LATEST NEWS
గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది. టాటా బోర్డు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా,విమాన ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు, ద్వారా’ జీవిత పర్యంతం ఈ ట్రస్ట్ ద్వారా’ ఆర్థిక సహాయం, నష్ట పరిహాం, వైద్య సంరక్షణ అందించడంతో పాటుగా, కుటుంబాల పునర్నర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని,టాటా ట్రస్ట్ తెలిపింది.అలాగే, ట్రస్ట్ పారదర్శక నిర్వహణ కోసం,నిపుణుల సేవలను వినియోగించుకోవడం జరుగుతంది టాటా ట్రస్ట్ తెలిపింది.
నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్కి విజ్ఞప్తి చేశారు. ప్రియమైన కార్యకర్తలారా!.. నేను చేసిన తప్పేమిటి, నన్ను ఎందుకు పార్టీ ఆదుకోవడం లేదు.
నేను ఉన్న బాధల్లో ఎంతో కొంత కార్యకర్తకు ఆర్థిక సహాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా !...దానికోసం మన కార్యకర్తలందరూ సహాయం చేయొచ్చు కదా!... ఆర్థికంగా కాదు, పార్టీ దృష్టికి తీసుకుపోయే దానికి లోకేష్ బాబు ఆరో తేదీ నెల్లూరు వస్తున్నారు. ఆయన దృష్టి తీసుకొని పోతారని కార్యకర్తలందరినీ వేడుకుంటున్నాను. ఇదే లాస్ట్ పిలుపు, తర్వాత చావటమా బతకటమా ఆలోచించుకుంటాను… నవంబర్ నుంచి మంచం మీదే ఉన్నాను మీరే ఆలోచించండని కార్యకర్త ఆవేవదన వ్యక్తం చేశారు.
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది. తమ టీంలు హైదరాబాద్లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
మరోవైపు జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఏపీ మావోయిస్టు కమీటీ హత్యకు ఆదేశించినట్లు రెండు సార్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని పేర్కొన్నారు. తన హత్యకు 5 బృందాలు రంగంలోకి దిగినట్లు వారు తనకు చెప్పినట్లు ఎంపీ రఘునందన్ తెలిపారు
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ ఎక్కువసార్లు కరెక్ట్ అవుతుంటుంది. ఒక సినిమా పట్టాలెక్కించే ముందు ఆయన ఎన్నో లెక్కలేసుకుంటారు. అలాంటి దిల్ రాజు.. ప్రజెంట్ హీరో నితిన్ మార్కెట్ కి మించి 'తమ్ముడు' సినిమా కోసం ఖర్చు చేశారు. దీంతో దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు దిల్ రాజు. (Dil Raju)
"ప్రేక్షకులకు థియేటర్లలో ఓ మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తమ్ముడు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశాము. బడ్జెట్ రూ.75 కోట్ల దాకా అవుతుంది. అయితే హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడంతో రూ.67 కోట్లలో సినిమాని పూర్తి చేయగలిగాం. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.35 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.32 కోట్లు వస్తే సరిపోతుంది. తమ్ముడు సినిమా కొత్తగా ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది." అన్నారు.
దిల్ రాజు నిర్మించే సినిమాలు ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయి. అలాంటిది తమ్ముడుకి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ రావడంపై కూడా దిల్ రాజు స్పందించారు. "ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోయింది. అయితే ఎంటర్టైనర్ తీయాలి.. లేదంటే థియేటర్లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అందించాలి. తమ్ముడు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. సెకండాఫ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే సెన్సార్ A ఇచ్చింది. ఆ సన్నివేశాలను తగ్గిస్తే U/A ఇస్తామన్నారు. కానీ, ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము A తీసుకున్నాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కువ శాతం ఫారెస్ట్ లో ఉంటుంది. ఒక మంచి అడ్వెంచర్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది." అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Interview link: Dil Raju Exclusive Interview
రీసెంట్ గా 'కన్నప్ప'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మంచు విష్ణు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. మంచి వసూళ్ళతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా విష్ణు నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్నేళ్లుగా ఓ మంచి సక్సెస్ కోసం చూస్తున్న విష్ణుకి ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఆయన మరో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.
కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గానూ తనదైన ముద్ర వేశాడు ప్రభుదేవా. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన.. తెలుగులో ఆ తర్వాత 'పౌర్ణమి', 'శంకర్ దాదా జిందాబాద్' వంటి సినిమాలు చేశాడు. తమిళ్ లోనూ నాలుగు సినిమాలు చేసిన ప్రభుదేవా.. ముఖ్యంగా హిందీలో పలు సినిమాలు చేశాడు. 2021 లో వచ్చిన 'రాధే' తర్వాత దర్శకుడిగా సినిమాలు చేయని ఆయన.. నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పడుతున్నట్లు వినికిడి. ఇప్పటికే విష్ణు, ప్రభుదేవా మధ్య కథా చర్చలు జరిగాయని.. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని అంటున్నారు. తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విష్ణునే ఈ సినిమాని నిర్మించనున్నాడట.
విష్ణుకి ఎంటర్టైనర్స్ నప్పుతాయి. ఢీ, దేనికైనా రెడీ వంటి సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో అలరించి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రభుదేవాతో కలిసి మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన మూవీ 'కన్నప్ప'. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ స్పెషల్ రోల్స్ చేశారు. జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన కన్నప్ప.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. వసూళ్లు కూడా మంచిగానే ఉన్నాయి. (Kannappa Collections)
ప్రభాస్ అతిథి పాత్ర చేయడం కన్నప్పకు కలిసొచ్చింది. దాంతో ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. కన్నప్ప సినిమా మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.16 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇక రెండో రోజు కూడా రూ.10 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో కన్నప్ప చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.10 కోట్లకు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. దాంతో ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా గ్రాస్ తో రూ.40 కోట్లకు చేరువ కానుంది. దాంతో మొదటి వీకెండ్ లోనే 'కన్నప్ప' మంచు విష్ణు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది.
కన్నప్పకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, ప్రభాస్ కూడా భాగం కావడంతో ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అది జరగాలంటే నాలుగు రోజైన సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా స్టడీగా ఉండాలి. మరి కన్నప్ప వంద కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి.
తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. ఆయన సినిమా వస్తే చాలు.. చూడాలనుకునేవారు ఎందరో ఉన్నారు. అయితే పవర్ స్టార్ అప్ కమింగ్ మూవీ 'హరి హర వీరమల్లు' పరిస్థితి మాత్రం భిన్నమైనది. (Hari Hara Veera Mallu)
'హరి హర వీరమల్లు' ఎప్పుడో ఐదేళ్ళ క్రితం మొదలైంది. కరోనా పాండమిక్, పవన్ పాలిటిక్స్ తో బిజీ వంటి కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో ఎన్నో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం మొదలై, ఇప్పటికే పలుసార్లు వాయిదా పడటంతో.. పవన్ కళ్యాణ్ అభిమానులు 'వీరమల్లు' కంటే కూడా ఆ తర్వాత రానున్న 'ఓజీ'పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ దృష్టిని పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలంటే.. వీరమల్లు టీం చేతిలో ఒకే ఒక ఆయుధం ఉంది. అదే ట్రైలర్. (HHVM Trailer)
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ను జూలై 3న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని భుజానికెత్తుకుంటారు అనడంలో సందేహం లేదు. వీరమల్లు ట్రైలర్ కట్ అదిరిపోయిందని, ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు. అదే జరిగితే 'హరి హర వీరమల్లు' సినిమా పవన్ కళ్యాణ్ స్టార్డంకి తగ్గ భారీ ఓపెనింగ్స్ ని రాబడుతుంది. కాగా, వీరమల్లు చిత్రం జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
Ee Nagaraniki Emaindi was a sensational success that resonated with all sections, particularly with youth audiences. Over time, the film evolved into a cult classic, particularly after its re-release, which was met with immense enthusiasm. Known for its relatable characters, spontaneous humor, and slice-of-life storytelling, the movie garnered a loyal following. Now, much to the delight of fans, the highly anticipated sequel has been officially announced. Titled ENE Repeat, the project promises to bring back the same brand of madcap, youthful entertainment that made the original a runaway success. Most of the original cast and crew are returning, ensuring continuity and nostalgia.
The Beloved gang Vishwak Sen, Sai Sushanth Reddy, Abhinav Gomatam and Venkatesh Kakumanu from the first part is reuniting for the madness once again. The sequel is helmed by Tharun Bhascker, the creative force behind the original, and produced by D. Suresh Babu, Srujan Yarabolu, and Sandeep Nagireddy under the banners of S Originals and Suresh Productions.
The title announcement itself is a quirky treat. The film’s name, ENE Repeat, is revealed through a humorous and visually engaging poster. The title logo cleverly incorporates Telugu script, where the first and last letters of ENE appear in Telugu, with the last one flipped, adding a unique touch that reflects the film’s offbeat tone. The tagline, Elinaati Shani Ayyipoyindhi, Kanyaraasi Time Ochindi, hints at a fun and chaotic ride ahead.
The announcement poster sets the tone perfectly, featuring whimsical elements like a briefcase bursting open mid-air with clothes flying out, along with beer bottles, sunglasses, a flight ticket, and more, all floating high above Earth, suggesting a sky-high adventure filled with humor and surprises. It promises not just a continuation, but an escalation of the madness, doubling the fun and energy of its predecessor.
On the technical front, the sequel boasts a talented crew: Vivek Sagar returns to compose the music, maintaining the signature vibe of the series. AJ Aaron handles cinematography, while Raviteja Girijala is in charge of editing. Sowmithri N joins as the executive producer.
Pre production is currently in full swing.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం.
అసలింతకూ అలా ఎందుకంటారు.
రెగులర్ ఎక్సర్సైజ్!
ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ. కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఇంజిన్ ఖర్చు లేనే లేదు!
బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.
వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది.
బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప.
అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.
◆ వెంకటేష్ పువ్వాడ.
“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు.
మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు.
మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే.
కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు.
నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా.
" ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.
బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు.
"కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా.
"అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.
బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు.
"ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు.
"ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.
"నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు
"అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.
"అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను.
అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు..
“సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా.
ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.
◆నిశ్శబ్ద.
బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా శుభమే. సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు... రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారం. ఇది ఎంతో విశిష్టమైన సమయం. పూజలు చేయడానికి, వ్రతాలు జపాలు చేయడానికి అనువైన సమయం. అందుకే ఈ ముహూర్తానికి అంత విశిష్టత.
అయితే కేవలం ఆధ్యాత్మిక పరంగాగానే కాదు... మన జీవనపరంగా కూడా ఈ ముహూర్తం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఏ మంచి పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో కనుక మొదలు పెడితే విజయం లభించి తీరుతుంది. పిల్లలను ఉదయమే లేచి చదువుకోమని చెప్పేది అందుకే. ఆ సమయంలో చదివితే చదివింది బాగా ఎక్కడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే వైద్యులు, నిపుణులు కూడా ఆ సమయంలోనే చదుకొమ్మని సూచిస్తుంటారు.
ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే సమయం కూడా అదే. లేలేత భానుడి కిరణాల నుంచి విటమిన్ డి లభిస్తుంది. తద్వారా ఎముకలు గట్టిపడతాయి. ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. కొన్ని రకాల వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయి. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఉండదట. మనసు, మెదడు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం ఇనుమడిస్తుందట.
అందుకే బ్రహ్మ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదని అంటారు. ఆ ముహూర్తాన్ని చేజార్చుకోకూడదని పెద్దలు సూచిస్తుంటారు.
-Sameera
గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది. టాటా బోర్డు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా,విమాన ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు, ద్వారా’ జీవిత పర్యంతం ఈ ట్రస్ట్ ద్వారా’ ఆర్థిక సహాయం, నష్ట పరిహాం, వైద్య సంరక్షణ అందించడంతో పాటుగా, కుటుంబాల పునర్నర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని,టాటా ట్రస్ట్ తెలిపింది.అలాగే, ట్రస్ట్ పారదర్శక నిర్వహణ కోసం,నిపుణుల సేవలను వినియోగించుకోవడం జరుగుతంది టాటా ట్రస్ట్ తెలిపింది.
నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్కి విజ్ఞప్తి చేశారు. ప్రియమైన కార్యకర్తలారా!.. నేను చేసిన తప్పేమిటి, నన్ను ఎందుకు పార్టీ ఆదుకోవడం లేదు.
నేను ఉన్న బాధల్లో ఎంతో కొంత కార్యకర్తకు ఆర్థిక సహాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా !...దానికోసం మన కార్యకర్తలందరూ సహాయం చేయొచ్చు కదా!... ఆర్థికంగా కాదు, పార్టీ దృష్టికి తీసుకుపోయే దానికి లోకేష్ బాబు ఆరో తేదీ నెల్లూరు వస్తున్నారు. ఆయన దృష్టి తీసుకొని పోతారని కార్యకర్తలందరినీ వేడుకుంటున్నాను. ఇదే లాస్ట్ పిలుపు, తర్వాత చావటమా బతకటమా ఆలోచించుకుంటాను… నవంబర్ నుంచి మంచం మీదే ఉన్నాను మీరే ఆలోచించండని కార్యకర్త ఆవేవదన వ్యక్తం చేశారు.
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది. తమ టీంలు హైదరాబాద్లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
మరోవైపు జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఏపీ మావోయిస్టు కమీటీ హత్యకు ఆదేశించినట్లు రెండు సార్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని పేర్కొన్నారు. తన హత్యకు 5 బృందాలు రంగంలోకి దిగినట్లు వారు తనకు చెప్పినట్లు ఎంపీ రఘునందన్ తెలిపారు
డయాబెటిస్ అనేది తీవ్రమైన, పూర్తిగా నయం చేయలేని వ్యాధి. ఇందులో శరీరం రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం లేదా దాని పనితీరు సరిగా లేకపోవడం. భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో బాధపడుతున్నారు. డయాబెటిస్ను సకాలంలో నియంత్రించకపోతే, అది శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఇది కళ్ళు, మూత్రపిండాలు, నరాలు, గుండె, రక్తపోటు, పాదాల సమస్యలు, లైంగిక సమస్యలను కలిగిస్తుంది.
చాలా మంది డయాబెటిస్ను మందులతో కూడా నియంత్రించలేరు. ఇలాంటి వారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కానీ ఇలా ఇన్సులిన్ తీసుకునే వారు సాధారణంగా చేసే 5 ప్రధాన తప్పులు ఉన్నాయి. ఈ తప్పుల వల్ల ఇన్సులిన్ తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గవు. ఇంతకూ ఇన్సులిన్ తీసుకునే వారు చేసే తప్పులేంటంటే..
అర్థం చేసుకోవడంలో పొరపాటు..
చాలా సార్లు రోగులు డాక్టర్ సలహాను సరిగ్గా అర్థం చేసుకోలేరు. చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. లేదా తప్పు సమయంలో ఇంజెక్ట్ చేస్తారు. దీనిని నివారించడానికి సులభమైన మార్గం డాక్టర్ ఇచ్చిన మోతాదు, సమయాన్ని పాటించడం. గ్లూకోజ్ మానిటర్తో చక్కెరను తనిఖీ చేస్తూ ఉండాలి .
స్టోర్ చేయడంలో తప్పులు..
ఇన్సులిన్ను తీవ్రమైన వేడిలో లేదా చల్లగా ఉంచినా, లేదా గడువు తేదీ తర్వాత ఉపయోగించినా, దాని ప్రభావం తగ్గుతుంది. దీన్ని చేయడానికి ఉత్తమ మార్గం మూసి ఉన్న సీసాను రిఫ్రిజిరేటర్లో ఉంచడం. తెరిచి ఉన్న సీసాను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద (25°C కంటే తక్కువ) 30 రోజుల వరకు ఉంచవచ్చు. ఇన్సులిన్ను ఎప్పుడూ ఫ్రీజ్ చేయకూడదు. లేదా చాలా వేడి ప్రదేశంలో ఉంచకూడదు.
ఎక్స్పైరీ డేట్..
ఇన్సులిన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గడువు తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. చాలా సార్లు దాని తేదీని తనిఖీ చేయకుండా ఇన్సులిన్ కొని దాన్ని ఉపయోగిస్తారు. గడువు తేదీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇన్సులిన్ కొనాలి. ఇన్సులిన్ తెరిచిన 30 రోజుల్లోపు దాన్ని ఉపయోగించండి.
సిరంజి రకం..
తప్పుడు రకం సిరంజితో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అధిక లేదా తగినంత మోతాదు తీసుకోకపోవచ్చు. ఈ తప్పు చేస్తుంటే వెంటనే దాన్ని ఆపాలి. దీన్ని నివారించడానికి, 40 IU/ml ఇన్సులిన్ కోసం ఎరుపు రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. 100 IU/ml ఇన్సులిన్ కోసం నారింజ రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. వైద్యుడి సలహాతో సరైన సిరంజిని ఎంచుకోవాలి.
ఒకే ప్రదేశంలో ఇంజెక్షన్..
ఇన్సులిన్ ఒకే చోట పదే పదే ఇంజెక్ట్ చేస్తే, అక్కడ గడ్డలు లేదా గుంటలు (లిపోడిస్ట్రోఫీ) ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనిని నివారించడానికి, ప్రతిసారీ ఇంజెక్షన్ సైట్ను మార్చాలి. ఉదాహరణకు కడుపు, తొడ, చేయి లేదా తుంటిపై. అంతకు ముందు ఇంజెక్షన్ చేసిన స్థానం నుండి కనీసం 1 సెం.మీ దూరంలో ఇంజెక్ట్ చేయాలి.
గుర్తుంచుకోవలసిన విషయం..
ఇన్సులిన్ ఒక ముఖ్యమైన ఔషధం. కానీ దాని సరైన ఉపయోగం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. పైన పేర్కొన్న తప్పులను నివారిస్తూ, ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో, తీవ్రమైన సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అధిక మోతాదు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొవ్వు పదార్థం, ఇది వివిధ శారీరక విధులకు అవసరం. ఇది కొన్ని ఆహారాలలో కూడా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు:
LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - దీనిని "చెడు" కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి.
HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - "మంచి" కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది రక్తప్రవాహం నుండి అదనపు LDL ను తొలగించడానికి సహాయపడుతుంది.
అనారోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక మద్యం సేవించడం వంటివి అధిక చెడు కొలెస్ట్రాల్ కు కారణం. పెద్దలు 20 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
అధిక కొలెస్ట్రాల్ కు కారణమేమిటి?
అధిక కొలెస్ట్రాల్కు అనేక కారణాలు ఉన్నాయి..
సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు (ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం.
శారీరక శ్రమ లేకపోవడం
అధిక శరీర బరువు.
ధూమపానం, మద్యం వినియోగం
జన్యుశాస్త్రం (కొంతమందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వారసత్వంగా వస్తాయి)
అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారికి, జీవనశైలి మార్పులు మాత్రమే దానిని నియంత్రించడానికి సరిపోకపోవచ్చు.
అధిక కొలెస్ట్రాల్ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ పెరిగితే, అది రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది. శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి.
చర్మంపై పసుపు రంగు మచ్చలు..
అధిక కొలెస్ట్రాల్ మొట్టమొదటి కనిపించే సంకేతాలలో ఒకటి పసుపు రంగు కొవ్వు నిల్వలు లేదా చర్మంపై, ముఖ్యంగా కళ్ళు, మోచేతులు మరియు మోకాళ్ల చుట్టూ గడ్డలు. వీటిని జాంతోమాస్ అని పిలుస్తారు. రక్తంలో అదనపు కొలెస్ట్రాల్ను సూచిస్తుంది.
చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి..
ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది, దీని వలన చేతులు, కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు లేదా సూదులు గుచ్చిన అనుభూతి కలుగుతుంది. చికిత్స చేయకపోతే ఇది నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
జీర్ణ సమస్యలు, పిత్తాశయ రాళ్లు..
అధిక కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. పిత్తాశయ సమస్యలకు దారితీస్తుంది. పిత్తంలో అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయ రాళ్లకు కారణమవుతుంది. ఇది ఉదరం కుడి ఎగువ భాగంలో నొప్పి, వికారం, అజీర్ణానికి దారితీస్తుంది.
ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం..
ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన ఛాతీ నొప్పి (ఆంజినా), శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు.
తిమ్మిరి, మాట్లాడటంలో ఇబ్బంది..
కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే, అది స్ట్రోక్కు దారితీస్తుంది. ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది, సమతుల్యత కోల్పోవడం వంటివి దీని లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
అధిక కొలెస్ట్రాల్ తరచుగా సమస్యలు తలెత్తే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యంగా ఉండటానికి సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం చాలామంది తమకు ఇష్టమైన కార్యకలాపాలు చేయడానికి, తమకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి, సంగీతం వినడానికి, ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కానీ ప్రతి ఒక్కరి ఆనందంలో హార్మోన్లు పెద్ద పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి వ్యక్తిని సానుకూలంగా, సంతోషకరమైన మూడ్లో ఉంచడానికి బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం. సంతోషకరమైన హార్మోన్లు ప్రధానంగా మెదడు, శరీరంలోని వివిధ భాగాలు (పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ మరియు న్యూరాన్లు) ఉత్పత్తి చేస్తాయి.
శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే, అది ఆ వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల విచారం, ఆందోళన, ఒత్తిడిని వంటివి అనుభవించవచ్చు. కానీ ఈ హార్మోన్లను కొన్ని విధాలుగా పెంచవచ్చు. ఇది ఆందోళనను తగ్గిస్తుంది, సంతోషంగా, ఒత్తిడి లేకుండా చేస్తుంది.
సంతోషకరమైన హార్మోన్లను మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు అని కూడా అంటారు. అవి సంతోషకరమైన, ఉత్సాహభరితమైన భావాలను ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. వాటిలో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్.
హ్యాపీ హార్మోన్స్ పెంచే మార్గాలు..
వ్యాయామం..
వ్యాయామం చేయడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి విని ఉంటారు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా పరుగు వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది.
సంగీతం..
సంగీతం వినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా నిరూపించబడింది. సంగీతం శరీరంలో డోపమైన్ను పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఆనందం, ప్రతిఫల భావనలలో పాత్ర పోషిస్తుంది.
బయటకు వెళ్లడం..
శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ పెంచుకోవాలనుకుంటే, బయటకు వెళ్లి కొంత ఎండలో ఉండాలి. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని "హ్యాపీ కెమికల్" అని కూడా పిలుస్తారు.
ఫిజికల్ అఫెక్షన్..
శారీరక అనురాగం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి శరీరంలో ఆక్సిటోసిన్ను పెంచుతాయి. ఇది సంతోషకరమైన హార్మోన్. దీనిని "ప్రేమ హార్మోన్" లేదా "బంధన హార్మోన్" అని కూడా పిలుస్తారు. సానుకూల సంబంధాలు, ప్రేమ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను (ఒత్తిడి హార్మోన్) కూడా తగ్గిస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...