English | Telugu

దయచేసి లైవ్ యానిమల్స్ ని గిఫ్ట్ చేయడం.కొనడం చేయొద్దు..అడాప్ట్ చేసుకోండి..

దయచేసి లైవ్ యానిమల్స్ ని గిఫ్ట్ చేయడం.కొనడం చేయొద్దు..అడాప్ట్ చేసుకోండి..

బుల్లితెర యాంకర్ గా రష్మీ గౌతమ్ కి ఉన్న పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు. ఆమె యాంకర్ గా, యాక్టర్ గా చేసింది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోస్ ని హోస్ట్ చేస్తోంది. వీటికన్నా కూడా ఆమెకు పెట్స్ మదర్ అని మరో పేరు కూడా ఉంది. ఆమెకు పెట్స్ అంటే ఇష్టం. వాటి కోసం ఏమైనా చేస్తుంది. ఆల్రెడీ గతంలో ఆమెకు ఒక పెట్ డాగ్ ఉండేది. దాని పేరు చుట్కి గౌతమ్. ఐతే అది చనిపోయింది. దాని ఆస్తికాల్ని కూడా గోదాట్లో కలిపింది. ఇక ఇప్పుడు మరో పెట్ డాగ్ ఆమె ఇంటికి వచ్చింది. అది కూడా చాలా క్యూట్ గా బ్రౌన్ కలర్ లో ఉంది.

బిఆర్ఎస్ ఎంఎల్సి కవితతో యష్, సోనియా...తొలి బోనం ఎత్తిన సోనియా ఆకుల

బిఆర్ఎస్ ఎంఎల్సి కవితతో యష్, సోనియా...తొలి బోనం ఎత్తిన సోనియా ఆకుల

ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండగ జాతర సంబరాలు షురూ అయ్యాయి. ఎటు చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. బోనాలు అంటే బోనం ఎత్తడం ముఖ్యం. ఇక రీసెంట్ గా తెలంగాణాలోని గోల్కొండ కోట మీద వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో  తొలి బోనంతో సందడి మొదలయ్యింది. ముందుగా మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించారు బిఆర్ఎస్ ఎంఎల్సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈమెతో పాటు ఈ బోనాల జాతరలో యష్ వీరగోని, సోనియా ఆకుల కలిసి మొదటి బోనం ఎత్తారు. ఈ విషయాన్నీ సోనియా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఫస్ట్ బోనం ఎత్తడం నిజంగా ఆ దైవ సంకల్పం.

బాబోయ్ ఏంటి వీళ్ళు..బుల్లితెర నటులా చిల్లర ఏరుకునే వాళ్ళా

బాబోయ్ ఏంటి వీళ్ళు..బుల్లితెర నటులా చిల్లర ఏరుకునే వాళ్ళా

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఆదివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇది కూడా బోనాల్ స్పెషల్ గా రాబోతోంది. దాంతో షోకి వచ్చిన వాళ్లంతా హోమ్లీ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. శోభా శెట్టి, ప్రేరణ, అంబటి అర్జున్, కావ్య శ్రీ, శివ్, ప్రియాంక జైన్ ఇలా చాలా మంది టీవీ ఆర్టిస్టులు వచ్చారు. శ్రీముఖి ఒక ముంత తీసుకొచ్చి దీన్ని కింద పడేస్తే ఆ ఊరోళ్లు, ఈ ఊరోళ్లు ఎవరు చిల్లర ఏరుకుంటారో చూస్తా అంటూ ఒక టాస్క్ అనౌన్స్ చేసింది. వెంటనే శ్రీముఖి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ముంతను కిందపడేసి రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ పడేయకుండా అందరినీ వెంట తిప్పుకుంది.

డ్రామా జూనియర్స్ ఎపిసోడ్స్ కింద కామెంట్స్ పెట్టిస్తున్న సుధీర్..

డ్రామా జూనియర్స్ ఎపిసోడ్స్ కింద కామెంట్స్ పెట్టిస్తున్న సుధీర్..

డ్రామా జూనియర్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో బోనాల స్పెషల్ తో రాబోతోంది. ఇందులో ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ లు పేలిపోయాయి. అందరూ కొత్త కొత్త కాస్ట్యూమ్స్ తో అలరించారు. ఇక సుధీర్ రోజాకి ప్రసాదం తినిపించాడు. బోనాలతో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కి నో ఎండ్ అన్నాడు సుధీర్. "బోనాల గురించి ఎవరికైనా తెలుసా" అని సుధీర్ అడిగాడు. దానికి లాస్య వెరైటీ ఆన్సర్ ఇచ్చింది. "పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ డిన్నర్ గురించి ఎం చేసుకోవాలి అన్నది ప్రేపరషన్" అంటూ అమాయకంగా చెప్పింది. బోనాల గురించి చెప్పమంటే భోజనాల గురించి చెప్తావేంటమ్మా అంటూ సుధీర్ లాస్య మీద కౌంటర్ వేసాడు.

Illu illalu Pillalu: ఊళ్లో దొంగలు పడ్డారు.. శ్రీవల్లి దొరికిపోయిందిగా!

Illu illalu Pillalu: ఊళ్లో దొంగలు పడ్డారు.. శ్రీవల్లి దొరికిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-195 లో.. ధీరజ్, ప్రేమ ఎగ్జామ్ రాసాక.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. నా ఆర్థిక పరిస్థితి బాలేదని ప్రేమ అనగా.. అదేంటే మాకు ఎంతో సహాయం చేశావ్.. లక్షల్లో ఫీజు కట్టావ్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయావని ప్రేమ స్నేహితురాలు అనగానే.. అందరి రాత ఒకేలా ఉండదని చెప్పి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇక అదంతా ధీరజ్ విని బాధపడతాడు. ఇక మరోవైపు రామరాజు దగ్గరికి తిరుపతి వచ్చి.‌ ఊళ్ళో జరిగిన దొంగతనాల గురించి చెప్తాడు. దొంగలు పది ఇళ్ళకి పైగా దోచుకున్నారని తిరుపతి చెప్పగానే డబ్బులన్నీ బ్యాంకులో వేసి రమ్మంటాడు. 

ఏవి అలనాటి ముద్దులు అంటున్న అర్జున్ కళ్యాణ్..శ్రీసత్య ఫీలవుద్ది అంటున్న నెటిజన్స్

ఏవి అలనాటి ముద్దులు అంటున్న అర్జున్ కళ్యాణ్..శ్రీసత్య ఫీలవుద్ది అంటున్న నెటిజన్స్

అర్జున్ కళ్యాణ్ బుల్లితెర మీద బాగా ఫేమస్ అయ్యాడు.  బిగ్ బాస్ తర్వాత నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే మూవీస్, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. "బాబు, ప్లే బ్యాక్, పెళ్లి కూతురు పార్టీ" వంటి మూవీస్ లో నటించగా, మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి, 7 డేస్ ఆఫ్ లవ్ వంటి వెబ్ సిరీస్ లో కూడా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో, బిబి జోడిలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు "ఏవి అలనాటి ముద్దులు" అనే మూవీలో నటించాడు. ఇప్పుడు ఈ మూవీ ఈటీవీ విన్ విన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.

హమ్మయ్యా దేవుడా థ్యాంక్యూ..వీసా వచ్చింది.. శివ్ తో కలిసి ఇక యూఎస్ వెళ్లొచ్చు

హమ్మయ్యా దేవుడా థ్యాంక్యూ..వీసా వచ్చింది.. శివ్ తో కలిసి ఇక యూఎస్ వెళ్లొచ్చు

బుల్లితెర మీద ప్రియాంక జైన్, శివ్ గురించి తెలియని వాళ్లుండరు. వీళ్ళు కలిసి సీరియల్స్ లో, షోస్ లో నటిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా ప్రియాంక ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. యూఎస్ వీసా కోసం ఎంతో ట్రై చేస్తోందని ఫైనల్ గ వీసా వచ్చిందంటూ ఆనందంతో గంతులేసింది. ఐతే వీసా గురించి మూడు ప్రశ్నలు అడిగారు శివ్ తో కలిసి యూఎస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు చెప్తాను అంటూ చెప్పింది. దేవుడికి కూడా థాంక్యూ చెప్పింది ప్రియాంక. ఇక ముంబైలోని బ్యాండ్ స్టాండ్ మీదగా వెళ్తూ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్ళు ఇవే అంటూ కార్ లో వెళ్తూ చూపించింది. ఫ్యూచర్ లో ఇలాంటి ఒక ఇల్లు ఇక్కడ ముంబైలో ఉండాలని అది షారుఖ్ ఖాన్ ఇంటి కంటే పెద్దగా ఉండాలని చెప్తూ "శివ్ ప్లీజ్ నాకు అంత పెద్ద ఇల్లు ఒకటి కావాలి" అంటూ అడిగింది.

అన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తో జనాల్ని మాయ చేసింది పాడుతా తీయగా సీజన్

అన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తో జనాల్ని మాయ చేసింది పాడుతా తీయగా సీజన్

సింగర్ ప్రవస్తి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె రెండు వీడియోస్ రిలీజ్ చేసింది. పాడుతా టీయగా షోలో తన ఎపిసోడ్ లో అసలు సునీత, చంద్రబోస్, కీరవాణి లేరు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్ కచ్చితంగా చూడండి మీకే నిజం తెలుస్తుంది అంటూ ఆడియన్స్ కూడా చెప్పింది. ఐతే రీసెంట్ గా ప్రసారమైన ప్రవస్తి ఎపిసోడ్ చూస్తే అందులో జడ్జెస్ ముగ్గురూ కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించారు. దీంతో ఆడియన్స్ కి డౌట్ రావడంతో ప్రవస్తి మరో వీడియోని రిలీజ్ చేసింది. ఇదంతా అన్ ఎథికల్ గా ఎడిటింగ్ చేసి లేనిది ఉన్నట్టు చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చూసాక తానే షాక్ కి గురైనట్టు చెప్పింది. "రియాలిటీ షో హిస్టరీలో ఇంత అన్ ఎథికల్ గా , అన్ ప్రొఫెషనల్ గా కంప్రెస్ చేసి ఈ వీడియో ఇలా వదులుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.

Brahmamudi : ప్రాణాపాయ స్థితిలో స్వప్న.. కావ్య ప్లాన్ అదే!

Brahmamudi : ప్రాణాపాయ స్థితిలో స్వప్న.. కావ్య ప్లాన్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -757 లో..... యామిని తన ప్లాన్ ఏంటో క్లియర్ గా కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. వెంటనే కిందకి వెళ్లి అక్క ఎక్కడ అని అడుగుతుంది. పాప ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది టీకా కోసమని రుద్రాణి అనగానే కనీసం మీకు తోడు వెళ్లాలన్నా బుద్ది కూడా లేదా అని వాళ్లని తిడుతుంది కావ్య. అప్పుడే హల్లో ఉన్న వాళ్ళందరూ ఏమైందని కావ్యని అడుగుతారు. అక్క గురించి చెప్తే అందరు కంగారు పడుతారని ఏం లేదని కావ్య అంటుంది. కావ్య వెళ్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. మీతో మాట్లాడాలి కళావతి గారు అని రాజ్ అనగానే.. నేను బయటకు వెళ్ళాలి ప్లీజ్ ఏమనుకోకండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి వస్తానంటూ కావ్య బయటకు వెళ్తుంది.

రాధ ఎవరనుకున్నావ్ కోహినూర్ వజ్రం.. 

"కుక్కు విత్ జాతి రత్నాలు" షో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, మూవీస్ లో విలన్ రోల్స్ లో కనిపించే ఆశిష్ విద్యార్థి, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ ఉండబోతున్నారు. ఇక షోలో వంటలు చేసి అలరించడానికి ఈటీవీ నటుడు ప్రభాకర్, ప్రియా, యష్మి, బాబా భాస్కర్, సుజిత, సుహాసిని, విజె సున్ని, అవినాష్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బాలు అలియాస్ విషుకాంత్ వంటి వాళ్లంతా రాబోతున్నారు. ఐతే రోజూ ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది స్టార్ మా. రీసెంట్ గా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. రాధ సిగ్గు పడుతూ కూర్చుంటే ఆశిష్ విద్యార్థి డైలాగ్ వేశారు. "ప్రదీప్ ఎవరయ్యా చెప్పింది బ్రిటీషర్ లు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారని ..చూడు మన పక్కనే కూర్చుంది" అన్నారు.