English | Telugu

"జయమ్ము నిశ్చయమ్మురా" అంటున్న శుభలగ్నం హీరో..జీ తెలుగులో త్వరలో న్యూ షో

ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతి బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగపతి బాబు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా "శుభలగ్నం". ఆయన కెరీర్ ని మార్చేసిన మూవీ. అలాంటి జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతున్నారు. "జయమ్ము నిశ్చయమ్మురా" అనే ఒక కొత్త టాక్  షో ద్వారా హోస్ట్ గా రాబోతున్నారు.."జ్ఞాపకం దాని విలువ ఒక జీవితం..అన్నీ నేరుగా చెప్పుకోలేక అమ్మకు రాసిన ఉత్తరం. నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం. ఆట కోసమే బతికిన రోజులు..అమ్మా నాన్న కోసమే చదువుకున్న క్షణాలు..అలవాటుగా మారిన అల్లరి పనులు..అన్నీ ఉన్నా కూడా చేసిన చిన్ని చిన్ని దొంగతనాలు.

బిగ్ బాస్ 9 లోకి రాజ్ తరుణ్, ఇమ్మానుయేల్

బిగ్ బాస్ 9 లోకి రాజ్ తరుణ్, ఇమ్మానుయేల్

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈ షో ప్రోమోలు కూడా వస్తున్నాయి. ఐతే హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్  మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఐతే సోషల్ మీడియాలో లో వేళ్ళు వెళ్లొచ్చు, వాళ్ళు వెళ్లొచ్చు అంటూ కొన్ని గాసిప్స్ నడుస్తున్నాయి. ఐతే రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్  ఇమ్మానుయేల్ అలాగే హీరో రాజ్ తరుణ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇమ్మానుయేల్ బిగ్ బాస్ కి వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్ము జర్నీ జబర్దస్త్ లో కమెడియన్ నుంచి టీమ్ లీడర్ అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వస్తున్నాడు అలాగే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కెప్టెన్ కూడా అయ్యాడు. అతని ఇన్స్పైరింగ్ జర్నీ కాబట్టి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే హీరోగా కొన్ని సినిమాలు చేసి ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకున్నాడు.

విజయ్ ఆంటోని మూవీ

విజయ్ ఆంటోని మూవీ "భద్రకాళీ"లో రెండు సాంగ్స్ రాయడానికి భోలే షావలికి ఛాన్స్

విజయ్ ఆంటోని మూవీ "మార్గన్" టీమ్ తో ఏమంటా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారో చాలా మందికి ఆఫర్స్ ఇచ్చారు ఆయన. జడ్జ్ ఇంద్రజ భోలే షావలి గురించి చాల మంచిగా చెప్పారు.   వండర్ ఫుల్ లిరిక్ రైటర్ అని మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు విజయ్ ఆంటోనీకి. "ఆయన ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసి ఫెంటాస్టిక్ ఆల్ రౌండర్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తారు" అని చెప్పారు. దాంతో విజయ్ ఆంటోని ఫుల్ ఖుషీ ఇపోయారు ఐతే "మీరు లిరిక్ రైటర్ ఐతే గనక నా రాబోయే సినిమా భద్రకాళి మూవీలో మీరు టు సాంగ్స్ రాయబోతున్నారు..ఇది నా ప్రామిస్" అని చెప్పారు. "భద్రకాళి మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. నేను మీతో టచ్ లో ఉంటాను. మీరు నా మూవీ 2 పాటలు రాయాల్సిందే " అని చెప్పారు. అలాగే నాటీ నరేష్ ఐతే బిచ్చగాడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసేసరికి విజయ్ ఫుల్ ఫిదా ఇపోయారు.

బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా అప్లై చేసుకునే వాళ్లకు ఆదిరెడ్డి టిప్స్

బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా అప్లై చేసుకునే వాళ్లకు ఆదిరెడ్డి టిప్స్

బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఎలా అంటూ గత బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే కామన్ మ్యాన్ కోసం కొన్ని టిప్స్ చెప్పాడు. త్వరగా అప్లై చేసి పంపించేయండి. బిగ్ బాస్ కి కావాల్సింది డిఫెరెంట్ క్యారెక్టర్స్ ఉండే కంటెస్టెంట్స్ . మీరు ఏ కేటగిరీలో పంపిద్దామనుకున్నారో ఆ కేటగిరీలో ఇంకా ఎవరైనా ముందుగా పంపించేస్తే మీ వీడియోస్ ని పరిశీలించే అవకాశం ఉండదు. సింపుల్ గా నువ్వు ఏంటి అనేది వాళ్లకు తెలిసేలా 3 మినిట్స్ వీడియో చేసి పంపించాలి. నువ్వెంటి నీ ఫామిలీ ఏంటి, బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వద్దామనుకుంటున్నావ్..వస్తే జనాలను ఎలా ఎంటర్టైన్ చేస్తావ్ అనే చెప్తూ నీ నేచర్ ఏంటి అనేది బిగ్ బాస్ కి అర్ధమవ్వాలి.

సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నా..అషు ​​రెడ్డి

సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నా..అషు ​​రెడ్డి

అషు ​​తాను ఒక మంచి సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నాను అంటూ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది. కాకమ్మ కథలు షోలో లాస్ట్ వీక్ గెస్టులుగా అష్షు-హరి వచ్చారు. ఐతే వీళ్ళ  ఎపిసోడ్ 2 రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అష్షు ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "డోర్ దాకా వచ్చిన రోల్ ని మిస్ చేసిన సందర్భం ఉందా" అని హోస్ట్ తేజస్విని అడిగింది. అప్పుడు అషు ​​రెడ్డి "3 రోజెస్ అనే మూవీ రీసెంట్ గా కొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. నేను అందులో ఒక అమ్మాయిగా చేయాలంటూ ఆఫర్ వచ్చింది. ఆ మూవీ ప్రొడ్యూసర్ నన్ను రమ్మని అడిగారు. ఐతే నేను న్యూమరాలజీని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాను. డేట్స్ విషయంలో బాగా నమ్ముతాను.

బెస్ట్ యాక్టర్ గా మానస్ కి

బెస్ట్ యాక్టర్ గా మానస్ కి "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్  2025 "  

బుల్లితెర మీద బ్రహ్మముడి సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్స్ గా మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీళ్ళు సీరియల్ లో కావ్య - రాజ్ గా బాగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు కార్తీక దీపం సీరియల్ రాత్రి వచ్చేది. ఆ సీరియల్ ఐపోగానే ఆ టైం స్లాట్ లో ఈ బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ ఐన దగ్గర నుంచి కూడా మంచి రేటింగ్ ని తెచ్చుకుంది. అలాగే మానస్ ఇంకా దీపికా సీరియల్ తో పాటు రకరకాల షోస్ లో కూడా చేస్తూ ఉన్నారు. మానస్ శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి వస్తున్నాడు. అలాగే ఇప్పుడు జబర్దస్త్ కి కో- యాంకర్ గా చేస్తున్నాడు. దీపికా కూడా ఈ షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో దీపికా - మానస్ ఇద్దరూ మెంటార్స్ గా వచ్చారు. ఇక దీపికా ఐతే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోకి సమీరా భరద్వాజ్ తో కలిసి వచ్చింది. ఐతే డాన్స్ ఐకాన్ తర్వాత దీపికా షోస్ లో కనిపించడం తగ్గింది. రీల్స్ మాత్రం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడుతోంది.

Illu illalu pillalu : ప్రేమలో రామరాజు కొడుకులు, కోడళ్ళు.. ధీరజ్, ప్రేమ తప్ప!

Illu illalu pillalu : ప్రేమలో రామరాజు కొడుకులు, కోడళ్ళు.. ధీరజ్, ప్రేమ తప్ప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -196 లో.... ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ప్రేమ ఎంతటి వారినైనా మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుందని ధీరజ్ అంటాడు. కోపందీసి నాపై ఏమైనా ప్రేమ మొదలైందా అని ప్రేమ అడుగుతుంది. అంత లేదు నేను నడిపోడు గురించి చెప్తున్నాను.. వాడు వదినని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా.. అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చెయ్యడం.. తనకి ఇష్టమట అందుకే అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తానని నాతో చెప్పాడని ప్రేమతో చెప్తాడు ధీరజ్.

మీ పిల్లలకు ఎం చదువులు చెప్తారా అని భయంగా ఉంది

మీ పిల్లలకు ఎం చదువులు చెప్తారా అని భయంగా ఉంది

సర్కార్ సీజన్ 5 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఈ షోకి ఆరియానా, వర్షిణి, దేత్తడి హారికా, శ్రీసత్య వచ్చారు. వచ్చే ముందు సుధీర్ ని ఆటపట్టించారు. ఇక ఒక ప్రశ్న అడిగారు సుధీర్ ఇందులో. "లక్ష రూపాయల్లో ఎన్ని 500 నోట్లు ఉంటాయి " అని అడిగాడు. ఈ ప్రశ్నకు క్లూస్ కోసం అందరూ డబ్బులు బిడ్డింగ్ పెంచుతూ వెళ్తున్నారు. ఆరియానా ఆశాలు బిడ్ చేయకపోయేసరికి సుధీర్ అడిగాడు ఎందుకు బిడ్ చేయట్లేదని. దానికి ఆరియానా ఏంటి నువ్వు ? అని అడిగాడు. "మీరు లెక్కలు అడిగారు నేను లెక్కల్లో చాలా పూర్. నా పరువు పోతుందని భయం" అంది. "ఎప్పుడన్నా మనకు ఉన్నదాని గురించి పోయిద్దా అని ఆలోచించాలి" అని కౌంటర్ వేసాడు.