కొడాలి నాని, వల్లభనేని వంశీ నోళ్లకు తాళాలు.. భయమా జాగ్రత్తా?

Publish Date:Feb 6, 2026

Advertisement

బూతులు, దూషణలు వైసీపీ ఎకో సిస్టమ్ లో భాగంగా మారిపోయాయి. అయితే అలా నోరు పారేసుకునే వారిలో చాలా మంది అనూహ్యంగా సైలెంటైపోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో బ్యాడ్ మౌత్ లీడర్లలో చాలా మంది మౌనమే నా భాష అన్నట్టుగా మారిపోయారు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోరెట్టుకు పడిపోవడమే కాకుండా... ఇష్టారీతిగా దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన నేపథ్యంలో వారిప్పుడు పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి ఉండటమే. మౌనంగా ఉంటే మేలు.. బయటకు వచ్చి కేసుల చిక్కులను కోరి ఆహ్వానించడం ఎందుకన్న ధోరణి వారిలో కనిపిస్తోంది.

అయితే వైసీపీలో అంబటి రాంబాబురూటే సెపరేటు.  ఆయనకు నోటిని అదుపులో పెట్టుకోవడం అన్న సంగతి తెలియదు. జగన్ మెప్పు కోసం, జగన్ ప్రశంస కోసం ఏమైనా చేస్తారన్న పేరుంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించు కోకపోవ డానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు. అది పక్కన పెడితే తాజాగా గత నాలుగు రోజులుగా ఏపీలో అంబటి వ్యవహారమే పెద్ద చర్చగా, రచ్చగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నోరు పారేసుకున్నందుకు ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టై రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  అంబటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రోడ్డు మీదకు వచ్చారు. రాజమహేంద్రవరం వెళ్లి అంబటిని పరామర్శించలేదు కానీ, గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని చెప్పడమే కాకుండా... అంతకు అంతా బదులు తీర్చుకుంటామంటూ చంద్రబాబు, తెలుగుదేశంలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇక్కడ వైసీపీయులలోనే ఒక సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ సరే గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి రాజకీయమైలేజీ కోసం చేయగలిగినంత చేసి వెళ్లారు. మరి పార్టీలో మిగిలిన వారి సంగతేంటి? బూతుపురాణాల స్పెషలిస్టుగా పేరుపొందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంబటికి మద్దతుగా కనీసం గొంతు కూడా సవరించుకోలేదేంటి? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమయ్యారు? కనీసం అంబటికి మద్దతుగా ఒక్క ప్రకటన చేయడానికి కూడా వారికి ఎందుకు మనసు రావడం లేదు?  

సాక్షాత్తూ పార్టీ అధినేత గుంటూరు వచ్చి ర్యాలీ నిర్వహిస్తే కనీసం అటువైపు తొంగి చసేందుకు కూడా వారు ఎందుకు ధైర్యం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉండగా హద్దూపద్దూ లేకుండా బూతుపురాణంతో రెచ్చిపోయిన ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి,  జగన్ హయాంలో పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదెందుకని అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

ఇప్పుడు వైసీపీలో గొంతు వినిపిస్తున్న వారు అంబటి, పేర్ని నాని, జోగి రమేష్ లు మాత్రమే. అంబటికి మద్దతుగా పేర్నినాని, జోగి రమేష్ లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వీరే వైసీపీ ఎకో సిస్టమ్ లోని బూతుల పారాయణాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగులోంది. 

By
en-us Political News

  
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను హెసీఏ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ను బ్లాక్‌మెయిల్‌ చేశారన్న ఆరోపణలు రావడం, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.