వాస్తవ వేదిక.. వైసీపీకి ఢిల్లీ లాబీయింగ్ అంతా విజయసాయే

Publish Date:Feb 6, 2026

Advertisement

తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక పదకొండో సంచిక గురువారం (ఫిబ్రవరి 6) విడుదలైంది. ఈ సారి  కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల మార్పులపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  

జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎన్నికల ఓటమి తర్వాతే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో  ప్రజలకు మాత్రమే కాదు పార్టీ కార్యకర్తలకు కూడా దురమై  హైబర్నేషన్'(స్తబ్దత)లోకి వెళ్ళిపోయారనీ, అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఒక ప్రత్యేక బృందం ఉండేదనీ వారు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.  వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితిలో కార్యకర్తల విశ్వాసం పొందడానికి జగన్ చేస్తున్న ప్రయత్నంగా దీనికి అభివర్ణించారు.  రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలు కేసుల భయంలో ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపి మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం కల్పించడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తన ఉనికిని చాటుకోవడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాదయాత్ర చేపట్టే ఆలోచనలో  ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

 జగన్ డెమొక్రాట్ కాదు కానీ.. చంద్రబాబు నాయుడు  డెమోక్రాట్ అన్న డోలేంద్ర ప్రసాద్.. చంద్రబాబు జగన్ లా ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూడరనీ,  అయితే చంద్రబాబు ప్రస్తుతం  జగన్ పట్ల ప్రజల్లో ఉన్న భయం చాలు తనకు ఓట్లు పడతాయని ఆయన భ్రమిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల కంటే ఐఏఎస్ ఆఫీసర్లు, కార్పొరేట్ శక్తులకే   ప్రాధాన్యత ఇస్తారని, ఇది కార్యకర్తలలో అసంతృప్తికి దారితీస్తుందనీ, ఇప్పుడూ అదే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు.  మూలాలు హెచ్చరిస్తున్నాయి. ఇక విజయసాయి రెడ్డి బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది కదా అన్న కంఠంనేని రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ విజయసాయి కేవలం రాజకీయ మానిపులేటర్ అన్నారు.  

ఆయన స్వయంగా ఏ ఎన్నికలోనైనా సరే గెలిచే ప్రశక్తే లేదనీ చెప్పారు. విజయసాయికి జగన్ పార్టీలో ఆదరణ తగ్గడం, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత కేసుల భయం కారణంగా ఆయన బీజేపీ వైపు చూస్తుంటే చూస్తుండవచ్చునన్నారు.   కానీ బిజెపి  ఇప్పుడు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ విధానాన్ని అమలు చేస్తోందన్న డోలేంద్ర ప్రసాద్..  పదవుల విషయంలో సొంత క్యాడర్‌కే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందువల్ల విజయసాయికి బీజేపీలో ప్రాధాన్యత లభించే ప్రశక్తి లేదన్నదని తన అభిప్రాయమన్నారు. అయితే అదే సమయంలో   తెలుగుదేశం వైసిపి వంటి  పార్టీల సిద్ధాంతం అధికారమే కనుక ఆ పార్టీలలో ఎవరైనా ఎప్పుడైనా చేరే పరిస్థితి ఉంటుందన్నారు.  

 జగన్ తన ప్రసంగాల్లో "రప్ప రప్ప" వంటి పదాలను వాడుతూ అరాచక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. ప్రజలు రౌడీయిజం తమ ఇంటి గడప దాకా వస్తే సహించరనీ, గత ఎన్నికలలో జగన్ ఓటమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇప్పటికీ మారకుండా జగన్ అదే ధోరణితో ఉండటం ఆయన  రాజకీయ భవిష్యత్తుకు ఇసుమంతైనా మేలు చేయదని డోలేంద్ర ప్రసాద్  అన్నారు. 

ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ కోసం వాస్తవ వేదిక పదకొండో సంచికను తెలుగువన్ యూట్యూబ్ చానల్ లో వీక్షించండి

 

By
en-us Political News

  
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.