డారు. ఆ మ్యాప్స్ చూపుతున్న మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన జోసెష్ నేరుగా వరద నీటిలోకి వెళ్లారు. తృటిలో ఘోర ప్రమాదం జరిగేదే. అయితే స్థానికులు గమనించి అప్రమత్తం చేయడంతో కారును ఆపారు. అయితే అప్పటికే జోసెఫ్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం వరద నీటిలో మునిగిపోయింది. స్థానికులు తక్షణమే స్పందించి జోసెఫ్ ను, ఆయన భార్యను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  
గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వరదలో మునిగారు!  Publish Date: Jul 25, 2025 9:15AM

ఏపీ లిక్కర్ కేసు.. విదేశాల్లో కీలక నిందితులు.. రెడ్ కార్నర్ నోటీసులు?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడును మరింత పెంచింది. ఈ కేసులో నిందితులు అయిన ఎనిమిది మంది విదేశాలలో ఉన్నట్లు గుర్తించిన సిట్ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. విదేశాలలో తలదాచుకున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసుందుకు రంగం సింద్ధం చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎనిమిది మంది నిందితులు దుబాయ్, ధాయ్ ల్యాండ్ లో ఉన్నట్లు గుర్తించింది. వీరిలో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్. సైమన్ ప్రసన్న, ప్రద్యుమ్నలు దుబాయ్ లోనూ, ఇక అవినాష్ , అనిరుధ్ రెడ్డిలు ధాయ్ ల్యాండ్ లోనూ ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ధాయ్ ల్యాండ్ కు పారిపోయిన అవినాష్, అనిరుథ్ రెడ్డిలు వారిపై కేసు నమోదు అయిన తరువాత పరారీ అయ్యారు. ఈ ఎనిమిది మందిని భారత్ కు రప్పించేందుకు సిట్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే  విదేశాంగ శాఖకు సిట్ అధికారులు సమాచారమిచ్చారు.  దుబాయ్, థాయ్ ల్యాండ్ కు పరారైన ఈ నిందితులను భారత్ కు ఆయా దేశాలతో ఉన్న మ్యూచువల్ లీగల్ ట్రీటీస్ ద్వారా భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా విదేశాంగ శాఖకు సిట్ అధికారులు లేఖ రాశారు. 
ఏపీ లిక్కర్ కేసు.. విదేశాల్లో కీలక నిందితులు.. రెడ్ కార్నర్ నోటీసులు? Publish Date: Jul 25, 2025 8:56AM

ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో జరిగిన కులగణన సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదన్నారు. కొన్ని విషయాల్లో ఎన్డీయే సర్కార్ దిగి వచ్చేలా రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రేవంత్ తెలిపారు. కులగణన దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచి పోతుందని అన్నారు. ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, అందరి సంతోషం కోసం పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని వివరించి, ఒప్పించామని సీఎం తెలిపారు.  ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వెల్లడించారు. ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నిర్ణయంతో, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన పకడ్బందీగా నిర్వహించిందని రాహుల్ అన్నారు. కులగణన అంత సులభం కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర నేతలు అంచాలకు మించి రాణించారని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలరాయిగా నిలుస్తుందని తెలిపారు.  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు Publish Date: Jul 24, 2025 7:50PM

ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.50 వేల కోట్ల పెట్టుబడుల SIPB ప్రతిపాదనలకు ఆమెదం తెలిపారు. సాగుభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంగా చర్చించారు.  పలు సంస్థలకు భూకేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో సిఫి సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది’’అని మంత్రి పార్థసారథి తెలిపారు.  త్వరలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని.. దీనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.  
ఏపీ ఎలక్ట్రానిక్స్‌  పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ Publish Date: Jul 24, 2025 6:51PM

ఈ నెల 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

    ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన  ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం...రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళుతున్నారు.  బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించి పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.  మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా... ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు గానూ ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు.
ఈ నెల 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన Publish Date: Jul 24, 2025 6:23PM

ఖమ్మం ఖిల్లాకు మహర్ధశ..అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు

  చారిత్రాత్మకమైన ఖమ్మం ఖిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇటీవలనే ఖిల్లాలో పాటుపడిన బావిని తిరిగి పునరుద్ధరించారు. ఖమ్మం ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే కొండపల్లి వద్ద బౌద్ధ స్థూపాన్ని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు.  ఖమ్మం జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎంతో చారిత్రక కట్టడం ఖిల్లా ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.29 కోట్లు పర్యాటక శాఖ నుంచి కేటాయించింది. ఖిల్లా పై రోప్ వే కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఖిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. దీన్ని శాసనాలు పురాతన గ్రంథాల్లో కమ్మమెట్టుగా పేర్కొన్నారు. మొట్టమొదటి ఈ కోట యొక్క బీజం ఇక్ష్వాకుల కాలంలో పడింది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది.  ఈ కోటను రేఖపల్లి పరిపాలిస్తున్న సమయంలో ముసునూరి కమ్మనాయక రాజులు బలంగా నిర్మించారు. ఆ తర్వాత సూర్యదేవర కమ్మనాయక రాజులు కమ్మమెట్టును రాజధానిగా పరిపాలించారు. రేఖపల్లి చుట్టుపక్కన ఉన్న శాసనాలు మరియు ఏకశిలామకుటం, నాయకరాజ వైభవం అనే గ్రంధాల ద్వారా ఈ సమాచారం లభ్యమవుతుంది.  తర్వాత కాలంలో బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీ వంశస్థులు ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు కమ్మమెట్టుగా ఆ తర్వాత ఖమ్మంమెట్టుగా, కుతుబ్షాహీల కాలంలో ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు    
ఖమ్మం ఖిల్లాకు మహర్ధశ..అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు Publish Date: Jul 24, 2025 6:12PM

లిక్కర్ స్కాంలో జగన్‌ని వదలొద్దంటున్న షర్మిల

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను వదిలిపెట్టొద్దని ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కోరారు.  విజయవాడలో  విలేకర్లతో మాట్లాడిన ఆమె.. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌పై విమర్శలు గుప్పించారు. సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టలరీల వద్ద కమీషన్‌లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్‌కి నెలకు రూ. 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. కేవలం బ్లాక్ మనీ‌ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి‌ ప్రభుత్వం చేసిన ఆర్ధిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. రూ. 3, 500 కోట్లు మద్యం కుంభకోణం ఒక్కటే కాదు.. పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్‌లోనే జరిగాయన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారో తేల్చాలన్నారు. డిజిటల్ పేమెంట్ ఆపడం‌ వెనుకే అవినీతి ఉందన్నారు. వీటన్నింటికీ  జగన్ సమాధానం చెప్పాలన్నారు. రిషి కొండను ఎందుకు తవ్వారో కూడా ఇంత వరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో జగన్ సొంత మీడియా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అంటూ వైఎస్ షర్మిల మరోసారి తన అన్నను తీవ్రస్థాయలో టార్గెట్ చేశారు.
లిక్కర్ స్కాంలో జగన్‌ని వదలొద్దంటున్న షర్మిల Publish Date: Jul 24, 2025 5:14PM

కొడుకు కోసం తమ్మినేని పాట్లు.. జగన్‌కి కొత్త టెన్షన్

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో విజయంపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజార్టీ 20 వేలకు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపధం కూడా చేశారు. తీరా చూస్తే సొంత బంధువు కూన రవికుమార్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత  పొలిటికల్‌గా తమ్మినేని సైలెంట్ అవ్వడంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఆముదాలవలస వైసీపీ నాయకుడు తిరిగి లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  తమ్మినేని సీతారాం తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆముదాలవలస వైసీపీలో  కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారుతోందంట. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తమ్మినేని, తర్వాత 2009లో సామాజికవర్గం లెక్కలతో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయనకు సొంత బంధువు కూన రవికుమార్ టీడీపీ నుంచి రాజకీయ ప్రత్యర్ధిగా మారారు.  2014లో కూన రవి ఆముదాలవలసలో తమ్మినేనికి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తమ్మినేని స్పీకర్‌గా పని చేశారు.  2024లో విజయంపై ధీమా ప్రదర్శించి సవాళ్లు సైతం విసిరిన ఆయనకు కూన రవి మరోసారి షాక్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లోనే తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్‌ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్  దగ్గర కూడా అదే విషయం చెప్పారు. అయితే.. ఈ సారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ స్పష్టం చేయడంతో కాదనలేకపోయారట సీతారాం. ఎన్నికల తర్వాత ఆమదాలవలసలో సీన్ మారిపోయింది. తమ్మినేని సీతారాం యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమైనట్టు కనిపించడంతో చింతాడ రవికుమార్ ని జగన్ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు. దీంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలంట్ అయ్యారు.  తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో అమదాలవలస వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవిగా ఇన్ సైడ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయంట. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా   తమ్మినేని  అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించినా ... సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోని కార్యక్రమాలతో  మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు ఉండేవారు.  అయితే.. సడెన్ గా ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. నియోజవర్గంలో వరుస కార్యక్రమాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన  వారికి ఆమదాలవలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపినా ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ ఆర్ జయంతిని కూడా ఓ రేంజ్‌లో నిర్వహించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్ లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తుంటే.. తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి.  మొత్తానికి కొడుకు భవిష్యత్ కోసమే తమ్మినేని యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.  తమ్మినేని స్వయంగా  యాక్టివ్ అవుతుండటంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. జగన్ ను మాత్రం కొత్త సమస్య వెంటాడుతుందని తెలుస్తోంది. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా చింతాడ రవికుమార్‌ని ప్రకటించినప్పటికీ పేరాడ తిలక్‌ను ఆమదాలవలసలో భవిష్యత్ లీడర్ గా  జగన్  భావిస్తున్నారని వైసీపీలో కీలక నేతల వెర్షన్. ఇప్పుడు తమ్మినేని యాక్టివ్  అవ్వడంతో వర్గపోరు ఎక్కడ పెరుగుతుందోనని వైసీపీ అధిష్టానం తెగ టెన్షన్ పడిపోతుందంట. మరి చూడాలి ఆముదాలవలస వైసీపీ పాలిటిక్స్ చివరికి ఏ టర్న్ తీసుకుంటాయో.
కొడుకు కోసం తమ్మినేని పాట్లు.. జగన్‌కి కొత్త టెన్షన్ Publish Date: Jul 24, 2025 5:02PM

ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి

  ఏపీ మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరుపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A-4గా ఉన్నారు. కాగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కారాగారంలో ఆయనకు పలు అదనపు వసతులు కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  ఈ విచారణపై సస్పెన్స్ నెలకొంది. పిటిషన్‌ను కోర్టు స్వీకరించిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా గత వైసీపీ హయంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అవనీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్‌కు అప్పగించింది. విచారణ చేపట్టడంతో పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. . ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.  కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల(జులై) 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ నెల (జులై) 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి Publish Date: Jul 24, 2025 4:45PM

ఖమ్మంలో శ్రీవారి ఆలయం కోసం స్థలాల పరిశీలన తుమ్మలతో టీటీడీఅధికారుల భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై  ఇప్పటికే   టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ఆ చర్చల నేపథ్యంలో   టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, టీటీడీ స్తపతి ఖమ్మంలో అనువైన స్థలాన్ని గురువారం (జులై 24) పరిశీలించారు. అనంతరం  మంత్రి తుమ్మల తో సమావేశమయ్యారు. ఖమ్మం  సమీపంలోని అల్లీపురం వద్ద ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని  శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం వీరు పరిశీలించారు.  అలాగే రఘునాథపాలెం మండలంలోని  స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మాణం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే శ్రీవారి ఆలయం నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని కూడా టీటీడీ అధికారులు పరిశీలించారు. అనం తరం మంత్రి తుమ్మలతో  భేటీ అయిన టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి ఆలయ నమూ నాలను పరిశీలించారు..  ఆగమ పండితులు, టీటీడీ స్థపతి నిర్ణయించిన ప్రాంతంలో త్వరలోనే ఆలయ నిర్మాణ స్థలాన్ని ఖరారు చేసి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తుమ్మల తెలిపారు.
ఖమ్మంలో శ్రీవారి ఆలయం కోసం స్థలాల పరిశీలన తుమ్మలతో టీటీడీఅధికారుల భేటీ  Publish Date: Jul 24, 2025 4:25PM

ఉభయ సభలు రేపటికి వాయిదా

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతునే ఉంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), గోవా అసెంబ్లీలో  ఎస్టీలకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. ఎంత చెప్పిన సభ్యులు వినకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొంది.  బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలకు దిగారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ హరివంశ్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో ఇరు సభలు రేపటికి వాయిదా వేశారు. 
ఉభయ సభలు రేపటికి వాయిదా Publish Date: Jul 24, 2025 4:22PM

మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో గురువారం (జులై 24) భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్,  కొండా సురేఖ, వాకిటి శ్రీహరీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా , ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో  ఆమెదించి  గవర్నర్ ద్వారా  రాష్ట్రపతికి  పంపిన బిల్లు, అలాగే  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం, ఆర్డినెన్స్ తదితర అంశాలపై చర్చించారు.  
 మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం Publish Date: Jul 24, 2025 4:17PM

ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క ప్రజా ప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ 2021లో సీతక్క ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా సీతక్క గురువారం (జులై 24) నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజాప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు.  కోవిడ్ సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి  సీతక్క చేపట్టిన నిరసనకు సంబంధించిన కేసు విచారణకు హాజరైన సీతక్క కోర్టులో పదివేల రూపాయలతో కూడిన రెండు పూచికత్తులను దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.  
ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క Publish Date: Jul 24, 2025 4:05PM

తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

    బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్‌ కేక్‌ కట్‌ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు.ఈ రోజు ఉదయం కేటీఆర్  బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నరు. మరోవైపు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎంవో అధికారిక ఎక్స్ ద్వారా తెలిపారు ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్ ట్వీట్టర్ వేదికగా నా సోదరుడు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.
తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు Publish Date: Jul 24, 2025 3:55PM

చంద్రబాబుకు జస్ట్ 5 నిముషాలు చాలు

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికీ, పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పారిశ్రామిక వేత్తలను కన్విన్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జస్ట్ ఐదంటే ఐదు నిముషాలు చాలు. ఈ విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా బెంగళూరు, చెన్నైలకు దీటుగా మార్చడంలో ఆయన పాత్ర కీలకం. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు కేవలం ఆయనపైనా, అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్న విజన్ పైనా నమ్మకంతో హైదరాబాద్ కు తరలి వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి అమరావతిలో కనిపిస్తున్నది.  ఐదేళ్ల జగన్ పాలన ఏపీలో  పరిశ్రమల రంగానికి ఒక చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. ఒక్క‌ చాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రప్రజలకు నరకం చూపించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ ఆయన పీడిత పాలన బాధితులే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అంతకు ముందు చంద్రబాబు పాలనలో అంటే 2014-19 మధ్య కాలంలో  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను జగన్ తన విధానాలతో  రాష్ట్రం నుంచి తరిమేశారు. దీంతో  జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్ర పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఏపీలో కూడా ప్రారంభించేందుకు క్యూకడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద వచ్చిందంటే.. అది సీబీఎన్ పై ఉన్న నమ్మకమే కారణం అనడంలో సందేహం లేదు. చంద్రబాబు పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకానికి  విజయవాడలో  ఇన్వెస్టోపియా గ్లోబల్ ఈవెంట్ సాక్షిగా యూఏఈ మంత్రి  చెప్పిన మాటలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఈవెంట్ కు గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ సదస్సుకు హాజరైన  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ  దావోస్ లో చంద్రబాబుతో ఐదు నిముషాలు భేటీ అయ్యాననీ, ఆ సందర్భంగా ఆయన విజన్ పట్ల ఆకర్షితుడినై పెట్టుబడితో ఏపీకి వచ్చేశామని చెప్పారు. ఇది చాలదూ రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్ కు, చిత్తశుద్ధికీ. యూఏఈ తన ఆర్థిక వ్యూహాల్లో భాగంగా పర్యాటకం, సాంకేతికత, ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. 
 చంద్రబాబుకు జస్ట్ 5 నిముషాలు చాలు Publish Date: Jul 24, 2025 3:20PM

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్

  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆయన కోడలు ప్రీతి రెడ్డి, కొడుకు భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలల సీట్ల కేటాయింపులో భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మించి విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందినట్టు సమాచారం.విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో వచ్చిన ఆదాయాన్ని సరిగా చూపకపోవడం.. ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించడం వంటి అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి ఫ్యామిలీ సంబంధించి పలు ప్రాపర్టీల్లో సోదాలు కొనసాగుతున్నాయి.  మరోవైపు ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏమన్నారంటే. ఐటీ అధికారులు ఇళ్లపై రైట్స్ చేస్తున్న విషయంలో నిజం లేదని తెలిపారు. 2022లో పీజీ సీట్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడకి వచ్చారని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు అందజేశారని అన్నారు. ఉదయం 6 గంటలకు అధికారులు రావడంతో ఐటీ అధికారులుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేర్కొన్నారు
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ Publish Date: Jul 24, 2025 3:03PM