English | Telugu

హాసినికి న‌య‌ని చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌ర‌మున్న ఓ యువ‌తి క‌థ‌గా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో.. ట్విస్ట్ ల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు న‌టించారు.

గాయ‌త్రీ దేవి ఆత్మ చెప్పిన ప్ర‌కారం పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక పూజాకు ఏర్పాట్లు చేస్తారు న‌య‌ని, విశాల్‌. ఇందు కోసం ఓ కాలీ స్థ‌లంలో నాగ‌లిని తెప్పించి ఏరు వాక కోసం అలంక‌రించిన‌ట్టుగా అందంగా అలంక‌రిస్తారు.. పూజ కోసం ఏర్పాటు జ‌రుగుతుంటే అక్క‌డ న‌య‌ని బ్లాక్ మ్యాజిక్ చేస్తుందో . ఇంకేదైనా చేస్తుందో తెలుసుకోవాల‌ని తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ‌, క‌సి వెళ్లాల‌నుకుంటారు. వారితో క‌లిసి హాసిని, దురంధ‌ర కూడా వ‌స్తారు. గో మూత్రంతో శుద్ది చేసిన న‌య‌ని అది తిలోత్త‌మ‌, వ‌ల్ల‌భ‌, క‌సి, దురంధ‌ర ల‌పై ప‌డేలా చేస్తుంది. దీంతో ఏంటిది ఇలా స్మెస్ వ‌స్తోంది ఏంటీ? అని చీద‌రించుకుంటారు. అది గోమూత్రం అని హాసిన చెప్ప‌డంతో మ‌రింతగా ఫీల‌వుతారు.

క‌ట్ చేస్తే.. పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో వున్న స్థ‌లాన్ని విశాల్, న‌య‌ని దున్నేస్తారు. ఆ త‌రువాత పూజ‌కు హాజ‌రైన వారికి ప్రసాదం ఇస్తూ వుంటుంది న‌య‌ని. ఈ క్ర‌మంలో తోడికోడ‌లు హాసినికి ఓ సిమ్ కార్డ్ ఇస్తుంది.. దీంతో ఇదేంటి చెల్లి అంటుంది హాసిని.. చెవిలో చెబుతాను ద‌గ్గ‌రికి రా అక్కా అంటూ న‌య‌ని.. ఓ ర‌హ‌స్యం చెబుతుంది. తిలోత్త‌మ అత్త‌య్య ఆట క‌ట్టించొచ్చు అంటుంది.. ఇంత‌కీ హాసినికి న‌య‌ని చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ? .. దాంతో తిలోత్త‌మ ఆట క‌ట్టించ‌బోతున్నారా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.