సుధీర్ ని హౌలే అంటూ గాలి తీసేసిన సాయి పల్లవి
ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ జీ తెలుగులో ఫాదర్స్ డే, మ్యూజిక్ డే సందర్భంగా `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జూన్ 19న ఈ ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. సుడిగాలి సుధీర్, శ్రీముఖి ఈ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో టీవీ స్టార్లు, కమెడియన్ లు, సింగర్స్, టీవీ సీరియల్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. ఈ షోలో గెస్ట్ లుగా రానా, సాయి పల్లవి, సురేష్ బాబు, హీరో గోపీ చంద్, రాశీఖన్నా, దర్శకుడు మారుతి పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.