ఎడారిలో ఫోటోషూట్.. ట్రెండింగ్ లోకి బిగ్ బాస్ సుదీప!
కొందరు సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ లో ఉంటారు. మరికొందరు సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన వైరల్ న్యూస్ గా మారుతుంటారు. కజకిస్తాన్ లో అశ్వినిశ్రీ, కులుమనాలిలో కీర్తిభట్, దుబాయ్ లో అనిల్ జీలా, థాయ్ లాండ్ లో శ్రీముఖి.. ఇలా కొంతమంది కొన్ని విదేశీ ట్రావెల్స్ చేసినప్పుడు వారు చేసిన వ్లాగ్స్ ట్రెండింగ్ లోకి వెళ్తాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లలో ఇనయా, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతు రాయల్, ఫైమా, ఆదిరెడ్డి రెగ్యులర్ గా రీల్స్, పోస్ట్, వ్లాగ్స్ అంటూ ఏదో ఒక సోషల్ మీడియా వేదికలో కన్పిస్తూనే ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి పింకీ చేరింది.