English | Telugu

Karthika Deepam2 : కార్తీక దీపం సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. కొత్త సీఈఓ ఎవరంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-513 లో.... దీప సీఈఓగా ఉండనని క్లారిటీగా చెప్తుంది. మరి ఇప్పుడు కొత్త సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అడుగుతుంది. నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను కొత్త సీఈఓ వస్తున్నాడని శివన్నారాయణ అంటాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. రెస్టారెంట్ కి కొత్త సీఈఓ శ్రీధర్ అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. మావయ్యకి ఆ అర్హత ఉందా అని జ్యోత్స్న అడుగుతుంది. బిజినెస్ లో మంచి అనుభవం ఉందని శివన్నారాయణ చెప్తాడు.

నా కోసం సీమ సింహం వస్తున్నాడు అన్న దీపికా

ఢీ 20 లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా ఉంది. డాన్స్ ల విషయం పక్కన పెడితే ఆది, పండు, హోస్ట్ నందు, దీపికా కామెడీ స్కిట్ వేరే లెవెల్ లో ఉంది. ఆది రావడమే టేబుల్ మీద కాలేసుకుని కూర్చున్నాడు. పండు ఆది వీపు పడుతున్నాడు. "ఎం నొక్కుతున్నావురా నీ యయ్యా" అన్నాడు ఆది. ఇక పండు సీరియస్ గా ఆది మీద డైలాగ్ వేసాడు. "ఏంట్రా చేతికి నోరొచ్చింది, కళ్ళకు రంగొచ్చింది ఏంటి కామ కళా" అన్నాడు ఆది. "ఇవన్నీ కాదు. నన్ను పంపించేయండి, నాకు వేరే ప్రాబ్లమ్ వచ్చింది" అన్నాడు పండు. "నా అమ్మ, అయ్యా పిలిచాడు, ఇక్కడి కంటే అక్కడ ఎక్కువొస్తది అంటే చేతులూపి సాగనంపటానికి ఎవరనుకున్నవురా కాట్రాజ్..కరకరా నమిలేస్తా..ఇక్కడే ఉండాలి" అన్నాడు ఆది.

నవంబర్ 20 నుంచి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5

ఆహా ఓటిటిలో ఇండియన్ ఐడల్ షో పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్ తో నవంబర్ 20 వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఐతే అది కాస్తా బ్లర్ చేసి వేశారు. ఐతే అందులో ఎవరు ఉన్నారు అనే విషయం లైట్ కనిపిస్తూ ఉంది కానీ అసలు అందులో పార్టిసిపంట్స్ ఎవరన్నది ఇంకా పూర్తిగా తెలీదు. ఐతే మానస్, అఖిల్ సార్ధక, యాదమ్మ రాజు, కావ్యశ్రీ, ప్రేరణ, టేస్టీ తేజ, పంచ్ ప్రసాద్, యాష్మి  ఉన్నట్టు కనిపిస్తోంది. ఆహా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టింది.

బావా మా కోసం పాట పాడవా.. అటు అషూరెడ్డి ఇటు స్రవంతి

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి సింగర్స్ వచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని ఇన్వైట్ చేశారు. ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఈ షోలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఈ మధ్య ఏ మూవీలో  చూసిన థమన్ మ్యూజిక్ ఆడియన్స్ ని షేక్ చేసేస్తోంది. ఇక ఇప్పుడు ఫామిలీ స్టార్స్ కి థమన్ రాబోతున్నాడు. స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చేలోపు కొంతమంది టాప్ సెలబ్రిటీస్ ఆయన గురించి ఎం అన్నారో వాటిని ప్లే చేశారు. "థమన్ హార్డ్ వర్కర్" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. "ఆరోజు ఎంత కష్టపడ్డాడో ఈరోజు అంతే కష్టపడుతున్నాడు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. "ఆడియో ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ థమన్" అంటూ బోయపాటి శీను చెప్పుకొచ్చారు. "ఎప్పుడు కలిసిన చిన్నపిల్లాడిలా ఎక్సయిట్ అవుతూ ఉంటాడు.

Bigg Boss 9 Telugu 10th week:  పోరాడిన సుమన్ శెట్టి.. సంజన గెలుపు.. సంఛాలక్ గా కళ్యాణ్ ఫెయిల్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం బీబీ రాజ్యం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం అంతా ఇదే సాగుతుంటుంది. అయితే నిన్న జరిగిన మొదటి టాస్క్ లో సంజన ఓడిపోతుంది దాంతో సుమన్ శెట్టి తో మరో గేమ్ ఆడాల్సి వస్తుంది. కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వడానికి బిగ్‌బాస్ పెట్టిన పోటీ 'బిల్డ్ ఇట్ టూ విన్ ఇట్'.. ఈ పోటీలో కమాండర్ సంజన విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతుంది. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారన్నమాట.. ఈ పోటీలో గెలవడానికి పోటీదారులు బజర్ మోగగానే తమకి కేటాయించిన బాక్సులని ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వేర్ లోపల ఒక బాక్సుపై మరో బాక్సు ఉండేలా ప్లేస్ చేసి టవర్‌ని నిర్మించాలి.. బజర్ మోగే సరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్లు ఈ పోటీలో గెలిచి కమాండర్ అవుతారు.. ఈ టాస్కుకి కళ్యాణ్ సంఛాలక్ అని బిగ్‌బాస్ చెప్పాడు.