రాగసుధకు చెమటలు పట్టిస్తున్న లాయర్!
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నటించి నిర్మించిన సీరియల్ ఇది. వర్ష ప్రధాన పాత్రలో నటించింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతగా ప్రసారం అవుతోంది. ఇతర పాత్రల్లో జయలలిత, జ్యోతిరెడ్డి, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రామ్ జగన్, రాధాకృష్ణ, అనూషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ తదితరులు నటించారు.