English | Telugu

యావర్ తో నయని పావని పాట. శివాజీ ఏం చేశాడంటే!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ  చూసిన 'గుంటూరు కారం' సినిమాలోని ఆ కుర్చీ మడతబెట్టి సాంగ్ నడుస్తుంది. చిన్న సెలబ్రిటీల నుండి పెద్ద స్టార్స్ దాకా ఈ పాటకి అదే కాస్ట్యూమ్ వేసుకొని అదిరిపోయే డ్యాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ నయని, యావర్ కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసారు. కాగా ఈ వీడియోకి ఇప్పుడు అత్యధిక వ్యూస్ వచ్చాయి. నయని పావని హౌస్ లో ఉంది వారం రోజులే అయిన శివాజీని నాన్న అని పిలవడంతో అందరికి దగ్గరైంది. హౌస్ లోని వారందికి నయని దగ్గరవ్వడం, దీనికి తోడు శివాజీతో ఉన్న రాపో తెలిసిందే.  హౌస్ లో శివాజీ ఉన్నప్పుడు ఎలాగైతే ఓట్లు వేసేవారో ఇప్పుడు అదే రేంజ్ లో వీరిద్దరి కలిసి చేసిన డ్యాన్స్ రీల్ ని చూస్తున్నారు. కాబట్టే ఈ పాట అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకుంది.

ఎడారిలో ఫోటోషూట్.. ట్రెండింగ్ లోకి బిగ్ బాస్ సుదీప!

కొందరు సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ లో ఉంటారు. మరికొందరు  సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన వైరల్ న్యూస్ గా మారుతుంటారు. కజకిస్తాన్ లో అశ్వినిశ్రీ, కులుమనాలిలో కీర్తిభట్, దుబాయ్ లో అనిల్ జీలా, థాయ్ లాండ్ లో శ్రీముఖి.. ఇలా కొంతమంది కొన్ని విదేశీ ట్రావెల్స్ చేసినప్పుడు వారు చేసిన వ్లాగ్స్ ట్రెండింగ్ లోకి వెళ్తాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లలో ఇనయా, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతు రాయల్, ఫైమా, ఆదిరెడ్డి రెగ్యులర్ గా రీల్స్, పోస్ట్, వ్లాగ్స్ అంటూ ఏదో ఒక సోషల్ మీడియా వేదికలో కన్పిస్తూనే ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి పింకీ చేరింది. 

నా ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి చెప్పాల్సిన పని లేదు. వెరైటీ పంచ్ డైలాగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయించుకున్నాడు.  ఆరోగ్యం సరిగా లేకపోయినా తన ఫామిలీ, ఫ్రెండ్స్ సాయంతో స్టేజి మీదకు అప్పుడప్పుడూ వచ్చి కామెడీ చేసి ఆడియన్స్ ని నవ్వించేవాడు. అలాంటి ప్రసాద్ ఇప్పుడు కోలుకున్నాడు. మంచి హుషారుగా కామెడీ చేయడానికి తనను తాను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా యూట్యూబ్ లో తన ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేసాడు. నెటిజన్స్ కి, ఫాన్స్ కి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్పాడు.

Brahmamudi:అప్పుకి యాక్సిడెంట్.. ఆ పూజలో కావ్య పాల్గొనగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -302 లో.. అప్పుకి పెళ్లి చెయ్యాలని కనకం కృష్ణమూర్తి అనుకుంటారు. అలా అనుకొని పెళ్లి సంబంధం చూడటం కోసం పెళ్ళిల్ల పేరయ్యకి కబురు పంపిస్తారు. కాసేపటికి అబ్బాయిల ఫోటోలు పట్టుకొని అతను వచ్చి కనకం-కృష్ణమూర్తిలకి చూపిస్తాడు.‌ అబ్బాయికి ఆస్తులు లేకున్నా పర్లేదు కానీ మా అప్పుని బాగా చూసుకోవాలని కనకం అంటుంది. ఇదంతా జరుగుతున్నప్పుడే అక్కడికి అప్పు వస్తుంది. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడని అనగానే అప్పు కోపంగా సంబంధాలు తీసుకొని వచ్చిన పేరయ్యని కొట్టలని అనుకుంటుంది. దాంతో వాడు పరుగెత్తుతాడు. ఒకరిని ప్రేమించి వాడికి పెళ్లి అవగానే మర్చిపోయి వేరేవాళ్ళని చేసుకోమంటే ఎలా అంటూ అప్పు అనేసి కోపంగా లోపలికి వెళ్తుంది. అసలే బాధలో ఉంది.. ఇంకా బాధ పెడుతున్నామేమోనని కృష్ణమూర్తి అంటాడు.