English | Telugu
సిద్ - కియారా నయా వెర్షన్ సాంగ్కి సూపర్బ్ రెస్పాన్స్
Updated : Feb 22, 2023
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మంగళవారం ముంబై ఎయిర్పోర్టులో హల్చల్ చేశారు. తన ట్రేడ్మార్క్ నవ్వుతో ఫొటోగ్రాఫర్లను పలకరించారు కియారా. వైట్ అండ్ వైట్లో సింపుల్గా కనిపించారు. పెళ్లికి ముందు, తర్వాత కూడా ఈ జంట తీరులో మార్పు ఏమీ లేదంటోంది ముంబై మీడియా.సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి ఫిబ్రవరి 7న జైసల్మేర్లోని సూర్యఘడ్ ప్యాలస్లో జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు.
వీరి పెళ్లి వీడియో ఈ మధ్య నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో షేర్షా సినిమాలోని రాంజా పాటను వాడారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా లిరిక్స్ కూడా రాయించారు.సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా అద్వానీ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో మీడియా కోడై కూస్తోంది. షేర్షా సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసిన వారు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. వారిద్దరి మధ్య అంతటి అన్యోన్యత ఉంది కాబట్టే రాంజా పాట ఆ రేంజ్లో హిట్ అయిందని కూడా అన్నారు.ఆ హిట్ సాంగ్కే ఇప్పుడు కొత్తగా లిరిక్స్ రాయించుకున్నారు ఈ జంట. ఈ నయా పాటను మంగళవారం అఫిషియల్గా విడుదల చేశారు.యూట్యూబ్లో విడుదలైన అతి కొద్ది సేపటిలోనే ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చేసింది పాటకు. సిద్, కియారా వెర్షన్ అంటూ ఈ నయా వెర్షన్కి పేరు పెట్టింది సోనీ మ్యూజిక్ ఇండియా. వ్యూస్, లైకులతో పాటకు యమా ఆదరణ దక్కుతోంది.
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటకు యువతలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. మంచి కథ ఉంటే, కలిసి సినిమా చేయడానికి తామెప్పుడూ రెడీ అని ఇద్దరూ ప్రకటించారు. ఇప్పుడున్న క్రేజ్ని, వాళ్ల అంగీకారాన్ని క్యాష్ చేసుకునే మేకర్స్ ఎవరనే చర్చ కూడా జరుగుతోంది. రామ్చరణ్తో నటిస్తున్న ఆర్సీ15 షూటింగ్కి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఆస్కార్ కోసం ముందుగానే అక్కడికి వెళ్లారు చరణ్.