English | Telugu

మయూరి, సప్తపది, మిధునం మూవీస్ మిస్ అయ్యాను

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ఫుల్ ఫన్నీగా సాగింది. ఈ షోకి సీనియర్ నటీనటులు కూడా వచ్చారు. అన్నపూర్ణ, జయలలిత, బాబుమోహన్, శ్రీలక్ష్మి, శివ పార్వతి వచ్చారు. ఇక జయలలితని హోస్ట్ శ్రీముఖి కొన్ని ప్రశ్నలు వేసింది. "ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా..అయ్యో ఈ మూవీ నేను చేయాల్సింది కదా..మిస్ అయ్యిందే అనే లాంటిది ఏదైనా ఉందా" అని అడిగింది. "మయూరి, సప్తపది నేను చేయాల్సిన మూవీస్ అవి మిస్ అయ్యాయి. తర్వాత భరణి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ మిధునం. నేను భరణి గారు చేద్దామని అనుకున్నాం. కానీ అది ఎలాగెలాగో డైవర్ట్ ఐపోయింది.

సదా కోసం వచ్చిన సాగర్...ఆ సాంగ్ స్పెషల్ గా ఆయన కోసమే

నీతోనే డాన్స్ ఈ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో అద్దిరిపోయే ట్విస్టులు ఉన్నాయి. సీజన్ 1 కంటెస్టెంట్స్ అంతా వచ్చేసరికి స్టేజి కళకళలాడిపోయింది. ఇక స్పెషల్ పర్సన్ వచ్చేసరికి సదా ఫేస్ ఇంకా కళకళలాడిపోయింది. వీళ్లందరినీ చూసేసరికి నీతోనే డాన్స్ 3 . 0  అని అంది శ్రీముఖి. ఆట సందీప్, యాని మాష్టర్, నటరాజ్, మెహబూబ్, అంజలి  తో పాటు అసలు సిసలైన సదా మనసు దోచుకున్న సాగర్ వచ్చాడు. ఆ సీజన్ లో సాగర్ అంటే చాలు సదా మనసు ఒక పాటేసుకునేది. ఈ సీజన్ లో బ్రిట్టోని చూస్తే అలా పాటేసుకుంటున్న సదా సాగర్ ని చూసేసరికి ఎగురుకుంటూ స్టేజి మీదకు వెళ్లి డాన్స్ చేసింది.

Krishna Mukunda Murari : తను అబార్షన్ చేయించుకోలేదని తెలుసుకున్న కృష్ణ, మురారి.. విషయం తెలిసుకున్న మీరా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -476 లో.. మీరా గదిలోకి కృష్ణ వెళ్లి చెక్‌ చేస్తుంది. ఎంత వెతికినా ఏం కనిపించదు. మీరాను ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని అనుకుంటుంది. మీరా గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో కొన్ని వాడిన ట్యాబ్లెట్స్, పేపర్ కనిపిస్తుంది. ప్రిస్కిప్షన్ చూసి కృష్ణ షాక్‌ అవుతుంది. బేబీ గ్రోత్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటుంది అంటే మీరా అబార్షన్‌ చేయించుకోలేదు. ఎందుకిలా చేస్తుంది. బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా.. అబద్ధం చెప్పినందుకు బాధపడాలా అని కృష్ణ అనుకుంటుంది. వాటిని తీసుకుని తన గదికి వచ్చి మనం మోసపోయామని మురారికి చెప్తుంది.

Eto Vellipoyindhi Manasu : ప్రియుడి మోసాన్ని గుర్తించిన భార్య.. భర్తకి దగ్గర అవ్వగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -103 లో... అభి మాట్లాడిన మాటలకి రామలక్ష్మి ఏడుస్తూ గుడికి వస్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతున్న రామలక్ష్మి దగ్గరకి సీతాకాంత్ వస్తాడు. ఇక అభి అన్న మాటలన్నీ సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. ఎందుకు అలా మాట్లాడాడో‌.. నేను అడుగుతాను పదా అని సీతాకాంత్ అనగానే.. వద్దు ఇక వాడు నాకు అవసరం లేదు.. నేనే వద్దనుకోని వచ్చాను. ఇకమీదట వాడి గురించి నా ముందు తియ్యకండి అని రామలక్ష్మి  చెప్తుంది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. వాడి నుండి నిన్ను కాపాడాను. ఇప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాకుండా ఇక చూడాలని సీతాకాంత్ అనుకుంటాడు.