ముద్దులకొడుకు ముచ్చట కోసం పార్లమెంటు బంద్ చేసినా తప్పేనా?

Publish Date:Aug 12, 2015

Advertisement

 

కాకి పిల్ల కాకికి ముద్దు. సోనియాగాంధీకి రాహుల్ బాబు అంటే ముద్దు. అందుకే ఆమె తన ముద్దుల కొడుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొనేందుకు వీలుగా ప్రధాని కుర్చీలో డా. మన్మోహన్ సింగ్ ని కూర్చోబెట్టి ఆమె రిమోట్ తో దేశాన్ని పాలించారు. కానీ పదేళ్ళపాటు ఎదురు చూసినా రాహుల్ బాబు ఆ కుర్చీలో కూర్చొనే సాహసం చేయలేకపోవడంతో, ఆయన తన కుర్చీకి అంటిన బొగ్గు మసి దులుపుకొంటూ రోజులు దొర్లించేసారు. తీరా రాహుల్ బాబుకి ఆ కుర్చీలో కూర్చోవాలనే మనసు పుట్టేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది.

 

పోనీ మమ్మీ కుర్చీలోనయినా కూర్చోందామని ముచ్చటపడితే ‘నీకు అంత సీన్ ఉందా?” అని వెనక నుండి ఎవరో గుసగుసలు ఆడుకోవడం చూసి ఆయన చాలా హర్ట్ అయిపోయి ఫారిన్ వెళ్లిపోయారు. “ఉద్యోగులు శలవులు పెట్టడం చూశాము కానీ దుక్కలా ఉన్న రాజకీయ నాయకులు రాజకీయాలకు, పార్టీకి శలవులు పెట్టడం మేమెన్నడూ చూడలేదు స్మీ!” అంటూ గిట్టనివాళ్ళు బుగ్గలు నొక్కుకొన్నారు. “లోకులు కాకులు వంటివారు...వారు అరుస్తూనే ఉంటారు...వాళ్లకి భయపడితే జీవితంలో ఇక ఏ కుర్చీలోనూ మనం కూర్చోలేము” అని ఫారిన్ లో ఉపదేశం పొందిన రాహుల్ బాబు తిరిగివచ్చి తన పవర్ ఏమిటో చూపించాలని ఫిక్స్ అయిపోయాడు.

 

ఫారిన్ నుండి వస్తూనే రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంటులో ఎక్కి చీమిడి ముక్కులున్న పిల్లలను గుర్తించి వాళ్ళని ఒళ్లో కూర్చోబెట్టుకొని జనాలతో మమేకం అయిపోయారు. ఆ తరువాత కాళ్ళు నొప్పులు పుట్టేవరకు వరకు పాదయాత్రలు చేసి తమ హయాంలో ఆత్మహత్యలు చేసుకొన్నా రైతుల కుటుంబాలను ఓదార్చడం మొదలుపెట్టారు. కానీ దానికి అంతెక్కడ?ఆయన జీవితాంతం పాదయాత్రలు చేసినా పూర్తవదు. అయినా కూడా ఓదార్పు యాత్రలు కంటిన్యూ చేసేవాడే కానీ మధ్యలో పార్లమెంటు సమావేశాలు వచ్చి పడ్డాయి.

 

తనకు బాగా పట్టున్న భూసేకరణ బిల్లు-సవరణలు-నష్టాలు, మహిళా సాధికారత, దేశాభివృద్ధి, నీతి నిజాయితీ అనే అంశాల మీద మాట్లాడి అందరినీ ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ, మోడీకి తన పవర్ ఏమిటో రుచి చూపించాలని ఫిక్స్ అయిపోవడంతో ‘పార్లమెంట్ బంద్’ కి పిలుపునిచ్చారు. రాజకీయాలలో శలవులు పెట్టుకోవచ్చేమో కానీ పార్లమెంటుకి బందులు చేయడం వీలుపడదు కనుక ఓ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక కేంద్రమంత్రి పేర్లు చెప్పి వాళ్ళందరినీ తక్షణమే డిస్మిస్ చేయాలని లేకుంటే పార్లమెంటు బంద్ తప్పదని ప్రకటించేశారు.

 

అప్పటి నుండి పార్లమెంటు బంద్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎంపీలు సభలో రభస చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో సోనియమ్మ కనుసైగ చేస్తే కిక్కురుమనకుండా కూర్చోండిపోయిన జేడీ శీలం వంటివాళ్ళు కూడా ఇప్పుడు లోక్ సభలో హెడ్ ఫోన్స్ పెట్టుకొన్న వారి చెవుల్లో నుండి రక్తాలు కారిపోయేంత గట్టిగా నోరు పెట్టుకొని అరుస్తుండటం చూసి, మరి ఆనాడు రాష్ట్రం కోసం వీళ్ళందరూ ఇలాగ ఎందుకు మాట్లాడలేకపోయారు? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

 

“ముద్దుల కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేయగాలేనిదీ, పార్లమెంటు బంద్ చేయలేమా...కొడుకు పవర్ ఏమిటో లోకానికి తెలియాలంటే ఆ మాత్రం ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా?” అనుకొన్న సోనియమ్మ అంత వయసులో కూడా రోడ్డు మీద నిలబడి ‘ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేసారు. కొడుకు కోసం ఆమె కష్టపడితే పడ్డారు కానీ దేశాన్ని పాలించిన ఆ పెద్దాయనని కూడా రోడ్డుమీద నిలబెట్టించి ఆయనతో కూడా నినాదాలు చేయించారే అయ్యో పాపం...అని మళ్ళీ గిట్టని వాళ్ళు బుగ్గలు నొక్కుకొన్నారు. కానీ కన్న ప్రేమ ముందు అవ్వన్నీ లెక్కలోకి రావు. అందుకే ఇవాళ్ళ ఆమె కూడా లోక్ సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిలబడి అందరితో కలిసి నినాదాలు చేసారు. అది చూసి కడుపు తీపి ఎంతకయినా తెగించేలా చేస్తుందని జనాలు అనుకొన్నారే తప్ప ఆమె దేశం కోసం ఏదో పోరాడేస్తున్నారనుకోవడం లేదు. ఇంకెంత మరొక్క రోజు ఓపిక పడితే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి ఆనక మళ్ళీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు రెస్ట్ తీసుకోవచ్చును. అందుకే ఆమెతో సహా అందరూ కలిసి రాహుల్ బాబు కోసం అంత కష్టపడుతున్నాట్లున్నారు.

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.