English | Telugu

దీప్తి సునైన పుస్తకం పేరేంటో తెలుసా?

ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీలు చేసే కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పోస్ట్ ల కంటే ఆ పోస్ట్ గురించి వాళ్ళు రాసిన మాటలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయింది. దీప్తి సునైన చేసిన పోస్ట్ కి ఒక క్వశ్చన్ ని అడుగగా.. ఇప్పుడు దానికి రకరకాల సమాధానాలు వస్తున్నాయి. దీప్తి సునైన.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది. 

 కుక్కలు కూడా ఇలా చేయవు...వైరల్ వీడియోపై కస్తూరి ఫైర్

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి ఫైర్ బ్రాండ్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఏ విషయాన్ని ఐనా బోల్డ్ గా తిట్టేస్తుంది.  ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్న టైపులో కనిపించే ఆమె ఆదిపురుష్ లో శ్రీరాముడికి మీసాలేంటి అని కూడా ప్రశ్నించారు. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ పై ఆమె ఫైర్ అయ్యారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో  ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్రం పోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఆమె ట్విట్టర్ లో తన స్టైల్లో స్పందించారు. ‘కుక్కలు కూడా ఇలా చేయవు. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు ఈ  ప్రవేష్ శుక్లా  సన్నిహితుడని తెలుస్తోంది.

ఏ సర్టిఫికెట్ జోక్స్ ఎక్కువేస్తుంది.. వంటలక్క టాలెంట్ ని బయటపెట్టిన డాక్టర్ బాబు

స్టార్ మాలో ప్రసారమైన "మా బోనాల జాతర"లో చాలా సెగ్మెంట్స్ జరిగాయి. ఇందులో కార్తీక దీపం వంటలక్క, మోనిత, డాక్టర్ బాబు ఎపిసోడ్ మంచి హైలైట్ గా ఉంది. ఎందుకంటే చాలా మంది ఫాన్స్ ఈ సీరియల్ టీంకి లెటర్స్ రాశారు. ఇక ఆ లెటర్స్ నుంచి కొన్నిటిని హోస్ట్ రవి చదివాడు. పాలకొల్లు నుంచి ప్రదీప్ అనే అతను రాసిన లెటర్ ఏంటంటే "మీరు సీరియల్ లో కనిపించిన ప్రతీసారీ చాలా క్లాసీగా కనిపిస్తారు. ఒక్కసారి మా అందరి కోసం మాస్ స్టెప్ వేస్తే చూడాలని ఉంది ప్రేమి గారు" అని రాశారు. దానికి ఈ సీరియల్ టీమ్ మొత్తం డాన్స్ చేసి చూపించింది.. "కార్తీక దీపం తర్వాత మీరు ఎవరిని ఎక్కువగా మిస్ అయ్యారు" అని రవి మోనిత అలియాస్ శోభా శెట్టిని అడిగాడు. "డాక్టర్ బాబుని" అని చెప్పింది మోనిత.

కీర్తి-కార్తిక్ ఎంగేజ్మెంట్..పిల్లల్ని కనలేనని తెలిసి వాళ్ళు ఆ మాట అన్నారు...

సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని, బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వెళ్లిన కీర్తి భట్ రీసెంట్‌గా ఎంగే‌జ్‌మెంట్ జరుపుకుంది. త్వరలో యాక్టర్  కార్తీక్‌తో కీర్తి ఏడడుగులు వెయ్యబోతోంది.  వీరి ఎంగేజ్మెంట్ కి  సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. "మా బోనాలు జాతర" షోలో వీళ్ళ నిశ్చితార్థం స్టార్ మా నటీ నటుల మధ్యన చాలా గ్రాండ్ గా జరిగింది.  ఈ షోలో  కీర్తి తన జీవితంలో జరిగిన విషయాలను చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అప్పట్లో ఒక పాపను కూడా ఆమె  దత్తత తీసుకుని పెంచుకుంది. ఐతే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన టైములో అనారోగ్య కారణాలతో ఆ పాప చనిపోయింది. ఇక విజయ్ కార్తీక్ తోటతో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.