English | Telugu

Karthika Deepam2 : భార్యని అలా చేసినంందుకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. పండు గాడికి ఇంట్లో ఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -51 లో.. నర్సింహా అన్న మాటలను గుర్తుకుచేసుకుని దీప బాధపడుతుంది. అప్పుడే శౌర్య వచ్చి హోమ్ వర్క్ చూపిస్తుంది. దీప మెడకి గాయమవుతుంది. అది చూసి శౌర్య.. ఏమైంది మందు రాస్తానని అంటుంది. నేను స్కూల్ కి వెళ్ళను. ఇక నీతో ఉండి ఇలా దెబ్బలు తగలకుండా చూస్తానని దీపతో శౌర్య అంటుంది.

నువ్వు అలా అనకూడదు మంచిగా చదువుకొని కలెక్టర్ కావాలని దీప చెప్తుంది. సరేనని శౌర్య అంటుంది. అసలు ఆ బాబు ఎందుకు తండ్రి పేరు దగ్గర తన పేరు రాసాడోనని అడుగుతానని దీప అనుకుంటుంది. దీప వర్క్ చేసుకుంటుండగా అక్కడికి కార్తీక్ వస్తాడు. మెడపైన గాయం అయినట్లుందని దీపని కార్తీక్ అడుగుతాడు.‌ మనిషి అన్నాక ఏదో ఒక గాయం అవుతుందని దీప అంటుంది. మీరు శౌర్య స్కూల్ అడ్మిషన్ ఫామ్ లో తండ్రి పేరు దగ్గర.. మీ పేరెందుకు రాసారని అడుగుతుంది.. నేను గార్డియన్ ప్లేస్ లో రాసాను కానీ తండ్రి పేరుపై కొట్టివెయ్యాడం మర్చిపోయానని కార్తీక్ అంటాడు. నేనే కాదు ఎవరు జాయిన్ చెయ్యడానికి వెళ్ళినా అలాగే చేస్తారని కార్తీక్ అంటాడు. నా కూతురు ఈ మాటలు వింటే బాగుండదని దీప అంటుంది. నువ్వు వాడిని క్షమించినా నేను క్షేమించనని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు నర్సింహా ఏదో ఘణకార్యం చేసినట్లు కొద్దీసేపు అయితే ఆ దీప తాళి తీసుకొని వచ్చేవాడిని అని శోభతో అంటాడు. నా కొడుకుని తక్కువ అంచనా వేసావ్ కదా అని అనసూయ అంటుంది.

నర్సింహ ఇంటికి పోలీసులు వస్తారు. నీ భార్యని వదిలేయడం కాకుండా తనని ఇబ్బంది పెడతావా? పదరా పోలీస్ స్టేషన్ కి అని ఇన్‌స్పెక్టర్ నరసింహని అంటాడు. నర్సింహ పోలీసులతో పొగరుగా మాట్లాడతాడు. దాంతో పోలీసులు నరసింహని తీసుకొని వెళ్ళిపోతారు. దీప ఇంత పని చేస్తావా అని అనసూయ తిడుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిక్వెస్ట్ చేద్దామని అనసూయ, శోభ లు వెళ్తారు. మరొకవైపు బంటు దీప ఊరుకి వెళ్ళి తన గురించి తెలుసుకొని పారిజాతానికి చెప్తాడు.. దీప ఊర్లో అప్పున్న విషయం చెప్తాడు. అత్తకోడళ్ళు హైదరాబాద్ వచ్చింది అందుకే అని బంటు చెప్తాడు. నేను ఎలాగైనా ఇంట్లోకి రావాలని బంటు అనగానే.. బంటు తలపై కొడుతుంది పారిజాతం. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. నన్ను దొంగ కొట్టబోతుంటే వీడు కాపాడాడు. వీడికి దెబ్బలు తాకయని పారిజాతం అంటుంది. సరే వెళ్ళమని అని శివన్నారాయణ అంటాడు. సుమిత్రని దీప కాపాడినందుకు ఇక్కడే ఉంది కదా నన్ను కాపాడిన బంటు కూడా ఇక్కడే ఉంటాడని పారిజాతం అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.